ఎమ్మెల్యేల పనితీరు పై ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారా...? 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రారంభించారా..? గెలుపు గుర్రాల వేటలో బాబు బీజీగా ఉన్నారా...? సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై వాయిస్ కాల్స్ తో ప్రజలనాడీని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా...? ప్రజలకు మూడుప్రశ్నలు వేసి సరైన సమాధానాలు రాబడుతున్నారా...? సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకోవడం సాధ్యమేనా...? ఇదే అంశం కొద్ది రోజులుగా టిడిపి వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలనిభావిస్తున్న చంద్రబాబునాయుడు 175 నియోజకవర్గాల్లో గెలుపుకై కసరత్తు ముమ్మరం చేసినట్లు వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సర్వేల ద్వారా తెలుస్తోంది.

cbn phone 258112018 2

ఎమ్మె ల్యేల గెలుపు ఓటములను నిర్దేశించే క్షేత్రస్థాయి ఓటర్లలో ఎమ్మెల్యేల పనితీరు పై అంచనాకు రావడం, కార్యకర్తలలో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీల పై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయే తెలుసుకోవడంలో భాగంగా యంత్రాంగం నర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. మూడు ప్రశ్నలను బాబు వాయిస్ తో కార్యకర్తల ఫోన్లకు వాయిస్ మేసేజీలు వంపి వారి అభిప్రాయాలు నేరుగా తెలుసుకుంటున్నారు. మీ ఎమ్మెల్యే వనితీ పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా..?,మీ ఎమ్మెల్యే అందరి కలుపుకుని పనిచేస్తున్నారా..?ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చక్కగా అమలు చేస్తున్నారా...? అనే అంశాల పై సర్వేబృందం క్రీయశీ కార్యకర్తలకు వాయిన్ మేసేజ్ పంపి సమాచారం సేకరించడంతో పాట వారి అభిప్రాయాలను క్రోడీకరించి అధినేతకు నియోజకవర్గాల వారి నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం.

cbn phone 258112018 3

ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా గ్రామదర్శిని, జన్మభూమి, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే తరుణంలో నేరుగా టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో అధినేత చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం! కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు ఇప్పుడున్న జూనియర్లతో సర్దుకోలేక పోతున్నారు. సీనియర్‌, జూనియర్లను ఎమ్మెల్యే సమన్వయ పర్చడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఐవీఆర్‌ఎస్‌లో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ విధమైన పరిణామాలకు దారితీస్తోందనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

రాజకీయాల్లో కావల్సింది వయస్సు కాదని, పరిణితి అవసరమని, ఆ పరిణితి ముఖ్యమంత్రి చంద్రబాబులో పుష్కలంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు వయస్సు పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60ఏళ్లు దాటినవారు పాలించడానికి పనికిరారని పవన్ అనటం సరి కాదని, 65 ఏళ్ల వయస్సులోనే సీఎం చంద్రబాబు 2817కి.మీ. పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. శారీరకంగా, మానసికంగా చంద్రబాబు చాల ఫిట్గా ఉన్నారని పవన్ లాగా తీరుపతి కొండకి వెళ్లి 80 సార్లు కుదేలైన వ్యక్తి కాదని, చంద్రబాబు సత్తా ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.

anuradha 25112018 3

రాజకీయాల్లో ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించే గుణం ఉండాలని, ఆ గుణం, 40సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని, కాబట్టే అభివృద్ధి చేయగలరేనే నమ్మకంతో ఓట్లేసి ఎన్నుకున్నారని తెలిపారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే పవన్ 64ఏళ్ల కేసీఆర్, 68ఏళ్ల ప్రధాని మోడీ వయస్సును అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 72ఏళ్లని, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 63ఏళ్లని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్! 72ఏళ్లని, రష్యా అధ్యక్షుడు పుతినకు 66ఏళ్లని పవ నీకు ఏం అనుభవం ఉందని ఇలా మాట్లాడుతున్నారో అర్దం కావటంలేదన్నారు. ప్రశ్నించడం కోసమే పుట్టానని చెప్పిన పవన్ నిత్యం సమీక్షలతో, పర్యటనలతో, టెలికాన్ఫరెన్స్లతో రోజుకి 18గంటలు పనిచేసే సీఎంని హేళనగా ప్రశ్నిస్తారా - మీరెంత, మీఅనుభమెంతా అంటూ నిలదీశారు.

