విశాఖపట్నంలో, ఎల్జీ పాలిమర్స్ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఆ గ్రామాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలను వెంకటాపురంలోని అడుగు పెట్టనివ్వకుండా, పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యన్నారాయ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పెందుర్తి పోలీసు స్టేషన్ కి తరలించారు. అనంతరం అక్కడ నుంచి ఆనందపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, జరుగుతున్న ఈ పరిణామాల పై తెలుగుదేశం పార్టీ భగ్గు మంది. బాధితులను పరామర్శించటానికి వస్తే అడ్డుకువటం, అరెస్ట్ చెయ్యటం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. వైసీపీ మంత్రులు, అక్కడ గ్రామాలకు దూరంగా పడుకుని డ్రామాలు ఆడారని, అక్కడ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ ఇబ్బందులు గురించి తెలుసుకోవటానికి, వెళ్తే అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న, 12 మంది చంపిన కంపెనీ వారిని కాకుండా, న్యాయం చెయ్యాలి అని చెప్పిన బాధితుల పై కేసులు పెట్టటం, ఇప్పుడు బాధితులకు అండగా ఉందామని, తెలుగుదేశం పార్టీ నేతలు వస్తే అరెస్ట్ చెయ్యటం ఏమిటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఇప్పటికీ అక్కడ ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నారని, నిన్న ఇద్దరు వాలంటీర్లు ఊపిరి ఆడక పడిపోవటం, కొంత మంది ఇళ్ళల్లో శుభ్రం చేసుకుంటూ, పడిపోవటం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం అంతా బాగుంది అని చెప్తూ, ఇక్కడ వాస్తవ పరిస్థితి చెప్పటం లేదు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

ఇక మరో పక్క, ఈ రోజు, ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఉన్న, వెంకటాపురం రైల్వేట్రాక్ సమీపంలో అంధకారం నెలకొంది. వీధి దీపాలు వెలగక స్థానికుల అవస్థలు పడుతున్నారు. స్టైరీన్ వాయువు పీల్చి మృతిచెందిన వారిలో ఎక్కువ మంది ఈ వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారే అన్న సంగతి తెలిసిందే. వెంకటాపురం రైల్వేట్రాక్ సమీపంలో అంధకారం నేలకోనటంతో, స్థానికలు భయాందోళనకు గురి అవుతున్నారు. వెంటనే, వీధి దీపాలు వెలిగేలా చెయ్యాలని కోరుతున్నారు. ఇప్పటికీ భయం భయంగా గడుపుతుంటే, వీధి దీపాలు లేకుండా చెయ్యటం పై, వారు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే అవి పునరుద్ధించాలని అక్కడ స్థానిక అధికారులను కోరుతున్నారు.

రాష్ట్రం ఒక పక్క కరోనాతో అల్లాడుతూ ఉండగానే, అనేక చెడు వార్తలు వినాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో, 11 మంది చనిపోవటం, అనేక మంది రోడ్డు మీద పరిగెత్తటం లాంటి ఘటనలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరో చెడు వార్త ఏపి ప్రజలను షాక్ కు గురి చేసింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో, పది మంది చనిపోవటం, మరికొంత మంది ప్రాణాలతో కొట్టుకుంటూ ఉండటంతో, ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద జరిగిన ఈ ఆక్సిడెంట్ తో, అందరూ షాక్ తిన్నారు. వ్యవసాయ కూలీలను తీసుకు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురి అయ్యింది. వ్యవసాయ పనులు ముగించుకుని, కూలీలు ట్రాక్టర్ పై ఇంటికి వెళ్తూ ఉండగా, ఈ ఘోర సంఘటన జరిగింది.

ట్రాక్టర్ అదుపు తప్పి, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో, అక్కడికక్కడే పది మంది చనిపోయారు. ట్రాక్టర్ వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో, ఆ స్థంబం పడిపోయి, దానికి ఉన్న కరెంట్ తీగులు వచ్చి, ఆ ట్రాక్టర్ లో ఉన్న కూలీల పై పడ్డాయి. ట్రాక్టర్ లో మొత్తం, 30 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం 11 మంది చనిపోగా, 8 మంది మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్ధులుగా తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానికులు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. వీరు అంతా, దగ్గరలోనే మిర్చి పొలంలో, మిరప పంట కోయటానికి వెళ్లి, చీకటి పడటంతో తిరిగి వస్తూ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో, ఇళ్ళ పట్టాల పై స్కాం జరిగింది అంటూ, హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. 600 ఎకరాల భూమి కొనుగులులో అవినీతి జరిగింది అంటూ, హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు, బూరుగుపూడికి చెందిన రైతు. ఆ పిటీషన్ ఈ రోజు హైకోర్ట్ లో విచారణకు వచ్చింది. తూర్పుగోదవరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో, ఎకరం రూ.7 లక్షల 20 వేలు చేసే భూమి, ప్రభుత్వం రూ.45 లక్షలు చెల్లించింది అంటూ, ఫిర్యాదు చేసారు. ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాలకు ఇస్తున్నారని, ఆ కొనుగోలులో, ఆరు రెట్లు అధిక ధర ఇచ్చారంటూ, కోర్ట్ దృష్టికి తెచ్చారు, పిటీషన్ తరుపు న్యాయవాది, బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు. అధికారులు, నాయకులు కుమ్మక్కు అయ్యి, ప్రజాధనం వృధా చేసారని చెప్పారు. అక్కడున్న 20 అడుగులు లోతు గుంతలు పుడ్చాలంటే వందల కోట్లు, ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని, కోర్ట్ కు తెలిపారు.

