ప్రజా చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారని, అటువంటప్పుడు ఆయన యాత్రకువెళ్లడానికి ఆలోచించాల్సిన అవసరమేముంటుందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఒప్పుకున్నాక, తానేదో విశాఖను బాగుచేసినట్లు, ఉత్తరాంధ్రను ఉద్ధరించినట్లు భావిస్తూ, మంత్రి బొత్స పర్యటనను అడ్డుకుంటానని చెప్పడం, వైసీపీనేతలారా మీరంతా అడ్డుకోండని పిలుపునివ్వడం దేనికి సంకేతమని వర్ల ప్రశ్నించారు. దేశంలో పిచ్చి బొత్సకే అలా మాట్లాడటం సాధ్యమైందని, రాజ్యాంగంపై ప్రకటన చేశాక, మామూలుగా మతి ఉన్నవారెవరూ అలాంటిప్రకటనలు చేయరని రామయ్య తెలిపారు. బొత్సప్రకటన తర్వాత పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతిభద్రతలు కాపాడాలనే సదుద్దేశంతో వారు పనిచేసి ఉండేవారని, బొత్సను, ఇతరవైసీపీనేతలను ముందస్తు అరెస్ట్ లు చేసి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు గతంలో ఆత్మకూరు పర్యటనకు వెళుతుంటే, శాంతిభద్రతల సాకుతో ఆయన ఇంటిగేటుకు తాళ్లు కట్టి నిరోధించిన పోలీసులు, బొత్సను, ఇతర వైసీపీనేతలను ఎందుకు నిర్బంధించలేదో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

వైసీపీవారిని కట్టడిచేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబునాయుడి పర్యటనకు ఒకరోజు ముందు, డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రితో రహస్యంగా మాట్లాడాడని, వారిసంభాషణల్లోంచే చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకొని తీరాలన్నదురాలోచన వచ్చిందన్నారు. విశాఖ వాసులెవరూ చంద్రబాబుని అడ్డుకోరన్న వర్ల, హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖ నగరాన్ని కాపాడటంకోసం తన రెండుచేతులు అడ్డుపెట్టిన వ్యక్తిగా... ఆయనపట్ల ఆనగర వాసులందరికీ ఉన్న సదభిప్రాయమే అందుకు కారణమన్నారు. చంద్రబాబు పాదం విశాఖలో పెట్టకుండా ప్రభుత్వమే కుట్ర పన్నిందన్నారు గతంలో విశాఖలో జగన్మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ చేపడతానంటే, పెట్టుబడుల సదస్సు జరుగుతున్న దృష్ట్యా, ఆనాడు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు. టీడీపీ కార్యకర్తలెవరూ ఆనాడు, జగన్ ను అడ్డుకోలేదని, దాన్ని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి, కేవలం వీధిరౌడీలా, దుర్మార్గపు ఆలోచనలు చేసి, చంద్రబాబుని అడ్డుకునేలా యంత్రాంగం నడిపాడన్నారు. వైసీపీ నేతలు, వారు తీసుకొచ్చిన కిరాయివ్యక్తులే చంద్రబాబుని అడ్డుకున్నారన్న రామయ్య, అందుకు సంబంధించిన చిత్రాలను, దృశ్యాలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చంద్రబాబు విశాఖలో అడుగుపెడితే పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చస్తానంటూ, హల్ చల్ చేసిన జెట్టి రామారావు, స్వయంగా మంత్రి బొత్సకు బంధువని వర్ల స్పష్టంచేశారు. రామారావు గత జీవితమేమిటో విశాఖ వాసులందరికీ తెలుసునని, ఆయన బొత్సకు ఎలాంటి బంధువో.. రామారావు సేవలు పొందినందుకు గాను కృతజ్ఞతతో బొత్స ఆయనతో బంధుత్వం కలుపుకున్నాడని వర్ల దుయ్యబట్టారు.

మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కు రామరావు ముఖ్య అనుచరుడని, ఆయనకూడా సదరు జెట్టి వారి సేవలు పొంది ఉండవచ్చన్నారు. పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ వీరంగం వేసిన రామారావుని ఆపి తనిఖీచేస్తే, శీతలపానీయమైన ఫాంటా ను సీసాలో పోసి, పెట్రోల్ అని నమ్మించేలా ఓవరాక్షన్ చేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇద్దరు మంత్రులకు అతిసన్నిహితుడైన వ్యక్తి, కూల్ డ్రింక్ ను సీసాలో పొసుకొని, చాలా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తే అతనిపై పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న అన్నల జాబితాలో గాజువాక, వేమూరు ఎమ్మెల్యేల కుమారులు తిప్పల వంశీరెడ్డి, మేరుగ కిరణ్ నాగ్ లు కూడా ఉన్నారని, ఈ విషయం వారి అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లతోనే బయటపడిందన్నారు. వైసీపీవారే లేరని పిచ్చికూతలు కూస్తున్న బొత్స, అవంతి, రోజా, ఇతర వైసీపీనేతలు, తమపార్టీ ఎమ్మెల్యేల కుమారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని వర్ల నిలదీశారు. అర్థరాత్రివేళ రాజధాని మహిళల ఇళ్లచుట్టూ తిరిగే పోలీసులు కిరణ నాగ్ ను, తిప్పల వంశీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. కందుకూరి కాంతారావు అలియాస్ కత్తి కాంతారావు అనే మరోప్రముఖవ్యక్తి కూడా చంద్రబాబు పర్యటనలో గోబ్యాక్ ప్లకార్డులు పట్టుకున్నాడని, ఆయన వైజాగ్ వైసీపీ స్టూడెంట్ యూనియన్ కి చెందిన నేత అని వర్ల చెప్పారు. (కాంతారావు ప్లకార్డు పట్టుకొని కూర్చున్న ఫొటోను విలేకరులకు చూపించారు.) జుట్టంతా ఊడిపోయి, 60ఏళ్ల వాడిలా, తన క్లాస్ మేట్ లా కనిపిస్తున్న కాంతారావు విద్యార్థివిభాగం నాయకుడు ఎలా అవుతాడో, కందుకూరి నుంచి ఆయన విశాఖకు ఎందుకొచ్చాడో శ్రీమతి రోజా చెబితే బాగుంటుందని రామయ్య చురకలు వేశారు.

చంద్రబాబుపై కడుపుమండి అందరూ ఆయన్ని అడ్డుకున్నారంటున్న రోజా, కందుకూరులో ఉండే కాంతారావు కి కడుపుమండితే విశాఖ ఎలా వచ్చాడో, ఎందుకొచ్చాడో చెప్పాలన్నారు. టీడీపీనేత గంటాపై పోటీచేసి ఓడిపోయిన కే.కే.రాజు చంద్రబాబు పర్యటనలో పోలీసులను తోసుకుంటూ, ముందుకు ఉరికాడని, అయినాకూడా వారు చోద్యం చూశారుతప్ప, ఆయన్ని అరెస్ట్ చేయలేదన్నారు. చంద్రబాబుని అడ్డుకోవడానికి తాను వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చానని, సాక్షి టీవీతో ఒకవ్యక్తి చెప్పాడని, ఆ వ్యక్తికి విశాఖలో ఏం పని అని, ఎవరు ఎంతసొమ్మిస్తే అతను అక్కడకు వచ్చాడో రోజా అక్క సమాధానం చెప్పాలన్నారు. రామారావు, కాంతారావు, వంశీరెడ్డి, కిరణ్ నాగ్, కే.కే.రాజు, వారి వెంట నడిచిన ఇతర వైసీపీనేతలు, కార్యకర్తలు ఎందుకు చంద్రబాబుని అడ్డుకున్నారో, ఎవరు పంపితే వారు ఆపనిచేశారో మంత్రి బొత్స, అవంతి, రోజా, అంబటి సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందస్తుగా, వివిధ ప్రాంతాలనుంచి డబ్బులు, మద్యం ఇచ్చిమరీ కిరాయి మూకలను పోగుచేసిందని, వారందరినీ చంద్రబాబుపైకి నడిపించడంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర కీలకనేతలకు బాధ్యతలు అప్పగించిందన్నారు. చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వం ఎందుకింతగా శ్రమించిందో, బరితెగించి అడ్డదారులు ఎందుకు తొక్కిందో బహిర్గతం చేయాలని రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుని ఆపడానికి డబ్బులు, మద్యం, ఆహరపొట్లాలు పంచేబదులు, పోలీసులే ఆయనకు అనుమతులు నిరాకరించి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం జరిపిన నేరపూరిత కుట్రలోభాగంగానే, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ తతంగ మంతా నడిపారన్నారు. రాజధాని మహిళలు గులాబీలిచ్చి, జై అమరావతి అనమని కోరినందుకే, వారిని అరెస్ట్ చేసి, ఈడ్చుకెళ్లిన పోలీసులు, చంద్రబాబు పర్యటనలో వీరవిహారం చేసిన వైసీపీనేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.

టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, పూర్తి వివరాలను, రోజువారీ జరిగే పనుల పురోగతిని ఆన్ లైన్ లో ఉంచడం జరిగిందని, పనులు చూడటానికి వెళ్లిన ప్రతిసారీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయప్రాజెక్ట్ నిర్మాణ వివరాలను అందరికీ తెలియచేసేవారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు పోలవరం పనులను పరిశీలించడానికి వెళ్లిన ప్రతిసారీ, కేంద్రజలవనరుల శాఖా మంత్రికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ కు, సభ్యులకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులకు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యులకు, రాష్ట్రప్రజలకు, పూర్తిస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా తెలియచేయడం జరిగేదన్నారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, తాను పోలవరం పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, అక్కడేం పనులుజరుగతున్నాయి... తానేం పరిశీలించాడు.. ఏఏ పనులు చేయమని అధికారులను ఆదేశించాడనే వివరాలను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ఉమా ప్రశ్నించారు. అసలు జగన్.. పోలవరం పనులు జరుగుతున్న తీరుని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, మీడియా ముందుకొచ్చి వివరాలు ఎందుకు వెల్లడించలేదన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వంపై పోలవరం నిర్మాణానికి సంబంధించి రోజుకోరకంగా అవినీతి ఆరోపణలుచేస్తూ, రూ.16వేలకోట్ల పోలవరం అంచనా వ్యయాన్ని, రూ.43వేలకోట్లకు పెంచామని, రూ.వెయ్యికోట్లు అదనంగా హెడ్ వర్క్స్ పనులకు కేటాయించామని గగ్గోలుపెట్టిన వైసీపీనేతలు, సాక్షి మీడియా నేడు జగన్ పోలవరం సందర్శనకు వెళితే, ఎందుకు మౌనంగా ఉన్నాయని దేవినేని ప్రశ్నించారు. 2021కి పోలవరం పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం చెబుతుంటే, అది ఎలా సాధ్యమవుతుందని ఎవరూ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నివేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయో, ఎన్ని తట్టల మట్టివేశారో, ఎన్ని యంత్రాలను తెప్పించారో, ఎందరు పనివాళ్లు పనిచేస్తున్నారనే వివరాలు ఎందుకు బయటకు రావడంలేదన్నారు. పోలవరం పనుల్లో రూ.20వేలకోట్ల వరకు దేవినేని ఉమా కాజేశాడని, చిలువలు పలవలుగా విష ప్రచారం చేసిన నోళ్లన్నీ ఏమైపోయాయని ఉమా నిలదీశారు. టీడీపీ పాలనలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పిన జగన్, నేడు ఎందుకు మౌనంగా ఉన్నాడన్నారు. రూ.20వేలకోట్ల దోపిడీ జరిగితే, ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడంలేదన్నారు. జగన్ తన బంధువైన పీటర్ తో వేసిన కమిటీ, పోలవరం పనులపై ఏమని నివేదిక ఇచ్చిందో ఎందుకు బయటపెట్టడం లేదని ఉమా ప్రశ్నించారు.