anuradha 25112018 2

చాలా చోట్ల నిలబడతానన్న పవన్ శ్రీకాకుళం తిల్లీ తుపాన్ బాధితులకు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం గురించి, వెనుకబడిన జిల్లాలకు నిధిలిచ్చి వెనక్కి తీసుకున్న కేంద్రాన్ని, కాకినాడకు కేటాయించిన పెట్రో కాంప్లెక్స్, లోటు బడ్జెట్ గురించి ఎందు కు ప్రశ్నించరన్నారు. ప్రతిపక్షనేత జగన్ కోడి కత్తి డ్రామా ఆడతారని, పవన్ ఇసుక లారీల కథలు చెబుతారని, పవన్ బౌన్సర్లు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మిడిల్ లైన్ దాటి వెళ్లి ఇసుక లారీని కొట్టిందని, ఆ ఘటన పై స్కార్పియో డ్రైవర్ తనదే తప్పని పరోక్షంగా అంగీకరించారని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపెట్టారు. పవన్ చెన్నైలో మీడియా సమావేశం ఎందుకు పెట్టారో అర్ధంకావటంలేదని, దక్షిణాదిలో రాజధాని కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తాయని, దీనికోసం పవన్ ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వలేదే అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగదారులకు ఇది తీపికబురే. విద్యుత్‌ చార్జీలు పెంచకుండా వచ్చే ఏడాది కూడా ప్రస్తుత విద్యుత్‌ చార్జీల టారిఫ్‌నే ప్రభుత్వం యథాతథంగా కొనసాగించనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏవిధమైన విద్యుత్‌ చార్జీల పెంపుదల లేకుండా ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రూపొందించాయి. 2019-20కిగాను రాష్ట్రంలో వినియోగదారులకు నాణ్య మైన, నమ్మకమైన విద్యుత్‌ పంపిణీకోసం రూ.38,204 కోట్లు అవసరం అని పేర్కొంటూ రూపొందించిన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి అందచేశాయి. శనివారం సింగరేణి భవన్‌లోని ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఈపీడీసిీఎల్‌ సీఎండి హెచ్‌వై దొర, సీజీఎం ప్రసాద్‌ , ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం బి.లలిత తదితరులు 2019-20 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)ను ఏపీ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌కు సమర్పించారు.

current 25112018 2

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా విద్యుత్‌ చార్జీల టారిఫ్‌ను ఇప్పుడున్నట్టుగానే యథాతథంగా కొనసాగించనున్నట్టు ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో సగటున 7.8శాతం వృద్ధి ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం సగటు యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.1.49గా ఉండటంతో రాష్ట్రంలో 1.64కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులు లాభపడనున్నట్టు ఏఆర్‌ఆర్‌ నివేదిక ద్వారా వివరించారు. ఇందులో ఎల్టి డొమెస్టిక్‌ కింద 1.31కోట్ల మంది వినియోగదారులు లబ్ది పొందుతారని , అదే విధంగా 17లక్షల వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు కూడా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి లక్ష విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు.

