కృష్ణా నదికి వచ్చిన వరదలు, ప్రకాశం బ్యారేజీకి కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. వరద ఆగిపోయి దాదపుగా వారం పైన అయ్యింది. ప్రకాశం బ్యారేజీ మూసేసారు. పైన ఉన్న పులిచింతల మూసేసారు. కాని ప్రకాశం బ్యారేజీ నుంచి మాత్రం, నీళ్ళు కిందకు వస్తూనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ మూసేసినా, ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా ? 70 గేటుల్లో, ఒక గేటు మాత్రం మూతబడలేదు. అందుకే ప్రకాశం బ్యారేజీలో ఉండాల్సిన నీళ్ళు, బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయం గమించిన ఇరిగేషన్ అధికారులు ఎంత ప్రయత్నించినా, ఆ బోటుని అక్కడ నుంచి తెయ్యలేక పోయారు. తరువాత రోజు కలెక్టర్ వచ్చి సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా పడవ బయటకు రాలేదు. ఇదే విషయం ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. మొదట్లో ప్రభుత్వ పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

boat 25082019 2

కాని రోజు రోజుకీ నీళ్ళు వేస్ట్ అవుతూ ఉండటం, దాదపుగా వారం రోజుల నుంచి ఆ గేటు ముసుకోలేదు అని ప్రజల్లో ఒక భావన ఏర్పడటంతో, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. నిన్న రోజంతా అక్కడ ఉండి అధికారుల చేత, బోటు తీసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో అక్కడ నీటి ప్రవహం తగ్గించటానికి, అక్కడ మరికొన్ని గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదిలారు. హెచ్చరికలు లేకుండా నీళ్ళు వదలటంతో, కింద ఉన్న ప్రజలు అప్రమత్తం అయ్యి, పరిగెత్తారు. కాని ఒక ముసలాయన మాత్రం, నీతి ప్రవాహంలో చనిపోయారు. బోటు తియ్యమంటే, ప్రాణం తీస్తారా అంటూ తెలుగుదేశం కూడా ఫైర్ అయ్యింది. అయితే, నిన్నంతా ఎంత ప్రయత్నం చేసినా, బోటు మాత్రం రాలేదు.

boat 25082019 3

దీంతో ఈ రోజు కూడా ప్రయత్నాలు జరిగాయి. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నిపుణుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో, బోటుని ఎట్టకేలకు బయటకు లాగారు. అయితే ఆ బోటు చూసిన ప్రజలు మాత్రం, ఆశ్చర్యపోయారు. అది ఎదో చిన్న బోటు కాదు, ఇసుక తరలించే బోటు. దాదపుగా 30 లారీల వరకు లోడ్ చెయ్యగలదు. ఇంత పెద్ద బోటు అడ్డం పడినా, ప్రకాశం బ్యారేజీకి ఎక్కడా డ్యామేజ్ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, మాత్రం అనుమనాలు వ్యక్తం చేస్తుంది. ఇసుక తవ్వకాలు ఆగిపోయి, నాలుగు నెలలు అవుతుంది. ఈ బోటు నదిలో ఎందుకు ఉంది ? ప్రవాహం ఆపి, నీళ్ళు వెనక్కు తన్నటానికి ప్రభుత్వం కుట్ర పన్నిందా అని లోకేష్ కూడా ఆరోపించారు. అయితే వైసీపీ మాత్రం చిన్న బోటు, ప్రవాహం ఆపుతుందా అని హేళన చేసింది. అయితే, వారం రోజుల నుంచి ఆ బోటు తియ్యటానికి ప్రభుత్వం పడుతున్న కష్టాలు, ఈ రోజు బోటు బయటకు తీసిన తరువాత, అది ఇంత పెద్దదా అని ప్రజలు ఆశ్చర్యపోతూ, ఆ రోజు టిడిపి చెప్పిన కుట్ర కోణం నిజమేనేమో అని అనుకునే వారు కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మార్పు వార్తల పై, గత వారం రోజులుగా, వార్తలు నడుస్తూ ఉన్నాయి. కృష్ణా నది వరదలు వచ్చిన సమయంలో, కావాలనే అమరావతిని ముంచాలని ప్లాన్ చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసినట్టే, తరువాత రోజే జగన్ ప్రభుత్వంలో, కీలక మంత్రిగా ఉన్న బొత్సా సత్యన్నారాయణ అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పై మా ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, మరో వారం రోజుల్లో ప్రభుత్వం తరుపున ప్రకటన వస్తుందని చెప్పారు. అమరావతి నిర్మాణం ఖర్చు డబల్ అవుతుందని, అమరావతికి వరదలు వచ్చి మొత్తం మునిగిపోతుందని, దాని కోసం, డాంలు, కాలువులు తవ్వాలని, అందుకే ఇక్కడ రాజధాని గురించి చర్చ చేస్తున్నామని బొత్సా అన్నారు.

