ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా మధ్య మళ్ళీ వాటర్ ఫైట్ మొదలయింది. మళ్ళీ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, చంద్రబాబు ఉన్న 5 ఏళ్ళు, రాయలసీమకు నీళ్ళు ఇవ్వటానికి, ఆ ప్రాజెక్ట్ అని, ఇదని అదని, ఏదో ఒకటి చేస్తూ ఉండటంతో, తెలంగాణా అభ్యంతరం పెడుతూ ఉండేది. అయినా సరే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టారు. పట్టిసీమ కట్టి ఆ నీటిని డెల్టాకి వాడుకుని, కృష్ణా నుంచి వచ్చే నీరు అంతా రాయలసీమకు పంపించారు. ఇలా చంద్రబాబు చేసే ప్రతి ప్రయత్నం కేసీఆర్ అడ్డుకుంటూ ఉండేవారు. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, కేసీఆర్, జగన్ ఇద్దరూ మంచి స్నేహితులు అవ్వటంతో, ఈ వివాదాలు ఉండవు అని ఇద్దరూ ప్రకటించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్తే, కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమ చేస్తాను అని ప్రకటించారు. అయితే ఏడాది నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవటంతో, కేసీఆర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోతిరెడ్డిపాడు కాలువలు విస్తరణ చేసుకుంటాం అని చెప్పటంతో, వివాదం మొదలైంది. కనీసం మాకు చెప్పకుండా, ఏపి జీవో ఇచ్చింది అంటూ, తెలంగాణా అంటుంటే, మాకు కేటాయించిన నీళ్ళు మా ఇష్టం అంటూ, ఏపి చెప్పుకొచ్చింది. అయితే, ఈ వివాదం మొత్తం, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా, అటు తెలంగాణా ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పరస్పరం అక్రమ ప్రాజెక్టులు అంటూ, రివర్ బోర్డు కు ఫిర్యాదు చేసాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అంటూ, కంప్లైంట్ చెయ్యటంతో, అందరూ అవాక్కయ్యారు. ఏ ప్రాజెక్ట్ అయితే, జగన్ వెళ్లి రిబ్బన్ కటింగ్ చేసారో, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అక్రమం అని కంప్లైంట్ చెయ్యటం ఆశ్చర్యం కలిగించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అని, ఏపి రైతాంగం దెబ్బతినే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కు వెళ్ళవద్దు అని చెప్పినా, అప్పట్లో జగన్ వెళ్లి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసి, రిబ్బన్ కటింగ్ చేసి, ఫోటోలు దిగి వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ అంటూ ఫిర్యాదు చేసారు. అయితే, ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ కాదని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డే, ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారని, శిలాఫలకం పై ఆయన పేరు కూడా ఉందని, అప్పట్లో సక్రమం అయిన ప్రాజెక్ట్, ఇప్పుడు అక్రమం ఎలా అవుతుంది, అని తమ వాదనలు వినిపించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, ఆ రోజు జగన్ చేసిన పనితో, ఇప్పుడు ఏపికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలా కాకుండా, మరో గట్టి వాదనతో, ఏపి ప్రభుత్వం వచ్చి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆపగలిగితే, జగన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి జగన్ గారు, ఏమి చేస్తారో చూడాలి.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధ్యమైనంత ఎక్కువ వాడుకుని, అటు ప్రభుత్వ పధకాలు, ఇటు ఉపాధి కూలీలకు డబ్బులు వచ్చేవి. ఈ ఉపాధి హామీ పధకాన్ని వాడుకోవటంలో, చంద్రబాబు ప్రభుత్వం, దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పని చేసిన లోకేష్, ఈ పధకం పై, ఎక్కువ శ్రద్ధ పెట్టి, కూలీలకు ఎక్కువ పని దినాలు వచ్చేలా చేసి, అటు ఉపాధి కూలీలకు చేతినిండా డబ్బులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పనులు అయ్యేలా చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ కార్యక్రమం అంతా, నీరు-చెట్టు పధకం కింద, ఎక్కువ పనులు చేసే వారు. అయితే చివరి ఏడాదిలో చంద్రబాబుతో, రాజకీయ వైరుధ్య వాతావరణం ఉండటంతో, కేంద్రం ఈ ఉపాధి హామీ పనులకు నిధులు ఇవ్వకుండా, ఆపేయటంతో, 2018-2019 సంవత్సరానికి, ఆ నిధులు బాకీ పడ్డాయి. చంద్రబాబు ఎన్ని సార్లు అడిగినా, అప్పట్లో కేంద్రం ఆ నిధులు ఇవ్వలేదు.

