జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను ఆయన సహచర మంత్రులు పట్టించుకోవటం లేదు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మంత్రుల పేషీల్లో సిబ్బంది పై కొన్ని సూచనలు చేసారు. ఈ విషయం పై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే, మంత్రులకు తగిన సూచనలు ఇచ్చారు. అయితే ఈ సూచనలు ఇచ్చి రెండు నెలలు అవుతున్నా, ఆయన మాటలను మాత్రం, మెజారిటీ మంత్రులు పాటించటం లేదు. ముఖ్యమంత్రి హోదాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చినా, మంత్రులు మాత్రం డోంట్ కేర్ అనటం, కొంచెం విడ్డురంగా కనిపిస్తుంది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనుల పై, చంద్రబాబు పై, అప్పటి మంత్రులు పై, ఎలా అయినా విచారణ చేసి, వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, జగన్ మంత్రులు మాత్రం, వేరే రూట్ లో వెళ్తున్నారు.

ministers 10082019 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, చంద్రబాబు హయమలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారులను తొలగించారు. కొంత మందిని ట్రాన్స్ఫర్ చేస్తే, మరి కొంత మందికి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. మరో పక్క, తన దగ్గర ఎలా అయితే మార్పులు చేసారో, మంత్రులకు కూడా అలాంటి ఆదేసాలే ఇచ్చారు. గత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పేషీల్లో ఉన్న వారిని, ఇప్పుడు మంత్రులు ఎవరూ పెట్టుకోవద్దని, అందరినీ తప్పించాలని జగన్ మొదట్లోనే ఆదేశాలు ఇచ్చారు. దీని పై ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, అందరి మంత్రులకు ఒక నోట్ కూడా వెళ్ళింది. పోయిన సారి ఉన్న సిబ్బందిని కాని, వారి బంధువులను కాని, పేషీల్లో ఉంచద్దు అంటూ మంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి. అయితే కొంత మంది మంత్రులు మాత్రం, జగన్ మాటను ఇప్పటికీ లెక్క చెయ్యలేదు.

ministers 10082019 3

స్వయానా జగన్ చెప్పినా, ఇంకా కొంత మంది మంత్రులు మాత్రం, తెలుగుదేశం హయంలో ఉన్న వారినే తమ సిబ్బందిగా కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఉన్నారు. బుగ్గన పీఎస్ గా పని చేస్తున్న ధనుంజయ్ రెడ్డి, గత తెలుగుదేశం హయంలో మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు దగ్గర పీఎస్ గా పని చేసారు. అలాగే కాల్వ శ్రీనివాసులు దగ్గర ఓఎస్డీగా పని చేసిన సత్యన్నారాయణ కూడా, ప్రస్తుతం హోం మినిస్టర్ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. అలాగే పరిటాల సునీత వద్ద ఉన్న ఓఎస్డీ రామచంద్రా రెడ్డి, బుగ్గన ఓఎస్డీగా ఉన్నారు. ఇలా మొత్తం 13 మంది మంత్రులకు, గతంలో టిడిపి మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందే ఉన్నారు. అయితే, దీని పై జగన్ కు ఫిర్యాదు వెళ్ళింది. ప్రభుత్వ రహస్యాలు అన్నీ టిడిపికి తెలిసిపోతాయని జగన్ వద్దకు మేటర్ వెళ్ళటంతో, జగన్ అందరినీ తన మాట ఎందుకు వినలేదో చెప్పాలి అంటూ, తాను అమెరికా వెళ్ళే లోపు సంజయషీ చెప్పాలని, చెప్పినట్టు సమాచారం.

మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, జనసేన పార్టీ సభ్యుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆయన వ్యవహార శైలి, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, జేడీలక్ష్మీనారాయణ ఒకే ఒకసారి, జనసేన సమీక్ష కార్యక్రమంలో పాల్గున్నారు. తరువాత నుంచి ఆయన పార్టీలో ఎక్కడా కనిపించలేదు. అయితే మొన్న ప్రకటించిన జనసేన పార్టీ కమిటీల్లో, ఎక్కడా లక్ష్మీనారయణకు, పవన్ చోటు ఇవ్వలేదు. లక్ష్మీనారాయణ లాంటి నేతకు ఎందుకు చోటు ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కాలేదు. దీంతో, ఆయన పార్టీ మారతారనే సమాచారం ఉండాబట్టె, పవన్ కళ్యాణ్ ఆయనకు ఏ కమిటిలో కూడా చోటు ఇవ్వలేదని ప్రచారం జరిగింది.