tgv 2508209 2

ఈ విషయం పై తెలుగుదేశం పార్టీతో పాటు, బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా స్పందిచాయి. రాజధాని రైతులు కూడా అన్ని రాజకీయ పార్టీలను కలిసి, వారి బాధను చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలోనే, బీజేపీ రాజ్యసభ ఎంపీ టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయం పై జగన మోహన్ రెడ్డి, ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. బీజేపీ అధిష్టానమే, జగన్ అమరావతి మార్పు పై చర్చలు జరిపిన విషయం తనకు చెప్పిందని అన్నారు. అయితే, అమరావతి మార్పు తధ్యం అని, ఇదే సందర్భంలో, ఎక్కడా లేని విధంగా, నాలుగు రాజధానులను జగన్ ప్రకటించే అవకశం ఉందని, దీని పై ఇప్పటికే ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయని అన్నారు.

tgv 2508209 3

విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానులు కాబోతున్నాయని, ఇది నూటికి నూరు పాళ్ళు నిజం అని, టిజి వెంకటేష్ అన్నారు. అలాగే పోలవరం టెండర్ల రద్దు విషయం పై కూడా టిజి వెంకటేష్ స్పందించారు. విజయసాయి రెడ్డి, అనవసరంగా ప్రధాని మోడీ పేరు ఈ విషయంలో లాగారని, ఇప్పటికే ఆయన్ను ప్రధాన మంత్రి కార్యాలయం పిలిపించిందని అన్నారు. ఇలాంటి పనులు ప్రధాని మోడీ ఆశీర్వాదంతో జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరం విషయంలో ఏమైనా తేడా జరిగితే, జగన్ మోహన్ రెడ్డి, చేతులారా చంద్రబాబుకి మళ్ళీ అధికారం ఇచ్చినట్టే అని టిజి అన్నారు. కేసీఆర్ ని గుడ్డిగా నమ్మకుండా, జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.

ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు, నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు అయితే ? ఒక రాష్ట్ర ప్రతినిధిగా, తనకు ఉన్న మంచి క్వాలిటీస్ తో, ఆ రాష్ట్ర ఖ్యాతిని, ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా చూడాలి. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి మాత్రం, ఆయన అధికారంలోకి రాక ముందే, ఆయన పై అనేక కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు దర్యప్తు చేసిన కేసులు, ఇప్పటికీ విచారణ జరుగుతున్నాయి. ఆయన ఈ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, ఇవన్నీ రాజకీయంగా కక్ష పూరితంగా పెట్టిన కేసులు అని, జగన్ మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఏది నిజం అనేది, కోర్ట్ తీర్పు ఇచ్చిన తరువాత కాని తెలియదు.

