హైకోర్ట్ లో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వమని ఆదేశిచాలని కోరుతూ, వి-వే-క కూతురు వేసిన రిట్ పిటీషన్ చూస్తే, సంచలన విషయాలు ఉన్నాయి. స్వయానా పెదనాన్న కొడుకు, సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న అన్న పైనే, ఈ ఆరోపణలు చెయ్యటం సంచలనంగా మార్దిని. వైఎస్ సునీత కోర్టుకి ఏమి చెప్పింది? కొన్ని ముఖ్యాంశాలు ఇవి, 1. కడపలో వైఎస్ఆర్ ఎంత పాపులరో మా నాయనా అంతే పాపులర్. సౌమ్యుడూ, అందరికీ అందుబాటులో ఉంటాడన్న మంచిపేరుతో చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 2. మా నాయన మృ-త-దే-హా-న్ని చూసిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తెదేపాలోని ముఖ్యులకు దీనిని ఆపాదిస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు. తన పార్టీసహచరులతను వెంటబెట్టుకొని వెళ్ళి గవర్నర్ ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరారు. 3. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడిషినల్ డీజీపీ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో మొదటి సిట్ టీం ను ఏర్పాటు చేయడం జరిగింది. 4. ఆ తర్వాత మా పెదనాన్న కొడుకూ, నా కజిన్ అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి, కొత్త డీజీపీ సవాంగ్ బాధ్యతలు తీసుకున్న 14 దినాల్లో సిట్ ను రీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అడిషినల్ డీజీపీ స్థాయి అధికారిని తప్పించి కేవలం జిల్లా ఎస్పీకి నేతృత్వాన్ని బదలాయించి రెండవ సిట్ ను నీరుగార్చారు.

11) [అమిత్ గార్గ్ ను ఇక్కడ తప్పించారు] రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఇద్దరు అనుమానితులు ఉదయ్ కుమార్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి లను విచారణకై పులివెందుల నుండి కడపకు తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో లెక్క లేనన్ని ఫోన్ కాల్స్ రావడం, చివరకు అనూహ్యంగా వారిని కడపకు తీసుకొని రాకుండా వెనక్కు పులివెందుల పంపించి వేయడం జరిగిది. ఎవరి ప్రోద్భలం మేరకు వారిని విచారణకు తీసుకొని రాకుండా మార్గమధ్యంలో వెనక్కి పంపివేయడం జరిగింది? 6. ఇది జరిగిన కొద్ది రోజులకే రెండవ సిట్ బాస్ అభిషేక్ మొహంతి ధీర్ఘకాలిక సెలవుపై ఏ కారణాల వలన వెళ్ళిపోయారు? ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాక 3 వ సిట్ ను వేసారు.. స్థానిక ఎస్పీ కేకే అంబురాజన్ నేతృత్వంలో. 7. సిట్ కు ఇన్ చార్జ్ గా అభిషేక్ మొహంతీ గారినే కొనసాగించవలసినదిగా డీజీపీని కోరడం జరిగింది. (28-11-2019) . వ్యక్తిగత రక్షణకై 21-11-2019 న డీజీపీని కోరడం జరిగింది. 07-12-2019 న (కేసులో అనుమానితులైన వ్యక్తులే సాక్షులను ఇంటొరాగేట్ చెయ్యడంపై) కడప ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసును సీబీఐ కి బదలాయించే విషయమై మళ్ళీ 11-12-2019 న డీజీపీని కోరడం జరిగింది. 8. ఘటనా స్థలంలో ర-క్త-పు మరకలు శుభ్ర పరచడం వల్ల అప్పుడు అక్కడ విధుల్లో ఉండటంతో సస్పెండయిన సీఐ శంకరయ్యను నిందితుల లిస్ట్ లో ఎందుకు చేర్చలేదు?

