తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రా వారిని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమ సమయంలో ఇష్టం వచ్చినట్టు తిట్టిన తిట్లు అందరికీ గుర్తు ఉన్నాయి. అయితే, ఉద్యమ వేడిలో అలా అన్నారు అని చెప్పే వారు ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో కూడా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించ పరుస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక థర్డ్ గ్రేడ్ స్టేట్ అని, దాంతో మా రాష్ట్రాన్ని పోల్చవద్దు అంటూ చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా పై, పోలవరం పై కూడా కేసీఆర్ మాటలు తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రం, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. అందుకే కేసీఆర్ తో కలిసి, మొన్న ఎన్నికల్లో ఆయన దగ్గర నుంచి అన్ని సహాయాలు తీసుకుని పని చేసారు. చివరకు గెలిచి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసారు.

jagan 28092019 2

అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన ఒక్క లాభం లేదు కాని, తెలంగాణాకు మాత్రం అన్నీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. సెక్రటేరియట్ భవనాలు ఇవ్వటం దగ్గర నుంచి, గోదావరి నీళ్ళు మన డబ్బులతో తెలంగాణాకు తరలించటం దాకా విషయం వెళ్ళింది. అయితే ఇదే సమయంలో ఉమ్మడి ఆస్తుల విభజన కాని, 6 వేల కోట్ల విద్యుత్ బకాయలు కాని, మాట్లాడే వారే లేదు. ఇలాంటి సందర్భంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు జగన్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఈ నెల 30న కేసిఆర్ తో కలిసి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ధరిస్తారని సమాచారం ఇచ్చారు. అలాగే తిరుమలలో జరిగీ కొన్ని అభివృద్ధి పనులకు కూడా, కేసిఆర్ చేత శంకుస్థాపన చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

jagan 28092019 3

అయితే జగన్ తో పాటుగా, కేసీఆర్ సైతం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు శ్రీవారికి పట్టు వస్త్రాల సమయం లో పట్టు వస్త్రాలు ఇవ్వటం ఆనవాయితీ. అయితే ఇక్కడ, పక్క రాష్ట్ర సియం పట్టు వస్త్రాలు ఇవ్వటం ఏంటి అనే వాదన వినిపిస్తుంది. దీని పై శ్రీవారి భక్తులే కాదు, టిడిపి కూడా అభ్యంతరం చెప్తుంది. ‘‘తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ కేసీఆర్‌తో కలిసి ఇవ్వటమేంటి? టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా? తెలంగాణ సీఎం చేతిలో ముఖ్యమంత్రి జగన్‌ కీలుబొమ్మలా మారుతున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఎంత మిత్రత్వం ఉన్నా రాష్ట్ర హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఆంధ్ర భూభాగంలోనే జరగాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి... స్వయానా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు, జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. సరిగ్గా ఎన్నికల ముందు, వివేక చనిపోవటం పెను సంచలనం అయ్యింది. అయితే ఆయన చనిపోయిన తరువాత, సన్నిహితులు చేసిన ప్రకటనలే, ఈ సంచలనానికి కారణం అయ్యింది. వివేక మరణ వార్త విన్న వెంటనే, ఆయన గుండెపోటు వచ్చి చనిపోయారు అంటూ వైసిపీ అనుకూల వర్గాలు అన్నీ చెప్పుకొచ్చాయి. అయితే ఒక రెండు గంటల తరువాత అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆయన్ను న-రి-కి చం-పా-రు. తల పై న-రి-కి-న గాట్లు ఉన్నాయి. ఆయన తలకి కుట్లు కూడా వేసి, అక్కడ ఉన్న రక్తం అంతా తుడిచేసారు. అయితే, ఇంత జరిగితే, ముందుగా గుండె నొప్పి వచ్చి చనిపోయారని ఎందుకు ప్రచారం చేసారు ? ఆయాన భార్య ఎదురు తిరగటంతో, అసలు విషయం ఎందుకు చెప్పారు ?