2006లో పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో, ఆనాడు జరుగుతున్న పనులను జగన్ అడ్డుకోవడం జరిగిందన్నారు. జగన్ అత్యాశ కారణంగా, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న పన్నాగంతో ప్రాజెక్ట్ పనులు ఆరేళ్లపాటు ఆగిపోయింది నిజం కాదా అని దేవినేని నిగ్గదీశారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2537 కోట్ల భారం ప్రాజెక్ట్ నిర్మాణంపై పడిందన్నారు. జగన్ వేసిన పీటర్ కమిటీ పవర్ ప్రాజెక్ట్ పనుల్లో రూ.2,346కోట్ల అవినీతి జరిగిందని, 2015-16 ఎస్సెస్సార్ తప్పని చెప్పడం జరిగిందన్నారు. పీటర్ కమిటీ తప్పన్న 2015-16 ఎస్సెస్సార్ నే ఆధారం చేసుకొని, జగన్ ప్రభుత్వం మరలా టెండర్లు ఎలా పిలిచిందో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన జగన్, రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు ఒక సంస్థకు అప్పగించాక, మరలా అదనంగా చెల్లింపులుచేయాలని అధికారులను ఎలా ఆదేశించారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఒకే కంపెనీ ఎలా పాల్గోందో, అదే కంపెనీకి -14, -12.06శాతంతో పనులప్పగించి, వందరూపాయల పనిని రూ.26తక్కువకు ఎలా చేయిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. 100రూపాయల పనిని 74రూపాయలకు జగన్ రెడ్డి ఎలా చేయిస్తున్నాడు అన్న ఆశ్చర్యం పక్కరాష్ట్రాలకు కూడా ఉందని దేవినేని ఎద్దేవాచేశారు.

కేవలం తాను పనులు అప్పగించిన కంపెనీకి మేలు చేయడానికే జగన్ నేడు పోలవరం వెళ్లాడని, ఆ మేలు ఏవిధంగా, దేన్ని పెంచి చేయాలో కూడా ఆయనే అధికారులను ఆదేశించాడని ఉమా తెలిపారు. చంద్రబాబు కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న జగన్, గతప్రభుత్వం చేసిన పనులుగురించి మాట్లాడే సాహసంచేయడం లేదన్నారు. జాతీయప్రాజెక్ట్ లో దోపిడీచేయడానికే, రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని, ల్యాండ్ అక్విజేషన్ లో గానీ, ఆర్ అండ్ ఆర్ లోగానీ ఒక్కరూపాయికూడా ఎందుకు ఖర్చుచేయలేకపోయారన్నారు. పీటర్ కమిటీ రిపోర్ట్ కేంద్రానికిచ్చి అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయబట్టే, నేడు జగన్ ప్రభుత్వం డీపీఆర్-2ను ఆమోదింపచేసుకోలేని దుస్థితికి వచ్చిందన్నారు. వందలు, వేలు, లక్షలకోట్ల అవినీతి జరిగిందన్నవారు, నేడుపోలవరం పనులు వివరాలను వెల్లడించలేకపోతున్నారో చెప్పాలన్నారు. టీడీపీప్రభుత్వం పునాదుల్లేని పోలవరం నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని 2021కి ఎలా పూర్తిచేస్తుందో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. న్యాయం అడవులపాలైంది కాబట్టే, అన్యాయం రాజ్యమేలుతోందని, ఆ అన్యాయం, న్యాయం చేసిన పనులను ఒప్పుకోలేకపోతోందన్నారు. చంద్రబాబు హయాంలో పనులు జరుగుతుంటే, లక్షలాదిరైతులు వాటిని ప్రత్యక్ష్యంగా చూశారని, జగన్ మాత్రం ఒక్కనాడుకూడా పోలవరం వెళ్లలేదన్నారు. గతంలో చాలాసార్లు ఇదే అంశంపై జగన్ ని ప్రశ్నించామని, ఆయనెప్పుడూ నోరు మెదపలేదన్నారు. పోలవరం పునాదులే పూర్తి కానప్పుడు, జగన్ వైఎస్సార్ పేరుబ్రిడ్జికి పెడతానని ఎలా అంటున్నాడో తెలియడంలేదన్నారు.

