జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ప్రధానిని కలసినా, అమిత్ షాని కలిసి ఒప్పించటానికి చూసినా, జగన్ పప్పులు ఉడకటం లేదు. కేంద్రం మాత్రం తగ్గటం లేదు. మీ విధానాల వల్ల, దేశానికి నష్టం అంటూ, జగన్ ప్రభుత్వ వాదనతో ఏకీభావించటం లేదు. ఇదే విషయాన్ని కేంద్రం అధికారికంగా హైకోర్ట్ కు కూడా చెప్పింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, 42కు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫున న్యాయవాదులు, పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించే అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మరోసారి హైకోర్టులో పునరుద్ఘాటించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో, ఇలాంటి క్లాజ్ ఏమి లేదని, ఎప్పుడో కుదుర్చుకున్న ఒప్పందాల ఇప్పుడు సమీక్షించి, రేటు తగ్గించమనటం కుదరదని అన్నారు.

ppa 29082019 2

ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి, అన్నీ ఆలోచించి, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని, రేటును నిర్ణయించిందని, 2014లో నిర్ణయించిన రేటును 2019లో తగ్గించాలనడం కేంద్ర విద్యుత్‌ చట్ట నిబంధనలకు విరుద్ధమని విద్యుత్‌ సంస్థల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇదే సందర్భంలో కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) బి. కృష్ణమోహన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఏదైనా అవినీతి జరిగిందని, స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే, ఆ ఒప్పందాలని రద్దు చేసుకునే అవకాసం ఉంటుందని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న టైంలో పునః సమీక్ష క్లాజ్‌ ఉంటేనే, వీటిపై మళ్లీ చర్చకు వీలుంటుందని చెప్పారు.

ppa 29082019 3

అంతే కాని ఇష్టం వచ్చినట్టు ఒప్పందాలు ఉల్లంఘించడానికి కుదరదని, ఒప్పందంలో స్పష్టంగా రాసుకుంటే తప్ప, వాటిపై పునః సమీక్షలు కుదరవని కేంద్ర ఇంధన వనరులశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్‌ జనరల్‌ ప్రస్తావించారు. విద్యుత్ కంపెనీల తరఫున మరికొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉండటంతో హైకోర్ట్ న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. అటు కేంద్రంతో పాటు, ఇటు విదేశీ ప్రభుత్వాలు కూడా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టాయి. జపాన్ ప్రభుత్వం ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పొరపాటున నోరు జారి, ఒక మాట మాట్లాడబోయి, ఇంకో మాట మాట్లాడితేనే, వైసిపీ నేతలు, ఎలా అల్లరి చేసే వాళ్ళో, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా అందరూ చూసారు. ముఖ్యంగా లోకేష్ ని టార్గెట్ చేసుకుని, ఆయన స్పీచ్ లో దొర్లే ప్రతి చిన్న తప్పుని ఎత్తి చూపి, ఆయన్ను హేళన చెయ్యటం చూసాం. అలాగే అప్పటి అధికార పక్షం, ఏమైనా తప్పులు పెడుతూ బ్యానర్లు పెడితే, హేళన చేసి వదిలి పెట్టె వారు. అయితే కర్మ ఫలం ఎవరినీ వదలదు అన్నట్టు, ఇప్పుడు అధికారంలోకి వైసీపీ వచ్చింది, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు జారి, నవ్వుల పాలు అయ్యారు. తాజాగా ప్రభుత్వం వైజాగ్ లో పెట్టిన ఒక ప్రకటన బ్యానర్ కూడా నవ్వులు పాలు చేసింది. ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియదా అంటూ, ప్రజలు నవ్వుకుంటుంటే, పొరపాటులను ఎత్తి చూపి, అప్పట్లో టిడిపిని హేళన చేసారు, ఇప్పుడు వీరే అనుభవిస్తున్నారు అని మరి కొంత మంది అంటున్నారు.

sania 29082019 2

ఇక విషయంలోకి వెళ్తే, జాతీయ క్రీడాదినోత్సవ సందర్భంగా, ప్రభుత్వం తరుపున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సెహ్సిన ఏర్పాట్లలో వైజాగ్ లో ప్రభుత్వం తీరు విమర్శలకు దారి తీసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో వచ్చిన తప్పిదాలు, ప్రభుత్వాన్ని నవ్వుల పాల్జేశాయి. టెన్నిస్‌ సూపర్ స్టార్‌ సానియా మీర్జా ఫొటో ముద్రించి, బ్యానర్‌ పై మాత్రం, ఆమె పేరును మాజీ అథ్లెట్‌ పీటీ ఉష పేరు రాశారు. ఈ రోజు నేషనల్ సపోర్ట్స్ డే సందర్భంగా ప్రభుత్వం తరుపున వైజాగ్ బీచ్‌రోడ్డులో, మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్రీడా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గున్న క్రీడాకారులు ఈ బ్యానర్ చూసి అవాక్కయ్యారు. ఈ తరం స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఈ ప్రభుత్వానికి తెలియదా అంటూ ఆశ్చర్య పోతున్నారు.

sania 29082019 3

అయితే ఈ విషయం పై ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. "చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోంది. అది చంద్రబాబుగారి దార్శనికత. ఇక ఇప్పటి వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు. #NationalSportsDay" అంటూ ట్వీట్ చేసారు.

