వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారో ఏమో కాని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, మార్ఫింగ్లు, అసభ్యకర పోస్టింగ్ లు మాత్రం ఆపటం లేదు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉండగా, సాక్షి ఆఫీస్ లో పని చేసే, ఇంటూరు రవి కిరణ్ అనే వ్యక్తి, శాసనమండలి పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు తయారు చెయ్యటంతో, శాసనమండలి సభ్యులు కేసు పెట్టటంతో, పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, అప్పట్లో ఆ వ్యక్తి కోసం, విజయసాయి రెడ్డి రోడ్డు ఎక్కారు. నేను కూడా సోషల్ మీడియాలో, ఇష్టం వచ్చినట్టు రాస్తాను ఏమి చేస్తారో చేసుకోండి అంటూ, అసభ్యకర రాతలు రాసే ఇంటూరి రవి కిరణ్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ప్రతిపక్షం కాబట్టి, వీళ్ళు ఏమి చేసినా చెల్లింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏమి మంచి చేస్తున్నామో చెప్పాలి కానీ, అది చెయ్యకుండా, అసభ్యకర రాతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

lokesh 28082019 2

వరదల్లో పంట నష్టపోయి, మంత్రి పై నోరు జారాడని, అతను టిడిపి పైడ్ ఆర్టిస్ట్ అంటూ, జైల్లో పెడితే, ఇలాంటి అసభ్యకర రాతలు, విజయసాయి రెడ్డి అండగా ఉంటూ రాస్తున్న, ఈ రవి కిరణ్ లాంటి వాళ్ళు, పైడ్ ఆర్టిస్ట్ లు కారా ? చట్టాలు వీరికి పని చెయ్యవా ? వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు సియంగా ఉండగా, అనూ రాజేశ్వరి అనే మహిళ, కొడుక్కుని లుకేమియా వ్యాధి వస్తే, సియం రిలీఫ్ ఫండ్ కింద, డబ్బులు ఇచ్చి, ఆమె కొడుకుని బ్రతికించారు. వారం రోజుల క్రితం, బిడ్డకు పూర్తిగా నయం అవటంతో, ఆమె కృతజ్ఞతగా, చంద్రబాబు వద్దకు వచ్చి, ఆమె కొడుకుకి నయం అయ్యిందని, చంద్రబాబుకి కృతజ్ఞత చెప్పి, సంతోషాన్ని పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోలు చూపిస్తూ, సాక్షిలో/వైసీపీలో పని చేసే ఇంటూరు రవి కిరణ్ అనే వ్యక్తి, చంద్రబాబు, ఆ మహిళ పై, అసభ్యకరంగా పోస్టర్ వేసి, పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ, ఆవేదనతో ఫేస్బుక్ లైవ్ పెట్టి, కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయం పై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

lokesh 28082019 3

ఇది నారా లోకేష్ ట్వీట్... "దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులూ అధికారంలోకి వస్తే సంస్కారహీనులు ఇలాగే రెచ్చిపోతారు. అనూ రాజేశ్వరి అనే తెదేపా కార్యకర్త, ఒక బీసీ మహిళ. ఆమె కొడుక్కి లుకేమియా వ్యాధి వస్తే మానవత్వంతో ఆదుకున్న చంద్రబాబుగారు ఆమె దృష్టిలో దైవంతో సమానం. రాజేశ్వరిగారు చంద్రబాబుగారిని కలవడానికి వచ్చినప్పటి ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసారు వైసీపీ వాళ్ళు. ఇక కామెంట్లు అయితే సభ్యసమాజం తలదించుకునేలా, అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. జగన్ గారూ! ఒక బీసీ మహిళను నీచంగా అవమానించిన వారి అహంకారానికి పార్టీపెద్దగా మీరు సమాధానం చెప్పాలి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెదేపా కార్యకర్తలపై దాడులు చేసారు. ఆస్తులు కూల్చారు. ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఇలాంటి నీచమైన చర్యలకు దిగారు. ఇక మీ ఆగడాలు సహించేది లేదు. ఏ రకంగా మిమ్మల్ని కట్టడి చేయాలో మాకూ తెలుసు. న్యాయపరంగా, హక్కులపరంగా మీకు బుద్ధి చెప్పేవరకు పోరాడుతాం. ఖబడ్ధార్!" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఇప్పటికీ పనులు మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం, ఎప్పటికి మొదలు పెడుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తాజగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును, పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుని, అందరికీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావు చాలా సీనియర్ అధికారి, వైఎస్ఆర్ హయంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక బాధ్యతలు ఆయనే చూసుకునే వారు. ఆయన్ను తప్పించటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గా ఉన్న వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

