జగన్ మోహన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను, పేర్లు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. నా పై వ్యతిరేక వార్తలు రాస్తే, కోర్ట్ కి ఈడుస్తా అని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, పది రోజుల క్రిందట దీనికి సంబంధించి, క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎవరైనా , ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే, వారి పై కోర్ట్ కు వెళ్ళాలని , సంబంధిత శాఖలను ఆదేశించారు. అయితే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి మరింత దూకుడుగా జగన్ పై కధనాలు రాస్తుంది. మరి ఇవి నిజంగా తప్పు ఉంటే, అవి తప్పుడు కధనాలు అయితే, జగన్ కోర్ట్ కు వెళ్తారా ? వైసీపీ శ్రేణులు మాత్రం, నిన్న ఏబిఎన్ లో, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కధనం పై, కోర్ట్ కు వెళ్ళాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరి, జగన్ ఆ నిర్ణయం తీసుకోగలరా ? ఇప్పటికే ఏబీఎన్ ని కేబుల్, ఫైబర్ లో బ్యాన్ చేసి, టీడీసాట్ చేత ఏపి ప్రభుత్వం చీవాట్లు తింది. ఇలాంటి సందర్భంలో, జగన్ మీద ఇంత డేరింగ్ కధనాలు వేస్తున్న రాధాకృష్ణ పై, జగన్ కు ఆక్షన్ తీసుకునే చాన్స్ ఉందా అనే చర్చ జరుగుతుంది.

jagan 27102019 2

ప్రతి శనివారం ఎబిఎన్ లో, వచ్చే వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. అయితే, ఈ వీకెండ్ కామెంట్ లో, కేసిఆర్ కు, జగన్ పై ఉన్న అభిప్రాయం ఇది అంటూ, ఆర్కే చెప్పుకొచ్చారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ తన ఆంతరంగికులతో జరిపిన సమావేశంలో, జగన్ కు చాలా తక్కువ భవిష్యత్తు ఉందని, త్వరలోనే జగన్ సీన్ అయిపోతుందని, మరో ఆరు నెలల తరువాత ఎప్పుడైనా, జగన్ కు జైలు తప్పదని, తన వద్ద దానికి సంబంధించి స్పష్టమైన సమాధానం ఉందని చెప్పారని, ఆర్కే చెప్పారు. సిబిఐ చార్జిషీట్ల పై, త్వరలోనే రోజు వారీ విచారణ ప్రారంభం అవుతుందని, అదే కనుక జరిగితే, అప్పుడు సిబిఐ, జగన్ బెయిల్ రద్దు చేయమని కోరుతుందని, అప్పుడు కోర్ట్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసిఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పారంట..

jagan 27102019 3

బెయిల్ కనుక రద్దు అయితే, జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుందని, కేసీఆర్ అభిప్రాయ పడ్డారట. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి, ప్రగతి భవన్ కు వచ్చి, కేసీఆర్ ని కలసిన సందర్భంలో, ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, బెయిల్‌ రద్దు కాకుండా మార్గాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక ప్రముఖ న్యాయవాదితో తాము ఇద్దరం చర్చలు జరిపమాని కేసిఆర్ చెప్పినట్టు చెప్తున్నారు. అయితే ఆ న్యాయవాది మాత్రం, మొత్తం సిబిఐ చేతిలో ఉందని, సిబిఐ బెయిల్ రద్దు చెయ్యాల్సిందే అని గట్టిగా పట్టుబడితే, కోర్ట్ దానికే అంగీకరిస్తుందని చెప్పారట. అందుకే జగన్ మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక పోయినా, అన్ని పధకాలు వెంట వెంటనే ప్రారంభిస్తూ, లబ్దిదారులకు చేరక పోయినా, ప్రచారం చేసుకుంటున్నారని, కేసీఆర్ అభిప్రాయ పడ్డారట. అయితే ఇంత ఓపెన్ గా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య జరిగిన విషయాన్ని ఆర్కే బయట పెట్టరు. ఇది అబద్ధం అయితే, మరి జగన్ గారు కేసు పెడతారా ? ఆర్కే ని కోర్ట్ కు ఈడవగలరా ? చూద్దాం...

