ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత, చేసిన ట్వీట్ ఒకటి, వైసీపీ పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీతో పాటు, రాష్ట్రం అంతటా, కలకలం రేపుతోంది. రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రావాలి అని కోరుకుంటున్నా అంటూ, విజయవాడకు చెందిన ఆ నేత చేసిన ట్వీట్ కలకలం రేపింది. అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్ డెలీట్ చేసారు, ఆ నేత. అయితే, అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయిపొయింది. స్క్రీన్ షాట్ కూడా, న్యూస్ ఛానెల్స్ తో వచ్చేయటంతో, ఆయన డెలీట్ చేసినా, ఆ ట్వీట్ స్క్రీన్ షాట్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపొయింది. దీంతో వైసీపీలో ఎవరిని చూసినా, ఈ ట్వీట్ పైనే, చర్చించుకుంటున్నారు. ఆ నేత చాలా కీలకమైన నేత కావటం, పార్టీ అధినాయకత్వంతో, మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, ఆయన చేసిన ట్వీట్ చూసి, పార్టీలో ఏదో జరుగుతుంది అనే చర్చ, వైసీపీ నాయకుల్లో, వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. ఈ నేత ట్వీట్ చేస్తే, అది వార్తల్లో కూడా ప్రముఖంగా చెప్తూ ఉంటారు.

ఇప్పుడు ఈ మహిళా ముఖ్యమంత్రి పోస్ట్ కు, న్యూస్ చానల్స్ లో వచ్చింది. దీంతో ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు, మరి ఇప్పుడున్న జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి, అనే విషయం పై పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే, దీనికి ఊతం ఇస్తూ, గత పది రోజులుగా తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు కూడా చర్చకు వస్తున్నాయి. రస్ అల్ ఖైమా దేశం, త్వరలోనే జగన్ ను అరెస్ట్ చేస్తుందని, ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం కూడా పర్మిషన్ ఇచ్చింది అని, దుబాయ్ తో పాటు, కొన్ని అరబ్ దేశాలకు, కేంద్రం పర్మిషన్ ఇచ్చిన గజెట్ చూపిస్తూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఇదే కేసులో, సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జనవరిలో, కేంద్రం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎవరిని అయినా అరెస్ట్ చేసే అవకాసం ఉంటుందని ఆరోపిస్తుంది.

రస్ అల్ ఖైమాని మోసం చేసిన కేసులో, ఇప్పటికే నిమ్మగడ్డ అరెస్ట్ అయితే, త్వరలోనే జగన్ కూడా అరెస్ట్ అవుతారు అంటూ, టిడిపి ప్రచారం చేస్తుంది. దీంతో, ఒక పక్క ఈ ఆరోపణలు, మరో పక్క కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు, ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నేత, అధిష్టానానికి దగ్గరగా ఉండే నేత, ఇలా మహిళా ముఖ్యమంత్రి అంటూ ట్వీట్ పెట్టటంతో, వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక వైసీపీ పార్టీ కూడా, ఈ ఆరోపణల పై, అస్సలు స్పందించక పోవటం, ఆ ప్రచారాన్ని ఖండించక పోవటంతో కూడా తికమక పడుతుంది వైసీపీ క్యాడర్. మరో పక్క కొంత మంది అమితమైన ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరూ అంటూ, రకరకాల పేర్లు చెప్తూ, అభిప్రాయాలు చెప్తున్నారు.

అధికారంలోకి రాకముందు విద్యార్థులను, యువతను మోసగించిన జగన్, అధికారంలోకి వచ్చాక వారికి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా, ఆయా వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత నయవంచనకు గురిచేస్తున్నాడని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన, టీఎన్ఎస్ఎఫ్ నేతలతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు, వివిధ సందర్భాలలో విద్యార్థులకు అన్నివేళలా అండగా ఉంటానని, వారి చదువులకు అవసరమైన సమస్త సౌకర్యాలను అందిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కాడన్నారు. పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే సమయమున్నా, జగన్ ఇచ్చినహామీ ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి డబ్బులు అందలేదన్నారు. ప్రతిఏటా ఒక్కో విద్యార్థికి రూ. 1,50,000 ఇస్తానన్న జగన్, నేడు వసతి దీవెన కార్యక్రమం పేరుతో, అరకొరగా రూ.7,500 ఇవ్వడం, ఆ కొద్దిమొత్తం కూడా అతితక్కువ మందికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమో, ముఖ్యమంత్రే చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, మెస్ బిల్లులు చెల్లించలేదని, అవి అందక విద్యార్థిలోకం నానా అగచాట్లు పడుతున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో పేదవిద్యార్థుల చదువులకు ఎంతఖర్చయితే, అంత మొత్తం తమ ప్రభుత్వం భరిస్తుందని, కాస్మొటిక్ ఛార్జీల కింద అదనంగా ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడెందుకు ఇలా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నాడని రవీంద్ర దుయ్యబట్టారు. రూ.లక్షన్నరపైగానీ, అదనంగా ఇస్తానన్న రూ.20వేలపైగానీ, ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదని, అసలుకి, కొసరకు ఎసరుపెట్ట్టిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు. విద్యా సంవత్సరం ముగింపుదశకు వచ్చాక, అరకొర చెల్లింపులు చేస్తూ, వసతిదీవెన పేరుతో జగన్, తనకుతానే డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే 16లక్షల మంది విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ సంఖ్యని 11 లక్షలకు కుదించాడన్నారు. జగన్ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం చేకూరుతోందని, అమ్మఒడి పథకాన్ని కూడా డిగ్రీ, ఇతర అనుబంధ, వృత్తి విద్యా కోర్సులు అవలసంభిస్తున్న విద్యార్థులకు ముడిపెట్టి, కుటుంబంలో ఒక్కరికే న్యాయం చేస్తాననడం జగన్ చౌకబారుతనా నికి నిదర్శనమన్నారు.

గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రూ.35వేల నుంచి రూ.40 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచితే, దాన్ని ఎంతమొత్తమైతే అంతమొత్తం ఏకకాలంలో చెల్లిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడెందుకు దాన్ని రూ.45వేలకే పరిమితం చేసి, విద్యార్థుల సంఖ్యను ఎందుకు తగ్గించాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నయవంచనకు గురిచేయడం ద్వారా జగన్ సర్కారు జగనన్న వసతిదీవెన పేరుతో నయా మోసానికి తెరలేపిందన్నారు. జగన్ చర్యల వల్ల అటు విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయని, పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఫీజులు చెల్లిస్తేనే, హాల్ టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. మెస్ బిల్లులను రూ. 1450పెంచుతామని చెప్పిన జగన్, 9నెలలైనా కూడా ఒక్క విద్యార్థికి కూడా పెంపుతో సంబంధంలేకుండా పాతమొత్తాలతో కలిపికూడా ఆబిల్లులు చెల్లించలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నిలిపివేయడం, మెస్ బిల్లులు చెల్లించకపోవడం, కాస్మొటిక్ ఛార్జీలు ఆపేయడం, తమ్ముడికో, చెల్లిలికో అమ్మఒడి డబ్బులిస్తే, పెద్దచదువులు చదివే వారి అన్నయ్యలకు, అక్కలకు డబ్బులివ్వకపోవడం వంటి చర్యలతో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థిలోకాన్ని నిలువునా మోసగించడన్నారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకాన్ని ఆపివేయడంద్వారా, కళాశాల విద్య ఆరంభంలోనే జగన్ డ్రాపవుట్స్ సంఖ్య పెరిగేలా చేశాడన్నారు. అదేవిదంగా విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం, అన్ని వర్గాల వారికి సాయం చేసిందని, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, విదేశీ విద్యాదరణ పథకాల కింద రూ. 10లక్షల వరకు సాయం చేసిందన్నారు. ఆయా పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులు లబ్దిపొందారని, గత ప్రభుత్వంలో ఆయాపథకాల ద్వారా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లినవారికి కూడా జగన్ సర్కారు సాయాన్ని నిలిపివేసిందన్నారు. గ్రూప్2, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం, ఆయా విద్యార్థులకు రూ.10వేలవరకు స్టయిఫండ్ ఇవ్వడంతోపాటు, కోచింగ్ కేంద్రాలకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వరకు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ పథకమే మరుగున పడిందన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకం ధ్వారా టీడీపీ ప్రభుత్వం, 1,75,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిందని, జగన్ వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. నిరుద్యోగ భృతి కింద, టీడీపీ ప్రభుత్వం 6లక్షల మందికి నెలనెలా భృతిని అందచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక, నిరుద్యోగులను రోడ్డున పడేశాడన్నారు. 9వ తగరతి చదివే విద్యార్థులకు సైకిళ్లు అందచేయడం, ప్రతిఏటా మెగాడిస్సీ నిర్వహించడం వంటి పనులన్నీ, చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తే, జగన్ సీఎం అయ్యాక, వాటన్నింటినీ అటకెక్కించడాని రవీంద్ర మండిపడ్డారు.

మాజీ మంత్రి, జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వి-వే-క హ-త్య కేసు పై, తమకు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇక్కడ పోలీసుల పై నమ్మకం లేదని, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, సాక్షాత్తు జగన్ సోదరి అయిన, వైఎస్ వి-వే-క కూతురు, సునీత హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్, ఇక వాదనలు ముగిసినట్టు ప్రకటించి, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ రోజు హైకోర్ట్ ఆదేశాలు మేరకు, పోలీసులు, శ-వ-ప-రీ-క్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని, పోలీసులు హైకోర్ట్ కు సమర్పించారు. కేసుకు సంబంధించి, ఇప్పటి వరకు వారి దగ్గర ఉన్న అన్ని విషయాలను కూడా పోలీసులు కోర్ట్ కు సమర్పించారు. గతంలోనే కోర్ట్, తమకు శ-వ-ప-రీ-క్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని, అన్ని వివరాలను సమర్పించాలని, ఇది వరకు కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలోనే, పోలీసులు ఈ రోజు అన్నీ సమర్పించారు. మరో పక్క ఈ రోజు చివరి సారిగా, ఇరు పక్షాలు, బలంగా హైకోర్ట్ ముందు తమ వాదనలు వినిపించాయి.

