అమిత్ షా కి పట్టు తప్పుతుంది. అటు పార్టీ మీద, ఇటు వ్యక్తిగతంగా కూడా. నిన్న మిజోరం పర్యటనలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు స్వల్ప ప్రమాదం జరిగింది. రాష్ట్ర పర్యటనకు వెళ్లిన అమిత్‌ షా హెలికాప్టర్ దిగుతుండగా మెట్ల మీద నుంచి జారిపడ్డారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల పర్యటన నిమిత్తం అమిత్‌ షా గురువారం మిజోరం వెళ్లారు. పశ్చిమ‌ తుయ్‌పుయ్‌ నియోజకవర్గంలోని త్లబంగ్‌ గ్రామంలో షా హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యింది.

amit 24112018 2

హెలికాప్టర్‌ దిగుతుండగా షా చూసుకోకుండా ఓ మెట్టు వదిలేశారు. దీంతో ఆయన కిందపడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయనను లేపి షా దుస్తులకు అంటుకున్న దుమ్ము దులిపారు. ఆ తర్వాత అమిత్‌షా తన పర్యటనను కొనసాగించారు. కాగా.. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఇది మర్చిపోక ముందే, ఈ రోజు మరోసారి అమిత్ షా జారి పడ్డారు. ఈ సారి, మధ్యప్రదేశ్ లో. మధ్యప్రదేశ్ లోని, అశోక్ నగర్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గునటానికి అమిత్ షా వచ్చారు.

amit 24112018 3

ఆ సమయంలో ఆయన ఎక్కిన వాహనం దిగుతూ, జారి పడిపోయారు. ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని లేపారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు.. https://twitter.com/scribe_prashant/status/1066275826554032128 మిజోరంలో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2008 నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అంతేగాక.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న ఏకైక ఈశాన్య రాష్ట్రం కూడా ఇదే. దీంతో కాంగ్రెస్‌ను గద్దె దించి ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు హస్తం పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిజోరం ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి... అయ్యా మీరు చంద్రబాబు నాయుడు మీద, స్తున్నటువంటి విమర్శలు-ఆరోపణలలో నిజం ఎంత! రుజువులేంటో అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ మీరు నిన్న చంద్రబాబు నాయుడికి వయసైపోయిందని ముసలోడైపోయారని ఒక విమర్శ చేశారు...అయితే ఈ విషయంలో దయచేసి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే... చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటలు కష్టపడతారు...మరి మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా టైం మేనేజ్మెంట్ గురించి మీకు తెలుసని నేను అనుకోవడం లేదు.(ఈ విషయం మీరు ఏ రాజకీయ,బిజినెస్ కార్పొరేట్ రంగాలవారిని అడిగినా చెప్తారు)..పొద్దున లేచిన దగ్గర్నుంచి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మొదలుకొని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గాని,పూర్తి కావలసిన ప్రాజెక్టుల గురించి గాని, కేంద్రంపై రాష్ట్రంలో ధర్మ పోరాట దీక్షల ద్వారా ప్రతి ఆంధ్రుడి ఆవేదనను కేంద్రానికి తెలియజేసే దిశలో ఆయన పడుతున్న కష్టం గురించి గానీ...ఇలా ఆయన రోజులో ఎన్ని పనులలో నిమగ్నమై ఉంటారో మీకు తెలుసా? కేంద్రంపై పోరాటం చేసే విషయంలో ఎంత వంతు మీరు మీ వైపునుంచి మీ పాత్ర పోషిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు!!