విశాఖలో చంద్రబాబుని అడ్డుకునే క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సాగించిన దౌర్జన్యకాండ చూశాక, జగన్ దాష్టీకంపై, దుర్మార్గపు పాలనపై మరోసారి సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుమారం రేగిందని, జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి విమానం ఎక్కించి పంపించింది చంద్రబాబుని కాదని, కొన్ని లక్షలకోట్ల పెట్టుబడులను అంటూ ఒక పోస్ట్ విపరీతంగా చెలామణి అవుతోందని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వివరించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ పోస్ట్ నూటికినూరుశాతం వాస్తవమని, జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు, ఎన్ని లక్షలకోట్ల పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు తరలిపోయాయో ప్రజలంతా చూశారన్నారు. లులూ గ్రూప్, ఆదానీ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పరిశ్రమలను తరిమేసి, లక్షలకోట్ల పెట్టుబడులను ఇప్పటికే తరిమేశారని, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని దమనకాండ సాగించడంద్వారా, భవిష్యత్ లో కూడా పారిశ్రామికవేత్తలెవ రూ రాష్ట్రంవైపుచూడకుండా జగన్ ప్రభుత్వం విధ్వంసకాండ సృష్టించిందన్నారు.

విశాఖ నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 7వేల ఎకరాల భూముల్ని ఇప్పటికే వివిధకారణాలతో కాజేశారని, పేదవాడి భూమిని లాక్కుంటున్న నేపథ్యంలోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చారన్నారు. ఆయనను అడ్డుకునే క్రమంలో జగన్ అండ్ కో సాగించిన వికృతక్రీడతో విశాఖ నగరం శాశ్వతంగా పెట్టుబడులకు దూరమైపోయిందని, పారిశ్రామికవేత్తలెవరూ నగర పొలిమేరల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. జగన్ సర్కారు విశాఖలో ఒకవైపు యుద్ధకాండ సాగిస్తుంటే, ప్రావిడెంట్ గ్రూప్ వారు తెలంగాణలో తమ ఆవిష్కరణ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, కేటీఆర్ తో చర్చలు జరిపిందన్నారు. ఆంధ్రాలో రోడ్లపై వైసీపీమూకలు దమనకాండ సాగిస్తుంటే, తెలంగాణలో అమెరికా సంస్థ రూ.700కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రం నుంచి పెట్టబడులు తరిమివేస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పట్టాభి ప్రశ్నించారు. జగన్ గొప్పతనం గురించి కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదస్సులో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం పీపీఏలపై నిర్వహించిన సమీక్షలవల్ల, దేశమే తీవ్రంగా నష్టపోయిందని, భారతదేశ ప్రతిష్ట తీవ్రంగా దిగజారిపోయిందని, దేశంలోకూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురాని దుస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింద న్నారు.

ఇండియా సక్సెస్ స్టోరీని జగన్ లాంటి వారు కిల్ చేస్తున్నారని కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. అదే కేంద్రమంత్రి దావోస్ వెళ్లినప్పుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి తీరుపై పారిశ్రామికవేత్తలంతా ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. . 2018 జనవరిలో యూఎస్ టీడీఏ (యునైటెడ్ స్టేట్స్ ట్రేడింగ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) తో విశాఖ అభివృద్ధికి సంబంధించి, చంద్రబాబునాయుడు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దేశంలోనే విశాఖ నగరాన్ని అత్యుత్తమ నగరంగా మార్చడమే ఆనాటి ఒప్పందంలోని ముఖ్య ఉద్దేశమన్నారు. నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉండిఉంటే, తెలంగాణకు తరలిపోయిన రూ.700కోట్ల ప్రావిడెంట్స్ సంస్థ పెట్టుబడులు, ఏపీకే వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు చేసుకున్నఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసి ఉంటే, విశాఖ నగరం అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు పొంది ఉండేదన్నారు. జగన్ నిర్వాకాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ వాసులు ఎక్కడికి వెళ్లినా, మేం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు తమది ఏపీ అని చెప్పుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని, జగన్ రాష్ట్రానికి ఎంతటి తలవంపులు తీసుకొచ్చాడో ఆయన చర్యలతోనే స్పష్టమవుతోందన్నారు. జగన్ అవినీతి చర్యలపై ఇప్పటికే జర్మనీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ప్రధానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు.

