కేంద్రం డబ్బులు ఇస్తున్నా, కనీసం ప్రధాని మోడీ పేరు కాని, కేంద్రం పేరు కాని లేకుండా, ఒక పక్క వైఎస్ఆర్ బొమ్మ, దాని కింద జగన బొమ్మ పెట్టుకుంటూ హడావిడి చెయ్యటం పై బీజేపీ పార్టీ భగ్గు మంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన రైతు భరోసా పై, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రైతన్నలకు, ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఏడాదికి రూ.6000/- పంపిస్తుంటే, ఆ డబ్బులు కలిపి ఇస్తూ, రూ.13,500/- తాను, తన తండ్రి ఇస్తున్నట్టు, ఫోటోలు పెట్టుకుని ప్రచారం చెయ్యటం ఏమిటి ? కేంద్రం ఈ రాష్ట్ర రైతన్నలకు ఇస్తున్న రూ.6000/- గురించి ప్రస్తావించకుండా, ప్రధాని ఫోటో లేకుండా, ఈ ప్రచారం ఏమిటి ? అంటూ బీజేపీ నిలదీసింది. "రూ.12,500/- రాష్ట్రం నుంచి ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6000/- కూడా కలిపి ఇస్తూ, ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు. రూ.13,500/- కాదు, కేంద్రం ప్రభుత్వం ఇచ్చే రూ.6000/-, హామీ ఇచ్చిన రూ.12,500 కలిపి, రూ.18,500/- ఇవ్వాలి. ప్రతి అన్నదాతకు పడిన బాకీ రూ.5,000/- వెంటనే విడుదల చెయ్యాలి." అని బీజేపీ నిలదీసింది.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. "రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ ప్రకటన. ప్రధాని బొమ్మనే లేపేసి, మొత్తం 13,500 రూపాయలని తానే భరిస్తున్నట్టు బాక్స్ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న వైనం. మరో స్టిక్కర్ సీఎం. పాదయాత్రలో జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి రూ 12,500/- ఒకే సారి రైతుల ఖాతాలో జమ చేస్తానని. ఆ ప్రకటన కన్నా ముందే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి రూ 6000 మూడు విడతలుగా ఇస్తామని చెప్పి ఆ మేరకు ఇవ్వటం జరుగుతున్నది. రాష్ట్రంలో రైతులు కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు అదనంగా జగన్ హామీ ఇచ్చిన 12,500/- వస్తాయని నమ్మి అధికారం కట్టబెట్టారు."

 

"మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన వైసీపీ బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ ఇస్తున్న ఆరువేల రూపాయలను కలిపి అంతా తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోటమ్, ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే. పీఎం కిసాన్ - రైతు భరోసా పథకంలో కేంద్రం వాటా 45% పైగా ఉన్నది. ఈ పథకం అమలు చేసే రోజున ఇచ్చిన ప్రకటన కూడా ఇక్కడ జత చేస్తున్నాను. దానిలో ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ ఉండటం గమనించగలరు. ఈ రకమైన అసత్య ప్రచారం ద్వారా ప్రజలను మోసంచేయటo ప్రజలను మోసంచేయటమే. ఇటువంటి అసత్య ప్రచారాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం ఈ అసత్య ప్రకటనను వెనక్కు తీసుకొని, ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో కూడిన ప్రకటన విడుదల చేయాలి. కేంద్రం ఇస్తున్న 45% నిధుల ప్రస్తావన కూడా ఆ ప్రకటనలో పొందు పరచాలని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది." అంటూ ధ్వజమెత్తారు.

నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక వార్తతో వార్తల్లోకి వచ్చే కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఈ సారి కూడా, పోలీసుల పై దౌర్జన్యం చేస్తూ, కెమెరాకు చిక్కారు. వారం రోజుల క్రిందట, ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ, నెల్లూరు కలెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి, ఈ రోజు ఏఎస్ఐ పై తమ ప్రతాపం చూపించారు. అధికారంలో ఉన్నామోనో, తమను ఏమి చెయ్యలేరు అని ఏమో కాని, పోలీసుల పై దౌర్జన్యం చేసారు ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, దౌర్జన్యం చేసారు. ఏఎస్ఐ ఫోను లాగేసుకుని, విధులకు ఆటంకం కలిగించారు. అనుచరులు ఫోను లాక్కున్నారని, ఎమ్మెల్యేకు చెప్పగా, ఫోను ఇవ్వను, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ సేవలతో మాకు పనిలేదు అంటూ, ప్రసన్నకుమార్ రెడ్డి, ఏఎస్ఐ పై వ్యాఖ్యలు చెయ్యటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన పై, ఏఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.

