అమరావతి ఆందోళన 150 వ రోజు జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి కోసం, అని రైతులు ఇచ్చిన భూములను, తమ రాజకీయం కోసం ఇళ్లస్థలాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పై ఏపీ హైకోర్టు శుక్రవారం నాలుగు వారాలు స్టే ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు నాలుగు నివాస జోన్లు ఉండేవి, మాస్టర్ ప్లానును అనుసరించి ఇంత వరకు ఇప్పటికే వున్న గ్రామాలను ఆర్-1గాను, తక్కువ సాంద్రాత గృహాలను ఆర్-2గాను, తక్కువ నుంచి మధ్యసాంద్రత కలిగిన గృహాలను ఆర్-3లోను వుంచి మూడు జోనులుగా, హైడెన్సివ్ గా ఆర్- 4జోన్లు ఉన్నాయి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు,కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ఇటీవల ప్రభుత్వం ప్రకటన జారీచేసింది.

ఇందులోని 900.97 ఎక రాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై అమరావతి గ్రామాని చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దానిమీద కేసును ప్రాథమికంగా విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై నాలుగువారాల ఇంటిరీయమ్ స్టేను జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లు తరుపు న్యాయవాదులు మాస్టర్ ప్లాన్లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పని సరి అని వాదించారు. తదువరి ఆదేశాలు ఇచ్చే దాకా భూములు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించవద్దని ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని ఇళ్ల పట్టాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ఏవీ హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటీషన్ దాఖలయ్యింది. 600 ఎకరాల భూమి కొనుగోలులో అవినీతి జరిగింది అంటూ బూరుగుపూడికి చెందిన రైతు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. ఆ పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. హైకోర్టు దీనిపై ప్రాథమిక విచారణనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు తదుపరి ఆదే శాలు ఇచ్చేవరకు భూములు అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ ఉత్తర్వులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగు పూడిలో ఎకరం రు.7.20లక్షలు విలువచేసే భూమికి ప్రభుత్వం రు. 45 లక్షలు చెల్లించిందని రైతు వ్యాజ్యంలో ఆరోపించారు. ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్నారు. సదరు భూమి కొనుగోలులో 6 రెట్లు అధికంగా చెల్లించారని పిటీషనర్ తరపు న్యాయవాది బి.ఎస్. ఎన్.వి.ప్రసాద్ బాబు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అధికారులు, నాయకులు కలసి కుమ్మక్కై ప్రజాధనం దుర్వినియోగం చేసారని, అక్కడ ఉన్న గుంతలు పూడ్చాలంటే వందల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఈ రోజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ 71 శాతం పూర్తయింది అని నిరూపిస్తే మీసం తీస్తా అంటూ ఛాలెంజ్ చేసారు, లేకపోతే నువ్వు తీస్తావా అంటూ ఎదురు దేవినేని ఉమాకు ఛాలెంజ్ చేసారు. ఇదే విషయం పై ఈ రోజు దేవినేని ఉమా మాట్లాడారు. "టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం కాటన్ జయంతి రోజున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇంజనీర్లను సత్కరించుకున్నాం. కాటన్ జయంతిని గుర్తు చేసుకునే తీరక కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. నీటిపారుదలశాఖ మంత్రేమో మీసాలు తీసేస్తామని చెబుతున్నారు. కాటన్, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య లాంటి వారిని భావితరాలు గుర్తుంచుకుంటారు. చంద్రబాబు గారి నాయకత్వంలో రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేసి సమగ్ర జలవిధానంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించాం. పోలవరంలో 70.82 శాతం పనులు జరిగాయని 19.5.2019 న అధికారులు ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి చూడాలి. ఎన్నికలు అనంతరం 26.5.2019న 71.13 పర్సెంట్ పనులు అయినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇదే అధికారులు ఇప్పుడూ అప్పుడూ ఉన్నారు. 10.6.2019న 71.43 పర్సంట్ పనులయ్యాయి. మీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎంత వరకూ జరిగాయో మీ రివ్యూల్లోనే బాగా చూసుకోండి."

