భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత అద్వానీకి తన సొంత ప్రాంతంగా భావించే రాష్ట్రం రాజస్థాన్‌. 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన భవిష్యత్తుకు పునాదిపడింది జైపుర్‌ నుంచే. రాజస్థాన్‌లో పర్యటించడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని పలు ఇంటర్వ్యూల్లో పెద్దాయన చెప్పారు కూడా. పలు ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థుల తరఫున గతంలో ఎన్నోసార్లు రాష్ట్రంలో ప్రచారమూ చేశారు. కానీ... ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుత నాయకత్వం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందని, కనీసం స్టార్‌ క్యాంపెయినర్‌గానైనా ఆయన సేవలను వినియోగించుకోవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

adwani 23112018 2

అద్వానీకి అన్యాయం జరుగుతోందంటూ తొలితరం భాజపా మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. రాజస్థాన్‌లో వసుంధర రాజె సర్కారు పై ప్రజా వ్యతిరేకత ఉన్నా... టికెట్ల కేటాయింపులో మాత్రం ఆమెదే పైచేయి అయింది. తన విశ్వాసపాత్రులకు పట్టుపట్టి మరీ టికెట్లు ఇప్పించుకున్నారామె. ఆ సంగతి ఎలాగున్నా, రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న అధిష్ఠానం... అక్కడ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకుంది. ప్రాంతాలు, వర్గాల వారీగా ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలనీ... పోలింగ్‌ నాటికి పరిస్థితిని తారుమారు చేసి ఎలాగోలా ఓట్లు కురిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. రాజె సర్కారు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం... వాటి ఆధారంగా పదునైన రాష్ట్ర ప్రచార ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది.

adwani 23112018 3

పార్టీ రాష్ట్ర శాఖ కూడా ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాల ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వసుంధర ప్రచార కార్యక్రమాల కంటే మోదీ, షాల ప్రచార సభలు, ర్యాలీల నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తోంది. కాగా, రాష్ట్రంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాల ప్రచార కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నెల 25న అల్వార్‌, భిల్వారా, బేణేశ్వర్‌ ర్యాలీలతో ప్రారంభమయ్యే మోదీ ర్యాలీలు డిసెంబరు 4 వరకూ కొనసాగుతాయి. కీలకమైన కోటా, నాగౌర్‌, భరత్‌పుర్‌, జోధ్‌పుర్‌, హనుమాన్‌గఢ్‌, జైపుర్‌, సికార్‌లలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనే అవకాశముంది.

శుక్రవారం కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని చంద్రబాబు ట్విట్టర్‌లో కోరారు. జమ్మూకశ్మీరు అసెంబ్లీ రద్దును ఫాసిస్టు చర్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇది పరాకాష్ఠగా పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తోందని గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. నియంతృత్వ పెత్తందారీ పోకడలకు బీజేపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు. సీబీఐ కార్యాలయాన్ని సీబీఐ అధికారులే సీజ్‌ చేసే వరకూ వచ్చిందని..ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఐటీ దాడులు చేయిస్తూ.. ప్రతి వ్యవస్ధను దుర్వినియోగం చేస్తూ.. బీజేపీ నేతలు వాటి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వారికి తగిన పాఠం చెప్పడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

jammu 23112018 2

చంద్రబాబు ట్వీట్ చేస్తూ, "Spoke with @MehboobaMufti ji over the phone today. Expressed solidarity with all the leaders fighting against injustice to save and protect democracy. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నాం. గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికం. కేంద్రంలో @narendramodi ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇది పరాకాష్ట. రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. దానికి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేస్తూ "Thank you for your support Naidu ji at this juncture when J&K is going through a difficult phase." అని అన్నారు.

jammu 23112018 3

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతంపై చంద్రబాబు జోరు పెంచుతున్న విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను... ఇతర పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. నాలుగేళ్ల పాలనలో ఎన్డీయే దేశంలోని పలు వ్యవస్థలను నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలను దెబ్బతీశారని కేంద్రంపై ఆయన నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నారు. బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... తాను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశానని, ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని ఆయన పదేపదే స్పష్టం చేస్తున్నారు.

వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు. శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది.

wa 23112018 2

ఇది ఆ వాట్స్ అప్ సారంశం "రాజన్న భక్తులకు, జగనన్న సైనికులకు మనవి..24 అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సీమంధ్రుల ఐక్యత పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు. ప్రతి జగనన్న సైనికుడు, పాల్గుని సంఘీభావం ప్రకటించండి. కూకటపల్లిలో టీఆర్ఎస్ ను మనం గెలిపిద్దాం. మన ధ్యేయం మహాకూటమి ఓటమి, కేసీఆర్ గెలుపు. మన ఐక్యత చూసి టిడిపి భయపడాలి, అలా కేసీఆర్ ను గెలిపిద్దాం. మనం టీఆర్ఎస్ ను గెలిపించాలి, మహాకుటమిని ఓడించాలి. తరువాత టీఅరఎస్, మన వైసీపీకి తోడుగా, అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రావటానికి, జగన్ అన్న సియం అవటానికి ఎంతో సహకరిస్తుంది." అంటూ సందేశాలు పంపించారు.

wa 23112018 3

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులకు భద్రత ఉండదని కొందరు భయపెట్టించారని, నాలుగేళ్ల కాలంలో తాము ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదని పలువురు వైసీపీ కార్యకర్తలు అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తాము బాగానే ఉన్నామని, సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలపడానికి ఈ నెల 24న కూకట్‌పల్లిలోని ఎన్‌ గార్డెన్స్‌లో సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్‌ సీఎం కావాలన్నది సీమాంధ్రుల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణాలో కెసిఆర్ కు వైసీపీ నమ్మిన బంటో ఈ ప్రకటనే సాక్ష్యం.

భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాను చూసిన మీకు, మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టారు, దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా దర్శకుడే అయినా.. రాజమౌళిలోని సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉందని నమ్మిన చంద్రబాబు ఆయనలోని ఆ నైపుణ్యన్ని అమరావతి కోసం వాడుకున్నారు. దీంతో రాజమౌళి, నార్మన్ ఫోస్టర్ టీంతో కలిసి పని చేసారు. బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని ఆయన చెప్పిన సూచన, అందరికీ నచ్చింది.

amaravati 23112018

అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేసారనుకోండి అది వేరే విషయం. అయితే అమరావతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రాజమౌళి తాజాగా వెల్లడించారు. రాజధాని నిర్మాణ విషయమై తనను సంప్రదించినప్పుడు ఆరు నెలలపాటు తప్పించుకు తిరగడానికి ట్రై చేశానన్నారు. అర్కిటెక్చర్ గురించి తనకేం తెలుసని తనని సంప్రదిస్తున్నారనే విషయం అర్థం కాలేదన్నారు.

amaravati 23112018

కానీ చంద్రబాబు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదని.. ఇక కలవక తప్పలేదని రాజమౌళి తెలిపారు. అనంతరం చంద్రబాబుకి, లండన్‌లో ఉన్న ఆర్కిటెక్‌లకు వారధిగా పనిచేశానన్నారు. తాను ఒక డిజైన్‌ను సూచించానని.. కానీ అది ఓకే కాలేదన్నారు. అప్పటికే రెడీగా ఉన్న ఒక డిజైన్ ఓకే అయిందన్నారు. ఆ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని సూచించానని ఆ ప్రతిపాదనను మాత్రం అంతా ఆమోదించారని రాజమౌళి తెలిపారు. మళ్ళీ ఈ ప్రకటన పై, జగన్ బ్యాచ్ మళ్ళీ ఏ హడావిడి చేస్తుందో..

Advertisements

Latest Articles

Most Read