వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్, అమరావతి మార్పు వార్తలు. వారం రోజుల క్రితం బొత్సా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అమరావతి పై ప్రకటనలు చెయ్యటం పై, రాజధాని అమరావతి రైతులు రోడ్డెక్కారు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఒక పక్క కౌలు డబ్బులు ఇవ్వటం లేదని, ఇప్పుడు ఏకంగా రాజధానినే మార్చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. రాజధాని తరలించాలి అంటే, మా శవాల పై తీసుకువెళ్ళండి అంటూ, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేసారు. అమరావతికి వరద ముంపు అంటూ కొత్త రాగం అందుకున్నారని, మేము ఇక్కడ తరతరాలుగా ఉండటం లేదా, అప్పుడు లేని వరద, ఇప్పుడు వస్తుందా అంటూ జగన్ ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీకి చెందిన సానుభూతి పరులు కూడా ఈ ధర్నాలో పాల్గున్నారు.

botsa 26082019 2

అయితే రాజధాని రైతుల ఆందోళన పై, బొత్సా ఈ రోజు స్పందించారు. వాళ్ళు ఆందోళన చేసేది కౌలు డబ్బులు కోసం అని, అమరావతి రాజధాని గురించి కాదని, అన్నారు. ఒక రకంగా, రైతులను హేళన చేసారు. ఇదే సమయంలో అమరావతి పై మళ్ళీ అవే వ్యాఖ్యలు చేసారు. అమరావతికి ముంపు ఉందని, ముంగిపోతుందని బొత్సా అన్నారు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన చేసిన వ్యాఖ్యల పై కూడా బొత్సా స్పందించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అమరావతిలో అతి పెద్ద భూకుంబకోణం జరిగిందని, ఇన్‌సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని బొత్సా అన్నారు. ఆ చిట్టా సరైన సమయంలో బయట పెడతామాని అన్నారు.

botsa 26082019 3

ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ పై, ఇటు బీజేపీ పై కూడా బొత్సా మండి పడ్డారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఛాలెంజ్ విసిరారు. రేపు సుజనా చౌదరి, బీజేపీ పార్టీ తరుపున, రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించే సమయంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బొత్స మాట్లాడుతూ, నిన్న ఒక కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ, ఆయనకు ఇక్కడ ఒక్క సెంట్ కూడా భూమి లేదని అన్నారు, ఆయనకు ఇదే మా ఛాలెంజ్. మీకు ఇక్కడ భూమి ఉందొ లేదో, మీరు దమ్ముంటే మమ్మల్ని చూపమని అడగండి, మేము చూపిస్తాం. ల్యాండ్ రికార్డ్స్ కూడా చూపిస్తాం, రెడీనా అంటూ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ చేసారు. మరి రేపు, అమరావతిలో పర్యటించే, సుజనా చౌదరి, ఈ ఛాలెంజ్ పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

పోలవరం విషయంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రం ట్రాప్ లో పడ్డారా ? లేక చేజేతులా అవకాశాన్ని తీసుకువెళ్లి, కేంద్రం చేతిలోనే పెట్టారా ? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబు, జగన్ కు బంగారపు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. 2014కు ముందు ఏమి లేని ప్రాజెక్ట్ సైట్ లో, ఏకంగా 73 శాతం పనులు చేసి పెట్టారు. అమరావతి, పోలవరం నా రెండు కళ్ళు అంటూ, ప్రతి సోమవారం పోలవరం పై సమీక్ష చేసి, పోలవరం సాకారం అవుతుంది అనే నమ్మకం తెచ్చారు. ఇలాంటి టైంలో జగన్ వచ్చారు. కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళు అయితే, చంద్రబాబు అప్పచెప్పిన పనిని, పూర్తీ చేసి, పోలవరం క్రెడిట్ అంతా, తన ఖాతాలో వేసుకోవచ్చు. ఇక్కడే జగన్, రాష్ట్రం గురించి కాకుండా, తన సహజ స్వభావాన్ని బయటకు తెచ్చారనే భావన కలుగుతుంది.

polavaram 26082019 2

చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టర్ చేత ఎందుకు పనులు చేపించాలి ? చంద్రబాబుని ఈ విషయంలో ప్రజలు మర్చిపోవాలి అనే విధంగా, జగన్ మోహన్ రెడ్డి ఇగోకి పోయారు. నవయుగని కారణం లేకుండా వెళ్ళిపోమనటంతో, వాళ్ళు కోర్ట్ కి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం కూడా, నవయుగని ఎందుకు తప్పిస్తున్నాం అనే విషయం చెప్పలేక పోయింది. దీంతో కోర్ట్ ప్రభుత్వం ఇచ్చిన రీటెండరింగ్ నోటిఫికేషన్ రద్దు చేసింది. మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం విషయంలో తొందరపడి టెండర్లు రద్దు చెయ్యద్దు అని చెప్పినా వినకుండా, ముందుకు వెళ్లి, కేంద్రం ఆగ్రహానికి గురయ్యారు. అయితే, ఇదే మంచి అవకాశంగా కేంద్రంలోని బీజేపీ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వంకగా చూపించి, ప్రాజెక్ట్ మొత్తం తన అధీనంలోకి తీసుకోవాలని చూస్తుంది.

