జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టిడిపి పార్లమెంటరీ పార్టీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన భేటికి టిడిపి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 9అంశాలపై ఈ భేటిలో చర్చించారు. రాజధాని అమరావతి మార్పు, 3 రాజధానుల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వ విధ్వంసకర చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు, దిగజారిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ఉపాధి హామీ నిధుల పెండింగ్, దారి మల్లింపు, పోలవరం పనులు ఆగిపోవడం, కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి చేస్తున్న ప్రలోభాలు- రాస్తున్న లేఖలు, మీడియా పై దాడులు- ఆంక్షలు- అక్రమ కేసులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్లేలు, ఇతర నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, జాతీయ అంశాలైన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జన పట్టిక తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, అవినీతి, అక్రమాలు, విధ్వంస కార్యక్రమాలు, కేంద్ర నిధుల సద్వినియోగంలో వైఫల్యం, ఉన్న నిధులను ఖర్చు చేయలేక పోవడం, అప్పులివ్వలేమని బ్యాంకులే లేఖలు రాయడం, ప్రభుత్వ విశ్వసనీయతకే తూట్లు పెట్టడం, పెట్టుబడులన్నీ వెనక్కి పోవడం తదితర అంశాలన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఈ భేటిలో చర్చించిన అంశాలు: 1) ‘‘ టిడిపి పాలనలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, వైసిపి ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఈ 8నెలల్లో అట్టడుగుకు దిగజారింది. ఈ వాస్తవాలను ఇటీవల కొన్ని సర్వేలే బైటపెట్టాయి. పెరిగిన అప్పులు, తగ్గిన ఎయిర్ ట్రాఫిక్, తగ్గిన వాహనాల కొనుగోళ్లు, తగ్గిన విద్యుత్ వినియోగం వైసిపి ప్రభుత్వ చేతగాని తనాన్ని స్పష్టంగా బైటపెట్టాయి. 2).భారత దేశ మ్యాప్ లో ఏపి రాజధాని అమరావతి లేకపోవడం కేంద్రం దృష్టికి తెచ్చి, పార్లమెంటులో పట్టుబట్టి సాధించారు, మళ్లీ అమరావతిని మ్యాప్ లో పెట్టించారు, అందుకు టిడిపి ఎంపిలను అభినందిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దానిపై కేంద్రానికి ధన్యావాదాలు కూడా తెలిపాం. అదే స్ఫూర్తి ఇప్పుడు టిడిపి ఎంపిలు మళ్లీ చూపాలి. రాజధాని అమరావతి పరిరక్షణకు జెఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాజ్యాంగ వ్యవస్థల ప్రతినిధులకు వినతులు ఇవ్వాలి. జెఏసి ఆధ్వర్యంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతు కూలీ సంఘాల ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న దుర్మార్గ పాలన గురించి ప్రధానికి, కేంద్రమంత్రులకు, రాజ్యాంగ వ్యవస్థల పెద్దలకు వినతులు ఇవ్వాలి. మానవ హక్కుల కమిషన్ ,ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ తదితర రాజ్యాంగసంస్థల ప్రతినిధులను కలిసి వివరించాలి.

3).కౌన్సిల్ రద్దు నిర్ణయం గురించి జాతీయ పార్టీల నాయకులకు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. గతంలో రద్దు అయిన కౌన్సిల్ పునరుద్దరణ కోసం 5రాష్ట్రాలు, కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మరో 5రాష్ట్రాలు అడుగుతుంటే ఉన్న కౌన్సిల్ ను రద్దు చేయడం వైసిపి తుగ్లక్ చర్య. 8నెలల్లో 38బిల్లులను ఆమోదించారు, 2బిల్లులకు సవరణలు ప్రతిపాదించారు, ఇప్పుడొచ్చిన 2బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపి ప్రజాభిప్రాయం సేకరించాలని సూచించారు. దానికే అక్కసు పట్టలేక కౌన్సిల్ రద్దు చేయాలని తీర్మానం ఆమోదించి పంపడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, పట్టభద్రులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ వైసిపి ప్రభుత్వ తుగ్లక్ చర్యలను నిరసిస్తున్న విషయాన్ని ప్రస్తావించాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి దీనిపై గతంలో చేసిన సూచనలను గుర్తు చేయాలి. 4).నరేగా నిధుల సద్వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని ఈ 8నెలల్లోనే అట్టడుగుకు దిగజార్చారు. గత ఏడాది ఈ పాటికి రూ 6వేల కోట్ల నిధులు వ్యయం చేయగా ఈ ఏడాది అందులో సగం వ్యయం చేయలేక పోయారు. ఉపాధి పనులన్నీ నిలిపేశారు, గతంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిపేశారు. కొత్త పనులకు నిధులిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు

5).కండిషనబుల్ బెయిల్ పై ఉన్న ముద్దాయి తమ కేసుల విచారణలో ఏ దర్యాప్తు అధికారి కావాలో ఏవిధంగా లేఖలు రాస్తారు..? తన హోదా దుర్వినియోగం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా ఇది..? సాక్షులను ప్రభావితం చేయరాదు, విచారణాధికారులను ఇబ్బందుల పాలు చేయరాదు అని బెయిల్ షరతులలో లేదా..? షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న ముద్దాయి ఆ షరతులను ఉల్లంఘిస్తూ దర్యాప్తు అధికారులపై లేఖలు రాయడం ఏ సంకేతాన్ని పంపుతోంది..? వీటన్నింటి గురించి ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలి. 6)మీడియా ప్రతినిధులపై దాడులు, మీడియా ప్రసారాలపై ఆంక్షలు, జీవో 2430 తీసుకురావడం, తునిలో రిపోర్టర్ హత్య, చీరాలలో రిపోర్టర్ పై హత్యాయత్నం, నెల్లూరులో ఎడిటర్ ను, మైనారిటి రిపోర్టర్ ను వైసిపి ఎమ్మెల్యే చంపుతానని బెదిరించడం, మరో వైసిపి ఎమ్మెల్యేపై హత్య కేసు నమోదు కావడం, విద్యార్ధులను ఆరుబైట ఎండలో నిలబెట్టి, పాఠశాల తరగతి గదుల్లో పోలీసులు నివాసం ఉండటంపై కథనాలు ఇచ్చిన మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెట్టడం, అసెంబ్లీ ప్రసారాలకు 3ఛానళ్లను బ్యాన్ చేయడం, ఎంఎస్ వోలను రాష్ట్ర మంత్రులే బెదిరించి రాష్ట్రవ్యాప్తంగా 2ఛానళ్ల ప్రసారాలు బంద్ చేయించడం తదితర అంశాలన్నీ జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి.

జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్ట్ లు చిక్కు ఎదురు అవ్వటంతో, ఇప్పుడు ఆయన తెలంగాణా హైకోర్ట్ గడప తొక్కారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినిహాయింపు ఇవ్వాలని కోరుతూ, ఆయన తెలంగాణా హైకోర్ట్ మెట్లు ఎక్కారు. ఈ మేరకు ఆయన నిన్న హైకోర్ట్ లో పితీశంవ్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై ఈ రోజు వాదనలు జరిగాయి. అయితే ఈ కేసు పై, సిబిఐ తమకు కౌంటర్ వెయ్యటానికి టైం కావాలని చెప్పటంతో, ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 6 లోపు తమకు కౌంటర్ ఇవ్వాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఇదే సందర్భంలో, సిబిఐకి హైకోర్ట్ మరో ఆదేశాలు కుడా ఇచ్చింది. జగన్ వ్యక్తిగత మినహాయింపు కేసు హైకోర్ట్ లో ఉందని, సిబిఐ కోర్ట్ కు చెప్పండి అంటూ, హైకోర్ట్ సిబిఐ ని ఆదేశించింది. అంటే దీని ప్రకారం, హైకోర్ట్ ల కేసు తేలే వరకు, జగన్ సిబిఐ కోర్ట్ కు వెళ్ళనవసరం లేదు. మొన్న జరిగిన వాయిదాలో, సిబిఐ కోర్ట్, ఏ1 గా ఉన్న జగన్, రేపు వాయిదాకి అంటే, జనవరి 31న వాయిదాకు కచ్చితంగా రావాలని, లేకపోతే సరైన ఆక్షన్ తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, అవసరం లేదు అని జగన్ తరుపు న్యాయవాదులు భావిస్తున్నారు.

