రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తూ ఉంటాం, నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఎవరైనా అంటే, నువ్వు వేరే పార్టీ వాడివి, నువ్వు వేరే కులం వాడివి, నువ్వు వేరే రాష్ట్రం వాడివి అంటూ సమాధానం చెప్తారు కాని, విమర్శలు మాత్రం తీసుకోరు. ఇందులో మొదటి వరసులో ఉంటారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరైనా ఏమైనా మాట్లాడితే చాలు, కేసీఆర్ కు ఉన్న బలమైన ఆయుధం బయటకు తీస్తారు. ఒకటి , నువ్వు ఆంధ్రోడి తొత్తువి అంటారు. రెండోది, నువ్వు చంద్రబాబు తోత్తివి అంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూడా, ఇవే భావోద్వేగాలు రెచ్చగొట్టి, కేసీఆర్ గెలిచారు. తన పాలన పై ఎంత వ్యతిరేకత ఉన్నా, చివర్లో జై తెలంగాణ అంటూ, చంద్రబాబుని నాలుగు తిట్టులు తిట్టి, ప్రజల్లో భావోద్వేగం రేపటంలో సక్సెస్ అయ్యారు.

jp 11082019 2

అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడ తన స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి రావటంతో, ఆంధ్రా వాళ్ళను రాజకీయం కోసం వాడుకోవటం మానేసినట్టే కనిపించారు. కాని, మళ్ళీ లోపల ఉన్న కేసీఆర్, మరోసారి బయటకు వచ్చారు. తెలంగాణాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై, మేధావులు అందరూ పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కోసం అయ్యే కరెంటు ఖర్చు, ప్రాజెక్ట్ డిజైన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం, ఇది ఈ దేశంలోనే ఎవరు చెయ్యలేని గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. మొన్న వరదలకు, తోడిన నీళ్ళు అన్నీ, రివర్స్ లో మళ్ళీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై జయప్రకాశ్ నారాయణ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కాళేశ్వరం పై మాట్లడారు. దీనికి సంబంధించి స్పందించిన కేసీఆర్, మళ్ళీ పాత బానీలోకి వెళ్ళిపోయారు.

jp 11082019 3

జయప్రకాశ్ నారాయణకు ఏమి తెలుసు ? అతను తెలంగాణా ద్రోహి, తెలంగాణా రాష్ట్రం పై విషం కక్కుతూ ఉండే, ఆంధ్రోడు అంటూ, మళ్ళీ విమర్శలు మొదలు పెట్టారు. అయితే దీని పై అమెరికా పర్యటనలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అదే రీతిలో స్పందించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ఇలాంటి లాజిక్లు తప్ప, వేరేవి చర్చకు రాకూడదు. ఎవరైనా మనకు చెప్తే, వాళ్ళు చెప్పే విషయం నిజమా కాదా అనేది చూడాలి. ప్రజా సంక్షేమానికి ఎలా ఉపయోగం అనేది ఆలోచించాలి, కాని ఎదుటి వాడు చెప్పే దానికి, మన దగ్గర సమాధానం లేక, వాదన లోపిస్తుందో, అప్పుడు ఎదురు దాడి చేస్తారు. సమాధానం చెప్ప లేక, కోపం తెచ్చుకోవడమో, ఉద్వేగాలు రెచ్చగొట్టి, నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం ఇది అనే అంశాలు తెరమీదకు తెస్తారని కేసీఆర్ కు చురకలు అంటించారు జయప్రకాష్ నారయణ.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, జగన్ మోహన్ రెడ్డి నేను అవినీతి లేని సమాజం సృష్టిస్తాను అని చెప్పినా, ఎన్నికల్లో ప్రతి పార్టీ డబ్బు పంచుతుంది, బాగా డబ్బు పంచే పార్టీ, పోల్ మ్యానేజ్మెంట్ చేసే పార్టీకి, అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎన్నికలు అంటే బాగా కాస్ట్లీ అయిపోయిన రోజులు ఇవి. ఎంతటి గొప్ప వాడు అయినా, గెలవాలి అనే ఆలోచన ఉంటే, ముందుగా డబ్బు ఉంటేనే బరిలోకి దిగాలి. ప్రజలు కూడా అలాగే అలవాటు పడిపోయారు. ఎన్ని పధకాలు పెట్టినా, 10 వేలు ఇచ్చినా, 2 వేలు పెన్షన్లు ఇచ్చినా, ఎన్నికల ముందు పంచే డబ్బులే వాళ్లకి ముఖ్యం. అయితే, రాజకీయ నాయకులు మాత్రం, ఎబ్బే మేము అసలు రూపాయి తియ్యలేదు అని చెప్తారు. కొంత మంది మాత్రం, ఎచ్చులకు పోయి, ఇబ్బందులు పడతారు.