అయితే తరువాత ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం, జగన్ మోహన్ రెడ్డి రావటం జరిగిపోయాయి. తరువాత, కొన్ని నెలలకు, 2018-2019 సంవత్సరానికి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, కేంద్రం నిధులు విడుదల చేసింది. అయితే, కేంద్రం ఇచ్చిన నిధులు, లబ్దిదారులకు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యటం, అలాగే ఈ విషయం పై, కొంత మంది హైకోర్ట్ లో కేసు కూడా వేసారు. ఈ కేసు పై, సోమవారం హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ కేసుని, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. అయితే విచారణ సందర్భంలో, హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఉఫాది హామీ నిధులు కేంద్రం ఇస్తే, ఆ నిధులు వాడుకునే అధికారం, దారి మళ్ళించే అధికారం ఎక్కడ ఉంది అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. నిధులు మళ్లింపు నిజం అని తేలితే మాత్రం, దానికి బాధ్యులు అయిన అధికారులు పై, విచారణకు ఆదేశాలు ఇస్తాం అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం పై, పూర్తి సమాచారంతో, తమకు అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది హైకోర్ట్. ఉపాధి హామీ నిధులు మళ్లింపు పై, తదుపరి ఏమి అవుతుంది, రాష్ట్రం ఏమి చెప్తుందో చూడాల్సి ఉంది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటన జరిగి 10రోజులు దాటింది. 12మంది చావులకు, 365మంది తీవ్ర అస్వస్థతకు, 5గ్రామాలతో సహా విశాఖ నగరం యావత్తూ కల్లోలానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై చర్యలు లేవు. సీఎం జగన్ మొక్కుబడి స్పందన, కంటి తుడుపు కమిటీల ఏర్పాటు, వైసిపి మంత్రుల నిద్ర నాటకాలు.. ఇవన్నీ వైసిపి చేతులకు అంటిన బురద తుడుచుకునే పనులే. సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు నిన్న పరాకాష్టకు చేరాయి. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు అనడం కన్నా పచ్చి అబద్దం మరొకటి లేదు. అబద్దాలతో తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయం. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. 1961 నుంచి 2020వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వినియోగిస్తున్న 219ఎకరాల భూమిని 23.11.1964న అప్పటి ప్రభుత్వం ఎకరం రూ2,500 చొప్పున కేటాయించింది( జివో నెం 217). ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 8.10.1992న అప్పటి ప్రభుత్వం ఇచ్చింది(జీవో నెం 1033). టిడిపి హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదు. భూముల కేటాయింపుపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం దీనిని బట్టే తెలుస్తోంది.

08.05.2007న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. 01.09.2009న మరోసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 13.04.2012న, 06.05.2012న క్లియరెన్స్ ఇచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ లు ఇచ్చాయి. (ఎనెగ్జర్స్) టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసిందే తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదు. పైగా పాలిస్టైరీన్ ఉత్పత్తులకు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో మావద్ద ఉన్నాయి. వీటిపై చర్చకు సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 08.05.2007న మరియు 01.09.2009న ఇచ్చిన అనుమతులను ఎందుకు జగన్మోహన్ రెడ్డి బైట పెట్టలేదు..? తండ్రి ఇచ్చిన అనుమతి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కొడుకుగా జగన్ పై లేదా..? 20.06.2019 నుంచి 23.06.2019 వరకు మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇవే రుజువులు. విజయవాడలో జరిగిన స్టేట్ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటి(ఎస్ ఈఏసి) సమావేశంలో అజెండాలో 128.48 అంశం కింద ఎల్జీ పాలిమర్స్ అప్లికేషన్ ను క్లియరెన్స్ చేసి స్టేట్ లెవల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి(ఎస్ ఈఐఏఏ) కు పంపారు. ఇది వాస్తవం కాదా.