9. మూడవ సిట్ కు ఎస్పీ అంబురాజన్ వచ్చినప్పటి నుండీ కేసు దర్యాప్తులో పురోగతి లేదు. గత సిట్ ల దర్యాప్తు వివరాలను తర్వాత వచ్చే వారు పరిగణలోకి తీసుకోవట్లేదు. 10. రెండవ సిట్ చే విచారింపబడిన హెడ్ కానిస్టేబుల్ రామ కృష్ణా రెడ్డి (ర-క్త-పు మరకలు శుభ్రపరిచేటప్పుడు ఘటనా స్థలంలో ఉన్నాడు) ఇప్పుడు తనే సాక్షుల ఇళ్ళకు వెళ్ళి ప్రశ్నలు వేయడం ఎక్కడి విచిత్రం? ఇదే విషయం డీజీపీకి కూడా లేఖ ద్వారా తెలియజేసాము. 11. నా సోదరుడు సీఎం జగన్ గతంలో స్వతంత్ర్య సంస్థ దర్యాప్తును కోరి ఇప్పుడు సీబీఐకు కేసును అప్పగించకపోవడం శోచనీయం. 12. తరచూ సిట్ అధికారులను ఎందుకు మార్చుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ చెప్పట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోసం రిట్ పిటీషన్ వేసిన నా సోదరుడు జగన్ ఆ పిటీషన్ ను వెనక్కి తీసుకోనంత వరకూ టెక్నికల్ గా ఆయన సీబీఐ విచారణ కోరుతున్నట్లే లెక్క. ఇప్పుడు తనే సీఎం అయ్యాక సీబీఐను ఈ కేసు విచారించమని కోరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అమాయకులపై దోషులుగా ముద్ర పడే అవకాశం ఉంది. 13. అనుమానితులు :: అంతా తెలిసిన వారు, బంధువులే.. ముఖ్యమైన వారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మరియూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి డీ. శివశంకర్ రెడ్డి.

అనుమానితుల్లో అందరి కంటే చివరన మొక్కుబడిగా ఆదినారాయణ రెడ్డి, రవీంధ్రనాధ్ రెడ్డి పేర్లు.. అసలు అభియోగాలన్నీ సొంత వారిపైనే. ఈ రిట్ పిటీషన్ చదివితే సీఎం సొంత బాబాయి కూతురే తనకూ తన తల్లికీ న్యాయం జరగడం కోసం ఎన్ని అవస్థలు పడుతుందో అవగతం అవుతుంది.. మరి ఈ విషయం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కొంతకాలంగా బీహార్ సీఎం నితీష్ కుమార్,ఐప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే.అనేక సందర్భాల్లో సీఎం నితీష్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియా తో మాట్లాడటం,తన సొంత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలగా ప్రకటిస్తూ ప్రశాంత్ కిషోర్ నితీష్ కి కొరకరాని కొయ్యగా మారారు.బీజేపీ కింగ్ పిన్ అమిత్ షా ఆదేశాలతో ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించిన నాటినుండి నితీష్ కి కంటి మీద కునుకు లేకుండా చేసారు ప్రశాంత్ కిషోర్.ముఖ్యమంత్రి గా ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపారు.పార్టీ లో కూడా నితీష్ ని కాదని తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఆ వివాదం తారా స్థాయికి చేరుకుంది.బీజేపీ తీసుకొచ్చిన సిఏఏ,ఎన్ఆర్సి,ఎన్పిఆర్ సిసిఏ బిల్లుల వ్యవహారంలో నితీష్ ,ప్రశాంత్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండే వాతావరణం తీసుకొచ్చాయి.రోజుకో ట్వీట్ తో నితీష్ ని ఇబ్బంది పెట్టారు కిషోర్.

రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాం అని గమనించిన నితీష్ అసలు నిజాలు బయటపెట్టారు.అమిత్ షా ఆదేశాలతోనే ప్రశాంత్ కిషోర్ ని పార్టీ ఉపాధ్యక్షుడిని చేసా,పార్టీ ని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చారు.పార్టీ లైన్ దాటాలి అనుకుంటే పదవికి రాజీనామా చెయ్యాలి అని అన్నారు.అయితే నితీష్ ని మరింత రెచ్చగొట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసారు.ఇక ప్రశాంత్ కిషోర్ ని పదవి నుండి తప్పించి ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చెయ్యాలని నితీష్ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమాచారం తెలుసుకున్న జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్ తో ఫోన్లో మాట్లాడారు. నేను మీకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇస్తా అని ప్రశాంత్ కిషోర్ కి జగన్ అఫర్ చేశారట.