తెలుగుదేశం నాయకులు, సానుభూతిపరులు, కార్యాకర్తల పై దాడులు కొనసాగుతున్నాయి. గత అయుదు నెలలుగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అనేక ఒత్తిడులు ఎదురు అవుతున్నాయి అని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాడులు చెయ్యటం, ఊరి నుంచి వెళ్ళగొట్టటం, ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టటం, వ్యాపారాలు ఇబ్బంది కలిగించటం, పంటలు నరకటం, ఇళ్ళకు అడ్డుగా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం ఇలా అనేకం చేసారు. దీని పై తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేసినా ఉపయోగం లేదు. దీంతో, తెలుగుదేశం పార్టీ, జాతీయ మానావ హక్కుల సంఘం దగ్గరకు కూడా వెళ్ళింది. అక్కడ నుంచి ఒక పోజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు పై, సమగ్ర దర్యాప్తు జరిపి, ఆరు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలి అంటూ, జాతీయ మానవ హక్కుల సంఘం, చీఫ్ సెక్రటరీ, డీజీపీని కూడా కోరింది. అయితే, ఇంత ఒత్తిడి ఉన్నా కూడా, వైసిపీ నేతలు ఆగటం లేదు. అధికారం ఉందనే ధీమాతో, ఇంకా ఎక్కువ కొనసాగిస్తున్నారు.

atp 27102019 2

తాజాగా, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితే నెలకొంది. వెంకటాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మధ్య గత కొంత కాలంగా ఉన్న స్థలం వివాదం కాస్త , పార్టీ రంగు పులుముకుంది. ఈ స్థలం విషయంలో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. అయితే, అధికారం మాది అని చెప్తూ, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. నాగరాజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా, బండ రాళ్ళు పాతారు. అయితే, విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు, ఆ బండలు పడగొట్టటానికి, దగ్గరలోని గ్రామాల నుంచి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

atp 27102019 3

అయితే తెలుగుదేశం నాయకుడి స్థలం కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్ళు తీపించకుండా, మమ్మల్ని అడ్డుకోవటం ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితితులు రోజు రోజుకీ దిగజారి పోతుంటే, డీజీపీ గారు మాత్రం, అంతా బాగుంది అని చెప్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. నాలుగు నెలల క్రిందట, ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్ళకు వెళ్ళకుండా, అడ్డంగా వైసీపీ వర్గీయులు గోడ కట్టారు. దీంతో టీడీపీ సానుభూతిపరుల ఇళ్ళకు దారిలేకుండా పోయింది. అది సాక్షాత్తు హోం మంత్రి సొంత నియోజకవర్గం అయినా, ఇప్పటి వరకు ఆ గోడ తియ్యలేదు. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా ఇళ్ళ మీదే పడ్డారు.

మంత్రి బొత్స సత్యనారాయణకి తెలుగుదేశం పార్టీ నేతలు, 25 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాసారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డొక్కా మాణిక్యవరప్రసాదరావు , ఈ ప్రశ్నలు సంధించారు. ఇది లేఖ "ఒక సామాజిక వర్గం కోసమని, ముంపు ప్రాంతమని.. ప్రజారాజధానిపై రోజుకొక నింద వేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే మీరు నరుకుతున్నారు. 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు, ఉద్యోగాలు కల్పించగల రాజధాని ఆంధ్రులకు అవసరం లేదా.? హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు ధీటుగా ఆంధ్రులకు రాజధాని లేకుంటే ఇక్కడకు వచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు.? ప్రజా రాజధానికి కుల తత్వం, ప్రాంతీయ తత్వం అంటగట్టి ప్రజల్ని రెచ్చగొట్టడం అంటే మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా.? ఈ కింది ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు సూటిగా సమాధానం చెప్పగలరా.? 1. 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అందులో రూ.5,674 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 5,674 కోట్లు మొత్తం ఖర్చయితే పీటర్‌ కమిషన్‌ పేరుతో లీకైన నివేదికలో రూ.30వేల కోట్లు రాజధానిలో దుబారా అయిందని చెప్పడం పచ్చి అబద్దం కాదా? పీటర్‌ వైఎస్‌ మేనత్త కుమారుడనేది వాస్తవం కాదా? అమరావతిపై అపోహలు సృష్టించడానికి పీటర్‌ని నియమించడం వాస్తవం కాదా?