స్టైరీన్ విస్తరణకు అనుమతిని టిడిపి ప్రభుత్వం నిరాకరించిందని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇచ్చిన అఫిడవిట్ లోనే చెప్పారు(10.05.2019న అఫిడవిట్ ఇదిగో..) టిడిపి అనుమతి ఇచ్చింది కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తులకే. స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. 27.12.2018 మరియు 20.6.2018న టిడిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు, దొంగ సాక్షి చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమే. ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక హస్తం వైసిపి ది కాదా..? ఈ కంపెనీ స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి ఇచ్చింది ఎవరు..? 2019 జులై 9న కేంద్రానికి సిఫారసు చేసింది మీరు కాదా..?( ఏపి స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి పంపిన సిఫారసు ఇదిగో) విశాఖలో జరిగిన దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హుటాహుటిన స్పందించి రూ50కోట్ల డిపాజిట్ చేయాలని కంపెనీని ఆదేశించింది. దీనిపై స్టే కోసం ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక హస్తం వైసిపిదే. ఇంత దురాగతానికి పాల్పడిన కంపెనీకి సీఎం జగన్ వత్తాసు పలుకుతారు. పరిహారం కంపెనీ నుంచి ఇప్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. కంపెనీతో తామేదో మాట్లాడుకుంటామని నిస్సిగ్గుగా చెబుతారు. ఆ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇస్తారు. ఈ వ్యాఖ్యలతోనే ఎల్జీ పాలిమర్స్ తో వైసిపికి ఉన్న ములాఖత్ రుజువైంది.

అబద్దాల ముఖ్యమంత్రి దాపురించడం దౌర్భాగ్యం: ముఖ్యమంత్రి స్థాయిలో అబద్దాలు చెప్పడం మంచిది కాదు. తన అబద్దాలతో జగన్ సీఎం హోదాను దిగజారుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దౌర్భాగ్యం. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై ‘‘మే 1న’’ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది (అనెగ్జర్). నిత్యావసరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్, ఫార్మా ఐటి హార్డ్ వేర్, జూట్ ఇండస్ట్రీస్ తదితర పరిశ్రమలనే తెరవాలని స్పష్టంగా చెప్పింది. ఆ జాబితాలో పెట్రో కెమికల్స్ లేకపోయినా ఎల్జీ పాలిమర్స్ కు మీరెందుకు అనుమతి ఇచ్చారు..? లాక్ డౌన్ లో కేంద్రం అనుమతి లేకున్నా ఎల్జీ పాలిమర్స్ తెరిచేందుకు మీరెలా అనుమతి ఇచ్చారు.? కంపెనీని అడిగేందుకు ప్రశ్నలు పంపాలట. కమిటి వేసే ప్రశ్నలకు జనం అడిగే ప్రశ్నలు కలిపి కంపెనీకి పంపుతారట. వాళ్లిచ్చిన జవాబును బట్టి చర్యలు తీసుకుంటారట. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది వైసిపి నాయకులా ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులా..? ఎల్జీ పాలిమర్స్, వైసిపి లాలూచి రాజకీయాలకు ఇవే నిదర్శనం. 12మంది చావుకు కారణమైన కంపెనీపై చర్యలు లేవు. పది రోజులైనా ఎవరినీ అరెస్ట్ చేసింది లేదు. దానిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వృద్దురాలు రంగనాయకమ్మ(గుంటూరు)పై తప్పుడు కేసులు పెట్టడానికి చేతులేలా వచ్చాయి..? 66ఏళ్ల వృద్దురాలైన ఒక సమాజ సేవకురాలిపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం, వైసిపి ప్రభుత్వ దుర్మార్గ చర్యలను గర్హిస్తున్నాం.

10రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మళ్లీ విశాఖ తొంగిచూడకుండా నిన్న వీడియో కాన్ఫరెన్స్ పేరుతో డ్రామా చేశారు. హుద్ హుద్ విపత్తులో టిడిపి ప్రభుత్వ పనితీరుకు, ఇప్పటి దుర్ఘటనలో వైసిపి ప్రభుత్వ పనితీరును విశాఖ వాసులే బేరీజు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైసిపి నాయకుల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. 10రోజులైనా గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్ద లేకపోవడం, బాధితుల్లో భరోసా లేకపోవడం కంపెనీపై చర్యలు చేపట్టక పోవడం, పదిరోజులైనా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలకు హద్దు అదుపు లేదు. దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీగురించి గాని, కమిటిలలో నిపుణుల నియామకంపైగాని, దీర్ఘకాలిక ఉపశమన చర్యలపై గాని, పరిహారం చెల్లింపులో వివక్షతపైగాని, బాధితులపై-వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసుల గురించి కాని సీఎం నోరు తెరవలేదంటేనే కంపెనీతో వైసిపి లోగుట్టు తెలుస్తోంది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోడానికి టిడిపిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టే జగన్మోహన్ రెడ్డిని మించిన అబద్దాల కోరు మరొకరు లేరనేది స్పష్టం అవుతోంది. టిడిపిపై కక్ష సాధింపుతోనో, నాపై అక్కసుతోనో రాష్ట్రానికి, భావితరాలకు నష్టం చేసే చర్యలకు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన బాధిత కుటుంబాలకు దక్షిణ కొరియాలో ఇచ్చినట్లుగా పరిహారం అందజేయాలని, వారిని దీర్ఘకాలంలో కలిగే అనర్ధాలనుంచి కాపాడటంపై దృష్టి పెట్టాలని, సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ఆ 5 గ్రామాల వారికి అందుబాటులో నెలకొల్పాలని, వారికి అందులో అత్యున్నత చికిత్స లభ్యం అయ్యేలా చూడాలని, అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ఆయా ప్రాంతాల్లో పర్యావరణాన్ని, భూగర్భ జలాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది. మే నెల వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీరు కంటే, ఎక్కవ వాడుకున్నారని, కృష్ణా బోర్డు రాష్ట్రానికి తెలిపింది. ఇప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కవ వాడుకున్నారు కాబట్టి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. సాగర్ కుడి కాలువ నుంచి కేటాయించింది 158.255 టీఎంసీ అయితే, ఇప్పటికే 158.264 టీఎంసీల వాడుకున్నారని తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి కేటాయించింది, 47.173 టీఎంసీలు అయితే, ఇప్పటికే 48.328 టీఎంసీలు వాడుకున్నట్టు బోర్డు తెలిపింది. ఇప్పటికే నీటిని వాడుకున్నారు కాబట్టి, బోర్డు ఉత్తర్వులు పాటించాలని, ఫిర్యాదులకు అవకాసం ఇవ్వకుండా సహకరించాలని కోరింది.

మరో పక్క కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవో పై బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వివరణ కోరింది. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం నాడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల బృందం భేటీ జరిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎదుట నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి అది త్యనాతో పాటు మరో ఇద్దరు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, గోదావరి జలాల వినియోగం విషయంలో తెలంగాణ పై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ మేరకు గోదావరి రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని సమాచారం.

ఎలాంటి డిపిఆర్లు ఇవ్వకుండా అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా తెలంగాణ అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని ఏపీ అధికారులు బోర్డుకు సమర్పించిన లేఖలో పేర్కొ న్నారని విశ్వసనీయంగా తెలిసింది. కాళేశ్వరం 225 టిఎంసీ, సీతారామ 70 టిఎంసీలు, తుపాకులగూడెం 100 టిఎంసీలు ఇలా మొత్తం 450.31 టీఎంసీల నీటి వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించినట్లు తెలిసింది. గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కింద రాష్ట్రాల ప్రాజెక్టుల పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో చూడకుండా అనేక నిర్మాణాలు చేపట్టిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి నీటి కేటాయింపులు ఫైనల్ కాలేదని తెలిపింది, ఇప్ప టికే కాళేశ్వరం 225 నుంచి 450 టిఎంసీ లకు, సీతారామ 70నుంచి 100 టిఎంసీలకు సామర్యం పెంచినట్లు తెలుస్తుందని వివరణ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజె క్టులను అడ్డుకోవాలని కోరుతున్నట్లు తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read