అయితే దీని పై హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, భూములు అమ్మిన రైతులకు, డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వం తరుపు వాదనలను అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇలాంటి కేసు పై దక్షిణ ఆఫ్రికాలో జడ్జిమెంట్ ప్రస్తావించారు, అడిషనల్ ఏజీ. అయితే సుప్రీం తీర్పులే దీని పై ఉన్నప్పుడు, ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకుని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తమకు కౌంటర్ దాఖలు చెయ్యటానికి సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరటంతో, కేసును హైకోర్ట్ వాయిదా వేసింది. రాజమండ్రి అర్బన్, రూరల్ మండల ప్రాంతంలోని 42,742 మంది పేదలైన లబ్దిదారులకు నవరత్నాలు పేరిట ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది.

ఈ మేర కు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లభ్యం లేకపోవడంతో రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, కోరుకొండ మండలంలో, 177 ఎకరాల్లో ఉన్న ఈ ఆవ భూములు కొనుగోలు చేసేలా, చేసారు. అక్కడ ఎకరా, 5 నుంచి 7 లక్షలు కూడా లేని చోట, ఏకంగా 43 లక్షల నుంచి 63 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించేలా ప్రయత్నాలు చేసారు. అయితే, ప్రయివేట్ వ్యక్తుల నుండి కొనుగోలు ద్వారా సేకరించిన భూముల్లో 177 ఎకరాలు భూమి గోదావరి ప్లడ్ ఎఫెక్ట్డ్ ల్యాండ్ ప్రాంతంగా ఉందని మార్చి 9 వ తేదీన జలవనరులశాఖ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ తన పై అధికారి అయిన ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ కి ఒక లేఖ కూడా రాసారు. జలవనరులశాఖ నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అంటే, ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. దీని పై, ఇప్పుడు హైకోర్ట్ ఏమి చెప్తుందో చూడాలి.

సోమశిల జలాల విడుదలలో డీఈలు అమ్ముడుపోయారంటూ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే సోమశిల నుంచి అనధికారికంగా 10 వేల క్యూసెక్కుల నీటిని ఎందుకు వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ "డక్కన్ ఏరియాకు ఈ మధ్య రెండో పంటకు నీరు ఇవ్వటం జరిగింది. లాక్ డౌన్ నేపధ్యంలో, మీటింగ్ పెట్టలేక పోవటంతో, కలెక్టర్ గారు అందరి ఒపీనియన్ తీసుకుని, అందరితో మాట్లాడి రెండో పంటకు నీరు ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది. సోమవారం రాత్రి, దాదాపుగా 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసారు. దాని వల్ల డైవర్షన్ రోడ్స్ అన్నీ కొట్టుకు పోయాయి. దీని పై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అంతా డెల్టా మీద పడే అవకాసం ఉంది. ఈ సోమశిల ప్రాజెక్ట్ లో ఉన్న డీఈలు అమ్ముడుపోయారు."

"ఏ నాయకుడుని అమ్ముడు పోయారో తెలియాల్సిన అవసరం ఉంది. 10 వేల క్యూసెక్కుల నీళ్ళు ఎవరు చెప్తే మీరు వదిలారు ? ఎక్కడకు వదిలారు ? ఏ నాయకుడు చెప్తే వదిలారు ? ఎందుకు వదిలారు ? ఉన్న రైట్స్ ప్రకారం ముందు డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి. దీని పై మంత్రిగారు, కలెక్టర్ తో మాట్లాడాను, ఎంక్వయిరీ వేసారు. దీని పై సమగ్రమైన విచారణ జరిపించాలి. ఏదో రిపోర్ట్ ఇచ్చాం అంటే సరిపోదు. దీనికి బాధ్యులైన డీఈలను సస్పెండ్ చెయ్యాలి. రాత్రికి రాత్రి 10 వేల క్యూసెక్కుల నీళ్ళు లేపారు అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ నాయకుడు చెప్తే ఇలా చేసారో, తెలియాలి. ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకుని, ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు". అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. దేవినేని ఉమా మాట్లాడుతూ "తెదేపా అనుమతులిచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం తిరిగి అనుమతులిచ్చి గొప్పలు పోతోంది. తెదేపా హయాంలో 25 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఆపేశారు. వైఎస్ హయాంలో జలయజ్జ్ఞం ధనయజ్జ్ఞంగా భ్రష్టుపట్టిపోయిన ఇరిగేషన్ రంగంలో తెదేపా హయాంలో రమారమి రూ.63,373 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు చేశాం. చంద్రబాబు నాయకత్వంలో సమగ్ర జల విధానం తీసుకువచ్చాం. కోస్తాంధ్ర పట్టిసీమ, పురుషోత్తమపట్నం పోలవరం ప్రాజెక్టులో 70శాతం, వెలుగొండ, సంఘం నెల్లూరు ప్రాజెక్టులు , హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చరిత్ర సృష్టించాం. హంద్రీ నీవా కాలువ తీసుకువెళ్ళు కియా పరిశ్రమ నెలకొనేలా చేశాం. కుప్పం దాకా నీళ్ళను తీసుకు వెళ్ళాం.. 805 అడుగుల వద్ద మచ్చుమర్రి లో నీళ్ళు లిఫ్ట్ చేసి హంద్రీనీవా, గాలేరి నగరి, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. పోతిరెడ్డిపాడు ద్వారా 400 టీఎంసీల నుంచి 500 టీఎంసీల నీళ్ళను రాయలసీమకు తరలించాం. రౌతునుబట్టే గుర్రం పరుగెడుతుంది. బుల్లెట్ దింపే మంత్రి జిల్లాలో నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదే అధికార యంత్రాంగాన్ని తాము అయిదేళ్ళు పరుగెత్తించాం, ప్రాజెక్టులను పూర్తి చేయించాం.
" అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read