polavaram 26082019 3

ఇందులో భాగంగానే, నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కలిసి, జీవీఎల్ ఆధ్వర్యంలో, పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి, జరుగుతున్న విషయాల పై బీజేపీ నేతలు స్పష్టత తీసుకున్నారు. ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యటం పెద్ద విషయం కాదని, పునరావాసం విషయంలోనే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయని, దాదపుగా లక్ష కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని, అందుకే పోలవరం బాధ్యత కేంద్రం తీసుకుంటే, రాజకీయంగా కూడా, రాష్ట్రంలో బలపడే అవకాసం ఉంటుందని, భావిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ పోలవరం పనులు మొదల పెట్టలేదు కాబట్టి, జరుగుతున్న విషయాలు సాకుగా చూపి, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకునే అవకాసం ఉంది. ఇదే జరిగితే, జగన్ మోహన్ రెడ్డి, చేజేతులా వేసుకున్న సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి. ఏమి జరుగుతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.

జగన్ అమెరికా నుంచి రాగానే హోటాహుటిన చేసిన మొదటి సమీక్ష పోలవరంలో కోర్ట్ మరియు కేంద్రం మొట్టికాయల పైన. ఒక పక్క వరదలు వచ్చి, ప్రజలు అల్లాడి పొతే, అది పక్కన పెట్టి మరీ, ముందుగా పోలవరం పై సమీక్ష చేసారు. అది కూడా ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యటానికి కాదు. ప్రాజెక్ట్ ను ఆపి, కొత్త టెండర్ పిలవటంలో విఫలం అయినందుకు. దీని పై అధికారులతో సమావేశం అయ్యారు, హైకోర్ట్ ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, అలాగే కేంద్రం ఎందుకు మన మీద ఆగ్రహంగా ఉంది అంటూ సమీక్ష జరిపారు. అయితే అధికారులు మాత్రం ఏమి చెప్తారు ? ఇది పూర్తిగా పొలిటికల్ డెసిషన్ కదా. ఒక సీనియర్ అధికారి చొరవ తీసుకుని, ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ విఫలం అయ్యిందో పూర్తి వివరంగా జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు. పోలవరం రీ టెండరింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ తప్పటడుగు వేసిందో చెప్పారు.

jagan 25082019 2

ఇప్పటికే జరుగుతున్న ఒక కాంట్రాక్టు, అదీ పనులు దూసుకు వెళ్తున్న వేళ, మనం పొలిటికల్ గా డెసిషన్ తీసుకుని రద్దు చేసాం. అవినీతి జరిగింది అని చెప్పాం కాని, ఎక్కడా పాలనా తప్పు జరిగింది అని చెప్పలేదు. నవయుగ కంపెనీ 73 శాతం పనులు పూర్తీ చేసేలా సహాయ పడింది. అలాంటి సంస్థని తప్పించే సమయంలో, పలనా తప్పు వాళ్ళు చేసారు అని మనం కోర్ట్ కి కాని, ఇటు కేంద్రానికి కాని చెప్పలేక పోయాం. అందుకే ఇటు కోర్ట్ కాని, అటు కేంద్రం కాని, మన వాదనతో ఏకీభవించలేదు. అంతే కాదు రివర్స్ టెండరింగ్ కు వెళ్తే, ఇంత తక్కువ ధరకు పనులు జరుగుతాయా ? అనుకున్న సమయానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చి పనులు, ఇంతే వేగంగా పూర్తీ చేయ్యగలుగుతారా అనే విషయం కూడా మనం సరిగ్గా చెప్పలేక పోయాం అంటూ అధికారులు జగన్ కు విన్నవించారు.

jagan 25082019 3

ఇవన్నీ విన్న జగన్ కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పోలవరం పనుల పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎదో ఒక నెపం దొరికితే తప్ప అటు కోర్ట్ కాని, ఇటు కేంద్రం కాని, జగన్ ప్రభుత్వ వాదన వినే పరిస్థితులో లేదు. అందుకే ఎదో ఒక విధంగా, విజిలెన్స్ విచారణలో, ఎక్కడో ఒక చోట నవయుగ తప్పు చేసినట్టు తెలిస్తే, ఆ పాయింట్ మీద, పోలవరం టెండర్ లు రద్దు చేస్తున్నాం, అని ఇటు కోర్ట్ కు, అటు కేంద్రానికి చెప్పి, ఒప్పించవచ్చు అనేది జగన్ ఆలోచన. అందుకే జగన్ అమెరికా నుంచి వచ్చీ రావటంతోనే, ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలవరం విషయంలో, బాగా పని చేస్తున్న నవయుగని తప్పించాలని జగన్, ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. చూద్దాం, అవినీతిని విజిలెన్స్ అయినా బయట పెడుతుందో లేదో.