highcourti 25082019 2

అయితే, ఈ నేపధ్యంలోనే, జగన మోహన్ రెడ్డి పై, ఆయన విచారణ సమయంలో కాని, బెయిల్ పిటీషన్లు వేసిన సమయంలో కాని, ఇలా అనేక సందర్భాల్లో జగన్ పై వివిధ కోర్ట్ లు చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచినా సరే, ఆయానను ఉదాహరణగా చూపిస్తూ, వివిధ ఆర్ధిక నేరాల కేసుల్లో కోర్ట్ లు మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానిస్తున్నాయి. తాజగా కాంగ్రెస్ దిగ్గజం, మాజీ హోం మంత్రి, ఆర్ధిక మంత్రి చిదంబరం పై బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో, ఢిల్లీ హైకోర్ట్ జగన్ మోహన్ రెడ్డి కేసుల ప్రస్తావన తీసుకొచ్చింది. చిదంబరం బెయిల్ రద్దు చేసే సమయంలో, తీర్పు ఇస్తూ, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌, జగన్ కేసులను ఉటంకించారు. జగన్ పై వివిధ కోర్ట్ లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావీస్తూ, చిదంబరం కూడా అదే కోవలోకి వస్తారంటూ, తీర్పులోని 20, 22 పేజీల్లో జగన్ ను ప్రస్తావించింది ఢిల్లీ హైకోర్ట్.

highcourti 25082019 3

"ఆర్థిక నేరాలు, మిగిలిన నేరాలకంటే మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైనవి. ఇలనాటి ఆర్ధిక నేరాలని మిగిలిన కేసులతో పోల్చలేం. అందుచేత ఆర్ధిక నేరగాళ్లకు బెయిల్‌ ఇచ్చేముందు ఆలోచించాలి. వీళ్ళు భారీ కుట్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగోడతారు. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన ఆర్ధిక నేరాల కేసులో జరిపిన దర్యాప్తును పరిశీలించిన తరువాత, సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భారీగా ప్రజాధనం కొల్లగొట్టిన నేరపూరిత కుట్రల్లో బెయిల్‌ పిటిషన్ల పై కఠినంగా వ్యవహరించాలి. భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలు దేశ ఆర్థికానికి చేటు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే చిదంబరం కేసులో బెయిలు కొనసాగించడం వల్ల దేశానికి తప్పుడు సంకేతాలను వెళ్తాయి’’ అని జస్టిస్‌ గౌర్‌ అభిప్రాయపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలో జరిగిన అవినీతి పై ఎన్నో కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావమే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మొహన్ రెడ్డి ఏ1గా ఎన్నో కేసులు ఆయాన పై ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి హయంలో జరిగిన స్కాంల విషయంలో, జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, అప్పట్లో అధికారంలో ఉన్న మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఎన్నో కేసులు పడ్డాయి. అందులో ఒక కేసు వోక్స్ వ్యాగన్ కేసు. చాలా కేసులు రాజశేఖర్ రెడ్డి చనిపోయన తరువాత వస్తే, వోక్స్ వ్యాగన్ కేసు మాత్రం రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలోనే వచ్చింది. అయితే అప్పుడెప్పుడో విచారణ మొదలైన ఈ కేసు, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. తాజాగా సిబిఐ, ఈ కేసులో, అప్పట్లో పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న బొత్సా సత్యనారాయణకు నోటీస్ పంపించింది.

cbi 25082019 2

ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత వారం రోజులుగా జగన్ ప్రభుత్వాని ఇబ్బంది పెడుతూ, ఆయనా అమరావతి పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తాజగా బొత్సాకు నోటీసులు రావటంతో, ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే, కొత్తగా సిబిఐ ఇచ్చిన నోటీసుల పై బొత్సా మొదటి సారి మీడియాతో స్పందించారు. ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో తనకు సీబీఐ నుంచి నోటీసులు అందాయానే విషయం తాను మీడియాలోనే చూసానని, ఇంకా తనను కలిసి నోటీసులు ఇవ్వలేదని బొత్సా అన్నారు. వచ్చే నెల 12న రావాలని నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశానని, అయితే, నాకు నోటీస్ ఇస్తే, అక్కడకు వెళ్తానని, నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్తానని బొత్సా అన్నారు.

cbi 25082019 3

ఇదీ అప్పటి కేసు... విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని కొంత మంది వ్యక్తులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసారనే కేసు నమోదు అయ్యింది. వశిష్ఠ వాహన్‌ కంపెనీ మాజీ అధికారి హెల్మట్‌ షూష్టర్‌, భారత ప్రతినిధి అశోక్‌కుమార్‌జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీ రాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ దీనిలో నిందితులుగా ఉన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో 11 కోట్ల వరకు నష్టపోవటంతో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు పై, బొత్సాకు నోటీస్ వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read