కర్నూల్ జిల్లా వైసీపీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర సిద్ధాపురం చెరువుకు నీటి విడుదల చేసే సందర్భంలో, నిన్న అతి పెద్ద ప్రమాదం నుంచి ప్రజా ప్రతినిధులు తపించుకున్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ఆర్థర్‌ తో పాటు మిగతా నేతలు, అధికారులు సిద్దాపురం స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ వద్ద నీటిని విడుదల చెయ్యటానికి అక్కడ స్విచ్‌ ఆన్‌ చేశారు. అయితే ఒక మోటార్‌ మొరాయించింది. దీంతో రెండో మోటార్ ని ఆన్‌ చేశారు. మోటార్లు ఆన్ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గుంటూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రజా ప్రతినిధులు ఆన్ చేసిన మోటార్ పని చెయ్యకపోవటంతో, అధికారులు దాన్ని సరిచేసి మ్యానువల్‌గా నీటిని విడుదల చేశారు.

siddhapauram 29082019 2

నీతి విడుదల సమయంలో, పంప్‌హౌస్‌ పైన ఉండి పైపుల్లో వస్తున్న నీటిని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా రెండు పైపుల నుంచి నీరు, ఒకేసారి వచ్చి పడింది. ఈ క్రమంలో అక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు నాయకులు ఏమి జరుగుతుందో తెలియక, భయంతో పరుగులు తీశారు. నీరు ఒకేసారి రావటంతో, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గందరగోళంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక వేళ నీటి ఉద్ధృతి ఇంకా ఎక్కువగా ఉన్నా, పంప్‌హౌస్‌ నుంచి జారినా, వీరందరూ చెరువులో పడిపోయేవారు. అయితే ఏ ప్రమాదం జరగకుండా, అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్స్ తో పాటు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తడిచిపోయాయి.

siddhapauram 29082019 3

ప్రమాదం జరిగింది ఇలా... ఆ పైపుల క్యాప్యాసిటీ 100 క్యూసెక్కులు గల సామర్థ్యం. రెండు భారీ పైపుల నుంచి చెరువులోకి నీరు వదిలే ప్రదేశంలో, ఇనుక బస్తాలతో తయారు చేసిన ప్లాట్ ఫారం పై ఎంపీ, ఎమ్మెల్యేలు నిలబడి అక్కడ నీటికి మంగళహారతులను, చీర సారె సమర్పించారు. ఇదే సమయంలో ఒక్కసారిగా నీటిప్రవాహంలో సంభవించిన ఎయిర్‌ ప్రెషర్‌ వల్ల, రెండు పైపుల నుంచి నీరు ఒక్కసారిగా నీరు బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, ఏమి జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. అక్కడ ఉన్న కడ్డీలను పట్టుకుని ఆ నీతి ఉదృత తట్టుకుని నిలబడ్డారు. కాగా ఇటలీ దేశంలో తయారైన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీతోనే నీటివిడుదలను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మోటార్లు మొరాయించడంతో మ్యాన్‌వల్‌ పద్ధతిలోనే నీరు విడుదల చేశారు.

అమరావతిలో కన్నా హైదరాబాద్ లోనే నిర్మాణ వ్యయం ఎక్కువని చంద్రబాబు అన్నారు. గుంటూరులో టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల పై ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగుల రాతపరీక్షకు రూ.5లక్షలు, రూ.10లక్షలు ఇస్తే ప్రశ్నాపత్రం ఇస్తామని దళారులే చెబుతున్నారంటే వైసిపి ప్రభుత్వ నిర్వాకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని అన్నారు. 10 లక్షలకు పేపర్ ఇస్తాం అంటూ తనకు కూడా ఎస్ఎంఎస్ వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చెప్పడం రాష్ట్రంలో దుస్థితికి అద్దం పడుతోందని, ఇంతకంటే సిగ్గు చేటు, ఈ ప్రభుత్వానికి ఏమి ఉంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

cbn 29082019 2

పారదర్శకత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పకడ్బందీ నిర్వహణ ఇవన్నీ నోటిమాటలే తప్ప ఆచరణ శూన్యం అని చంద్రబాబు అన్నారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల కోసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చెల్లించామని ఎంపికైన వారే చెబుతున్నారని, బాధ్యతలు చేపట్టగానే గ్రామ వాలంటీరు జనన ధ్రువీకరణ పత్రం కోసం సత్యవేడు మండలంలో రూ.5వేలు డిమాండ్ చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. వైసిపి కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే లక్షలాది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని, చంద్రబాబు అన్నారు. వైసిపి నేతల బెదిరింపులు-వేధింపులు తట్టుకోలేకే ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు,ఆరోగ్య కార్యకర్తలు,అంగన్ వాడి వర్కర్లు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు.

cbn 29082019 3

ఉన్న ఉద్యోగాలను ఊడబీకి వాటిలో వైసిపి కార్యకర్తలను నింపడం గర్హనీయం అని అన్నారు. ఇంత పెద్దఎత్తున రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేయడం వారిలో నెలకొన్న అభద్రతకు అద్దం పడుతోందని అన్నారు . పేదల పొట్టకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టనింపే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, దీని కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. అలాగే టిడిపి నేతల పై పెడుతున్న కేసుల పై కూడా స్పందించారు. "శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నేత కూన రవికుమార్ పై కేసు పెట్టారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు పెట్టారు. పునుగుపాడు వెళ్లిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల బృందంపై కేసులు పెట్టారు.గతంలో ఎమ్మెల్యే బెందలం అశోక్ పై దాడి చేశారు. కొండెపి ఎమ్మెల్యే స్వామిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఖండిస్తున్నాం. అదే వైసిపి ఎమ్మెల్యేలు జర్నలిస్ట్ లపైనే దాడులు చేసినా, ఫోన్ లో బెదిరించి దుర్భాషలాడినా కేసులు నమోదు చేయక పోవడం గర్హనీయం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read