అంతే కాదు ప్రస్తుతం ఢిల్లీ లో వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి అనేక కేసుల్లో నిందితుడుగా ఉండటంతో జగన్ కి ముఖ్యుల అపాయింట్మెంట్ రావడం కష్టం అవుతుంది అందుకే ప్రశాంత్ కిషోర్ కి క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ఢిల్లీ లో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ చేసారట.ప్రశాంత్ కిషోర్ కి బీజీపీ అధినాయకత్వం ఆశీస్సులు ఉన్నాయి.కాబట్టి ఢిల్లీ పెద్దల నుండి కావాల్సిన సహాయం కూడా వెంటనే దక్కుతుంది అలానే రాష్ట్రంలో తనకి అడ్డుగా మారిన మండలి రద్దు కు కూడా ప్రశాంత్ కిషోర్ మార్గం సుగమం చేస్తారు అని జగన్ బలంగా నమ్మి ప్రశాంత్ కిషోర్ ని మరో సారి పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అట.ప్రశాంత్ కిషోర్ కూడా ముఖ్యమంత్రి జగన్ అఫర్ కి అంగీకరించినట్టు సమాచారం.వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు పార్టీ వర్గాలు.పూర్తి స్థాయిలో పీకే బాధ్యతలు స్వీకరిస్తే ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పీకే మార్క్ సినిమా కనిపిస్తుంది అని వైఎస్ఆర్సి వర్గాలు అంటున్నాయి

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధిహామీ మండలి సభ్యులు సచివాలయంలో పంచాయతీరాజ్‌ కమీషనర్‌ గిరిజా శంకర్‌ ని, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ని కలిసి ఉపాధిహామి నిధులపై కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు పరచాలని, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సంధర్భంగా వారితో ఉపాధిహామీ మండలి సభ్యులు మాట్లాడుతూ.... పేదల ఉపాధికి, గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడిన నరేగా పథకాన్ని గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకుండా నిధులు దారి మళ్ళించారు.పథకం ప్రాథమిక లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నారు. పనులు చేసినవారికి బిల్లులు లేవు. 2018-19 సంవత్సరానికి రాష్ట్రంలో నరేగా పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ మూడు జీవోలు ఇచ్చారు. 05.08.2019న రూ.836,00,68,000, 08.07.2019న రూ.641,39,52,000 మరియు 09.04.2019న రూ.367,65,41,000. మొత్తంగా రూ.1,845 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తన వాటా రూ. 615 కోట్లతో కలిపి మొత్తం రూ. 2460 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.ఈ నిధులను స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ ఫండ్‌కు 3 రోజుల్లోపు విడుదల చేయాలని స్పష్టంగా ఆదేశించింది. లేనిపక్షంలో భవిష్యత్తులో ఇచ్చే నిధులను ఆపేస్తామని, నిధుల జాప్యమైన కాలానికి 12% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హెచ్చరించింది. ఎన్‌.ఆర్‌.ఈ.జీ.యస్‌ చట్టం దేశవ్యాప్తంగా, పకడ్బందీగా, కట్టుదిట్టంగా అమలవుతోంది.

నరేగా కింద చేసిన పనులకు ప్రాధాన్యతా క్రమంలో, ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలి. పాత బకాయిలను ప్రథమ ప్రాధాన్యత కింద చెల్లింపులు జరపాలి. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి.గాడి తప్పిన పాలనతో పంచాయితీల్లో అన్నీ అభివృద్ధి పనులు అగిపోయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైన మాట వాస్తవం కాదా?ఆంధ్రప్రదేశ్‌ లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద సిమెంట్‌ రోడ్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, అంగన్‌ వాడీ భవనాలు, డ్రైనేజీ నిర్మాణం, సంపద తయారీ కేంద్రాలు స్మశాన వాటికలు మొదలగు అభివృద్ధి పనులను మాజీ సంర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు మరియు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు చేసి తమ ఆస్థులను తాకట్టు పెట్టి ఈ పనులను చేసినారు.పులివెందుల, పుంగనూరుకు బిల్లులు చెల్లించారు. నరేగా నిధులలో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఆ రెండు ప్రాంతాలలో మాత్రం ఎలా బిల్లుల చెల్లించారు. అక్కడ అవకతవకలు జరగలేదని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? నవ్యాంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలుండగా పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలవారే మనుషులుగా ఈ ప్రభుత్వానికి కనిపించారా? మిగతా నియోజకవర్గాలలో పనులు చేసినవారు మనుషులు కాదా?