polavaram 28082019 2

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి మాత్రమే కాకుండా, ఆయన్ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా తొలగించటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా జలవణరుల శాఖా అధికారులు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ప్రస్తుతం, అటు కేంద్రానికి, రాష్ట్రానికి ఈ విషయంలో వార్ నడుస్తుంది. మరో పక్క, కోర్ట్ లో కూడా ఈ విషయం ఉంది. న్యాయ పరమైన విషయాలు ఎప్పటికి తెలుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి నుంచి, ఉన్న ఇలాంటి సీనియర్ అధికారులను తప్పించటం పై అందరూ షాక్ అయ్యారు.

polavaram 28082019 3

వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ హయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు చూస్తున్నారు. తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా అయన సేవలను పోలవరం ప్రాజెక్ట్ లో ఉపయోగించుకున్నారు. కేంద్రం నుంచి వివిధ పర్మిషన్ లు తీసుకు రావటంలో, నిధులు తీసుకురావటంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఈయన సేవలు, పోలవరం ప్రాజెక్ట్ కు అవసరం లేదని భావించి, ఆయన్ను, రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. మరోప్ అక్క వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సీఈ సుధాకర్‌బాబును ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన్ను ఎందుకు తప్పించారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

జగన్ ప్రభుత్వం, రాజధాని అమరావతిని తరలిస్తుంది అనే, ఏకంగా మంత్రులే ప్రకటన చెయ్యటం, ఇంత గొడవ జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడక పొవటంతో, రాజధాని రైతులు ఆందోళన బాట పాట్టారు. రెండు రోజుల నుంచి, అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. నిన్న ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నే అడ్డుకునే ప్రయత్నం చేసారు. రాజధాని రైతులకు బీజేపీ, టిడిపి, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు అండగా నిలిచాయి. రైతులు కూడా, అటు కన్నా, ఇటు పవన్, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని కలిసి, వారితో పోరాటానికి కలిసిరావాలని వివిధ పార్టీలను కోరారు. దీనికి అనుగుణంగా, నిన్న బీజేపీ నేతలు, రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. మరో పక్క, నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య, కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చారు.

venkaiah 28082019 2

స్వర్ణ భారతీ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి అయ్యి రెండేళ్ళు అయిన సందర్భంలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, అమరావతి రైతులు, వెంకయ్యను కలిసి, తమ బాధలు చెప్పుకున్నారు. తమకు సొంత కుటుంబ సభులతో సమానమైన భూమిని, ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో, రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని, రాష్ట్రాభివృద్ధి కోసం, భూములు ఇచ్చామని అన్నారు. అటు రాష్ట్రం బాగుపడుతుంది, ఇటు మా జీవితాలు కూడా బాగుపదతాయని అనుకున్నామని వారు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రాజధాని అమరావతి మారిపోతుందని, ప్రభుత్వంలోనే మంత్రులే ప్రతి రోజు చెప్తున్నారని, దీనికి తగ్గట్టుగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని రైతులు వెంకయ్య దృష్టికి తీసుకొచ్చారు.

