తెలంగాణాలో ఎన్నికల జరుగుతంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. అసలు ఇప్పటి వరకు చంద్రబాబు తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు కదా, అసలు హైదరాబాద్ లోనే అడుగు పెట్టలేదు కదా, అయినా ఎందుకు ఫిర్యాదు చేసరానుకుంటున్నారా ? ఇక్కడే ఉండండి అసలు విషయం. చంద్రబాబు పేరు చెప్తే చాలు కేసీఆర్ వణికి పోతున్నాడు. చంద్రబాబు అంటే ఎదో అనుకుని, అది ఒక పార్టీనా, దానికి 0.01 శాతం ఓట్లు కూడా లేవు, అలాంటి పార్టీ గురించి మాకెందుకు అంటూ, చెప్పిన కేసీఆర్, చంద్రబాబు రోజుకి ఒక దెబ్బ తీస్తుంటే, తట్టుకోలేక, కక్కలేక మింగలేక, ఇబ్బంది పడుతున్నారు. ఆ చిరాకులో, పబ్లిక్ మీటింగ్లలోనే బూతులు తిడుతున్నాడు.

ec 18112018 2

మరి కంప్లైంట్ ఇచ్చి, ఎన్నికల కమిషన్ ఆక్షన్ తెస్సుకోవాల్సింది, ఇలా బూతులు తిట్టే వారి మీద కాని, తన పని తాను చేసుకు పోతున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాదు కాదా. ఇంతకీ టీఆర్ఎస్ భయం ఏంటో తెలుసా ? చంద్రబాబు తెలుగు చానల్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ప్రకటనలు ఇస్తున్నారంట. ఆయన ఇచ్చుకుంటే వీళ్ళకు వచ్చిన బాధ ఏంటో మరి ? మా పోటీ గుజరాత్ లాంటి రాష్ట్రాలతో కాని, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమా మాతో పోటీకి అన్న కేసీఆర్, ఇప్పుడు ఎందుకు ఏపి అంటే అంత బాధ పడుతున్నారో మరి. తన ఎంపీ వినోద్ కుమార్ చేత ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేపించారు. చంద్రబాబు పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తున్నందన ఆ ప్రకటనలను నిలువరించాలని ఈసీని కోరారు.

ec 18112018 3

అయితే, మనకు ఉన్న చానల్స్ అన్నీ రెండు రాష్ట్రాల్లో వస్తాయి. దాన్ని ఎలా నిలువరిస్తారు ? ఎవరి రాష్ట్ర ప్రగతి గురించి, సంక్షేమం గురించి వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ తెరాస బాధ ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు 5 లక్షల ఇల్లు కట్టి అవి చూపిస్తున్నాడు, మరి తెలంగాణా ప్రజలు మా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏవి అంటే ఏమి చెప్తాడు ? అందుకని భయం... ఇక్కడ చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తున్నారు, మరి ఇవన్నీ నువ్వు ఎందుకు చెయ్యటం లేదని తెలంగాణా ప్రజలు అడుగుతారని కేసీఆర్ భయం. ఇప్పటికే వాళ్ళ పార్టీ అభ్యర్ధులు కనిపిస్తే చాలు, నువ్వు ఏమి చేసావని నీకు ఓట్లు వెయ్యాలి అని తరిమి తరిమి కొడుతున్నారు తెలంగాణా ప్రజలు, మళ్ళీ ఇక్కడ చంద్రబాబు అన్నీ చేసేస్తున్నాడని తెలంగాణా ప్రజలకు తెలిస్తే, ఎక్కడ ఇబ్బందో అని, ఏపి ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి, ఎన్నికలు అయ్యేదాకా చూపించ వద్దు అని ఫిర్యాదు చేసారు.