jd 10082019 2

మరో పక్క పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సొంత కార్యక్రమాలకు, సొంత ఇమేజ్ లకు పార్టీని వాడుకుంటే చూస్తూ కూర్చును అంటూ చేసిన వ్యాఖ్యల పై కూడా ఊహగానాలు వచ్చాయి. లక్ష్మీనారయణ పార్టీ కార్యక్రమాలు కాకుండా, తన సొంత కార్యక్రమాలు చేసుకుంటూ, జనసేన కార్యకర్తలను వాడుకుని ఇమేజ్ పెంచుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగి, అందుకే పవన్ అలా అన్నారనే వాదన నడిచింది. ఈ పరిణామాలు అన్నిటి నేపధ్యంలో, నిన్నటి నుంచి, లక్ష్మీనారయణ పార్టీ మారుతున్నారు అంటూ, అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ లో ప్రచారం మొదలైంది. అటు జనసేన వర్గాలు కాని, లక్ష్మీనారాయణ కాని ఖండించకపోవటంతో, ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఈ నేపధ్యంలోనే, లక్ష్మీనారయణ ఈ విషయం పై ఘాటుగా స్పందించారు.

jd 10082019 3

తన ట్విట్టర్ లో దీనికి సంబంధించి, ఘాటు వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిరేకులు ఇలాంటి వార్తలు పుట్టిస్తే, ఫూల్స్ ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారని, ఇడియట్స్ ఇలాంటివి నిజమే అని నమ్ముతారని, ఘాటుగా బదులిచ్చారు. నా అవసరం పవన్ కళ్యాణ్ కు ఉన్నది అన్నంత వరకు, నేను పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని, లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి వార్తల పై కాకుండా, వరద సహాయం చెయ్యటం, చెట్లు నాటటం, యువతను తీర్చిదిద్దటం వంటి పనులు చెయ్యాలని కోరుకుంటున్నా , జై హింద్ అంటూ లక్ష్మీనారయణ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీంతో, ఆయన అన్ని వార్తలకు ఒక్క దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టారు.

విజయవాడలో ఫైర్ బ్రాండ్ నేతగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా, గత కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో ఈ వార్తలకు అంతు లేకుండా పోయింది. దీనికి తోడు, బొండా ఉమా పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కూడా ఈ వదంతులకు బలం చేకూర్చింది. తాను న్యూజిల్యాండ్ పర్యటనలో బంగీ జంప్ చేస్తున్న ఫోటో పెట్టి, నా తరువాత రాజకీయ అడుగు ఇలా ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అందరూ , బొండా ఉమా పార్టీ మార్పు ఖాయంగా భావించారు. దీనికి తోడు, ఎన్నికలు అయిన దగ్గర నుంచి బొండా ఉమా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా, ఈ పార్టీ మార్పు వార్తలకు బలం చేకూర్చేలా చేసింది.

bonda 10082019 2

అలాగే చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన సమయంలో కాపు నాయకులు అందరూ మీటింగ్ పెట్టుకోవటం, అందులో బొండా ఉమా ప్రముఖంగా ఉండటంతో పాటు, ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే తరువాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితితులతో బొండా ఉమా అలక పాన్పు ఎక్కారని చంద్రబాబుకు తెలియటంతో, పిలిచి మాట్లాడారు. అయితే, తరువాత బొండా ఉమా చాలా రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, జగన్ ఆయానకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే, బొండా ఉమా పార్టీ మార్పు ఖాయం అనే అనుకున్నారు.