undi 11082019 2

దానికి బెస్ట్ ఉదాహరణ మొన్నటి జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పటంతో, ఆయన పై ఇప్పుడు కోర్ట్ లో కేసు నడుస్తుంది. అయితే, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేసారు వైసీపీ నేత. జేసి దివాకర్ రెడ్డి అంటే, ఓడిపోయారు కాబట్టి, ఆయన గురించి పెద్దగా పట్టించుకోరు కాని, అధికారంలోకి వచ్చిన పార్టీ, మేము డబ్బులు పెట్టి గెలిచాం అంటే, అది నిజంగా సెన్సేషన్ అనే చప్పాలి. వైసీపీ తరుపున, ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నరసింహ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం అయితే, వైసీపీలో మాత్రం అవాక్కయ్యేలా చేసాయి. మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా నరసింహ రాజు, నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

undi 11082019 3

మన జిల్లాలోనే కాదు, చాలా మందికి పార్టీ నుంచి 10 నుంచి 18 కోట్లు డబ్బులు పార్టీ నుంచి వచ్చాయి, కాని నేను మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఎన్నికలకు వెళ్ళాను, నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను కాని, మిగతా వారిలాగా పార్టీ నుంచి వచ్చిన 18 కోట్లతో ఎన్నికలకు వెళ్ళలేదు అంటూ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఇది ఎక్కడ జగన్ కు చుట్టుకుంటుందా అని వైసీపీ నేతలు కంగారు పడే పరిస్థితి. ఎన్నికలకు, ఈసీ ఇచ్చిన నిబంధనలు మేరకే ఖర్చు పెట్టాలి. మరి ఇప్పుడు నరసింహరాజు అంటున్నట్టు, జగన్ ప్రతి నియోజకవర్గానికి 18 కోట్లు పంపిస్తే, అవి ఏమయ్యాయి ? ఎలా ఖర్చు పెట్టారు ? ఈ దిశగా కనుక ఎలక్షన్ కమిషన్, కోర్ట్ లు ఆలోచిస్తే, వైసీపీ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అయినా ఆ పరిస్థితి మన దేశంలో రాదు అనుకోండి. https://www.facebook.com/TeluguPrajalaNadi/videos/2058685101093262/

నిన్న కొత్తూరు తాడేపల్లిలో జరిగిన సంఘటనతో, గో ప్రేమికులతో పాటు, సామాన్యులు కూడా చింతించే పరిస్థితి. ఒకేసారి 100 ఆవులు చనిపోవటంతో, అందరూ బాధ పడుతున్న వేళ, అసలు ఎందుకు ఇన్ని ఆవులు చనిపోయాయి అనే విషయం తెలుసుకుని, మరింత ఆవేదన కలుగుతుంది. ఆవుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాధమిక నివేదికలో దారుణమైన నిజాలు బయట పడ్డాయి. ఆవుల మరణానికి విషపదార్థాలే కారణమని ప్రాధమిక నివేదికలో వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా, ఆవుల కడుపులో గడ్డి తప్ప మరే ఇతర ఆహారం లేదని వైద్యులు తేల్చారు. అంతే కాదు విష ప్రభావంతో ఆవుల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందని తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల్లో అక్కడక్కడా రక్తపు చారికలతో ఉన్నాయని తెలిపారు.

cow 11082019 2

అంతే కాకుండా, ఊపిరితిత్తుల్లో భారీగా నీరు చేరినట్టు తెలుసుకున్నారు. విష తీవ్రత ఎక్కవుగా ఉండబట్టే ఆవుల ముక్కల్లో నుంచి రక్తం వచ్చినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే నిన్న అందరూ భావించినట్టు ఆవుల మృతికి పొట్ట ఉబ్బరం కారణం కాదని పశు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఈ విషం కావాలని పెట్టారా ? లేక ఇంకా ఏమైనా కారణమా అనే విషయం మాత్రం, పోలీసులు దర్యాప్తులో తేలాల్సిందే. ఈ విషయం పై బీజేపీతో పాటు, ఇతర స్వామీజీలు మౌనంగా ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం, రాత్రికి రాత్రే 100 ఆవులు మరణించడం ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అనిపించడంలేదని, దీని వెనుక ఎదో కుట్ర కోణం ఉందని అనిపిస్తుందని, దీని పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

