దేశంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. రోజుకి ఒక వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది. కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సీవీసీ ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. నిన్న సుప్రీంలో సీబీఐ డీఐజీ వేసిన పిటిషన్‌లో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇవి చూసిన సగటు భారతీయాడు, ఈ దేశానికి ఏమైంది అంటూ తల బాదుకుంటున్నారు. సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా వెల్లడించిన సంగతులతో పెను సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేంద్ర సహాయమంత్రి హరిభాయ్‌ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోవల్‌, కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) కేవీ చౌదరి, న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, వీళ్ళందరూ కలిసి సర్వ నాశనం చేసారనే విషయం బయటకు వచ్చింది.

garikapati 20112018

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబల్‌, కేంద్ర మంత్రి హరిభాయ్‌, సీవీసీ కేవీ చౌదరిపై ఐపీఎస్‌ అధికారి మనీష్‌ కుమార్‌ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై తాను చేస్తున్న దర్యాప్తులో ఈ ముగ్గురూ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించారని వెల్లడించారు. అస్థానాపై కేసు నమోదు చేస్తున్నట్టు ధోబల్‌కు అక్టోబర్‌ 17న సీబీఐ డైరెక్టర్‌ చెప్పారని మనీశ్‌కుమార్‌ ఆరోపించారు. అదేరోజు రాత్రి జాతీయ భద్రతా సలహాదారు ఈ విషయాన్ని రాకేశ్‌ అస్థానాకు చెప్పారని, తనను అరెస్టుచేయకుండా ఉండాలని ధోబల్‌ను రాకేశ్‌ అస్థానా కోరినట్టు ఆరోపించారు. కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రికి ఈ ఏడాది జూన్‌ తొలిపక్షంలో ముట్టినట్టు మనశ్‌కుమార్‌ తన పిటిషన్లో పొందుపరిచారు. అలోక్‌వర్మను తప్పించిన రోజే తనను కూడా అన్యాయంగా బదిలీ చేశారని వాపోయారు.

garikapati 20112018

ఆలోక్‌ పై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ జరుగుతుండగా.. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, నవంబర్‌ 8న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి రేఖారాణి పదేపదే సతీశ్‌ సానా కార్యాలయంలో మాట్లాడే ప్రయత్నం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన సాక్షి సాన సతీశ్‌ను విచారించినప్పుడు గత నెల 20న తాను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పాడని, అదే సందర్భంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్ చౌదరికి ఈ ఏడాది జూన్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారని మనీష్‌‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రికి అహ్మదాబాద్‌ వాసి విపుల్‌ ద్వారా ముడుపు ముట్టినట్టు సాన సతీశ్‌ తనకు చెప్పినట్టు డీఐజీ వెల్లడించారు. సాన సతీశ్‌ వ్యవహారమంతా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలో లొసుగులన్నీ బయటపడేందుకు కారణమవుతున్నాయని, అంతకుముందు జరిగిన వ్యవహారాలు, పలువురు అధికారుల్లో వివిధ స్థాయిలో జరిపిన అవకతకవకలన్నీ దర్యాప్తు ద్వారా బయటకు వస్తాయని పేర్కొన్నారు. మొయిన్‌ ఖురేషీ కేసులో ఎన్‌ఎస్‌ఏ ధోబల్‌కు సంబంధాలు ఉన్నట్టు పిటిషన్‌లో తెలిపారు. మధ్యవర్తులు మనోజ్‌, సోమేశ్‌లకు ధోబల్‌తో సంబంధాలు ఉన్నట్టు.. రాకేశ్‌ అస్థానా, డీఎస్పీ దేవేందర్‌పై దర్యాప్తులో ధోబల్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా ధోబల్‌ అడ్డుకున్నారని తెలిపారు. కేంద్రమంత్రి, సీవీసీ చౌదరిని ప్రధాన సాక్షి సానా సతీశ్‌ దిల్లీలో కలిశారని వెల్లడించారు.

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, జగన్ నంచి నుంచి వాగ్మూలం తీసుకోవలసి ఉందని విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా ఇది వరకే తెలిపారు. ఆయనకు ఇప్పటికే సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు అందజేశామని వెల్లడించారు. రిజిస్టర్ పోస్టులో, జగన్ కు నోటీస్ పంపారు. సిట్ కూడా ఇప్పటికి మూడు సార్లు నోటీసు పంపింది.

jaganaa 19112018 2

అయినా జగన్ వినకపోవటంతో, ఈ రోజు మరోసారి నోటీసులు పంపారు. కోడికత్తి దాడి కేసులో జగన్‌కు సిట్ మరోసారి నోటీసులిచ్చింది. వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో జగన్‌, ఆయన పీఏకు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను నవంబర్ 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో చొక్కా కీలకమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. దాడి జరిగిన తర్వాత పోలీసులకు జగన్ వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను ఏపీ పోలీసుల బృందం కలిసింది. వాగ్మూలం ఇవ్వాలని పోలీసులు కోరారు.