జగన్ నిర్వాకాలు, అవినీతి చర్యల కారణంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోతలు విధించాలని, కేంద్రప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలు, విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించే రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులురాకుండా చేయాలని కూడా పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. దీనిపై ఒకచట్టం చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. జగన్ చర్యల కారణంగా భవిష్యత్ లో రాష్ట్రానికి ఏవిధమైన నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయిందని, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలని పట్టాభి నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పట్టాభి తేల్చిచెప్పారు. 5ఏళ్ల కొకసారి ఎటుపడితే అటు దొర్లుకుంటూ పార్టీల్లోకి వెళ్లే బంతిలాంటి అవంతికి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని, ఆ బంతిని ఎప్పుడు బూటుకాళ్లతో బంగాళాఖాతంలోకి తందామా అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని పట్టాభి దెప్పిపొడిచారు.

అమరావతిని నిర్వీర్యం చెయ్యటానికి, జగన్ మోహన్ రెడ్డి, ఏ నిమిషాన నిర్ణయం తీసుకున్నారో కాని, అప్పటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో ప్రతి రోజు, ఏదో ఒక చెడ్డ వార్తా , జగన్ కు వినిపిస్తూనే ఉంది. వెంటనే విశాఖ వెళ్లిపోదాం అని అనుకుంటున్న జగన్ కు, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న హైకోర్ట్ మాట్లాడుతూ, హైకోర్ట్ శాశ్వత భవనాలు నిర్మాణం కొనసాగించండి అంటూ, ఇచ్చిన ఆదేశాలతో జగన్ షాక్ తిన్నారు. ఒక పక్క కర్నూల్ కు హైకోర్ట్ తీసుకు వెళ్దాం అని జగన్ అనుకునుంటే, కోర్ట్ మాత్రం, వాదనలు వింటూ ఉంటాం, కాని అమరావతిలో మాత్రం, శాశ్వత హైకోర్ట్ పనులు కొనసాగించండి అంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పక్క అసెంబ్లీలో బిల్లు పెట్టేసి, మూడు ముక్కల రాజధాని చేద్దాం అనుకుంటే, శాసనమండలి బ్రేక్ పెట్టింది. అయితే శాసనమండలినే రద్దు చేసి పడేసారు. కాని ఇప్పుడు ఇది కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రం రద్దు చేసే నిర్ణయం పై, ఇప్పుడే పార్లమెంట్ లో పెట్టే పరిస్థితి లేదు.

crda 28022020 2

ఇలా ఉంటే, ఈ రోజు మరో షాక్ తగిలింది. కొండవీటి, పాలవాగు పనులు ఎందుకు ఆపారు, ఆ పనులు పూర్తి చేయాలి అంటూ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 4 వారాల్లోగా పనులు పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కొండవీటి, పాలవాగుల పనుల్ని మధ్యలోనే ఆపేయటం వల్ల రాజధాని గ్రామాల్లో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని హైకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా కొండవీటి, పాలవాగు పనులు చేయకుండా, నిలిపివేసారని హైకోర్టు దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు. అయితే ఈ విషయం పై వివరణ ఇవ్వటానికి, తమకు రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్ట్ ని కోరారు.

crda 28022020 3

అయితే ఈ విషయం పై, హైకోర్ట్ ఒప్పుకోలేదు. రెండు వారల గడువు ఇవ్వటానికి హైకోర్ట్ నిరాకరించింది. 4 వారాల్లోగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని న్యాయమూర్తి కోరారు. 4 వారాల్లో ఈ ఆదేశాలు అమలు చేసి నివేదిక ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కమిషనర్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడు అమరావతిలో ఆపేసిన కొండవీటి, పాలవాగుల పనుల్ని మళ్ళీ కొనసాగించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. అమరావతి వరదలు బారిన పడకుండా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సహాయంతో, కొండవీటి, పాలవాగులు వెడల్పు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. పనులు కూడా తెలుగుదేశం హయంలో పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read