జగన్ పై కోడి కత్తి దాడి తరువాత, దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు, పెద్ద వైసీపీ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అతన్ని తెలుగుదేశం పార్టీకి అంటకట్టటానికి, లోటస్ పాండ్ లో ఉన్న మార్ఫింగ్ బ్యాచ్, తెలుగుదేశం సభ్యత్వ కార్డుతో, అతని పేరు మీద ఒక సభ్యత్వ కార్డు తాయారు చేసి వదిలింది. అయితే, ఆ కార్డ్ నెంబర్ ద్వారా అసలైన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, ఈ గొడవలోకి నన్ను ఎందుకు లాగారు అంటూ బాధపడ్డారు. ‘‘చిన్ననాటి నుంచి నేను ఎన్టీఆర్‌ అభిమానిని. సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్టీఆర్‌ అభిమానిగానే కొనసాగుతున్నా. ఓటు పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తూ వీరాభిమానిగా ఉన్నా. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన కుటుంబానికి చెందినవాడిని. నా కార్డును ఫోర్జరీ చేసి ఈ విధంగా అలజడి సృష్టించటం దారుణం’’ అంటూ నంబూరి అంకాలు కన్నీటి పర్యంతమయ్యాడు.

bapatla 30102018 2

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అంకాలు నిరుపేద గిరిజన కూలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కార్డు వ్యవహారంలో నిజానిజాలను వివరించటానికి టీడీపీ శ్రేణులు అంకాలును మీడియా ముందకు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అంకాలు మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి పేరుతో నా టీడీపీ సభ్యత్వపు కార్డును ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోలి’’ అని డిమాండ్‌ చేశాడు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు.

bapatla 30102018 3

ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. మరో పక్క, ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్‌ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశం పై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.

ఆపరేషన్ గరుడ విషయం బయటకు చెప్పిన హీరో శివాజీని, అరెస్ట్ చేయాలంటూ విజయవాడ పోలీస్ కమీషనర్ కు వైసిపి నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు పై అమెరికా పర్యటనలో ఉన్న సినీ నటుడు శివాజీ స్పందించారు. వైసిపి నేతల వైఖరిని దుయ్యబడుతూ శివాజీ అమెరికా నుంచే ఒక వీడియో విడుదల చేశారు. అమెరికా నుంచే స్పందించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆపరేషన్ గరుడ విషయంలో వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని హీరో శివాజీ ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారం చెప్పానని, వైసీపీ నేతల ప్రేలాపన ఆపాలని హెచ్చరించారు.

sivaji 30102018 2

నాకున్న సమాచారం ప్రకారం నేను ఆపరేషన్ గరుడ గురించి చెప్పాను. నేను చెప్పిందే మీరు నిజం చేస్తున్నారు. మళ్లీ నన్నే తప్పుబడుతున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు, ఎందుకు పెట్టాలి అని శివాజీ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారని, రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలని కోరుతున్నారని, ఎందుకు ఇవ్వాలి, నేనేమైనా బ్యాంకులని మోసగించానా? రుణాలు ఎగ్గొట్టి అమెరికా వచ్చానా? అని శివాజీ మండిపడ్డారు. నా మీద ఫిర్యాదు చెయ్యాలంటున్న బీజేపీ వారిని ప్రశ్నిస్తూ, చంద్రబాబు ప్రభుత్వన్ని మూడు నెలల్లో పడగొడతాం, చుక్కలు చూపిస్తాం అని ఎందుకు అంటున్నారో కూడా విచారణ చెయ్యాలన్నారు.

sivaji 30102018 3

సిఎం చంద్రబాబు నాకు డబ్బులిస్తే నేను అమెరికా వచ్చానని వైసిపి నేతలు అంటున్నారు. నేను అమెరికా రావడం ఇదే మొదటిసారి కాదు, నా వీసా చెక్ చేసుకోండి, ఇప్పటికి 54 సార్లు అమెరికా వచ్చాను. అదీ 2010 నుంచి అనేక సందర్భాల్లో అమెరికా వచ్చా, నాకు ఛార్జీలకు డబ్బులు కూడా లేని పరిస్థితి, వేరే వాళ్లు డబ్బులు ఇస్తేనే అమెరికా వచ్చేంత హీన పరిస్థితి లేదన్నారు. అయినా కేంద్రం మీ చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటున్నారు. నా మీద మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేసుకోండి, తప్పు ఉందని తేలిస్తే మీ ఇష్టం వచ్చినట్లు శిక్షించుకోండి, అంతే తప్ప ఊరికే ఆరోపణలు చేయొద్దని హీరో శివాజీ తాను అమెరికా నుంచి విడుదల చేసిన వీడియోలో వైసిపికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు, ఐటి అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఐటి దాడులు చేస్తున్నారు. వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటి అధికారులు, అచ్చంగా ఏపిలోనే నివాసం ఉంటున్నారా అనే విధంగా, గత 20 రోజుల నుంచి, ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈ రోజు మళ్ళీ విశాఖలో తనిఖీలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌‌ టార్గెట్ గా ఆయన బంధువు, పేరం గ్రూప్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