bail 28012020 23

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న తాను ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం అవసరమని అంతే కాకుండా విజయవాడ నుండి హైదరాబాద్ లో ఉన్న సీబీఐ కోర్టు కి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి హోదా లో హాజరవ్వడానికి 60 లక్షలు అవుతోంది.అంత ప్రజాధనం వృధా కావడం అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మంచిది కాదు అని జగన్ తరపు న్యాయవాది సిబిఐ కోర్టులో అప్పీల్ కి వెళ్లడం దానిని సిబిఐ కోర్టు తిరస్కరించడం అందరికి విధితమే.ఈ నేపథ్యంలో హై కోర్టులో మరో సారి బలంగా వాదనలు వినిపించడానికి జగన్ తరపు న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు.త్వరలో మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి అవుతుంది.ఒక వేళ కోర్టు కేసులతో ఆలస్యం అయినా సీఎం క్యాంపు కార్యాలయం వరకూ మొదటి దశ లో మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారు.

bail 28012020 3

ఇప్పుడు ఇదే అంశం సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది అని జగన్ తరపు న్యాయవాదులు భావిస్తున్నారు.ఈ సారి మరింత బలంగా వాదనలు వినిపించడానికి సిద్ధం అవుతున్నారు.విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లడానికి 275 కిలోమీటర్లు.పూర్తి స్థాయి యంత్రంగా తో ముఖ్యమంత్రి వెళ్ళడానికి 60 లక్షలు అవుతుంది.ఇప్పుడు ఆయన కార్యాలయం విశాఖ కు మారింది విశాఖపట్నం నుండి హైదరాబాద్ సీబీఐ కోర్టు మధ్య దూరం 622 కిలోమీటర్లు.అంటే సుమారుగా ఇప్పుడు 1 కోటి 25 లక్షలు అవుతుంది.నెలకి సుమారుగా 5 కోట్లు సంవత్సరానికి 60 కోట్లు,5 ఏళ్లకు గాను 300 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది.ముఖ్యమంత్రి జగన్ సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది అంటూ మండలి ని రద్దు చేసారు.ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు గుర్తించి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చేలా హై కోర్టు లో కొత్త వాదనలతో అప్పీల్ కు వెళ్లాలి అని జగన్ తరపు న్యాయవాదులు నిర్ణయించారు.ఈ వాదనతో ఖచ్చితంగా మినిహాయింపు వస్తుంది అని జగన్ తరపు న్యాయ వాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. దేశం మొత్తం, మన వైపు తిప్పుకునేలా చేస్తాను అంటున్న జగన్, నిజంగానే, దేశం మొత్తం మన గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు. విద్యుత పీపీఏల విషయం దగ్గర నుంచి, చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు దాకా, అన్నీ అయోమయ ప్రకటనలే. వీటి పై, జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ను తుగ్లక్ అంటూ సంబోధిస్తూ, ఆర్టికల్స్ వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం, ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎవరి మాటలు పట్టించుకోవటం లేదు. ఎవరు ఏది చెప్పినా, వాళ్ళు చంద్రబాబుకి అనుకూలం అనే ముద్ర వేసి, తాను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా, ప్రజలను నమ్మించే పనిలో ఉన్నారు. ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా, జగన్ మాటకు భజన చేసే పరిస్థితి. దీంతో, తాను తీసుకున్న నిర్ణయం రైట్ అనే విధంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాజగా మండలి రద్దు విషయంలో కూడా అదే జరిగింది.

kesavarao 28012020 2

తన నిర్ణయాన్ని సమర్ధించని, మండలి అవసరం లేదు అంటూ, జగన్ నిర్ణయం తీసుకుని, ఏకంగా మండలినే రద్దు చెయ్యటం సంచలనంగా మారింది. అయితే మండలి రద్దు పై, ఖర్చు అంశాన్ని జగన్ తెర మీదకు తీసుకు వచ్చారు. మండలి సమావేశాలకు, ఏడాదికి 60 కోట్లు అవుతాయని, మనకు ఇది అవసరమా అనే చర్చ పెట్టరు. అయితే దీని పై విపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ప్రతి వారం కోర్ట్ కు వెళ్ళటానికి, 60 లక్షలు అవుతాయి అన్నారు, అంటే 5 ఏళ్ళకు 150 కోట్లు అవుతాయి, మీరు సియంగా అవసరమా అంటూ కౌంటర్ ఇచ్చాయి. అయితే, ఇదే అంశం పై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జగన్ శాసనమండలి రద్దు, దానికి ఖర్చు సాకుగా చెప్పటం పై, తెలంగాణా వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