మీరు చేసేదల్లా ఏంటంటే....వారానికి రెండు మూడు మీటింగ్లు పెట్టి చంద్రబాబుని విమర్శించడం వరకే సరిపోతుంది. వారంలో మిగతా టైం అంతా మీ ఫాం హౌస్ లోనో,ఇంట్లోనో హ్యాపీ గా రెస్ట్ తీసుకుంటారు. ఆయన వయసు- ఓపిక గురించి చిన్న ఉదాహరణ...ఇది నేను చెబుతున్న మాట కాదు పబ్లిక్ గా టీవీలలో,సోషల్ మీడియాలో అందరూ చూసిందే...తిరుపతి మెట్లు ఎక్కడానికి చంద్రబాబు గారికి ఈ వయసులో కూడా కేవలం గంట అది కూడా ఎక్కడ కూర్చోకుండా పైకి వెళ్లి...మొదటి మెట్టు ఎక్కే ముందు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చివరి మెట్టు వరకూ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు.మీడియా,సెక్యూరిటీ ఆయన వెనుక పరుగులు పెట్టింది.ఇది నేను చెప్తున్న మాట కాదు...ఆ వీడియో క్లిప్పింగ్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను.కానీ అదే మీరు మీ మెట్ల నడక ప్రయాణంలో ఎన్నిసార్లు కూర్చుని...ఎంత ఆయాసంతో వగర్చారో అందరూ చూసారు.మరి ఆయన వయసు-ఓపిక గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం ఉందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఆ వయసులో అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబునాయుడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సుడిగాలి పర్యటన చేశారు.మీరూ ఆ మధ్యలో ఏదో యాత్ర మొదలు పెట్టారు పట్టుమని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా ఆ యాత్ర పూర్తి చేసింది లేదు.పైగా సెక్యూరిటీ లేదని,అదనీ ఇదనీ దాన్ని కూడా వాయిదా వేసారు.వారంలో రెండు మూడు రోజులు ఏదో ఒక యాత్ర పేరిట లేదా ఏదో కార్యక్రమం పేరిటో టైం పాస్ చేసి మిగతా నాలుగు రోజులు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇకపోతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు తిరగలేరు అని చెప్పి మీరు అంటున్నారు. అసలు ముందు మీ సత్తా ఏంటో... తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల కోసం మీరేం చేస్తారో మీ స్టాండేంటో చెప్పండి ముందు.

చంద్రబాబు నాయుడు సత్తా ఏంటనేది ఈరోజు తెలంగాణ ప్రజలు,ఆంధ్ర ప్రజలతో పాటు దేశం మొత్తం చూస్తుంది,గమనిస్తుంది. పార్టీ పెట్టిన మీరు నాలుగు సంవత్సరాల కాలంలో అక్కడ ఓ ప్రక్కన తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతుంటే ఒక అభ్యర్థిని నిలబెట్ట లేకపోయినా మీ పార్టీ ఎక్కడ!! అసలు ఇక్కడ తెలుగుదేశం లేదు రా బాబు అయిపోయింది చంద్రబాబును మేం తోలేసాం అని అన్న కేసిఆర్ కి ముచ్చెమటలు పోయించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ!! ఇవే కాకుండా ప్రజలకు మీరు చెప్తున్న అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.మీరు మీ కాన్వాయ్ని లేదంటే నాదెండ్ల మనోహర్ కారును ఇసుక లారీ గుద్దేసినయ్ అని అన్నారు. ఎందుకు జరుగుతున్నాయో అని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను అమాయకులను చేసి గందరగోళంలోకి నెట్టాల్సిన అవసరం లేదు.మీరు ఆ రోజు ఎందుకు స్పందించలేక పోయారు.మీరు చెప్పే కబుర్లు ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు దయచేసి గమనించగలరు.

ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల కోసమే కాదు తెలంగాణ ప్రజలందరి కోసం ఒక మహా కూటమి ఏర్పాటు చేసి దానిలో కాంగ్రెస్ ను పెద్దన్న పాత్రధారిని చేసి తెలుగుదేశం అక్కడ పోటీ చేస్తుంది అంటే దానికి కారణం ఎవరు?? ఈరోజు కేసిఆర్ కూడా కాంగ్రెస్ విమర్శించడంలేదు....కేవలం 12 సీట్లకు పోటీ చేస్తున్న తెలుగుదేశంను చూసి చంద్రబాబును విమర్శిస్తున్నాడు. మరిక్కడ దమ్ము-ధైర్యం,రోషం-పౌరుషం ఎవరికున్నట్ టోతెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అసలిక్కడ ప్రజలకు ఏం కావాలో,వాళ్లేం కోరుకుంటున్నారో వాళ్ల భావోద్వేగాలు ఎలా ఉన్నయ్యో ఏనాడన్నా తెలుసుకునే ప్రయత్నం చేసారా? ఎంతసేపూ విమర్శలగోల తప్ప ప్రజల ఘోష మీకేమన్నా అర్ధమౌతుందా? ప్రజలంటే చంద్రబాబు,పవన్,లోకేష్,జగనే కాదు...వాళ్ల అభిమానులే కాదు.తటస్థంగా కూడా ఉండేవాళ్ళుంటారు. దయచేసి మీరు ఏదోటి మాట్లాడి మీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసి వారి అమాయకత్వాన్ని మీ బలంగా మల్చుకుని ఏదో సాధిద్దామనుకుంటే అది బూమారాంగౌతుందే తప్ప మరోటికాదు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం.కానీ నాయకుడనేవాడు వారికి మార్గదర్శిగా ఉండాలేగానీ వాళ్లను అజ్ఞానంలోకి తోయకూడదు.

మొన్న శ్రీకాకుళంలో ఆవులు వస్తే నన్ను చంపటానికే అని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే నా ఇంటి పై డ్రోన్ లు తిప్పుతున్నారు, నన్ను చంపేస్తున్నారు అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది కాకుండా, అసలు హైలైట్ ఏంటి అంటే, నా హత్యకు ముగ్గురు మాట్లాడుకుంటే అది నేను విన్నాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ఎవరయ్యా అని పోలీసులు అడిగితే మాత్రం, నాకు నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు అంటాడు. సెక్యూరిటీ ఇస్తే తిప్పి పంపిస్తాడు, మళ్ళీ నాకు కాని, నా వాళ్ళకు కాని, ఏమైనా జరిగితే డీజీపీ దే బాధ్యత అంటాడు. ఏ విషయంలోనూ క్లారిటీ లేని, పవన్, చివరకు ఇలాంటి విషయాల్లో కూడా ఏమి మాట్లాడతాడో అర్ధం కాదు.

pk 24112018 2

వారం క్రితం, అర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని, ముంబైలో ఉన్న కేటీఆర్ ను కలవటానికి, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే సమయంలో, తన సెక్యూరిటీ వాహనం వెళ్లి ఒక లారీని గుద్దింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, సెక్యూరిటీ వాహనం వెళ్లి, లారీని గుద్దింది. లారీ వచ్చి వీళ్ళను గుద్ద లేదు. అలాగే, హైదరాబాద్ లో మనోహర్ ప్రయనిస్తున్న్ కార్ ని, ఎదో లారీ గుద్దింది. హైదరాబాద్ లో పవన్ కి ఎంతో ఇష్టమైన కేసీఆర్ సర్కార్ ఉంది. ఈ రెండు సంఘటనలు, తనను చంపటానికే అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారు. మరి, అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు ? జగన్ లాగా ఏపి పోలీసులు పై నమ్మకం లేదు అనుకుందాం, మరి హైదరాబాద్ లో, మీ కేసీఆర్ పరిపాలనే కదా, అక్కడ ఎందుకు కేసు పెట్టలేదు ?

pk 24112018 3

ఇవేమీ చెయ్యకుండా, కేవలం చంద్రబాబు నన్ను చంపేస్తున్నాడు అంటే ఎలా ? రోడ్డు మీద రోజుకి వంద ఆక్సిడెంట్ లు అవుతాయి. పవన్ కాన్వాయ్ లో ఉండే పిల్ల డ్రైవర్ ల వల్ల, ఎప్పుడూ ఎదో ఒక ఆక్సిడెంట్ అవుతుంది. దానికి చంద్రబాబుని అంటే ఎలా ? మళ్ళీ కోడి కత్తి దాడిలో చంద్రబాబు స్పందించారు, నా పై దాడి జరిగితే స్పందించలేదు అనటం ఏంటి ? అసలు నీ పై దాడి ఎక్కడ జరిగింది ? నీ సెక్యూరిటీ వాహనం వెళ్లి లారిని గుద్దితే, అది నీకు జరిగిన దాడి అని నువ్వు అనేసుకుని, దాని పై చంద్రబాబు స్పందించాలి అని కోరుకోవటం ఏంటి ? నువ్వు చేసే ఆక్సిడెంట్ లకి డీజీపీ బాధ్యత వచించటం ఏంటి ? దేశంలో ఏది జరిగినా, నా గురించే చేశారు అనుకోవటానికి, నువ్వు ఏమన్నా పెద్ద రాజకీయ నాయకుడివా ? కనీసం పంచాయితీ వార్డ్ మెంబెర్ గా కూడా గెలవని చరిత్ర నీది.. కొంచెం వాస్తవాల్లో బ్రతుకు పవన్...