2018-19 సంవత్సరంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా నరేగాను అమలుచేశారని అవార్డు ఇచ్చి ప్రశంసించారు. మరి అలాంటి పనులు చేసినవారికి బిల్లులు ఆపడం అన్యాయం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు విడుదలైనప్పటికీ కూడా కేవలం కక్షకట్టి బిల్లులు చెల్లించక పోవడం వలన ఈ పనులు చేసిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది తమ ఆస్థులను అమ్ముకుని అప్పులు కట్టుకుంటున్నారు.ఈ నేపద్యంలో 30.12.2019 న రాష్ట్ర ప్రభుత్వం మెమో నం. 1060306/ష్ట్రఈ-11/జు1/2019 తో జూన్‌ 01, 2019 నుండి పనులు చేసిన వారికి మాత్రమే బిల్లులు చెల్లించాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం చేయటం జరిగింది.ఈ విషయాలపై చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న మనకు న్యాయం ఇంకా బ్రతికే ఉంది అన్నట్లు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరీ, జస్టిస్‌ ఎం. సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం కేంధ్రం విడుదల చేసిన రూ. 1845 కోట్లను ముందు పనిచేసిన వారికి నెల రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పు చెప్పడం జరిగింది. ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. కావున, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే బిల్లులు చెల్లించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వి.వి. గురుమూర్తి-కృష్ణ జిల్లా, ఎస్‌. సుబ్బరామయ్య- చిత్తూరు,పి. పీరయ్య- కడప, ఎం. లక్ష్మీ సుభాషిణి - గుంటూరు, వి.సురేంద్రబాబు - నెల్లూరు, సత్రం రామకృష్ణుడు-కర్నూలు, నారాయణస్వామి - అనంతపురం పాల్గొన్నారు.

అందరూ ఊహించినట్లుగానే శాసనమండలి రద్దుచేస్తూ కేబినెట్, శాసనసభ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల కాలంలోనే జగన్ తీసుకున్న అతి తిక్క నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను తెసుకున్న ప్రతి నిర్ణయంలోను మండలి మొదటి నుంచీ ఏదో సాకుతో తిరిగి వంపుతోంది అని జగన్ భావిస్తున్నారు. టిడిపి తనకున్న అవకాశాలను వినియోగిస్తూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేవిధంగా సభలో ఒత్తిడి తెచ్చింది. చైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభిప్రాయాలు తీసుకోవడానికి జగన్ మూడ్రోజుల సమయం కేటాయించారు. శాసనసభ ద్వారా మండలిని రద్దుచేస్తూ తీర్మానంచేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.

జగన్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగించారు. ఇదే అంశం పై మంత్రులు, సభ్యులు రద్దు అనివార్యమని చెప్పారు. చివరకు మండలిని రద్దు చేయాలని తీర్మా నం చేస్తూ కేంద్రానికి నివేదించారు. ఈ తీర్మానం ముందుగా కేంద్ర హోంశాఖకు చేరుతుంది. అక్కడ తీర్మానం పరిశీలించి కేంద్ర హోంమంత్రి, ప్రధాని అంగీకరిస్తే.. కేంద్ర కేబినెట్ సమావేశంలో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే పార్లమెంటులోని రెండు సభల్లోనూ ఆమోదం పొందాలి. ఆ తర్వాత మాత్రమే తిరిగి హోంశాఖ రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఆయన ఆమోదం పొందిన తర్వాత మండలిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కానుంది. అప్పటివరకూ మండలి రద్దు ప్రక్రియ అమల్లోనే ఉంటుంది. మండలి సభ కొనసాగడం, చర్చలు నిర్వహించడం యధాతథంగానే కొనసాగుతుంది.

ఏపి శాసనమండలిలో బిజెపి నుంచి సోము వీర్రాజు, మాధవ్ ఇద్దరు సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపితో టచ్ లో ఉన్నారు. అయితే తమ పార్టీకి చెందిన సభ్యులెవరూ ఇప్పుడు ఎపి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడంలేదు. తాజా నిర్ణయంతో మండలిలోనూ అవకాశం కోల్పోతారు. ఇద్దరు సభ్యులకోసం బిజెపి అధినాయకత్వం ఆలోచన చేయదని, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను వరిగణలోకి తీసుకుంటుందని నిపుణులంటున్నారు. తమిళ నాడులో ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా మండలిని రద్దుచేస్తూ తీర్మానం పంపగా, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎపి ముఖ్యమంత్రికి కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాల ఆధారంగానే దీనిపై నిర్ణయం వెలువడుతుందని వారి అంచనా. ఇప్పటినుంచి రెండేళ్లు పడుతుందని టిడిపి వాదిస్తుంటే, అంత సమయం పట్టదని, బిజెపి జగనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఎపి మండలిరద్దు తీర్మా నంపై కేంద్రస్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read