viveka 28092019 2

ఆయన బాడీకి కుట్లు వేసింది ఎవరు ? చనిపోయారని తెలిసినా, ఎందుకు అలా చేసారు ? అక్కడ రక్తం అంతా తుడిచింది ఎవరు ? ఇలాంటివి అన్నీ ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఈ ఉదంతం రావటంతో, అప్పటి అధికార, ప్రతిపక్షాలు, ఈ విషయం పై నువ్వంటే నువ్వు అని అనుకున్నాయి. జగన్ మోహన్ రెడ్డి, ఈ విషయం పై సిబిఐ ఎంక్వయిరీ కావాలని ప్రతి రోజు డిమాండ్ చేసే వారు. అయితే అప్పట్లోనే, అప్పట్లో రాహుల్‌దేవ్‌శర్మ కడప ఎస్పీగా ఉండే వారు. వైసిపీ ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి, ఆయన్ను బదిలీ చెయ్యమని కోరింది. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఎస్పీని మార్చాలంటూ వైసీపీ నేతలు అప్పట్లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈసి ఆయన్ను బదిలీ చెయ్యటంతో, అభిషేక్‌ మహంతిని ఎస్పీగా నియమించారు.

viveka 28092019 3

ఈయన ఆయనకంటే స్ట్రిక్ట్ అనే పేరు ఉంది. ఆయన్ను అప్పటి ప్రభుత్వం, సిట్ వేసి, విచారణ అధికారిగా పెట్టింది. ఈ లోపు ప్రభుత్వం మారి జగన్ వచ్చారు. వివేక కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధాన నిందితులను గుర్తించేందుకు పలువురిని విచారించారు. ఇటీవల నలుగురికి కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్‌ పరీక్షలు సైతం నిర్వహించారు. నిందితులు ఏం చెప్పారనే విషయం ఇంకా బయటకు రాలేదు. వివేక కేసు విచారణ చివరి దశకు వచ్చిందని త్వరలోనే అసలు నిందితులు ఎవరో తేలిపోతుందని, వారి అరెస్టు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అభిషేక్‌మహంతి ఉన్నట్టు ఉండి బదిలీ అయ్యారు. ఇంత హై ప్రొఫైల్ కేసులో, కేసు చివరి దశలో ఉన్న సమయంలో, ఆయన బదిలీ కావటం, విచారణపై ప్రభావం చూపుతుందనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు మహంతి బదిలీ కావడంతో కేసు విచారణ జాప్యం అయ్యే అవకాశం ఉందని పలువర్గాలు చర్చించుకుంటున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో కొద్దిగా స్లో అయ్యింది అనుకున్న సిబిఐ, గత రెండ వారాలుగా, కొంచెం దూకుడు పెంచింది. జగన్ కేసుల్లో ఒకటైన, పెన్నా సిమెంట్స్ కేసులో, కొత్త విషయాలు ఉన్నాయి అంటూ, సిబిఐ ప్రత్యెక కోర్ట్ కి, అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసారు. పెన్నా సిమెంట్‌ లో, పెట్టుబడులకు సంబంధించిన కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగుచూశాయని సీబీఐ, కోర్ట్ కు తెలిపింది. ఈ కొత్త అంశాల ఆధారంగానే అదనపు చార్జిషీటు దాఖలు చేశామని సీబీఐ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీపీ సురేందర్‌రావు, ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ అదనపు చార్జిషీటును స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోను సిబిఐ శుక్రవారం విచారించింది. గతంలో సిబిఐ, పెన్నా సిమెంట్‌ కేసులో పెట్టుబడుల వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన చార్జిషీటు చేసినా, తరువాత మరి కొన్ని కొత్త అంశాలు రావటంతో, ఈ అదనపు చార్జ్ షీట్ వేశామని కోర్ట్ కి తెలిపారు.