"ఎవరి మీసాలు ఎవరు తీసుకుంటారో, ఎవరి గడ్డాలు ఎవరు తీసుకుంటారో తేల్చుకోండి. మాట్లాడేప్పుడు బాధ్యతగా మెలగాలి. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా నేను ప్రతి వారం పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టి మీడియాకు ఇచ్చాను. మీరు ఎందుకు సమాచారం దాస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాదైనా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఎందుకు ఆన్ లైన్ లో పెట్టడం లేదు? ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. పోలవరం పనులకు సంబంధించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సమాచారాన్ని నేను మీడియా ముందు పెడుతున్నా. సిగ్గుతో తలవంచుకుంటారా మీరు? నోరు ఉందికదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఐదేళ్లు మీ సాక్షిలో నోటికొచ్చినట్టు రాశారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీటు వేశారు ?ఎంత మట్టి తీశారో చెప్పమంటే సమాధానం చెప్పే దమ్ము లేక మీసాలు తీసుకుందాం రమ్మంటున్నాడు ఇరిగేషన్ మంత్రి. ఏం మాట్లాడుతున్నారు మీరు? రూ. 12,236 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 12 నెలల్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు తీశారు? ఎన్ని బొచ్చిల కాంట్రీటు వేశారు. నెల్లూరు కట్టాం, సంగం కట్టామంటూ కబుర్లు చెబుతున్నారు. ఓ ఎమ్మెల్యే నీళ్లు అమ్ముకున్నారని ఆరోపణ వచ్చింది కాబట్టే నేను ప్రశ్నించాను"

"ఆరోపణలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే . ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. రూ. 12, 236 కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీ రివర్స్ టెండరింగ్ ఎంతవరకు వచ్చింది . టీడీపీ హయాంలో సాగునీటి విజయాలపై పూర్తి సమాచారాన్ని నేను చెప్పగలను. సమగ్ర జలవిధానంతో ముందుకెళ్లాం. దేశానికి ఆదర్శంగా నిలిచాం. 19 స్కాచ్ అవార్డు తెచ్చాం. పోలవరం ప్రాజెక్టును దేశ చరిత్రలో పెట్టాం. సాగునీటి రంగంలో గుజరాత్ తర్వాత ఏపీని దేశంలో రెండో స్థానంలో నిలబెట్టాం. రివర్స్ టెండరింగ్ చేసి రివర్స్ పాలన చేసి మీరు ఏమి ఉద్దరించారు? గోదావరి-పెన్నా అనుసంధానం టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి. 11 నెలలుగా మీరు పనులను ఎందుకు పక్కన పెట్టారో చెప్పండి. వెలిగొండ టెన్నల్ పనులు ఎవరు మొదలుపెట్టించారు? ఎవరు వేగవంతం చేశారు? పోలవరం పనులు ఎందుకు ఆపేశారు? పోలవరం పవర్ ప్రాజెక్టును కోర్టుల్లో ఎందుకు పెట్టారో చెప్పండి? మీ ఘనకార్యాలు చెబితే వింటాము. 24 గంటలు ఆపకుండా కాంక్రీట్ వేయించాం. కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మేము చేస్తే మీరేం చేశారు..పరిగెత్తే ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో ఆపేశారు. రూ. 500 కోట్ల రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. ఇసుకకే రూ. 500 కోట్ల ఫైల్ నడిపారు. సమగ్ర జల విధానంపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి. టీడీపీ హయాంలో ఏపీకి 19 స్కాచ్ అవార్డులు 670కి పైగా అవార్డులు, 2 గిన్నీస్ బుక్, 1 లిమ్కా అవార్డులు వచ్చాయి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిని జీర్ణించుకోలేక ఎదురుదాడి చేస్తున్నారు. సమగ్ర జలవిధానంతో వెనకబడిన ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాం. వేదావతి, గుండ్రేవుల పనులు ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో వైసీపీ సమాధానం చెప్పాలి." అని ఉమా అన్నారు.,