it 29102018 2

నిన్న ప్రముఖ వ్యాపారి, టీడీపీ నేత, గుంటూరు వాసులకు గ్యాస్‌ నానిగా సుపరిచితుడైన కోవెలమూడి రవీంద్ర (నాని) ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే సుమారు 16 మంది ఐటీ అధికారులు మూడు బృందాలుగా విడిపోయారు. లక్ష్మిపురం మెయిన్‌ రోడ్డులో ఐటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నాని ఇల్లు, కార్యాలయంతో పాటు బ్రాడీపేట 3వ లైన్‌లోని గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయంలో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రవీంద్ర నా వద్ద ఎటువంటి డబ్బు లేదు, మీరు అన్నీ చూసుకోవచ్చు అని స్పష్టం చేసినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని తమతో తీసుకొని వెళ్లిన ఐటీ అధికారులు... నానిని కార్యాలయానికి వచ్చి కలవాలని చెప్పారు.

it 29102018 3

కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారికి ఆర్థిక సహకారం అందించే వ్యాపార వేత్తలపై ఐటీ దాడులు జరగవచ్చంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తుండే కోవెలమూడి రవీంద్రపై ఐటీ దాడులు జరగడంతో కలకలం రేగింది. రవీంద్రపై దాడితో వ్యాపార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి. సోదాలు పూర్తయ్యే వరకు వారంతా రోడ్డుపైనే ఉండిపోయారు. అధికారుల బృందం వెళ్ళిన తరువాత పార్టీ శ్రేణులు నానీని కలిసి పరిణామాలపై చర్చించాయి. అయితే ఈ విషయమై అటు ఐటీ అధికారులు కానీ ఇటు నాని కానీ స్పందించేందుకు నిరాకరించారు. బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.

వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి పై విచారణ మూడో రోజుకి చేరింది. ఠాణేలంక పెదపేటలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి సోదాలు చేసి.. తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. శ్రీనివాసరావు 20 రోజుల క్రితం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో గోదావరి ఒడ్డున కొంతమంది స్నేహితులకు శ్రీనివాసరావు భారీ విందు ఇచ్చాడని.. ఆ విందుకు ఒక యువతిని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విందుకు రూ.40 వేల వరకు చెల్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు.. అక్కడ ఏం మాట్లాడుకున్నారనే విషయాలపై సిట్‌ ఎస్‌ఐ వెంకట్రావు ఒక్కొక్కరినీ విడివిడిగా విచారిస్తున్నారు.

jagan 30102018 2

శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కాల్‌డేటా పరిశీలనలో అతడు ఏడాదిలో పదివేల కాల్స్‌ మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. వందమందితో ఎక్కువసార్లు సంభాషించాడని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. శ్రీనివాసరావుతో తరచూ మాట్లాడిన వారెవరు? ఏ అంశాలపై మాట్లాడారు? అన్నది కూపీ లాగుతున్నారు. వైకాపా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ‘కె.కె.’ అనే వ్యక్తితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అతన్ని సోమవారం విమానాశ్రయ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. దీంతోపాటు విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనిచేసే ముగ్గురు యువతుల సెల్‌ఫోన్ల నుంచి కూడా శ్రీనివాసరావు మాట్లాడాడని తేలడంతో వారినీ విచారించారు.

jagan 30102018 3

నిందితుడికి ప్రాథమికంగా మూడు బ్యాంకు ఖాతాలున్నాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో సున్నా, విజయా బ్యాంకులో రూ.350, ఎస్‌బీఐలో కేవలం రూ.56 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇంత తక్కువ మొత్తాలపై పోలీసులు విస్మయానికి గురయ్యారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజుకు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో రూ.80 వేలున్నట్లు గుర్తించారు. ఈ నగదు ప్రైవేటు వడ్డీ వ్యాపారినుంచి వచ్చినట్లు సమాచారం. శ్రీనివాసరావు తల్లి సావిత్రి, వదిన బేబిలకు ఠాణేలంక ఎస్‌బీఐ కియోస్క్‌లో ఖాతాలున్నాయి. ఉపాధిహామీ పథకం, గ్యాస్‌రాయితీ వంటి సొమ్ములు మినహా వాటిలోకి భారీగా నగదు బదిలీ జరిగే అవకాశం లేనందున అధికారులు వాటిని పరిశీలించలేదని తెలిసింది. శ్రీనివాసరావు తండ్రి జనిపల్లి తాతారావు పేరున రూ.2 లక్షల రుణం మంజూరు కాగా ఇప్పటివరకు రూ.1.15 లక్షలవరకూ బిల్లు చేసినట్లు గృహనిర్మాణ అధికారులు వివరించారు.

Advertisements

Latest Articles

Most Read