మాటలతో మురిపిస్తూ... వరాల జల్లులు కురిపిస్తూ... తూర్పు అభివృద్ధికి హామీలిస్తూ... వివిధ వర్గాలకు సాయం అందిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మంగళవారం సుమారు ఏడు గంటలపాటు సందడిగా గడిపారు. ప్రకృతి అందాల విడిది కోనసీమలో పర్యాటకానికి మరింత సొబగులు అద్దుతామన్నారు. నవ నిర్మాణ వేళ నవ్యబాటన నడుద్దామని జిల్లావాసుల్లో ఉత్సాహం నింపారు. చంద్రన్న పెళ్లికానుకలిచ్చి... ఇళ్లస్థలాలు అందిస్తూ... లబ్ధిదారులకు అండగా నిలిచారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అమలాపురం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన క్షణం తీరిక లేకుండా సాగింది. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఏకబిగిన పలు కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా గడిపారు. ప్రజలతో మమేకమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామదర్శిని పేరుతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

cbn 0606018 2

ఈ సందర్భంగా చంద్రబాబు బీజేపీ పై నిప్పులు చెరిగారు. ‘పోలవరానికి ఇస్తామన్న నిధులను కేంద్రం ఇవ్వలేదు. కాకినాడ వద్ద పెట్రో కెమికల్‌ పరిశ్రమ ఏర్పాటు విషయంలోనూ రూ.5500 కోట్లను ముందే చెల్లించాలంటూ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని ఒడిశాను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలని చూశారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం, లోటు బడ్జెట్‌ విషయంలో కేంద్రం సహకరించలేదు. భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితిలో లేం’అని కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలను తరలించుకుని పోతూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదని అరోపించారు.

cbn 0606018 3

‘వెంకటేశ్వర స్వామినీ కుట్రల్లో ఇరికిస్తున్నారు. ఇటీవల ఒక పూజారితో కుట్ర రాజకీయాలు చేశారు. యాదవ కులానికి చెందిన వ్యక్తిని తితిదే ఛైర్మన్‌గా నియమిస్తే భాజపా రాద్దాంతం చేసింది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దు. అలజడి, గొడవలు చేసి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందనే ప్రచారం చేసి బలహీన పరిచే కుట్ర చేస్తున్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాజపా రాయలసీమ డిక్లరేషన్‌ అంటే పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తుని సంఘటన ఇలా జరిగిందే. ప్రజలంతా సమైక్యంగా ఉంటూ వీటిని ఎదుర్కోవాలి. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చరిత్రాత్మక అవసరం. మరో 5 సంవత్సరాలు కష్టపడితే మిగిలిన రాష్ట్రాలతో సమానంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. జరగరానిది జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.’అన్నారు.

లేని పింక్ డైమెండ్ పోయింది అని... జెనీవాలో 500 కోట్లకు వేలం వేసారని.. ఇలా అనేక ఆరోపణలు చేస్తున్న ఆపరేషన్ గరుడ బ్యాచ్ దిమ్మి తిరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహామండలి అనుమతి కోరింది. అనుమతిరాగానే భారీ భద్రత కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది.

tirumala 06062018 2

రుమలలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగింది. ఈనెల 26న మరోసారి సమావేశమై అధ్యక్షుడితో పాటు సభ్యులు ఆభరణాలు పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ఆగమ సలహామండలి అనుమతి తీసుకోవాలని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు సూచించారు. తవ్వేసినట్లుగా రమణదీక్షితులు ఆరోపిస్తున్న వకుళామాత పోటును పరిశీలించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. నోటీసులు అందుకోనున్న వారిలో రమణదీక్షితులుతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

tirumala 06062018 3

మరో పక్క విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.బాలసుబ్రమణ్యం , రమణ దీక్షితుల ఆరోపణల పై స్పదించారు. తిరుమల జేఈవోగానే కాదు, నా మొత్తం సర్వీసులో ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే శ్రీవేంకటేశ్వర స్వామివారి సాక్షిగా ప్రాణత్యాగం చేసుకుంటానని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.బాలసుబ్రమణ్యం ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుకు సవాల్‌ విసిరారు. రమణ దీక్షితులు సోమవారం చేసిన ఆరోపణల నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం మంగళవారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తిరుమల జేఈవోగా తొమ్మిదన్నరేళ్ల పాటు పని చేశానని, వేయికాళ్ల మండపాన్ని తొలగించాలని తాను కోరలేదన్నారు. రోజుకు రూ.50 చొప్పున కూలీ ఇచ్చినట్లు చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవంలేదని, సంభావన అర్చకులకు మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. గతంలో తాము ఆ కంపెనీని టేకోవర్‌ చేసుకుంటామంటూ ముందుకొచ్చిన జీఎస్సెల్‌ గ్రూప్‌ ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హైకోర్టు విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు మరోసారి జీఎస్సెల్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా 10 ఆస్తులకు సంబంధించిన విలువను సీఐడీ కోర్టుకు సమర్పించింది.