ఏపిఎస్ ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో పని చేస్తున్న వారికి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఒకేసారి 6 వేల మందిని తొలగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకోవటంతో, లబోదిబో మంటున్నారు కార్మికులు. నేటి నుంచి విధులకు హాజరుకావద్దని డిపో మేనేజర్ల మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,270 మంది ఉద్యోగులకు ఏప్రిల్ జీతాలు నిలుపుదల చేసినట్టు సమాచారం. ఆర్టీసీ ఎండీ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు అధికారరులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా అందలేదని తెలుస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు పై, కార్మిక సంఘాలు భగ్గు మంటున్నాయి. ఆర్టీసీ తీరును ఖండిస్తూ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసాయి. తొలగించిన అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఆర్టీసీ వర్గాలు మాత్రం, దీని పై అధికారంగా స్పందించకపోయినా, మార్చి నెల 23 నుంచి లాక్ డౌన్ కారణంగా, ఆర్టీసీ బస్సులు బయట తిరిగే అవకాసం లేకపోవటంతో, భారీగా ఆర్టీసీకి నష్టాలు వచ్చాయని వాపోతున్నారు. ఆదాయం భారీగా పడిపోయిందని, వాపోతున్నారు. ఈ కారణంతోనే సంస్థలోనే రెగ్యులర్ ఉగ్యోగుల్లో ఖాళీలు ఉన్నా, వాటికి ఖాళీగానే ఉంచాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆర్టీసీకి వచ్చిన నష్టాలను పురించుకోవాలి అంటే, కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని, అందులో భాగంగానే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించనట్టు తెలుస్తుంది. అయితే దీని పై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా, మోఖిక ఆదేశాలు వచ్చాయని, ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం తరువాత, మాకు భరోసా ఉంటుందని అనుకున్నామని, కాని ఇలా మా పైనే, ప్రభుత్వం కత్తి కట్టటం దారుణం అని వాపోతున్నారు. ఇప్పటికే పోయిన నెల జీతం రాక ఇబ్బంది పడుతున్నాం అని, ఇప్పుడు కరోనా వల్ల మరింత ఇబ్బందుల్లో ఉంతే, ఇప్పుడు ఉద్యోగాలు నుంచి పీకేస్తే మా జీవనం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగం పొతే, తాము, తమ కుటుంబం ఎలా బ్రతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని చెప్పి, ఇప్పుడు మా పొట్ట కొట్టారు అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పదంతో అలోచించి, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి తక్కువ ఎక్స్ గ్రేషియా ఇవ్వటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయన వారికి, ప్రతి ఒక్కరికీ రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో, విద్యుత్ షాక్ తగిలి, 9 మంది కూలీలు చనిపోయారని, వారంతా దళిత వర్గానికి చెందినవారని, వారి మృతికి తెలుగుదేశం పరి సంతాపం వ్యక్తం చేస్తుందని వర్ల రామయ్య అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత, ప్రభుత్వం స్పందించిన తీరు అవమాకరంగా ఉందని అన్నారు. విశాఖలో జరిగిన ఘటనలో, అక్కడ చనిపోయినవారికి, ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ఇచ్చారని, మా ముఖ్యమంత్రి ఎంతో దయా హృదయం కలవారు అంటూ, ప్రచారం చేసుకున్నారని, ప్రభుత్వమే చనిపోయిన వారికీ కోటి రూపాయలు ఇవ్వటంతో, ఇక నుంచి ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఇలాగే కోటి రూపాయలు ఇస్తారని అనుకున్నాం అని అన్నారు.

విశాఖలో స్పందించిన విధంగానే, ప్రకాశం జిల్లాలో చనిపోయిన వారికి కూడా కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారని, కాని కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ప్రభుత్వం ఇలా స్పందించటం దారుణం అని అన్నారు. వారివి కోటి ప్రాణాలు, వీరివి 5 లక్షల ప్రాణాలా ? అని నిలదీశారు. చివరకు ప్రకాశం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు కూడా, ప్రమాదం జరిగిన స్థలం వద్దకు వెళ్లలేదని, 9 మంది చనిపోతే ఇదేనా వ్యవహరించే తీరు అని అన్నారు. కేవలం అక్కడ స్థానిక ఎస్సై వచ్చారని, చనిపోయిన వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. విశాఖలో పోటీ పడి నిద్రలు పోయి హంగామా చేసారు, ఇక్కడ కనీసం ఆ కుటుంబాలని పరామర్శించలేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి దళితులు అంటే ఇంత చిన్న చుపా అని ప్రశ్నించారు. దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని, వారితో అవసరం తీరిపో గానే ,వారితో వ్యవహరించే తీరు ఇదా అని రామయ్య ప్రశ్నించారు. చివరకు వీరి అందరినీ సాముహిక సమాధి చేసారు అంటే, ఈ ప్రభుత్వానికి దళితులు అంటే, ఎంత గౌరవం ఉందొ అర్ధం అవుతుందని అన్నారు. ఈ విషయాలు అన్నీ ఈ ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా ? తెలియనట్టు నటిస్తున్నారా అని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో, అదేదో తన సొంత కంపెనీ అన్నట్టు జగన్ వ్యవహరించిన తీరు, ఇక్కడ మాత్రం కనీసం మంత్రులు కూడా వారిని పట్టించుకోకపోవటం చూస్తుంటే, దళితులు అంటే దిక్కులేని వారు అనే అలుసే కారణం అని అనంరు.

Advertisements

Latest Articles

Most Read