వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో గుచ్చి 0.5 cm మేర దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కోడి కత్తితో గుచ్చినోడు జగన్ వీరాభిమాని అని అందరికీ తెలియటంతో, తమ బండారం బయట పడుతుందని, వైసీపీ మార్ఫింగ్ డ్రామాలు చేసింది. ఆ కోడి కత్తితో గుచ్చినోడు వైసీపీ కాదు, తెలుగుదేశం అని, ఒక నకిలీ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు. ఈ నకిలీ కార్డు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయటమే కాకుండా, సాక్షాత్తు ఆ పార్టీ అధికారప్రతినిధి జోగి రమేష్ కూడా ఆ నకిలీ కార్డు ను చూపించి మాట్లాడటం జరిగింది. అయితే అబద్ధాలను మార్ఫింగ్ ద్వారా చూపించాలి అన్న తొందరలో వైసీపి జఫ్ఫా బ్యాచ్ చేసిన మార్ఫింగ్ కార్డ్ లో పెద్ద కామెడీ ఏమిటంటే వాళ్ళు కార్డ్ లో చూపించినట్లు " ముమ్మిడివరం మండలం " అమలాపురం నియోజకవర్గంలో లేదు.. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉంది..

jogi 03112018 2

కనీస అవగాహన లేకుండా కేవలం ఫోటోషాప్ మాత్రమే తెలిసిన బ్యాచ్ ను నమ్ముకుని ఇలా " వెర్రి పప్పలు " అయిపోయారు. అతి పెద్ద కామెడీ ఏమిటంటే ఆ ఫోటో షాప్ బ్యాచ్ ని నమ్మి, జోగి రమేష్ విపి అవ్వటం. ఇదే విషయం లోకేష్ కూడా అన్ని ఆధారాలతో తన ట్విట్టర్ లో పోస్తే చేసారు. జానిపల్లి శ్రీనివాసరావు, అతని సోదరుడు సుబ్బరాజు పేర్లతో ఉన్న ఆ ఐడీ కార్డులు ఫేక్‌ గా తెలుగుదేశం నాయకులు తేల్చారు. వారిద్దరూ టీడీపీ సభ్యులుగా చిత్రీకరించేందుకు జరిగిన కుట్రను ఛేదించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో, ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని వైసీపీ నేత జోగి రమేశ్ కు నోటీసులు జారీచేశారు గుంటూరులోని, అరండల్ పేట పోలీసులు.

jogi 03112018 3

వాస్తవానికి దాడి జరిగినప్పుడే మీడియా ముందుకు వచ్చిన సుబ్బరాజు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమ్ముడికి జగన్‌, వైసీపీలంటే ప్రాణమని చెప్పాడు. కానీ, అన్నదమ్ముల పేర్లతో సభ్యత్వ కార్డులు రావడం ‘విచిత్రం. ప్రచారంలో ఉన్న సభ్యత్వ కార్డులపై నంబర్లు ఉండటంతో, అవి అసలైనవో, నకిలీవో గుర్తించడం టీడీపీ నాయకులకు సులువైంది. ఆ నంబర్ల ఆధారంగా అసలు కార్డులను మీడియాకు విడుదల చేశారు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు. ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాష్ట్రానికి నయవంచన చేసిన మోడీ మీద ప్రతి ఆంధ్రుడు రగిలిపోతుంటే, హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం, మోడీని ఒక్క మాట పడనివ్వటం లేదు. మొన్నటికి మొన్న తిత్లీ తుఫాను సాయం అంటూ 229 కోట్లు, మనకు కేటాయించిన విపత్తు నిధులు విడుదల చేసి, అదే మీకు మేమిచ్చే సహయం అని కేంద్రం నిస్సిగ్గుగా చెప్తే, అది నా చొరవే అంటూ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్.. కాని, ఆ డబ్బులు మనకు ప్రతి ఏటా ఇచ్చే విపత్తు నిధులే. ఈ విషయం పై కనీస అవగాహన కూడా పవన్ కు లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ధర్మపోరాట దీక్షలు పెట్టి, మోడీని ఏకి పడేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ చేసిన మోసాన్ని, రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు.

pk 03112018 2

18 విభజన హామేల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన మోడీ పై, ప్రతి జిల్లాల్లో సభులు పెట్టి మోడీని నిలదీస్తున్నారు. అయితే, ఈ విషయంలో పాపం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో కాని, చాలా బాధపడుతున్నారు. నిన్న ట్రైన్ లో జరిగిన షూటింగ్ గ్యాప్ లో, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు పెట్టి, మోడీని ఓ తిడుతున్నారని, అలా తిట్టకుండా, మోడీతో, ఎంతో సౌమ్యంగా మాట్లాడుకుని, మనకు రావాల్సినవి సాధించుకోవాలని పవన్ అన్నారు. ఇక మరో పక్క, జగన్ కోడి కత్తి ఎపిసోడ్ పై కూడా పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారు. ఒక పక్క జగన్ ని కోడి కత్తితో గుచ్చినది ఆయన అభిమానే అని అందరికీ తెలిసినా, అది జగన్, మోడీ, అమిత్ షా ప్లాన్ లోని, ఆపరేషన్ గరుడలోని భాగం అని ప్రజలందరికీ తెలిసినా, పవన్ మాత్రం, చంద్రబాబు పై విమర్శలు చేసారు.

