ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు సంచనాలు సృష్టిస్తున్నారు. ఆయన ఢిల్లీటూర్‌తో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జాతీయ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల్లో సమూలంగా మారిపోయింది. ఇది నాయుడు ఫ్రంట్‌ అంటూ జాతీయ మీడియా విస్తృత కథనాలు ప్రచురిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత కలిసి నడవడం పెనుసంచలనమంటూ జాతీయ విశ్లేషణలు చేస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ncbn 0112018 1

1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. తర్వాత చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు... మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని, ఆయన మళ్లీ ప్రధాని అయితే మరింత అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే... మోదీ పాలన దేశానికే ముప్పుగా మారిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ncbn 0112018 1

ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొందరు ఇష్టపడడం లేదు. దీంతో కూటమి పక్రియ ఓ అడుగు ముందుకు రెండగులు వెనక్కు అన్నట్లు మారింది. దీంతో చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ప్రధాని మోదీ, అమిత్‌షాపై ప్రాంతీయ పార్టీలన్నీ రగిలిపోతున్నాయి. అయితే ఇన్నాళ్లు లోలోపల రగిలిపోయిన పార్టీలు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే ప్రాంతీయ కూటమి కోసం మంచి నాయకత్వం కోసం వెతుకుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు చొరవ తీసుకోవడం వారికి ఆశాకిరణంలా కనిపించింది. అందుకు మోదీ వ్యతిరేక కూటమిపై అంతా ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.

ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయడంలో మోదీ సఫలీకృతమయ్యారని... కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మోదీ విఫలమయ్యా రు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడో అతిపెద్ద భాష తెలుగుకు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు తల్లి బిడ్డగా తన మనసు క్షోభిస్తోందన్నారు. పైసా ఖర్చు లేని ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే ఇంత వివక్షా? అని ప్రశ్నించారు. తెలుగువారంతా తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది అని ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

cbn tweet 01112018 2

"భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు #StatueOfUnity వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా?ప్రతి తెలుగు వారూ అలోచించి,తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.

cbn tweet 01112018 3

భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్‌ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నిలదీశారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతం అయ్యారు.. కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా భాజపా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్‌ ఆక్షేపించారు.

2019 ఎన్నికలు కొత్త ఎత్తులకు, పొత్తులకు వేదికగా నిలుస్తున్నాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో అదే పార్టీతో కలిసి నడవబోతోంది. ఇప్పటి వరకు నీరూనిప్పులా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఏకం చేసిన ఘనత ప్రధాని మోదీకి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దక్కుతుంది. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన మోదీ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన వెంటనే ఏపీ కేబినేట్‌లో మంత్రులుగా ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ అవినీతి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

delhi 0112018 2

ఇది ఇలావుంటే కేంద్ర రాజకీయాల్లో సీఎం చంద్రబాబు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్‌డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. బుధవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలని, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తామని చెప్పారు. ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తానని స్పష్టం చేశారు. తనకు ప్రధాని పదవిపై కోరికలేదని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని తానేనంటూ ప్రకటించారు. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు.

delhi 0112018 3

‘‘బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడింది. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... నేను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశాను. మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది’’ అని చంద్రబాబు చెప్పారు. ఆయన ప్రకటించినట్లే చంద్రబాబు.. ఈ రోజు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. వారం వ్యవధిలోనే ఆయన రెండు సార్లు ఢిల్లీ పర్యటిస్తున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో పర్యటించి పలు పార్టీల నేతలను కలిశారు. చంద్రబాబు కలిసిన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాయావతిని కలిశారు.

కాంగ్రెస్ పార్టీకి చేతకానిది, మమతాకి చేతకానిది, చంద్రబాబు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి సెట్ చేసారు. మమత, కమ్యూనిస్ట్ లు, ఆప్, ఎన్సీపీ, ఫరుఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్, ఇలా అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు. దేశంలో వ్యవస్థలు నాశనం అవుతుంటే, అన్ని విపక్షాలని కలుపుకు వెళ్ళాల్సిన కాంగ్రెస్ వదిలేయటంతో, మోడీ-షా ని ఎదుర్కోవటానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ రోజు చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు చర్చలు చేపట్టారు. పర్యటనలో భాగంగా శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలపై మంతనాలు నిర్వహించారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో చర్చించామని తెలిపారు.

newdelhi 0112018 2

అలాగే సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామన్నారు. కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చామని తెలిపారు. శరద్‌పవర్‌ మాట్లాడుతూ.. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులల్లో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్‌ నేతలు అని చెప్పారు. దేశంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. సీనియర్‌ నాయకులుగా మేమంతా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేశారు. అందరం కలిసి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు, దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలనుకున్నామని వివరించారు.

newdelhi 0112018 3

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా రాహుల్‌తో సమావేశమయ్యారు. రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనకు వీణను బహూకరించారు. దేశంలో భాజపాయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుపైనే ప్రధానంగా రాహుల్‌తో చర్చించారు. రాహుల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read