current 25112018 3

కమర్షియల్‌ కేటగిరిలో 12.1లక్షమంది వినియోగదారులు లబ్ది పొందుతారని వెల్లడించారు.కాటేజెస్‌ ఇండస్ట్రీస్‌ పరిధిలోని దోబీఘాట్స్‌కు ఉచిత విద్యుత్‌ సరఫరాను కొనసాగించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలోని నాలుగువేల మంది ఉద్యాన నర్సరీ పెంపకందారులకు కూడా ఉచితంగానే విద్యుత్‌ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. విద్యత్‌ వాహనాలకు చార్జింగ్‌ కోసం ఈవీపాలసీ ప్రోత్సాహం కింద టారీఫ్‌లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.6.95నుంచి రూ.5.95కు తగ్గించి యూనిట్‌కు రూపాయి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నట్టు నివేదికలో పొందు పరిచి ఈ మేరకు డిస్కమ్‌ అధికారులు ఏపీ ఈఆర్సీసి ఛైర్మన్‌ జస్టిస్‌ భవానీ ప్రసాద్‌కు ఏఆర్‌ఆర్‌ నివేదికను సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి పునాదులు వేసిన ఆర్టీజీఎస్‌ రియల్‌ టైమ్‌ గవ ర్నెన్స్‌ (ఆర్టీజీ) ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు వినూత్న ఆలోచనల నుండి పురుడుపోసుకున్న వ్యవస్థ. విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ను శరవేగంగా అభివృ ద్ధిపథంవైపు పయనించేలా కంకణబద్ధుడైన సీఎం చంద్ర బాబుకు ఆర్టీజీఎస్‌ ఒక ఆయు ధంలా తయారయ్యింది. ఒక దార్శినికతతో, భవిష్యత్‌ తరా లకు సుపరిపాలన అందించా లన్న ముఖ్యమంత్రికి అత్యా ధునిక సాంకేతిక సహకారం ఎంతో అవసరమన్న ఉద్దేశంలో ఉండ గా శ్రీకారం చుట్టిందే ఆర్టీజీఎస్‌. 2017 నవంబరు 26న గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌ సేవలను ప్రారంభించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మరో అడుగు ముందుకు వేశారు.

rtgc 25112018 2

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌) ద్వారా భూగర్భ జల మట్టాల మొదలుకొని వాతావరణంలోని మార్పులను సైతం ఇట్టే పసిగట్టే ఆధునిక సాంకేతిక విధానంతో ప్రజలను విపత్తుల నుండి కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవల ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘తిత్లి’ తుఫాను విపత్తును ఎదుర్కొనడంలో పూర్తి విజయాన్ని సాధించడానిఇక ఆర్టీజీఎస్‌ ఎంతగానో దోహదపడింది. దేశంలోనే మొట్టమెదటి ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ ఆర్టీజీఎస్‌ కేంద్రం ఎపీలో సేవలను ప్రారంభించింది. దాదాపుగా 62 అడుగుల పొడవైన వీడియో వాల్‌ ఆర్టీజీఎస్‌ ప్రత్యేకత. ఆసియాలోనే అతి పొడవైన వీడియో వాల్‌ ఇదే. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ లో సాంకేతిక వినియోగం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో రూ.1600 కోట్ల ప్రభు త్వం ఆదా చేయగలిగింది. ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలలో పూర్తిస్థాయిలో అక్రమా లను అడ్డుకట్ట వేస్తూ.. సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడింది.

rtgc 25112018 3

ఇప్పటి వరకూ అందిన ఫిర్యాదులు 1,69,76,311, దీనిలో వ్యక్తిగత ఫిర్యాదులు 1,36,74,648, సామా జిక (కమ్యూనిటీ) ఫిర్యా దులు : 33,01,663, ఇప్ప టి వరకూ పరిష్కరించినవి 73,17,238, పరిశీలన పూర్త య్యి, మంజూరు కానివి : 72,34, 605, ఇంకా పరిశీలించాల్సిన ఫిర్యా దులు : 5,48,552, తిరస్కరించిన ఫిర్యాదులు : 18,75,908. ఆర్టీజీఎస్‌ మొత్తం 27 ప్రభుత్వశాఖలు అమలు చేస్తున్న 156 పథకాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ, వాటి అమలు తీరుపై నిత్యం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం లో సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం ఇప్పటి వరకూ 62.27 లక్షల కాల్స్‌ చేసింది. పరిష్కారవేదికకు అందిన ఫిర్యాదులు మొత్తం : 6,040, విచారణను పూర్తి చేసిన ఫిర్యాదుల సంఖ్య : 2,065, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నవి : 3,975.

Advertisements

Latest Articles

Most Read