cow 11082019 3

శ్రావణ మాసం అందులోనూ శుక్రవారం.. శ్రవణ శుక్రవారం రోజు, ఇలా వంద ఆవులు చనిపోవటం, రాష్ట్రానికి అరిష్టం అనే వాదన కూడా ఉంది. శ్రవణ శుక్రవారం కావటంతో, గోసాలకు ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు వచ్చారు. గో మాతలకు పూజలు చేసారు. అయితే రాత్రికి ఇలా జరగటంతో, భక్తులు కూడా షాక్ అయ్యారు. గో మాతను పూజించిన చోటే, ఇలా 100 ఆవులు చనిపోవటం పై, వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం యధావిధగా కమిషన్లు వేసింది. దీని పై విచారణ జరుగుతుంది. ఒక పక్క పూర్తీ స్థాయి పోస్టుమార్టం నివేదిక మరో రెండు మూడు రోజుల్లో రానుంది. మరో పక్క, పోలీసులు వారి పని వారు చేసుకు వెళ్తున్నాడు. మరి ఈ దారుణం పై అసలు నిజం తెలుస్తుందో లేదో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో, రాజకీయంగా సఖ్యతగా ఉన్నట్టు బీజేపీ కనిపిస్తున్నా, కేంద్ర ప్రభుత్వ పరంగా మాత్రం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే పనుల పై మాత్రం, చాలా గుర్రుగా ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న డబల్ గేమ్ ని, ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారు. ఢిల్లీ పెద్దల దగ్గర మాత్రం జగన్, విజయసాయి రెడ్డి వినయం నటిస్తూ, అంతా మీ తరువాతే అన్నట్టు అక్కడ చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చి మాత్రం, కనీసం కేంద్రానికి కూడా సమాచారం ఇవ్వకుండా, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలు కూడా, లెక్క చెయ్యకుండా, కేంద్రానికి చెప్పకుండా, జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు నిర్నయం తీసుకోవటం పై కేంద్రం గుర్రుగా ఉంది. కనీసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా చెప్పకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవటంతో, కేంద్రం కోపంగా ఉంది.

ppa 11082019 2

రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నా, రూల్స్ ప్రకారం నడవాల్సిన చోట, కేంద్రం జగన్ ప్రభుత్వానికి షాకులు మీద షాకులు ఇస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్షలో కేంద్రం వద్దు అని ఎంత చెప్పినా, జగన్ ప్రభుత్వం మాత్రం, మేము సమీక్షించి తీరుతాం అంటూ, కేంద్రాన్ని ధిక్కరించి, చివరకు విదేశీ పెట్టుబడులకు గండి కొట్టే పరిస్థితి వచ్చింది. మరో పక్క పూర్తిగా కేంద్ర పరిధిలో ఉన్న పోలవరం పై, జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం పై కేంద్రం గుర్రుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, ప్రధాన కాంట్రాక్టర్ గా ఉన్న నవయుగ కంపెనీని, కేంద్రానికి చెప్పకుండా, రాష్ట్రం పంపించేసింది. దీని పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది.

ppa 11082019 3

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సంజయషీ ఇచ్చినా కూడా, కేంద్రం మాత్రం సంతృప్తి చెందలేదు. ఇదే కాకుండా, పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చెయ్యకూడదు అంటూ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ తరుణంలో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 13న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వచ్చి, సమాధానం చెప్పాలని, ఏపీ జలవనరుల శాఖ, కేంద్ర జలవనరులశాఖ అధికారులకు పిలుపు వచ్చింది. ఎందుకు నవయుగని తప్పించారు ? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ముందుగా ఎందుకు సంప్రదించలేదు ? కొత్త టెండర్ పిలిస్తే, నవయుగ చేసిన రేటుకే, కొత్త సంస్థ చేసే అవకాసం ఎంత వరకు ఉంది, ఇలాంటి అంశాల అన్నిటి పై, రాష్ట్రాన్ని వివరణ కోరనున్నారు. మరో పక్క, ఈ వ్యవహారం పై, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read