jaganaa 19112018 3

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కత్తి దాడి ఘటనపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ జగన్ కోర్టులో పిటిషన్‌లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌లో సీఎం చంద్రబాబుతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై చెప్పమంటే, గత నెల రోజులుగా ఒక్క మాట కూడా చెప్పలేదు పవన్ కళ్యాణ్. యుద్ధం అక్కడ జరుగుతుంటే, కత్తులు వచ్చి ఆంధ్రాలో తిప్పారు. తెలంగాణా ఎన్నికల గురించి ఎప్పుడు అడిగినా, అదిగో ఇదిగో అంటూ తప్పించుకుని వెళ్ళిపోయారు. తెలంగాణా ఎన్నికల్లో పోటీ అంటే ఎందుకు అంత భయమో, ఎవరి ఆదేశాలు రావాలో కాని, అటు పవన్, ఇటు జగన్ ఇద్దరూ చేతులు ఎత్తేసారు. జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చేసి ఒక వారం ముందే, తెలంగాణాలో మా వల్ల కాదు, మా టార్గెట్ 2024 అని చెప్తే, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తెలంగాణాలో నా వల్ల కాదు, నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి, ఇద్దరూ చేతులు ఎత్తేసారు.

janasena 19112018 2

నామినేషన్ ఆఖరి రోజు అయిన, ఆఖరి గంటలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని తాము ఊహించలేకపోయామనీ, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీని విరమించుకున్నట్లు జనసేన స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందించుకున్నామనీ, కానీ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలు రావడంతో తమ వ్యూహం మార్చుకున్నామని వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లు తెలిపింది.

janasena 19112018 1

తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్‌ ప్రకారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని ప్రకటనలో స్పష్టంచేశారు. అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గత సంవత్సరం ఏప్రిల్ 2017న చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. "ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే." అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ట్వీట్ చేసారు. మరి ఇప్పుడు ముందస్తు వస్తే, మేము రెడీగా లేము అని చెప్తున్నారు అంటే, ఈయన, ఈయన సేన కబురులు మాత్రం, బాగా చెప్తారని తెలుస్తుంది. మొత్తానికి యుద్ధం తెలంగాణాలో, కత్తులు తిప్పేది ఆంధ్రాలో. ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలో, ప్రజలే చెప్పాలి.

 

వైసీపీ అధినేత జగన్‌ ‘బోర్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నారని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిత్యం భ్రమల్లో మునిగితేలడం, ఏవేవో ఊహించుకోవడం, అంతా తానే అన్నట్టు.. సీఎం అయిపోయినట్టు భ్రాంతి చెందడం సదరు వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. మానసిక వ్యాధి నిపుణుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆదివారం విజయవాడలోని జలవనరుల విడిది కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘ఆ వ్యాధి లక్షణాలున్న వ్యక్తులు ఏదేదో ఊహించుకుని సీఎం అవుతాననే భ్రమలో ఉంటారు. మంత్రిగా, శాసన సభ్యుడిగా తమ్ముడికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది."

devineni 1911208 2

"కోడికత్తి ఘటనలో బాధ్యత గల ప్రతిపక్ష నేతగా సంబంధిత అధికారులకు సహకరించకుండా చేతులు ఊపుకుంటూ ఫ్లైట్‌ ఎక్కి హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో పడుకొని జగన్నాటకానికి తెరతీశారు. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఉండదని, రెండో సంవత్సరం బంగాళాఖాతంలో కలపమని, మూడో సంవత్సరం చెప్పులు వేయమని చెప్పిన జగన్‌ నాల్గవ సంవత్సరం కోడికత్తి డ్రామా ఆడుతున్నాడు.జగన్‌ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అని విచారిస్తే... జగన్‌లాంటి వ్యక్తులు బోర్డర్‌ లైన్‌ పర్సనాలిటి డిజార్డర్‌ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఒక భ్రాంతిలో ఉంటారని, వారు చెప్పిందే జరగాలని అనుకుంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారని తేలింది’’ అని మంత్రి దేవినేని దుయ్యబట్టారు.

devineni 1911208 3

రాజమహేంద్రవరంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ‘‘వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలందరికీ అర్థమయింది. దాడి జరిగి 20 రోజులు అయ్యాక జగన్‌ నోరిప్పాడు. వైసీపీ కోడికత్తి నాటకాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీబీఐలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీబీఐను వ్యతిరేకించాయి. తాజాగా మమతా బెనర్జీ కూడా వ్యతిరేకించారు’’ అని అన్నారు. ‘ప్రజల్లో విశ్వసనీయత తగ్గింది. ఈ నేపథ్యంలో సానుభూతి కోసం వైఎస్‌ జగన్‌ పాకులాడుతున్నాడు. అర సెంటీమీటర్‌ గాయమైంది. చేతులూపుకుంటూ విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ తరువాత పెద్ద గాయమైనట్లు, హత్యాయత్నం జరిగిందని ఆస్పత్రిలో చేరి డ్రామాకు తెరలేపారన్నారు. చంద్రబాబు ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. సీబీఐని అడ్డంపెట్టుకుని కేంద్రం కుట్రలు పన్నుతోంది. అత్యున్నత స్థాయిలో ఉన్న సీబీఐని దేశంలో నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ వద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని అనంతపురంలో మండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read