pk 031120183

"జగన్‌పై దాడి జరగడం దురదుష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం వెకిలిగా మాట్లాడ్డం సరికాదు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి. దాడి కావాలని చేశాడా..? ఎవరైనా చేయించారా? కుట్ర ఉన్నదా అనేది పోలీసులు విచారణలో తేలాలి. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి. అంతే కాని, కోడి కత్తి అంటూ హేళన చేస్తారెందుకు" అంటూ పవన్ కళ్యాణ్, పాపం చాలా బాధపడ్డారు. మొత్తానికి, తన బాస్ అయిన మోడీ పై చంద్రబాబు చేస్తున్న దేశ వ్యాప్త ఉద్యమంతో, పవన్ కళ్యాణ్ బాగా హార్ట్ అయ్యారు. అందుకే, చంద్రబాబు, మోడీ పై దేశ వ్యాప్త పోరాటం చేస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తన పార్టనర్ కాబట్టి, రేపు అమిత్ షా ఆదేశాల ప్రకారం చచ్చే చెడు, ఇద్దరూ కలిసి పోటీ చెయ్యాలి కాబట్టి, జగన్ పై హేళనలను కూడా పవన్ తిప్పి కొట్టారు.

ఎంతో సహనంతో రాష్ట్రం కోసం నాలుగేళ్లు ఓపిగ్గా ఎదురుచూశానని, ఢిల్లి చుట్టూ తిరిగినా మోడీ ప్రభుత్వం హామీలు నెరవేర్చ లేదని, అందువల్లే తిరగబడి బయటకు వచ్చానని, ఇప్పుడు విపక్ష పార్టీలను కూడగట్టి మెడలు వంచుతా నని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర అభి వృద్ధితోపాటు తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం మార్టూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం తాను పడుతున్న శ్రమకు అడుగడుగునా అడ్డం పడతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఈ సమ యంలో దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడిగా తనవంతు బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం ఆసన్న మైనదని భావించానన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తె చ్చి వారికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమయ్యానన్నారు.

cbn 03112018 2

తానేం చేసినా తన స్వార్థం కోసం చేయడం లేదని, దేశం కోసం, భవిష్యత్‌ తరాల కోసం చేస్తున్నానని, దీనికి ప్రజల అండ కావాలని చంద్రబాబు కోరారు. ఏకపక్షంగా తనకు మద్దతు తెలిపి, 25 ఎంపీ సీట్లనూ గెలిపిస్తే ఢిల్లిని శాసిస్తానని, తాను చేయబోతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలకాలని సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే దశాబ్దాల వైరాన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపానని చంద్రబాబు అన్నారు. తనకు హస్తినకు వెళ్లే ఆలోచన లేదని, ఇక్కడే ఉండి కష్టపడతానన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు న మ్మక ద్రోహం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిందన్నారు. అదేమని అడిగితే దగా చేయడం మొదలెట్టారని, దీంతో తాను ధర్మపోరాటం చేస్తున్నానన్నారు.

cbn 03112018 3

తనను ఏమీ చేయలేక తనను నమ్ముకున్న వారిపై, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై, తెలుగు ప్రజలపై బీజేపీ కక్ష కట్టిందన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ దాడులు చేయించి భయపెట్టే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీకేం చేసిందంటూ ప్రజలను ప్రశ్నించారు. నోట్లు రద్దు చేసి, ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారని, జీఎస్టీ అమలు చేయలేక చతికల పడ్డారని, పెట్రోల్‌, డీజల్‌ ధరలు అడ్డగోలుగా పెంచేశారన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని రూపాయి విలువ పడిపోయిందన్నారు. ప్రజల సంక్షేమం పట్టకపోగా రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నారు. సీబీఐ, ఆర్‌బీఐ లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఈ దశలో దేశంలోనే ఒక సీనియర్‌ నాయకుడిగా నా బాధ్యతగా ఢిల్లి వెళ్లి అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగువారికి అన్యాయం జరిగితే బొబ్బిలిపులిలా విజృంభించాలని నాడు ఎన్‌టీఆర్‌ పిలుపునిచ్చారని, తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి వాళ్లను ఎదుర్కోవడమే తనకు తెలిసిన విద్యని చంద్రబాబు పేర్కొన్నారు.

గత కొద్ది రోజులుగా, ఏపి పోలీసుల పై, ముఖ్యంగా ఇంటలిజెన్స్ పై కేటీఆర్ ఓ పేలుతున్నాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి, తన రాజకీయం కోసం, ఏపి పై పడి ఏడుస్తున్నాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై, విచారణ చేసిన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు డబ్బులు పంచడానికి వచ్చారని స్థానికులు నిలదీశారని తెరాస నేతలు చేసిన ప్రచారం నిజం కాదన్నారు సీఈఓ రంజిత్ కుమార్. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదనే ధర్మపురి వచ్చారని వారిదగ్గర డబ్బు కూడా దొరకలేదని చెప్పారు. తమ విచారణలో కూడా ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదే వచ్చారని ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరగలేదని తేలిందని చెప్పారు.

ktr 03112018 2

ఈ ఆరోపణల పై ఏపి డీజీపీ కూడా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు మహాకూటమి తరఫున డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదం పై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని తెలిపారు. ‘ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీ-సీఈవో రజత్‌ కుమార్‌ షైనీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి సమాచారం తెప్పించుకుని తెలంగాణ సీఈవోకు డీజీపీ సమాధానం పంపించారు.

ktr 03112018 3

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీకి చెందిన కీలకమైన ఆస్తులు, వీఐపీల రక్షణకు పలు విభాగాలు పని చేస్తున్నాయి. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలపై రహస్య సమాచారం తెలుసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మా విభాగాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతర్గత భద్రతపై వివరాలు సేకరించేందుకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది’’ అని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచారనడం అసత్యం, నిరాధారమని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి... ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించారన్నారు.

Advertisements

Latest Articles

Most Read