agrigold 06062018 2

సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్టు సమాచారం. జిల్లాల వారీగా ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటుచేసి వాటిద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేయాలని ప్రతిపాదించింది. అంతేగాకుండా అవసరమైతే కొంత మొత్తాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుమతిస్తే బ్యాంకులతో ఓటీఎస్‌(ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌)కు చర్చిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. దీన్ని విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

agrigold 06062018 3

అగ్రిగోల్డ్‌కు సంబంధించి అత్యధిక విలువ కలిగిన పది ఆస్తుల జాబితాను ఏపీ సీఐడీ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్‌ 25న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని రూపొందించింది. ఇవన్నీ ఏ బ్యాంకులోనూ తనఖాలో లేనివే. అగ్రిగోల్డ్‌ కేసులో కాంపింటెంట్‌ అథారిటీగా వ్యవహరిస్తున్న సీఐడీ అదనపు డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఈ వివరాలను హైకోర్టుకు నివేదించారు. మచిలీపట్నంలోని చల్లపల్లి జమీందార్‌ వీధిలో ఖాళీ ప్లాట్‌. విజయవాడ మొగల్రాజపురంలో 24000.92 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన జీ ప్లస్‌ 4 భవనం. విలువ రూ.10.55 కోట్లు. విజయవాడ కండ్రికలో 4199.7 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన పారిశ్రామిక భవనం (5427.64 నిర్మితప్రాంతం). విలువ రూ.9.23 కోట్లు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామం అల్లూరు రోడ్డులోని వ్యవసాయ భూమి.విజయవాడ వాంబే కాలనీలో ఖాళీ ప్లాట్‌. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోతెగుంట గ్రామంలో వ్యవసాయ భూమి. విలువ రూ.6.7 కోట్లు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 75.96 ఎకరాల భూమి (టేకు, చింత తదితర చెట్లున్నాయి). విలువ రూ.4.93 కోట్లు.

సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న స్వామినే రాజకీయాల్లోకి లాగి, స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ, బీజేపీ నేతలను కలుస్తూ, తిరుమల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితుల పై టీటీడీ పాలకమండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి ఆభరణాలు, కైంకర్యాలు, ఇతర అంశాలపై, నిరాధార ఆరోపణలకు కళ్లెం వేసి తీరాల్సిందేనని నిర్ణయించింది. ఆయనతోపాటు... ఆ ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. మంగళవారం తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రమణ దీక్షితులు ఆరోపణలపై నివేదికను రూపొందించి న్యాయ నిపుణుల సూచనలు కోరతాం. ఆయనతోపాటు టీటీడీపై విమర్శలు చేసిన వ్యక్తులకూ నోటీసులు జారీ చేస్తాం’’ అని తెలిపారు.

ttd 0602018 2

దీక్షితులుపై సుధాకర్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘24 ఏళ్లుగా స్వామివారికి సేవలందించారు. అప్పుడు లేని అనుమానం ఈ రోజే ఎందుకొచ్చింది? నిజంగా తప్పు జరిగి ఉంటే ఆయన తిరుమలకు వచ్చి మాట్లాడాలి. మేమెక్కడికీ పారిపోలేదు. తప్పు జరిగినట్లయితే మాకు చూపించవచ్చు కదా! మేమూ మీవెంట వస్తాం. ఆలయంలో చూద్దాం రా! అది వదిలేసి హైదరాబాద్‌లో ఒకసారి ఢిల్లీలో ఒకసారి, చెన్నైలో ఒకసారి ఎవరి పోత్సాహంతోనో పూటకో మాట మాట్లాడుతున్నావు? భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నావ్‌! దేవునిపై దుష్ప్రచారం చేస్తున్నావ్‌! ఆ దేవుడే నీకు సరైన గుణపాఠం చెబుతాడు’’ అని హెచ్చరించారు.

ttd 0602018 3

మిరాశీ వ్యవస్థ రద్దయ్యాక టీటీడీ ఆధీనంలోకి వచ్చిన ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈవో, చైర్మన్‌ తెలిపారు. ఈనెల 26న జరిగే సమావేశం సందర్భంగా బోర్డు సభ్యులకు ఆభరణాలను చూపిస్తామని తెలిపారు. గ్రామాలలో శ్రీవారి ఆలయాలు, రామాలయాలు నిర్మించడానికి అయ్యే అంచనా విలువను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. ఇకపై ప్రవాస భారతీయ దాతలకు కూడా శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. వెంటనే ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో ప్రసారమైన, ప్రచురితమైన వార్తలను పరిశీలించి పరువునష్టం కలిగించిన వ్యక్తులను గుర్తించాలని దేవస్థానం న్యాయవిభాగాన్ని ఆదేశించింది. లీగల్‌ నోటీసులు ఇచ్చి న్యాయపోరాటం చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు అందుకోనున్నవారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

 

Advertisements

Latest Articles

Most Read