viveka 24022020 2

అయితే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉన్నట్టు ఉండి ఆయన పిటీషన్ వెనక్కు తీసుకుంటూ, దానికి కారణాలు చెప్తూ మెమో దాఖలు చేసారు. అయితే ఈ మెమో పై, వి-వే-క కూతురు తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే ఈ నేపధ్యంలో తాము ఎందుకు పిటీషన్ వెనక్కు తీసుకువాలి అని నిర్ణయం తీసుకున్న విషయం పై కూడా, జగన్ మోహన్ రెడ్డి, తరుపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి, వి-వే-క కూతురు తరుపు నయ్యవాది మాత్రం, తీవ్ర అభ్యంతరం చెప్పారు. గతంలో ఒక హకూతురుత్య కేసుకు సంబంధించి, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐకి ఇవ్వాలి అంటూ నిర్ణయం తీసుకున్నారని కోర్ట్ కు చెప్పారు.

viveka 24022020 3

అదే విధంగా వివేక కేసుని కూడా సిబిఐకి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ వేసారని, ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారని, అభ్యంతరం చెప్పారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న, హైకోర్ట్, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. దీని పై త్వరలోనే తీర్పు రానుంది. అయితే ఈ పిటీషన్ పై గత నెల రోజులగా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడిచాయి. వి-వే-క కూతురు వేసిన పిటీషన్ లో, వైసీపీ ఎంపీల పేర్లు, వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళ పేర్లు ఉండటంతో, ఒక్కసారి సంచలనంగా మారింది. మొన్న జరిగిన విచారణలో, దాదపుగా అయుదుగురు వైసీపీ ముఖ్య నాయకులు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు, తమకు అనుమానాలు ఉన్నాయి అంటూ, పిటీషన్ తరుపు న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.

జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన పధకం ఈ రోజు విజయనగరంలో ప్రారంభించారు జగన్. ఈ సందర్భంగా, విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు, పేపర్లు, ఛానళ్ళు ఉన్మాదులు లాగా తన పై పడ్డారని అన్నారు. ప్రజల కోసం, ఎంత మంచి చేస్తున్నా, వీళ్ళు అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ, జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోతున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన పత్రికలూ, ఛానెల్స్ లో, డబ్బులు ఇచ్చి వ్యతిరేక కధనాలు రాస్తున్నారు అంటూ, జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, డబ్బులు ఇచ్చి తన పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని అన్నారు అంటే, అది ఎంత పెద్ద ఆరోపణ అనేది అర్ధం చేసుకోవచ్చు. జగన్ ఇంతటితో ఆపలేదు.

jagan 24022020 2

తాను మూడు ప్రాంతాలకు న్యాయం చెయ్యాలని, మూడు రాజధానులు తీసుకు వస్తే, మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చెయ్యాలని తాను చూస్తుంటే, తమ పై, ఉన్మాదులు లాగా దాడి చేస్తున్న వీళ్ళను ఏమనాలి అంటూ, జగన్ ప్రశ్నించారు. ప్రతి పేద వాడికి ఇళ్ళు ఉండాలని, అందుకే వారికి 25 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అయితే దీని పై కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ, జగన్ మండి పడ్డారు. దళితుల భూములు లాక్కుని, అసైన్ భూములు లాక్కుని, ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు అంటూ, చాలా మంది, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఆ విషయాన్ని చూపించిన మీడియాను, జగన్ ఉన్మాదులు అంటూ వాపోయారు.

jagan 24022020 3

నిజంగా సమస్య ఉంటే, దాని పై ఫోకస్ చెయ్యాలి కాని, తన పై వ్యతిరేక వార్తలు రాస్తే, ఉన్మాదులు అనటం ఏమిటి అంటూ, ప్రతిపక్షాలు ప్రస్నిస్తున్నాయి. ఇక మరో పక్క, స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్లు పెంచుతూ మేము నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు కోర్ట్ కు వెళ్లి, ఏదో జరిగిపోయినట్టు, విపరీత వార్తలు రాసారని, జగన్ వాపోయారు. అయితే, జగన్ వ్యాఖ్యల పై టిడిపి మండి పడింది. ఒక వేళ, వార్తల్లో రాసింది, ఛానెల్స్ లో చుపించింది తప్పు అయితే, జగన్ తెచ్చిన జీవో 2430 పై చర్యలు తీసుకోవచ్చు కదా అని వాపోయాయి. ఆ వార్తలో నిజం ఉండబట్టే, ప్రభుత్వంలో ఉండి కూడా, ఇంకా ఎదురు మీడియా పై, తన అక్కసు చూపిస్తున్నారని, జగన్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని, ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆరోపణలు చేసి తప్పించుకోలేరని, అన్నిటికీ సమాధానం చెప్పాలని వాపోయింది టిడిపి..

Advertisements

Latest Articles

Most Read