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విషయంలో, ప్రత్యర్ధి పార్టీ వాళ్ళే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా అప్పుడప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చంద్రబాబుకి ఉన్న తలనొప్పులకు ఇది ఓక ఎక్ష్త్రా అడ్వాంటేజ్. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యం. ఆనాడు ఎన్టీఆర్ అయినా, తరువాత బాలకృష్ణా, హరికృష్ణా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, తారక్ రాం, ఇలా ఎవరికి తోచినట్టు వారు పార్టీకి సేవ చేసారు. బాలకృష్ణ 2014 నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నారు. హరికృష్ణ కొన్నాళ్ళు ఉన్నా, తరువాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు 2009లో హరికృష్ణకు రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు. అయితే విభజన సమయంలో, ఆయన రాజీనామా చేసారు. ఇక జు ఎన్టీఆర్, మిగతా వారసులు, పార్టీకి కావలసిన సమయంలో వచ్చి ప్రచారం చేసి, వెళ్ళిపోయి, వాళ్ళ సినిమాలు చూసుకుంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కూడా, ఎందుకంటే, వాళ్ళకు సినిమాల్లో ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి.

bharat 25082019 2

అయితే ఇక్కడ రాజకీయాన్ని, సినిమాని విడదీసి చూడాల్సిన సందర్భంలో, రాజకీయాల్ని, సినిమాలను కలిపి చూసి, పార్టీకి లేని పోని తలనొప్పులు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇది ఎక్కువ అవుతుంది. లోకేష్ అన్ని వ్యాపారాలు వదిలేసి, ఫుల్ టైం రాజకీయాలు చేస్తున్నారు. అదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వచ్చి, పార్టీకి మంచి చేస్తాను అంటే ఆపే వారు ఎవరు ఉంటారు ? కాని ఇదే సందర్భంలో, ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్న లోకేష్ కు, ఫుల్ టైం సినిమాల్లో ఉన్న జు ఎన్టీఆర్ కు లంకె పెడతారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇది పార్టీకే దెబ్బ అవుతుంది. ఇప్పుడు బాలయ్య చిన్న అల్లుడు, విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ చేసిన వ్యాఖ్యలు కూడా అనవసర రాద్ధాంతానికి దారి తీసాయి. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఇది అనవసర చర్చ అనే చెప్పాలి. నిన్న ఒక ఇంటర్వ్యూ లో భరత్ ని, విలేఖరి అడిగిన ప్రశ్న "జూనియర్ ఎన్టీఆర్ "వస్తేనే" పార్టీ బాగుపడుతుంది అనుకుంటున్నరా ?" అని ప్రశ్న వేసారు.

bharat 25082019 3

దీనికి భరత్ సమాధానం చెప్తూ, అలా ఎందుకు అనుకోవాలి, జూనియర్ వస్తే ఎవరూ కాదనరు, ఆయనకు ఫ్యాన్ ఫలోఇంగ్ ఉంది, బాగా మాట్లడతారు, చంద్రబాబు దగ్గరకు వచ్చి, నేను రాజకీయాల్లోకి వస్తాను అని అడిగితే, చంద్రబాబు ఒకే అంటే ఆయన రావచ్చు. అంతే కాని, అయన వల్ల మాత్రమే పార్టీ నిలబడుతుంది అంటే ఒప్పుకొను, పార్టీలో ఎంతో మంది ఉన్నారు, అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తాం అన్నారు. ఇదే సమయంలో ఆ విలేఖరి మళ్ళీ అడుగుతూ, ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడుతుంది అని మీరు అనుకోవటం లేదు ? అని అడిగితే, అవును ఎన్టీఆర్ వస్తేనే నిలబడుతుంది అని అనుకోవటం లేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్, ఈ మాటను తప్పుగా అర్ధం చేసుకుంటూ, ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదు అనే యాంగిల్ తీసుకున్నారు. దీని వల్ల పార్టీకే నష్టం కాని, ఎవరికో కాదు. జు ఎన్టీఆర్ సియం అవ్వాలి అంటే, ముందు పార్టీ బలంగా ఉండాలనే లాజిక్ మర్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. జు ఎన్టీఆర్ వస్తాను అంటే, ఆపేది ఎవరు ? చంద్రబాబుకి మరికొంత బలం వస్తుంది. ఇలా ఎవరో అన్నారు అని కాకుండా, జు ఎన్టీఆర్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫుల్ టైం రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది కాని, ఆయన పాటికి ఆయన అందరివాడు అనిపించుకోవటం కోసం, ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటుంటే, అపార్ధాలు చేసుకుని, పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు. భరత్ లాంటి వాళ్ళు కూడా, ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే, ఈ అపోహలు కూడా లేకుండా ఉంటాయని టిడిపి అబిమానులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read