2. చంద్రబాబు ప్రారంభించిన సైబరాబాద్‌ నగర నిర్మాణాన్ని వైఎస్‌ ప్రభుత్వం అడ్డుకోలేదు. నిర్మాణాన్ని కొనసాగించారు. కనుకనే నేడు సైబరాబాద్‌ 13 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. 2018-19లో లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు చేసింది. తెలంగాణ బడ్జెట్‌కు ఒక్క హైదరాబాద్‌ నగరమే 60 శాతంపైగా ఆదాయం సమకూరుస్తున్నది. హైదరాబాద్‌ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు. దాంతో తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధిలో ఇది కీలకంగా ఉన్నది వాస్తవం కాదా? అమరావతి అభివృద్ధిని నాశనం చేయడమంటే 13 జిల్లాల ఏపీ అభివృద్ధికి గండికొట్టడం కాదా? 3. అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని వైసీపీ నాయకులు, మంత్రులు పదేపదే అబద్దాలు చెబుతున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333, హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు ఫర్నీచర్‌, సెంట్రల్‌ ఏసీ, 50 ఎకరాల అభివృద్ధి కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్‌ అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు అయింది. ఈ లెక్కలన్నీ బొత్స గారి వద్ద ఉన్నా, చ.అ.కు టీడీపీ ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని పదే పదే అబద్దాలు ఎందుకు చెబుతున్నారు? మీ రివర్స్‌ డెవలప్‌మెంట్‌ విధానాల వైఫల్యం కప్పిపెట్టుకోవడానికి కాదా?

4.హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు నగరాలకు ధీటైన రాజధాని ఆంధ్రులకు లేకపోతే ఏపీలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయం ఎలా సమకూరుతుంది? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్‌ నగర ఆదాయమే సింహ భాగం ఉన్నది వాస్తవం కాదా? హైదరాబాద్‌ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాలన్నింటి అభివృద్ధి జరుగుతోందనేది వాస్తవం కాదా? 5.శివరామకృష్ణన్‌కు వచ్చిన, సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం అత్యధికులు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరింది వాస్తవం కాదా? విజయవాడ-గుంటూరు-అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండాలని 2,191 మంది కోరగా, విశాఖకు 507, కర్నూలుకు 360, తిరుపతికి 113, దొనకొండకు 116 అభిప్రాయాలు వచ్చింది వాస్తవం కాదా? రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున ఉన్న అమరావతికన్నా మించినది మరేమున్నది? శాతవాహనులు, వాసిరెడ్డివారు, నాగార్జునా చార్యులకు కేంద్రంగా, రాజధానిగా ఉన్న అమరావతి నేడు జగన్‌ రెడ్డి గారికి ఎందుకు రుచించడంలేదు. కుల తత్వం, ప్రాంతీతత్వం లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి పాలకులుగా ఉండే అరత ఉన్నదా?

6.అమరావతిలో రాజధానిని జగన్‌ బలపరిచింది వాస్తవం కాదా? రాజధానికి 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని జగన్‌ మాట్లాడింది అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నది వాస్తవం కాదా? నేడు అందుకు విరుద్ధంగా మీరెందుకు మాట్లాడుతున్నారు? 7.ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు రాజధానికి అతి తక్కువ వడ్డీపై మంజూరు రూ.5వేల కోట్ల రుణం మీ అసమర్ధత వల్ల రద్దయినది వాస్తవం కాదా? 8.రాజధాని నిర్మాణాలన్నీ నిలుపుదల చేయడం వల్ల, ప్రజా వేదికను కూల్చి రాజధాని ప్రాంత ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడం వల్ల ఒక్క రాజధాని భూముల విలవే లక్ష కోట్లు పడిపోయింది వాస్తవం కాదా? ఈ ప్రభావంతో రాష్ట్రమంతా భూముల విలువ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి పడిపోయింది నిజం కాదా? హైదరాబాద్‌ భూముల విలువ 30 శాతం పెరిగింది వాస్తవం కాదా? 9.హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ జగన్‌ గారికి, వారి అనుచరులకు భూములున్నందువల్ల రేట్లు పెంచుకునేందుకు అమరావతిని డ్యామేజ్‌ చేస్తున్నారా? లేక దొనకొండలో వారి భూములు అమ్ముకొనేందుకు అమరావతిని దెబ్బతీస్తున్నారా? లేక హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి ఉండరాదనే కేసీఆర్‌ కోరిక నెరవేరుస్తున్నారా? 10. అమరావతి ముంపు ప్రాంతమని మీరు చెప్పింది అబద్దం కాదా? అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, ఇస్రో నిర్ధరించింది నిజం కాదా? 1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పేరా 76లో చెప్పింది వాస్తవం కాదా?

11. బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలిచ్చి ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ చేశారనే మీ ఆరోపణ పచ్చి అబద్దంకాదా? బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదని రుజువైంది వాస్తవం కాదా? 12. అమరావతిలో ఫౌండేషన్‌ ఖర్చులు హైదరాబాద్‌, చెన్నై కన్నా తక్కువ అని ఇంజనీరింగ్‌ నిపుణులు ప్రకటించింది నిజం కాదా? అమరావతిలో ఖర్చు ఎక్కువ అన్న మీ ప్రకటన అబద్దం కాదా? అమరావతిలో రాకీ స్టార్టా ఎల్‌ 11 మీ. డెప్త్‌, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్‌ కెపాసిటీ ఉన్నది. హైదరాబాద్‌ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్‌ చేయాలి. బేస్‌ మెంట్‌ 7.1 మీటర్లు, బ్లాస్టింగ్‌ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్‌, దీనికి తోడు కృష్ణా, గోదావరి నీటి సరఫరా ఖర్చులు, చెన్నైలో బేరింగ్‌ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్‌ టన్నులే. ఫైల్‌ ఫౌండేషన్‌ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి. రాజధానుల సాయిల్‌ స్ట్రెక్త్‌ కు సంబంధించి మద్రాసు ఐఐటీ నిపుణుల అంచనాలకు విరుద్దంగా మంత్రి బొత్స చేత జగన్‌ రెడ్డి గారు అబద్దాలు చెప్పిస్తున్నది వాస్తవం కాదా?

13. అమరావతి స్వయం ఆధారిత అభివృద్ధి (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) ప్రాజెక్ట్‌. అమరావతిలో రైతులకు ఇవ్వగా ప్రభుత్వానికి మిగిలిన భూముల విలువ లక్ష కోట్లు అనేది వాస్తవం కాదా? ఇందులో 50 వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్‌ కు దీటైన రాజధాని అంధ్రులకు ఏర్పడుతుందనేది నిజం కాదా? రాజధాని నుంచే రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు జమ కావడం నిజం కాదా? రాజధాని అమరావతి. బహుళ ప్రయోజనకారి కాదా.? 14. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ అబద్దాలు చెప్పడమే కాక కుల చిచ్చు పెట్టడం మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా? ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం జగన్‌ గారికి ఇష్టంలేదా? రాజధానిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్న మాట నిజం కాదా? 29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. రెడ్డి, కమ్మ జనాభా కుడి ఎడమగా ఉన్నది వాస్తవం. తుళ్లూరు, తాడేపల్లిలలో రెడ్లు, కమ్మవారికి భూములు సమానంగా వున్నది నిజం కాదా? ఈ వాస్తవాలు కప్పిపెట్టి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? విజయవాడ, గుంటూరులలో బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం జనాభా గణనీయంగా ఉన్నారు. అమరావతి కులాల కాస్మాపాలిటిన్‌ ప్రాంతం అనేది నిజం కాదా?

15. రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదనే మీ పార్టీ విమర్శలు పచ్చి అబద్దాలు కాదా? సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు శాశ్వితం కాదా? ఇటుకలు లేకుండా నిర్మించారా? 16. అమరావతిలో గ్రాఫిక్స్‌ రోడ్లపై తిరుగుతున్నారా? 17. 29 గ్రామాల పేదలకు నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్‌ యేనా? 18. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్‌ గానే ఉన్నాయా? 19. హేపీనెస్ట్‌ కు ఎన్‌ఆర్‌ఐల స్పందన కూడా మీకు గ్రాఫిక్స్‌ లా కనిపిస్తోందా? 20. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీలు, ఎక్సెల్‌ ఆర్‌ఐ, ఎయిమ్స్‌ నిర్మాణాలు గ్రాఫిక్సేనా? 21. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ గ్రాఫిక్సేనా? 22. రైతులు రాజధాని కోసం 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన అంశంగా హార్వార్డ్‌ విశ్వవిద్యాలయంలో చర్చించలేదా? 23. రాజధానిలో 8వేల కోట్లతో పనులు చేసింది వాస్తవం కాదా? అందులో 1500 కోట్లు కేంద్రం ఇచ్చింది నిజం కాదా? 24. 22.10.2019 నాటికి ప్రధాన మంత్రి అమరావతికి శంకుస్థాపన చేసి 4 ఏళ్లు గడిచింది వాస్తవం కాదా? కొత్త రాజధానులన్నింటికన్నా అమరావతిలో నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంతో ఎక్కువగా ఉన్నదనేది వాస్తవంకాదా? 25. స్విస్‌ ఛాలెంజ్‌ కేసు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ హైకోర్టు ప్రాంతంలో కనీసం టీ కూడా లభించడంలేదు. జడ్జీల క్వార్టర్లు ఇప్పటిదాకా నిర్మించలేదు. పనుల జాప్యంతో హైకోర్టులో సమస్యలు. పనులు మీరు చేస్తారా? ఆదేశాలు ఇవ్వాలా? అని వ్యాఖ్యానించారు. ఇది జగన్‌ ప్రభుత్వ అసమర్థతకు, ద్రుక్పద లోపానికి నిదర్శనం కాదా?

తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను, అధికార పార్టీ, ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎలాగైనా టిడిపిని ఇబ్బంది పెట్టాలని, ఇప్పుడు గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసారు. ఇందులో భాగంగా, వారి ఎన్నిక చెల్లదు అంటూ, వైసీపీ నేతలు కోర్ట్ కు వెళ్లారు. దీంతో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలకు నిన్న హైకోర్టు నోటీస్ జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు టిడిపి ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావులకు కూడా హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. గల్లా జయదేవ్‌ తో పాటుగా, ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావు ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో వైసీపీ నేతలు దాఖలైన పిటిషన్‌లో భాగంగా హైకోర్ట్ వీరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబుతో సహా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు, హైకోర్ట్ ఇలాంటి నోటీసులే ఇచ్చింది. చంద్రబాబు సియంగా ఉంటూ జీతం తీసుకుని, అది చూపించలేదు అంటూ, ధాఖలైన పిటీషన్ పై, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.

gadde 26102019 2

ఇప్పుడు తాజగా, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, నిన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావుకు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసారు. మొన్న జరిగిన ఎన్నికల్లో, మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా 4200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా జయదేవ్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని వైసిపి ఆరోపిస్తుంది. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో మతలబు జరిగింది అంటూ మోదుగులు ఆరోపిస్తున్నారు.

gadde 26102019 3

ఈ విషయం పైనే కోర్ట్ కు వెళ్లారు. పోస్టల్ బ్యాలట్ విషయంలో కలెక్టర్ సరిగ్గా వ్యవహరించలేదని, మోదుగుల వాదన. అందుకే తాను ఓడిపోయానని, హైకోర్ట్ కు ఇచ్చిన పిటీషన్ విషయంలో, హైకోర్ట్, గల్లాకు నోటీసులు జరీ చేసింది. ఇక పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలుపుని కూడా సవాల్ చేస్తూ, వైసీపీ నాయకుడు సత్యనారాయణ మూర్తి తరుపున వాసుదేవ రావు హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. అలాగే, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ మూడు పిటీషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. దీని పై గల్లా, ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావు , హైకోర్ట్ కి సమాధానం ఇవ్వనున్నారు.

Advertisements

Latest Articles

Most Read