జమ్మలమడుగులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనసంద్రాన్ని తలపించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జమ్మలమడుగు అంటే వైఎస్ జగన్ రెడ్డి అడ్డా. టిడిపిలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు లేరు. టిడిపిలో చాలా ఏళ్లుగా ఉంటూ వచ్చిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీ నేత. జమ్మమడుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ. ఎటుచూసినా ఇక్కడ టిడిపికి పెద్ద దిక్కులేదు. టిడిపిలో చేరింది ఓ యువనేత మాత్రమే. వైసీపీలో మదమెక్కిన అధికారం. ధీటుగా ఢీకొట్టే నేతలు బీజేపీ పంచన ఉన్నారు. టిడిపికి దశాబ్దాలుగా వెన్నంటి ఉన్న నేత వైసీపీలో చేరాడు. సరిగ్గా అటువంటి సంక్షోభ సమయంలో, తెలుగుదేశం మాటే వినిపించని జమ్మలమడుగులో టిడిపి యువనేత నారా లోకేష్ పాదయాత్ర జనసునామీని తలపించింది. జనసంద్రంగా మారిన జమ్మలమడుగులో ఎటుచూసినా జనమే. లోకేష్ ని చూసేందుకు వచ్చిన జనంతో కిలోమీటర్ల మేర డ్రోన్ షూట్కి అందనంత జనం పోటెత్తారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు ప్రజలు. జమ్మలమడుగులో పాదయాత్ర విఫలం అవ్వాలని అధికార పార్టీ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. కుర్రాడైనా, రాజకీయాలకు కొత్తయిన దేవగుడి భూపేష్ రెడ్డి కోఆర్డినేషన్ నభూతో నభవిష్యత్ అన్న చంద్రంగా ఉంది. బెదిరింపులకి దేవగుడి వారబ్బాయి భయపడలేదు. అడ్డంకులు సృష్టిస్తే నారా సింహం వెనకడుగు వేయలేదు. ఇక చివరి అస్త్రంగా జమ్మలమడుగులో కరెంట్ తీసేయించారు. వీధిలైట్లు వెలగకుండా జనం రాకూడదని, కనపడకూడదని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పల్లెల నుంచి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. టిడిపి కేడర్ ఉరకలెత్తే ఉత్సాహంతో కదం తొక్కింది. టిడిపికి లీడర్, కేడర్లేని వైకాపా అడ్డాలో అశేష ప్రజాస్పందన, ప్రభుత్వంపై వ్యతిరేకతే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోకేష్ చరిష్మా, టిడిపి మినీ మేనిఫెస్టో కూడా జమ్మలమడుగు జనసంద్రానికి ముఖ్యకారణాలని అభిప్రాయపడుతున్నారు.
news
చంద్రబాబు మారిపోయాడు అనేదానికి, ఇదే ఉదాహరణ...
చంద్రబాబు వ్యవహార శైలి పై, గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక విమర్శలు వస్తూ ఉండేవి. అవి మంచి చేసేవే అయినా, చంద్రబాబు నిర్ణయాలు పార్టీలో చాలా మందికి నచ్చేవి కాదు. ముఖ్యంగా చంద్రబాబు, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే, ఆయన తీసుకునే సమయం, నాన్చే విధానంతో, టిడిపి శ్రేణులు విసుగెత్తిపోయేవి. ముఖ్యంగా ఏదైనా సమస్య జటిలం అవుతుంటే, దాన్ని మరింత జటిలం చేసేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉండేది. అయితే విమర్శలు నుంచి , పాఠాలు నేర్చుకుని, మారే వాడే నాయకుడు. చంద్రబాబు అలాంటి వారు కాబట్టే, ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మొన్నటి మ్యానిఫెస్టో పెద్ద షాక్. ఇంత ప్రిపెరేడ్ గా చంద్రబాబు ఎన్నికలకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక సీట్ల విషయంలో కూడా తేల్చి పడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరించింది. సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేసారు. అయితే ఇక్కడ కోడెల శివరాం ఉన్న సంగతి తెలిసిందే. సహజంగా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాన్చుతూ, చివరి వరకు తేల్చే వారు కాదు. ఎన్నికల పది రోజులు ముందు క్లారిటీ ఇచ్చే వారు. అయితే ఇప్పుడు మాత్రం ఏడాది ముందే తేల్చేసారు. కోడెల శివరాంని ఎలా సముదాయిస్తారు అనేది పక్కన పెడితే, అంబటికి మాత్రం కన్నా సరైన పోటీ అని, అంబటి ఓడిపోవటం ఖాయం అని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.