తెలంగాణా రాష్ట్రంలో మీడియా సంగతి ఎలా ఉందో చెప్పే పనే లేదు. తెలంగాణాలో ఎన్నో సమస్యలు ఉన్నా, కనీసం వార్తల్లో రావు. ఎంత సేపు కేటీఆర్ కు సినిమా వాళ్ళు చేసిన భజన తప్పితే తెలంగాణా వార్తలు నుంచి ఏమి ఉండవు. అదే ఆంధ్రాలో అయితే, చీమ చిటుక్కు మన్నా, ఇక ప్రపంచం అంతం అయిపోతుంది అన్నంత కలరింగ్ ఇస్తుంది హైదరాబాద్ మీడియా. అలాంటి హైదరాబాద్ మీడియా, ఎన్నికల సమయంలో కూడా వెన్నుముక లేకుండా కేసీఆర్ ను మోస్తుంది. ఒక పక్క సోషల్ మీడియాలో కేసీఆర్ ను ఉతికి ఆరేస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఏమి లేదు.

kcrmedia 18112018 2

తెరాస అభ్యర్ధి కనిపిస్తే తరిమి తరిమి కొడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటే, టీవీ చానల్స్ లో మాత్రం, అవేమి ఉండవు. ఎంత సేపు కేసీఆర్ ని ఆహా ఓహో అనటం, కూటమిలో లుకలుకలు అని చెప్పటమే. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితులో మరేదన్నా కాని, కెసిఆర్ కు సన్నిహితంగా ఉండే మీడియా అధినేత మాత్రం, ఈ మధ్య కొంచెం ఓపెన్ అప్ అవుతున్నారు. మాకు పరిమితులు ఉన్నాయి అని చెప్తూ, తెలంగాణాలో మీడియా స్వేఛ్చ గురించి చెప్పకనే చెప్తున్నారు. మా ఒత్తిడిలు మాకు ఉంటాయి, కాని సోషల్ మీడియా అలా కాదు అని వాస్తవం చెప్తున్నారు.

kcrmedia 18112018 3

మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోతోంది అంటూ తెలంగాణాలో వాస్తవ పరిస్థితి చెప్పకనే చెప్పారు. ప్రగతి నివేదన సభ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంగరకలాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదని, సోషల్ మీడియాలో మాత్రం, ఉతికి ఆరేసిందని అన్నారు. మొత్తానికి ఒక వాయిస్ తెలంగాణా నుంచి గట్టిగానే లేగిసే సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు అంటే, ఈ సాహసం చేసే వారు కాదేమో. కేసీఆర్ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టే, మీడియా నెమ్మిదిగా ఓపెన్ అవుతుంది. కనీసం ఈ 20 రోజుల్లో అయినా తెలంగాణా ప్రజలకు వాస్తవాలు చూపిస్తారని ఆశిద్దాం...

ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్‌ సాగర్‌లో రెండో రోజు ఎఫ్‌1హెచ్‌2ఓ-పవర్‌ బోట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.. ప్రధానంగా ఫార్ములా-1 అర్హత పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ఉర్రూతలూగించాయి. మూడు రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో అమరావతి బోట్‌ డ్రైవర్‌ అగ్రస్థానంలో నిలవాలంటూ.. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ప్రోత్సహించారు. శనివారం ఫార్ములా-1 అర్హత పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ రౌండ్లలో కేవలం కొన్ని సెకన్ల తేడాతో కొందరు, మిల్లీసెకన్‌ తేడాతో ఒక డ్రైవర్‌ తాము ఆశించిన స్థానాన్ని అందుకోలేకపోయారు.. అయితే, ఈ రేస్ చూడటానికి, హీరో మంచు మానోజ్ కూడా అమరావతి వచ్చారు. రేస్ చూసిన తరువాత మనోజ్ తన అనుభూతిని, సోషల్ మీడియాలో పంచుకున్నారు.

manoj 18112018 2

"Watch #F1H2O today..Thanks to Tourism Minister Akhila Bhuma and TeluguDesamParty for inviting me to such an crazy and great event conducted by our CM Nara Chandrababu Naidu...Great initiative and a proud moment for India and specially Telugu people ???? Was fun watching this with my fav Bhuvaneshwari garu... ‪#F1H2O_Amaravati ' అంటూ పోస్ట్ పెట్టారు మనోజ్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటింగ్‌ రేసుల్లో భాగంగా శనివారం జరిగిన రేసులో మనోజ్ పాల్గున్నారు.