రాష్ట్రంలో ఇలాంటి అజ్ఞాలుతో, చంద్రబాబు స్థాయి నాయకుడు పోటీ పడాల్సిన పరిస్థితి... ఇద్దరు ఉన్నారో, ఒకరికి మించిన అజ్ఞానం మరొకరిది... మోడీ అనే పేరు ఎత్తే ధైర్యం లేక, మోడీ చేసే తప్పులకి కూడా చంద్రబాబు మీద పడి ఏడుస్తూ ఉంటారు... ఎందుకంటే మోడీ మీద ఒక్క విమర్శ చేస్తే, అక్కడ అమిత్ రియాక్ట్ అయితే, ఒకడికి కేసులు, ఇంకొకడికి పెన్ డ్రైవ్ లు బయటకు వస్తాయి... అందుకే ప్రతి సందర్భంలో, మోడీని ఒక్క మాట కూడా అనుకుండా, ప్రతి దానికి చంద్రబాబునే నిందిస్తూ ఉంటారు... ఈ కోవలోనే విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై ఒక విష ప్రచారం చేస్తున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్, కట్టేది నేషనల్ హైవే మీద... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది.

flyover 24112018 2

కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన మాత్రం, ఇదేదో చంద్రబాబు చేతకానితనంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రే, దీని పై స్టేట్మెంట్ ఇచ్చి, ఇలాంటి వారి నోర్లు ముపించారు.

flyover 241120183

దుర్గ గుడి ఫ్లైఓవర్ పనులు ఎంతకీ పూర్తికాకపోవడం పై కేంద్రం ఆ కాంట్రాక్టు సంస్థను మందలించింది. నిర్మాణ సంస్థ విషయంలో అంచనాలు తలకిందులయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఏడాదిలోనే పనులు పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకొన్న సంస్త రెండేళ్లు దాటినా పనులను కొలిక్కి తీసు కురాలేకపోతోందని, ఫలితంగా ప్రాజెక్టు పై ఆర్టీక భారం పడుతోందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(ఎంవోఆర్ టీహెచ్) ఇటీవల బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా.. ఢిల్లీలో జరిగిన సమీ క్షలో ఎంవోఆర్టీ హెచ్ ఉన్నతాధికారులు ఈ విషయంపై ఏపీ జాతీయ రహదారుల విభాగం అధికారులను నిలదీసినట్లు తెలిసింది. కాగా, పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే మార్చి 31 నాటికి పూర్తిచేయాలని కేంద్రం తాజా గడువు విధించింది. అప్పటికీ పనులు పూర్తి కాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించి నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మొత్తం ఫైలును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెప్పించుకొని పరిశీలించినట్లు తెలిసింది. దుర్గమ్మ ఫ్లైవోవర్ ఎందుకు ఆలస్యం ఆష్పతోంది? మీరేం చేస్తున్నారంటూ ఎన్ హెచ్ఏ ఐ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇదే సందర్భంలో, కేంద్రం కావాలని చేస్తున్న జాప్యం మాత్రం బయటకు రానివ్వకుండా, కాంట్రాక్టు సంస్థ మీదకు తోసెయ్యటం గమనించాలి. ఏదేమైనా, ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ కేంద్ర పరిధిలో ఉందని, మన రాష్ట్రంలోని అజ్ఞానులు గుర్తిస్తే మంచిది.

Advertisements

Latest Articles

Most Read