bonda 10082019 3

ఈ నేపధ్యంలోనే బొండా ఉమా, విదేశాల నుంచి తరిగి విజయవాడ వచ్చారు. దీంతో విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమా వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. చంద్రబాబు దూతగా వచ్చానని, జరుగుతున్న ప్రచారం పై ఇరువురూ చర్చించారు. దాదపుగా గంటకు పైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన తరువాత బొండా ఉమా మాట్లాడుతూ, నేను చంద్రబాబునాయుడు గారి తోనే ఉంటానని , తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఇదే విషయాన్నీ చెప్తూ ఫేస్బుక్ పోస్ట్ రాసి, ఐ యాం విత్ సిబిఎన్ అంటూ చంద్రబాబు ఫోటో పెట్టి, బొండా ఉమా పోస్ట్ చేసారు. దీంతో బొండా ఉమా పార్టీ మారతారు అనే ప్రచారానికి ఇక తెర పడినట్టు అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు చాలా అవసరం. అయితే జగన్ మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి రావటంతో, కార్పోరేట్ ప్రపంచంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అతని పై ఉన్న కేసులు చూసి సహజంగా వెనకడు వేస్తారు. అయితే జగన్ మాత్రం, తన పై ఉన్న అవినీతి ముద్ర చేరుపుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా ఒక చెయ్యి వేసి, రాష్ట్రానికి నాలుగు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తన వంతు సాయంగా డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ అనే కార్యక్రమంతో, వివిధ దేశాల దౌత్యవేత్తలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావటంతో, వివిధ దేశాల నుంచి, విదేశీ రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్‌ జనరల్‌లు ఈ సమావేశానికి వచ్చారు. నిజానికి వీళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టె వారు కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్ధం చేసుకుని, వారి దేశాల్లో ఉండే పెట్టుబడి దారులకు, ఇక్కడ పెట్టుబడి పెడితే వచ్చే లాభాల పై సలహాలు, సూచనలు ఇచ్చే విదేశీ రాయబారులు మాత్రమే.

jagn 1008219 2

అయితే ఇంత మంచి అవకాసం అటు కేంద్రం కల్పిస్తే, జగన్ మాత్రం, ఈ అవకాశాన్ని వాడులుకున్నరనే చెప్పాలి. జగన్ ప్రసంగం ఇస్తూ, మాది పేద రాష్ట్రం, మాకు మెట్రో సిటీ లేదు, మాకు డబ్బులు లేవు అంటూ మొదలు పెట్టారు. ఎవరైనా ముందు మన బలాలని గర్వంగా చెప్పుకుంటారు. పెట్టుబడి పెట్టె వాడికి మనం చెప్పే మాటలు కాన్ఫిడెన్సు ఇవ్వాలి. అంతే కాని, బేద అరుపులు అరిస్తే, అవతలి వాడు పెట్టుబడి ఎందుకు పెడతాడు ? అలాగే విద్యుత్ ఒప్పందాల రద్దు విషయం పై కూడా జగన్ గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఇది ఇక్కడ ఎవరూ చెప్పారు. మీరు పెట్టుబడులు పెడితే, నేను ఏ క్షణం అయినా ఆ ఒప్పందం రద్దు చేస్తాను అని బెదిరించినట్టు ఉంటుందా ఉండదా ? ఇక పొతే 75 శాతం లోకల్ రిజర్వేషన్ల గురించి కూడా జగన్ చెప్పుకున్నారు.

jagn 1008219 3

అమెరికా చేస్తుంది, మేము చేస్తే తప్పు ఏంటి అన్నట్టు మాట్లాడారు. అమెరికా అనేది ఒక దేశం, మనది ఒక రాష్ట్రం అనేది కూడా జగన్ మర్చిపోయారు. పెట్టుబడులు పెట్టె వాడికి, ఆ ఇన్సెంటివ్ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పెట్టుబడి పెట్టండి అని చెప్పాలి కాని, జగన్ మాత్రం, మీరు ఈ పని చేస్తేనే, మా రాష్టంలో పెట్టుబడి పెట్టండి అన్నట్టు చెప్తున్నారు. ఇలా అయితే ఎవరైనా పెట్టుబడి పెడతారా ? ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలి, కరువు ప్రాంతంలో కియా లాంటి కంపెనీ వచ్చింది, ఇక ఏ సంస్థ అయినా, ఈజీగా వచ్చి పెట్టుబడి పెట్టచ్చు అనే ధైర్యం ఇవ్వాలి. మనకు ఉన్న బలాలు చెప్పాలి. ఇవన్నీ చంద్రబాబు చేసారు కాబట్టి, నేను చెప్పను అంటే, మనకు పెట్టుబడులు వస్తాయా ? అది చంద్రబాబు సొంతం కాదు, ఆయన రాష్ట్రం కోసమే చేసారు. మరి జగన్ గారు ఆ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి కాని, మాది పేద రాష్ట్రం అంటే, అవతలి వాడు పెట్టుబడి పెట్టడు, దానం చేస్తాడు.

Advertisements

Latest Articles

Most Read