manoj 18112018 3

మరో పక్క, స్థాయికి మించి రాణించిన అమరావతి టీమ్‌(ఐదో స్థానం)తో పాటు అబుదబీ టీమ్‌కు చెందిన షాన్‌ టొరెంటె(ప్రథమ స్థానం), ఎమిరేట్స్‌ రేసింగ్‌ టీమ్‌కు చెందిన మేరిట్‌ స్ర్టోమోయ్‌(ద్వితీయ స్థానం), అబు దబీ టీమ్‌కు చెందిన ఎరిక్‌ స్టార్క్‌(తృతీయ స్థానం), థాని అల్‌ కెమ్జీ (నాలుగో స్థానం), టీమ్‌ విక్టరీకి చెందిన అహ్మ ద్‌ అల్‌ హమేలీ(ఆరోస్థానం) ఫైనల్స్‌కు చేరుకున్నారు. టీమ్‌ అమరావతి ఫైనల్స్‌కు చేరుకుందని విన్న గ్యాలరీల్లోని ప్రజలు జై అమరావతి అంటూ హర్షధ్వానాలు చేస్తూ.. డ్రైవర్‌ ఆండర్సన్‌కు అభినందనలు తెలిపారు. ల్యాప్స్‌(లక్ష్యాన్ని)ను అతితక్కువ సమయంలో దాటిన రేసర్ల ప్రతిభను బట్టి విజేతలను నిర్ణయించారు. ప్రతిభకు పట్టం కట్టిన నిర్ణేతల న్యాయంతో అమరావతి టీమ్‌ ఫైనల్స్‌కు స్థానం దక్కించుకుంది.

అంతా అనుకున్నట్టే, ప్లాన్ ప్రకారం జరుగుతుంది. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లబ్ధి కోసం, పవన్, జగన్ ఆరాట పడుతున్న సంగతి తెలిసిందే. కాకపొతే, వ్యవహారాలు అన్నీ లోపల లోపల చేసుకుంటున్నారు. ఏది బయటకు చెప్పటం లేదు. రాజకీయాల్లో ఏదైనా ప్రజల ముందు చెయ్యాలి కాని, అన్నీ చాటు మాటు వ్యవహారాలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్న స్క్రిప్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణా ఎన్నికల విషయానికి వద్దాం. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పవన్, జగన్ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

pk 18112018 2

ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి అర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ముంబై వెళ్లారు. అదే సమయంలో ఎదో అవార్డుల కార్యక్రమంలో పాల్గునటానికి కేటీఆర్ కూడా ముంబై వెళ్లారు. వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులని నిలబెడతారాని, ఆంధ్రా ఓట్లు చీలిక కోసం, ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ రోజు కొంత మందికి బీఫారం లు కూడా పవన్ ఇస్తారని సమాచారం.

pk 18112018 3

ఇదంతా కేటీఆర్ తో భేటీ తరువాతే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరబాద్ లో అయితే, మీడియా కంట పడతారు కాబట్టి, ఈ వ్యవహారం అంతా ముంబైలో జరిగినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా అభ్యర్ధులని నిలబెడతారా, లేక టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ విషయం పై ముంబై మిర్రర్ అసిస్టెంట్ ఎడిటర్ కూడా ట్వీట్ చేసారు "అనూహ్యంగా, జనసేన తెలంగాణా ఎన్నికల్లో పోటీకి వస్తుంది. నిన్న ముంబైలో జరిగిన బేటీ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు" అంటూ ట్వీట్ చేసారు. అంటే కేటీఆర్ తో భేటీ నిజం అని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. చూద్దాం పవన్ ఏమి చేస్తారో..

Advertisements

Latest Articles

Most Read