venkaiah 28082019 3

తమకు న్యాయం చెయ్యాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అమరావతి మార్చకుండా సూచనలు ఇవ్వాలని వారు ఉప రాష్ట్రపతి వెంకయ్యను కోరారు. దీని పై స్పందించిన వెంకయ్య నాయుడు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, అమరావతి మార్పు పై ఎటువంటి అధికారిక ప్రకటన విడుఅల కాలేదు కదా, మీరు ఆందోళన చెందకండి అని అన్నారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను అని, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నని, రాజకీయాలు మాట్లాడకూడదు అని, కాని, రాజ్యాంగబద్ధంగానే ఈ విషయం పై తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని రైతులకు ధైర్యం చెప్పారు. మీ తరుపున ఏమి చెయ్యగలనో, ఎంత చెయ్యగలనో, అక్కడి వరకు వెళ్లి అన్నీ చేస్తానని వెంకయ్య అన్నారు.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, వైసీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వరదలు సాకుగా చూపి, అక్కడ నుంచి రాజధాని తరలించే ఆలోచనలో ఉంది. అయితే ఈ విషయం పై, ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య మాటల దాడి జరుగుతున్న సందర్భంలో, మంత్రి బొత్సా సత్యన్నారాయణ, తెలుగుదేశం నేత, సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ వియ్యంకుడి పై ఆరోపణలు చేసారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏమన్నా కొత్త విషయాలు బయట పెడతారు అనుకుంటే, అప్పట్లో సాక్షి పేపర్ లో వచ్చిన కధనాలే, ఇప్పుడు మళ్ళీ బొత్సా చెప్పుకొచ్చారు. చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి, జగ్గయ్యపేట మండలం జయంతీపురం గ్రామంలో, ఎకరా లక్ష చొప్పున, 493 ఎకరాలు ప్రభుత్వం అప్పనంగా ఇచ్చి, దాన్ని రాజధాని ప్రాంతంలో కలిపారని ఆరోపణ చేసారు.

bharat 28082019 2

అయితే, బొత్సా చేసిన ఆరోపణల పై, బాలయ్య వియ్యంకుడి కుటుంబం తరుపున, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్‌ స్పందిస్తూ, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. బొత్సా ఆరోపణలకు సంబంధించి, పూర్తీ ఆధారాలతో సహా, మీడియా ముందుకు వచ్చి, దాదపుగా 25 డాక్యుమెంట్లు మీడియా ముందు పెట్టి, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. అసలు ఈ భూమి మాకు ఇచ్చింది వైఎస్ఆర్ హయంలోనే అంటూ బాంబు పేల్చారు భరత్. దానికి సంబధించి ఆధారాలు ఇచ్చారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉందని, దీని పై బొత్సా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.

bharat 28082019 3

తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయంలో, దీని పై జీవో వచ్చిందని, అప్పట్లో కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో బొత్స మంత్రిగా ఉండగానే భూములు కేటాయించారని స్పష్టంచేశారు. అయితే ఈ భూమి పై, న్యాయపరమైన వివాదం రావటంతో, ఇప్పటికీ ఈ భూమి మా కంపెనీకి అప్పచెప్పలేదని అన్నారు. ఎప్పుడో రాష్ట్ర విభజనకు ముందు ఇవన్నీ జరిగాయని, బాలకృష్ణ గారి కుటుంబంతో సంబంధాలు పెట్టుకోక ముందే, తన పెళ్లికి ఆరేళ్ల ముందే తాము ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించామన్నారు. ఈ వ్యవహారంలో అసలు ఎక్కడా తెలుగుదేశం పాత్ర లేదని భరత్ చెప్పారు. అమరావతిని తప్పుదోవ పట్టించి, చంద్రబాబు పై బురద చల్లి, ఎదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టె ఆలోచన చేస్తున్నారని భరత్ అన్నారు. ఒక మంత్రి హోదాలో ఆరోపణలు చేసేప్పుడు, ఆధారాలతో ఆరోపణలు చెయ్యాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, 2007 నుంచి ఇప్పటి వరకు ఉన్న వివిధ డాక్యుమెంట్లు భరత్ బయట పెట్టారు.

Advertisements

Latest Articles

Most Read