తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. చంద్రబాబును ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆయన వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానాశ్రయం వద్ద వైకాపా కార్యకర్తల తీరుతో ప్రజలు భీతిల్లారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పలుచోట్ల నుంచి కార్యకర్తలను వైకాపా సమీకరించింది. మాజీ సీఎం చంద్రబాబు వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట బైఠాయించి వైకాపా శ్రేణుల నినాదాలు చేశారు. ఫలితంగా, విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులను వేరే వాహనాల్లో పోలీసులు తరలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజల అవస్థలు పడుతున్నారు.

"వైకాపా కార్యకర్తల నిరసన కారణంగా విశాఖలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెదేపా కార్యకర్తలను విమానాశ్రయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. "విశాఖలో జగన్ భూకబ్జాలు బైటకు వస్తాయనే వైసిపి భయం. అందుకే చంద్రబాబు విశాఖ పర్యటనకు వైసిపి అడ్డంకులు. మాజీ సిఎం చంద్రబాబు కాన్వాయ్ పై వైసిపి దాడికి పాల్పడటం హేయం. ప్రజాస్వామ్యాన్ని ఫాక్షన్ రాజ్యంగా చేస్తారా..? మీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా..? వైసిపి నేతల స్వార్ధానికి పోలీసులను వాడుకోవడం అతిహేయం. ఫాక్షన్ బుద్దులున్నవాళ్లు పాలకులైతే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది తొలినుంచి ఫాక్షన్ బుద్దులే. ఫాక్షన్ కుటుంబం కాబట్టే ప్రత్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలు. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నెలకొల్పారు. వైసిపి ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. "

"టిడిపి ప్రభుత్వం ఇలాగే చేసివుంటే 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవారా..? 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా..? గృహ నిర్బంధాలు టిడిపి నాయకులకేనా..? వైసిపి నేతలకు గృహ నిర్బంధాలు ఉండవా..? గంటల తరబడి మాజీ సిఎంను ఎయిర్ పోర్టు వద్దే నిలిపేస్తారా..? ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలు విసురుతారా..? టిడిపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడతారా..? చోద్యం చూడటానికా పోలీసులు ఉన్నది..? ఏపిలో ప్రభుత్వమే శాంతిభద్రతలను భగ్నం చేస్తోంది." అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే, నాలుగు గంటలుగా వైసీపీ శ్రేణులు, అడ్డుకుంటే, ఇప్పుడు పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటానికి చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖ ఉడుకుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పరిస్థితి రణరంగమైంది. వేలాదిగా తరలివచ్చిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి... కొన్ని గంటలుగా చంద్రబాబు వాహనశ్రేణి ముందుకు కదలకుండా స్తంభింపజేశారు. ఈ క్రమంలో వాహనం దిగి నడుస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. అయితే ఈ పరిణామంతో పోలీసులు ఖంగుతిన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తిరిగి వాహనంలోకి వెళ్ళాలని, సహకరించాలి అని చెప్పటంతో, చంద్రబాబు వెనక్కు వచ్చారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. పొరపాటున చంద్రబాబు పై, ఒక్క రాయి పడినా, అది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. టిడిపి శ్రేణులు అదుపు తప్పే ప్రమాదం ఉందని గ్రహించి, వెంటనే చంద్రబాబుని కోరటంతో, చంద్రబాబు కూడా వారికి సహకరించి వెనక్కు వెళ్లారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్‌ను వైకాపా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు.

vizzag 27022020 2

అత్యంత ఉద్రిక్త పరిస్థితులే మధ్యే చాలాసేపు వాహనంలో వేచిచూసిన చంద్రబాబు.... పరిస్థితి ఎంతకీ సద్దుమణకపోవడంతో ఇక లాభం లేదనుకుని కిందకు దిగారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితులే మధ్యే చాలాసేపు వాహనంలో వేచిచూసిన చంద్రబాబు.... పరిస్థితి ఎంతకీ సద్దుమణకపోవడంతో ఇక లాభం లేదనుకుని కిందకు దిగారు. పాదయాత్రగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వాహనం ఎక్కారు చంద్రబాబు. వాహనంలో ఉన్న చంద్రబాబుతో పోలీసులు మాట్లాడారు. తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాట కొనసాగుతోంది. కాన్వాయ్‌ ఎదుట బైఠాయించేందుకు వైకాపా నేత కె.కె.రాజు యత్నించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను కదలనీయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ‌వాహనం ఎదుట నల్లజెండాల ప్రదర్శనతో నినాదాలు చేశారు.

vizzag 27022020 3

తెదేపా నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రౌడీలు, గూండాలను పంపించి దాడి చేయిస్తారా అని నిలదీశారు. బయటికి ఎలాగైనా వెళ్తామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలా ఆందోళనలు చేయిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ నేత చినరాజప్ప ప్రశ్నించారు. విమానాశ్రయంలో చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకే చంద్రబాబు విశాఖ పర్యటన చేస్తున్నారని తెలిపారు.

విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు, అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. మరోవైపు.. ఇప్పటివరకూ పోలీసులు ఈ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తును మోహరించారు. ఇరు పార్టీల నేతలను అదుపు చేస్తున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం చంద్రబాబు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టి, తన పర్యటన కోసం, బయటకు రాగానే, వైసీపీ మూకలు ఎయిర్ పోర్ట్ లో రెచ్చి పోయాయి. చంద్రబాబు పై, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరెందుకు ప్రయత్నం చెయ్యగా, అవి వచ్చి పోలీసుల మీద పడ్డాయి. పోలీసులు మాత్రం వైసీపీ శ్రేణులు ఎంత వీరంగం సృస్తిస్తున్నా, చూసి చూడనట్టు వదిలేసారు. చంద్రబాబు పర్యటనకు స్వాగతం పలకటానికి టిడిపి కార్యకర్తలు వస్తారని తెలిసినా, వైసీపీ కార్యకర్తలను ఎలా పంపించారు అనేదాని పై, టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

cbn 270220202

వైసీపీ శ్రేణులు, ఎయిర్ పోర్ట్ లో చేస్తున్న వీరంగం కవర్ చేస్తున్న మీడియా ఛానెల్స్ పై కూడా వైసీపీ మూకలు దాడి చేసారు. మరో పక్క, చంద్రబాబుకి స్వాగతం పలకటానికి వచ్చిన, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వాహనాన్ని కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టిడిపి శ్రేణులు, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు వాహనం ముందు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అలాగే ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కారు అద్దాలు కూడా పగలకొట్టారు. ఇక ఎయిర్ పోర్టు దగ్గర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. తమ అధినేత వస్తుంటే, మేము స్వాగతం పలకటం కూడా తప్పా అంటూ, తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.

cbn 27022020 31

వైకాపా నేతల లెక్క తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరే ముందు పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు. ఉదయం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు. వైకాపా లెక్కలను ఉత్తరాంధ్ర పర్యటనలో తేల్చుతానని వ్యాఖ్యానించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైకాపాకు... తెదేపాను ప్రశ్నించే నైతిక అర్హత లేదన్నారు. పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వకం సరికాదని చెప్పారు. తన పర్యటనకు ఆంక్షలు పెట్టడం కాదని.. రోడ్లు తవ్వుతున్న వారి సంగతి చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లెయినర్లు అడ్డుపెట్టినా పర్యటన ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతోందని ఆరోపించారు.

చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ భలే ఇరుక్కుంది. వైజాగ్‌లో చంద్రబాబు తన పర్యటనను పెట్టుకోవటం, బాబును ఎలాగైనా వైజాగ్‌లో అడుగు పెట్టనివ్వం అని వైకాపా ప్రకటించటంతో చంద్రబాబు ప్లాన్ ఊహించిన రీతిలో క్లిక్ అయింది. వైజాగ్ వాసులకు వైకాపా వాళ్లు ఎంత దౌర్జన్యపరులు, ఎంత దాదాగిరి చేస్తారు, ఎలా దాడులు చేస్తారు, ఎలా పేట్రేగిపోతారో చంద్రబాబు వాళ్లతోనే ఈవాళ లోకల్ ప్రజలకు ఒక డెమో ఇప్పించారు. ఇంతకాలం రాజకీయ ఆరోపణగానే ఉన్న వైకాపా రౌడీయిజం చేస్తుంది, వైకాపా వస్తే అరాచకం ప్రబలుతుంది అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ చాలాసార్లు రాజకీయంగా ఆరోపించాయి. ఇప్పుడు వాళ్లతో అదే పని చేయించి చంద్రబాబు విశాఖ వాసుల దృష్టిలో వైకాపాను ఎక్స్‌పోజ్ చేశారు. వైజాగ్ వీధుల్లో, విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు పట్టుకుని నడిరోడ్డు మీద వైకాపా కార్యకర్తలు భీభత్సం చూస్తుంటే వైజాగ్ జనం బిర్ర బిగుసుకుపోయారు. ఆనాడు జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి తిరగ్గొట్టినట్టే చంద్రబాబును కూడా రిటర్న్ పంపాలని వైసీపీ ప్లాన్ వేసింది.

బాబు టూరును ఎవరో తమ సత్తా చూపుతారో వాళ్లకి పార్టీలో గుర్తింపును ఇస్తామని లోకల్‌గా ఆధిపత్యం వహిస్తున్న ఓ ప్రముఖ నేత నిన్నటి వైకాపా కేడర్ మీటింగ్‌లో వాగ్దానం కూడా చేశారు. దాంతో భారీ ఎత్తున వాహనాల్లో జనాలను తీసుకుని వచ్చి విశాఖ నగరంలో వైకాపా చేసిన అల్లరి జనంలో అధికారపార్టీని బ్యాడ్ చేసిందే తప్ప వాళ్లు ఇందులో పాముకునేదేం లేదు. సున్నిత మనస్కులు, సహృదయులు, శాంతికాముకులు అయిన వైజాగ్ సిటిజన్స్‌కు ఈరోజు వైసీపీ ఇచ్చిన డెమో ప్రభావం వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో ఖాయంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ పై, పులివెందుల ముఠా కన్ను పడింది అంటూ, తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు చేసిన ప్రచారం, నిజం అనే విధంగా, ఈ రోజు వైజాగ్ ప్రజలు లైవ్ లో చూసారు.

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకే చోట గుమిగూడిన పరిస్థితుల్లో.. విమానాశ్రయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, వైకాపా వర్గీయుల పోటాపోటీ మోహరింపుతో విశాఖ విమానాశ్రయం అట్టుడికింది. తెదేపా అధినేత చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి ఇరు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనే విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న వైకాపా శ్రేణులు.... ఆయన వాహనశ్రేణిని చుట్టుముట్టారు.

Advertisements

Latest Articles

Most Read