అందరూ అనుకున్నట్టే, అవినాష్ రెడ్డికి భారీ ఊరట ఇచ్చిన హైకోర్టు...
వైఎస్ వివేకా హత్య కేసులో, అవినాష్ రెడ్డి పాత్ర గురించి, సిబిఐ ఎన్ని ఆధారాలు ఇచ్చినా, గూగుల్ టేక్ అవుట్ తో చెప్పినా, ఫోన్ కాల్స్ వివరాలతో కోర్టు ముందు పెట్టినా, అవేమీ నిలబడలేదు. తెలంగాణా హైకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించ లేదు. అవినాష్ రెడ్డి రక్తం మరకలు తుడిపించాడని, అలాగే చంపించిన వారు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని, ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ చేసారని, ఇలా మొత్తం ఆధారాలు సిబిఐ కోర్టు ముందు పెట్టింది. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే, సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి విచారణలో సహకారం అందించటం లేదని కూడా చెప్పింది. అరెస్ట్ చేయటానికి వెళ్తే, కర్నూల్ హాస్పిటల్ ముందు ఆడిన డ్రామా వివరించింది. అయితే ఇవేమీ హైకోర్టు విశ్వసించినట్టు కనిపించ లేదు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ, హైకోర్టు భారీ ఊరట ఇచ్చింది. అవినాష్ రెడ్డికి హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ వాదనల సమయంలో హైకోర్టు అడిగిన ప్రశ్నలు, సిబిఐ సరిగ్గా సమాధానాలు చెప్పలేక పోయింది. అప్పుడే హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తుందని, న్యాయ నిపుణులు ఊహించారు. అందరూ అనుకున్నట్టే బెయిల్ వచ్చింది. మరి సిబిఐ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తుందా, లేదా అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచి వదిలేస్తుందా అనేది చూడాలి. సిబిఐ వెళ్లకపోయినా, సునీత మాత్రం, సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
పాదయత్రలో భారీ స్కాం బయట పెట్టిన లోకేష్.. షాక్ తిన్న వైసీపీ.. రంగంలోకి సిబిఐ, ఈడీ..
పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వ స్కాం ఒకటి బయట పెట్టారు. లోకేష్ దెబ్బకి ఎమ్మెల్యే శిల్పా బ్యాంక్ బెంబేలు ఎత్తిపోయింది. వర్ధన్ బ్యాంక్ ద్వారా శిల్పా కుటుంబం చేసిన ప్రజా ధనం లూటీని నారా లోకేష్ కర్నూల్ పాదయాత్రలో బయట పెట్టారు. బహిరంగ సభ వేదిక పైన బయట పెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా శిల్పా కుటుంబం దోపిడీ గురించి పూర్తి ఆధారాలతో నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా ద్వారా శిల్పా కుటుంబం దోపిడీ మొత్తాన్ని బయటకి తీసాడు లోకేష్. ఈ క్రమంలోనే వర్ధన్ బ్యాంక్ ద్వారానే రూ.100 కోట్లు దళితుల సొమ్ము కొట్టేసారని శిల్పా చక్రపాణ రెడ్డి, శిల్పా రవి పై లోకేష్ ఆరోపణలు హ్సుసారు. అంతే కాదు ఆధారాలు కూడా బయట పెట్టారు. లోకేష్ బయటపెట్టిన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి, ఫెమా, ఐటి, సిబిఐ అధికారులకు శిల్పా కుటుంబం అక్రమాల పై విచారణ జరపాలి అంటూ టిడిపి ఎంపీలు లేఖలు రాసారు. టిడిపి ఫిర్యాదు పై, ఐటి అధికారులు రంగంలోకి దిగారు.