kesavarao 28012020 3

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అయిన కె.కేశవరావు, జగన్ మండలి పై తీసుకున్న నిర్ణయం పై స్పందించారు. మండలి ఖర్చు వృధా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ, "అబ్సల్యూట్ నాన్సెన్స్" అంటూ ఘాటుగా స్పందిన్కాహారు. పెద్దల సభ రాష్ట్రాలకు అవసరం అని కేశవరావు అన్నారు. గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేస్తే, తాము అందరం పోరాడామని గుర్తు చేసారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కూడా, ఏపిలో జరుగుతున్న మూడు రాజధానులు, మండలి రద్దు పై విలేఖరులు స్పందన కోరగా, ఆ పంచాయతీ గురించి మనకెందుకు అంటూ, వ్యాఖ్యానించారు. మొత్తానికి, జగన్ తీసుకున్న నిర్ణయం పై, తనకు సన్నిహితంగా ఉండే పార్టీలే, విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్మో హన్ రెడ్డికి ఆత్రం చాలా ఎక్కువని విమర్శించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందిన రోజే, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారని నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు మండలి రద్దు విషయంలో కూడా ఆత్రం ఎక్కువైపోయిందని విమర్శించారు. 4 నెలలు ఆగితే మండలిలో వైకాపా బలం పెరిగేదని గుర్తు చేశారు. బలం ఉంది కదా అని తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో, 3 రాజధానుల బిల్లును మండలి అడ్డుకోవడంతోనే ఏకంగా రద్దు చేసారని అన్నారు. నిజానికి సెలెక్ట్ కమిటీ పెండింగ్ లో ఉండగా రద్దు చేయడం సాధ్యపడుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమేనని నారాయణ వ్యాఖ్యానించా రు. అసలు మండలి రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు.

narayana 28012020 2

జగన్ వైఖరి వల్ల రాజకీయ పార్టీలకంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ప్రభుత్వాలు సైతం ఐదేళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోయాయని, అధిక బలం ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. శాసన మండలి లేదా విధానమండలి ఉండాలా, వద్దా అన్న విషయంలో సీపీఐ వైఖరి మేమే అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దు నిర్ణయం స్వార్ధ ప్రయోజనాల కోసం జరిగింది కాబట్టి ఖండిస్తున్నామని నారాయణ వ్యాఖ్యానించారు. మండలి ఉండాలి అని సీపీఐ ఎప్పుడూ కోరలేదని గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో జగన్ నిర్ణయాలతో వ్యవస్థలకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించా రు. అమరావతి అభివృద్ధి జరిగితే తనకు పేరు రాదని, తన మార్కు ఉండదన్న ఉద్దేశంతోనే రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

narayana 28012020 3

మొత్తానికి అమరావతిలో పరిస్థితి దారుణంగా తయారయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలి కానీ మూడుముక్కలాట తగదని నారాయ ణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అని జనాన్ని నమ్మిస్తూ పాలనను వికేంద్రీకరించడం సరికాదని హితవు పలికారు. విశాఖపట్నం నగరాన్ని కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, ఉన్నదాన్ని పాడుచేయకుండా ఉంటే చాలని నారాయణ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ముఖ్య మంతైన జగన్‌ను తాను తొలుత అభినందిస్తూ సమర్థ వంతంగా పనిచేస్తారని భావించానని, కానీ పరిస్థితి చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక భారతీయ జనతా పార్టీ మద్దతు ముఖ్యంగా అమిత్ షా భరోసా ఉందన్న అనుమానం నారాయణ వ్యక్తం చేశారు.. బీజేపీ పెద్దల మద్దతు లేకుండా ఇలాంటి నిర్ణయాలు జగన్ తీసుకుంటారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యా నించారు. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ తీర్మానాలు చేస్తే సరిపోదని, తదుపరి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు. అందుకే , వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని నారాయణ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read