cbi 28092019 2

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, పలువురు ప్రభుత్వ అధికారులు, అప్పటి ప్రభుత్వంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేందర్‌రావు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు మెమో దాఖలుచేసినప్పటికీ, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఎప్పుడైనా అనుబంధ చార్జిషీటు వేసే అధికారం సీబీఐకి ఉందన్నారు. ఈ అనుబంధ చార్జ్ షీట్ పై, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌, గనులశాఖ మాజీ అధికారి వీడీ రాజగోపాల్‌, డీఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, తహశీల్దారు ఎల్లమ్మల పై నిన్న విచారణ చేసారు. అయితే ఈ అదనపు చార్జ్ షీట్ పై, నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని చెప్పి, మళ్ళీ ఇదేంటి అంటూ, వారు అభ్యంతరం చెప్పారు.

cbi 28092019 3

దీని పై సిబిఐ లాయర్ స్పందిస్తూ, ఎప్పుడైనా అనుబంధ చార్జ్ షీట్ వేస్తామని, నిందితుల పాత్రను అనుబంధ ఛార్జిషీటులో స్పష్టంగా వివరించామని, ఐఏఎస్‌ చిరంజీవులు వాంగ్మూలాన్ని చేర్చినట్లు వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ అక్టోబరు 11కి వాయిదా వేసింది. ఇక జగన్, విజయ్ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నిందితులు కోర్టు అనుమతితో గైర్హాజరయ్యారు. ఇక అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్ట్ కి రాకుండా, తమకు మినహాయింపు ఇవ్వాలని జగన్‌ అభ్యర్థించగా, ఆ పిటిషన్‌పై అక్టోబరు 1న విచారణ జరగనుంది. అయితే ఉన్నట్టు ఉండి, సిబిఐ విచారణలో వేగం పెంచటంతో, రాజకీయంగా జగన్ కు ఇబ్బందులు పెట్టటానికి, బీజేపీ వైపు నుంచి, ఏమైనా వ్యూహం పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అమరావతి పై మొదటి నుంచి అయిష్టంగా ఉన్న జగన మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అదే నైజంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, అమరావతి పై హేళన చేస్తూ, భ్రమరావతి అంటూ, గ్రాఫిక్స్ అంటూ హేళన చేసి, ఇప్పుడు అదే అమరావతిలో ఉన్న సచివాలయం నుంచి పరిపాలిస్తూ, అదే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో చెప్తారని, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని కొనసాగిస్తారాని అందరూ అనుకున్నారు. అమరావతికి రూపాయి పెట్టాల్సిన పని లేదు, లోన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అది సిద్ధం అవ్వగానే, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి, అమరావతిని ఆపే ప్రయత్నం జగన్ చెయ్యరు అని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. జగన్ అమరావతి పై ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు.

amaravati 28092019 2

అమరావతికి లోన్ ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. అమరావతి నిర్మాణం మొత్తం ఆగిపోయింది. ఎక్కడ పనులు అక్కడ నిలిచి పోయాయి. బొత్సా లాంటి వారు, ఇక్కడ రాజధానిగా ఉండటం కరెక్ట్ కాదని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. అమరావతిలో కాకుండా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.కడప జిల్లా సచివాలయంలో ఇతర మంత్రులతో సమీక్ష జరిపి, విలేకరులతో మాట్లాడుతూ సీమలో హై కోర్ట్ పెట్టె ఆలోచన ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు.

amaravati 28092019 3

అయితే కేవలం ఆఫీస్ లు మారిస్తే, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా ? అనే ప్రశ్న వస్తుంది. దేశంలో ఎక్కడైనా, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ అనేవి, రాజధానిలో ఉంటాయి. అంటే ఇప్పుడు రాజధాని మార్పు విషమై, మంత్రి బుగ్గన సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. సీమలో హైకోర్ట్ కావలని, అమరావతిలోనే ఉంచాలని లాయర్లు ఆందోళన చేస్తున్నారు. మరో పక్క, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు, ఈ అంశం పై ఒక్క ముక్క కూడా మాట్లాడక పోవటంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ భూముల పై, రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వటం లేదని, ఇప్పుడు హైకోర్ట్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్తున్నారని, ఇక అమరావతి రాజధానిగా ఉండదు అనే అభిప్రాయం కలుగుతుందని, ఆవేదన చెందుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చెయ్యాలని కోరుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read