మొన్న జిల్లా ఎస్పీ పై, కలెక్టర్ పై, ఈ రోజు ఏఎస్ఐ పై ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యం పై, పోలీసు వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పై, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పై ఆలోచనలు చేస్తున్నారు. నెల్లూరులో జరిగిన దాని పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. తెదేపా ఏపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు స్పందిస్తూ, "ఏపీలో రావణ రాక్షస రాజ్యం కొనసాగుతోంది...హిట్లర్ పాసిజం పరాకాష్టకు చేరింది. పాలకులు మారడంతో ధర్మం అధర్మమైంది, నీతి అవినీతి రూపం సంతరించుకుంది.. అమరావతిలోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టిన దళిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకోవడం సహించరాని నేరం. 150 రోజులుగా ప్రజా రాజధానిని కాపాడుకోవడానికి రైతులు, కూలీలు, మహిళలు, అన్ని వర్గాలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వర్గాలూ సంఘీభావం తెలుపుతుంటే అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకూ సబబు. శాంతియుతంగా ఉద్యమ సాగిస్తున్న రైతులను అరెస్ట్ చేసి మూడు రాజధానులంటూ రాజధానిని విశాఖకు తరలించే యత్నం చేయడం దుర్మార్గం. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం బాబా సాహెబ్ అంబేద్కర్ కు రైతుల ఆవేదనను విన్నవించుకోడానికి వెళ్తున్న తెదేపా మాజీ శాసనసభ్యులు శ్రవణ కుమార్ ను పోలీసులు అక్రమగా నిర్బంధించడం హేయం. "

"అవినీతికి, అన్యాయాలకు పాల్పడ్డ వైకాపా నేతలకు రాచమర్యాదలు చేయడమా? న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ బడుగులకు అండగా నిలుస్తున్న తెదేపా నేతలపై పులివెందుల చట్టాన్ని అమలు పరిస్తే తెదేపా చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర మూలధనం లాంటి నేలతల్లిని వేలమేస్తు స్వయంగా సీఎం జగన్ భారీ దోపిడీకి తెరతీస్తుంటే `గేదె చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లు తయారైంది వైకాపా నేతల దోపిడీ,అరాచకాలు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని అతలాకుతలం అవుతుంటే జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ దోపిడీకి తెరతీశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మద్దతుగా ఆర్ ఆర్ వెంకటాపురాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో పాటు మరి కొందరు నేతలను ఎలా అరెస్టు చేస్తారు. గుడివాడలో భూ కబ్జాలు చేస్తూ గుండాయిజంతో రిజిస్ట్రేషన్ భూముల్లో పాగా వేస్తుంటే పోలీసులు గడ్డం గ్యాంగ్ కి కొమ్ముకాస్తారా? నెల్లూరు జిల్లాలో బుచ్చిలో ఏఎస్ఐటపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెగడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తే ఇక సామాన్య ప్రజలకు దిక్కేది? తక్షణం పోలీసు బాస్ గుడివాడలో భూ కబ్జాలు, నెల్లూరులో ఏఎస్ఐ పై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రె డ్డి అనుచరులు దౌర్జన్యంపై విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయాలి." అని డిమాండ్ చేసారు.

మద్రాసు నుంచి తరిమేస్తే, కర్నూల్ కి, అక్కడ నుంచి హైదరాబాద్ కి, అక్కడ నుంచి మళ్ళీ మనల్ని తరిమేస్తే, మనకు రాజధాని లేదు, రాజధానిని కట్టుకోడానికి భూములు లేవు అని సమయంలో, మన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను నేటి ప్రభుత్వం, 3 రాజధానుల ప్రకటనతో, రోడ్డున పడేసింది. ఆ రోజు నుంచి, ఇప్పటి వరకు అంటే, 150 రోజులుగా, ఈ విషయం పై ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ భవిష్యత్తుతో పాటు, రాష్ట్ర భవిషత్తు కోసం 34 ఎకరాలు ఇచ్చాం అని, తమను అన్యాయం చేయ్యావద్దు అంటూ, 150 రోజులుగా ఆందోళన చేస్తున్నా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని, ఒక్క అధికారి కాని, కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా, వచ్చి, ఆరు నెలలుగా మీరు ఆందోళన చేస్తున్నారు, మీ కష్టం ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు. పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టినా, కరోనా వచ్చినా, అమరావతి మహిళలు, రైతులు మాత్రం, తమ పోరాటం ఆపటం లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, తమ ఆందోళన చేస్తాం అంటున్నారు.

అమరావతి రైతుల దీక్ష, ఈ రోజుతో 150 రోజులు కావటంతో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. "అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు 150 రోజులు. కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు... ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర. రాష్ట్రం కోసం 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలది. ప్రభుత్వానికే 5వేల ఎకరాల ఆస్తి కట్టబెట్టి 'బిల్డ్ ఏపి' చేశారు. వారి త్యాగాలతో రాష్ట్ర ప్రజలకు రూ. లక్ష కోట్ల ఆస్తి సమకూరితే, మూర్ఖత్వంతో ఆ ఆస్తిని వైసీపీ పాలకులు మట్టిలో కలిపేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి 'బిల్డ్ ఏపి'ని 'సోల్డ్ ఏపి'గా మార్చి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు."

"నిర్మాణం విలువ తెలియని విధ్వంసకుల చేతుల్లోకి రాష్ట్రం చేరడమే ఈ దుస్థితికి కారణం. రాజధాని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆవేదనతో 64మంది రైతులు గుండెపోటుతో మరణించారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా రాజధాని ప్రజలను కలిసి పలకరించిన పాపానికి పోలేదంటే... ఎంతటి కర్కోటక పాలనలో ఉన్నామో అర్ధమవుతోంది. లాక్ డౌన్ కాలంలోనూ శాంతియుతంగా, ఆత్మ విశ్వాసంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలూ... మీ పోరాటం స్పూర్తిదాయకం. మీకు న్యాయం జరిగేవరకూ మీ అండగా నేనుంటాను. తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అధైర్యపడకండి." అని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తాయనే, ప్రభుత్వాలు కంటే, కోర్టులకు ఎక్కువ అధికారం ఇచ్చారు. ప్రభుత్వం తమకు బలం ఉంది అని, చేసే తప్పులను, కోర్టులు కరెక్ట్ చేస్తూ ఉంటాయి. హైకోర్ట్ కాని, తరువాత సుప్రీం కోర్ట్ కాని, ప్రభుత్వాలు చేసే తప్పులు సరి చేస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వాలు కూడా కోర్టులను గౌరవిస్తూ వస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, అందుకు భిన్నంగా, చిన్న చిన్న సాంకేతిక అంశాలు చూపించి, కోర్టు తీర్పులను పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారు. రంగుల విషయంలో ఇలాగే చేసారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ కూడా, రంగులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడితే, తమ పార్టీ మూడు రంగులకు, ఇంకో రంగు జోడించి, ముందుకు వెళ్లారు. దీంతో రెండో సారి కూడా హైకోర్ట్ ఆపేయమని చెప్పింది. ఇక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పై కూడా ఇలాగే జరుగుతుంది. తెలుగు మీడియం ఆప్షన్ అనేది ఇవ్వకుండా, బలవతంగా ఇంగ్లీష్ మీడియం పెట్టటాన్ని హైకోర్ట్ కొట్టేసింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, హైకోర్ట్ చెప్పినా, ఇంగ్లిష మెదిఉమ పై ముందుకే వెళ్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ, భాషా మాధ్యమం, పాఠశాలలు యధాతధంగా కొనసాగుతున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే అక్కడా సమాంతరంగా ఆంగ్ల మాధ్య మ తరగతుల్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వ హయంలో పెట్టిన ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ స్కూళ్ళు యథాతధంగా కొనసాగుతాయి. ఇక ఏడవ, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులను క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారుతున్నాయి. పాఠశాల విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపె ట్టాలనే అంశంపై విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీ ఈఆర్సీ) అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లి దండ్రులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ గతంలో కోరింది. ఇందుకు మూడు ఆప్షన్లు కల్పించింది. తెలుగు తప్పని సరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృభాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. దాంతో మొత్తం 17,97,168మంది నుంచి ఆప్షన్లు రాగా, వారిలో 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనా, ఆర్థికపరంగా సాధ్యం కాదు గనుక గతంలో ఇచ్చిన జీవో 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో అంటే 672 మండలాల్లో ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగిం చనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. అయితే హైకోర్ట్ వద్దు అని చెప్పినా, ఇలా ముందుకు వెళ్ళటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ప్రతి విషయంలో కోర్టు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ధిక్కరిస్తూ ముందుకు వెళ్తే, రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాసం లేకపోలేదని చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read