జీవితం ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది అని ఒక సినిమా డైలాగ్ ఉంది... అది నిజ జీవితంలో, పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డైలాగ్... ఒక పద్ధతిగా జీవితం బ్రతకకుండా, డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఏ రోజుకైనా బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. దానికి మరో ఉదాహరణ ఈ సంఘటన... ఈ ఫొటోలో... కటకటాల వెనుక దీనంగా నిల్చున్నది ఎవరో ఊహించారా? ‘సమరసింహా రెడ్డి’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా నిర్మాతగా ఒక వెలుగు వెలిగి... ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా నెగ్గిన చెంగల వెంకట్రావు! హత్యకేసులో శిక్షపడిన ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

changala 30062018 2

మలేరియా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌... అక్కడే ఖైదీలు చికిత్స పొందే విభాగాన్ని పరిశీలించారు. అందరు ఖైదీల్లాగానే చెంగలను పలకరించారు. అయితే... ఆయన సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అని తెలుసుకుని ఒకింత ఆశ్చర్యపోయారు. చెంగల వెంకట్రావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేసి పరాజయం పాలయ్యారు.

changala 30062018 3

2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీచ్‌ మినరల్స్‌ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఒక మత్సకారుడు మరణించాడు. ఇందుకు చెంగల వెంకట్రావు,ఆయన మద్దతుదారులే కారణమంటూ రెండో వర్గం కేసు పెట్టింది. దాదాపు పదేళ్లపాటు కేసు విచారణ కొనసాగింది. చివరకు గత ఏడాది మే 24న అనకాపల్లి జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టు చెంగల సహా 21 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. చెంగల జైలుకు వెళ్లక తప్పలేదు. ఓడలు బండ్లు కావడమంటే ఇదే..

జపాన్‌ దిగ్గజ సంస్థ ‘టోరే’ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్లతో చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 11న శంకుస్థాపనకు ముహూర్తం కూడా నిర్ణయించారు. టోరే అధ్యక్షుడు అకిహిరో నిక్కాకుతోపాటు రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, అమర్నాథరెడ్డిలు ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోని వెయ్యి భారీ పరిశ్రమల్లో ఒకటిగా టోరేకు గుర్తింపు ఉంది. ఈ సంస్థను 1926లో ప్రారంభించారు. మన దేశంలోని గురుగావ్‌లో సేల్స్‌, చెన్నైలో టోరే వ్యాపార కార్యాలయాలు ఉన్నాయి.

japan 30062018 2

ఆ సంస్థ మన దేశంలో ఒక మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టులో పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికత సాయంతో తయారు చేస్తారు. వీటిలో పిల్లలు, పెద్దలు వినియోగించే డైపర్స్‌ కీలకమైనవి. శ్రీసిటీలో స్థాపించే టోరే ప్లాంటులో 165 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తారు. ఇప్పటికే ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌, కింబర్లీ క్లార్క్‌, యూనీచార్మ్‌ వంటి సంస్థలు డైపర్ల తయారీలో ఉన్నాయి. వీటికి టోరే ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తాయని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు.

japan 30062018 3

చిత్తూరు జిల్లాలో తూర్పున పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఏర్పాటు చేసిన శ్రీసిటీ పారిశ్రామికవాడ అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచింది. వివిధ దేశాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. తూర్పు మండలాలు పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం. చక్కని రవాణా వ్యవస్థ, నీటివనరులతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉంది. ఇప్పటికే సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో శ్రీసిటీ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. పలు బహుళజాతి సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. శ్రీసిటీలో ఇప్పటికే సుమారు వంద వరకు పరిశ్రమలు ఏర్పాటై పని ప్రారం భిం చాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ నేతలు చెప్పే అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొడుతూ, ప్రజలకు ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ లతో సహా, చూపిస్తూ, బీజేపీ నేతలకు ఎండగడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పై, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, హేళన చేస్తూ, ఆయన్ను పర్సనల్ గా టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా, ఇలాగే కుటుంబరావుని ఇష్టం వచ్చినట్టు మాట్లడారు. దీంతో, ఈ రోజు కుటుంబరావు గారు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నోటికి ఏది పడితే అది వాగుతున్నా కాన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు పంపించారు కుటుంబరావు...

kutumbrao 29062018

తన పరువుకు నష్టం కలిగేలా కన్నా అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కుటుంబరావు తన నోటీసులో హెచ్చరించారు. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి, ఏది పడితే అది వాగుతూ, ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన పార్టీలో చేరటానికి రాత్రికి రాత్రి రెడీ అయ్యి, ప్రెస్ మీట్ పెట్టి, బ్యానర్లు కట్టి, అమిత్ షా ఫోన్ తో హాస్పిటల్ లో చేరి, బేరం కుదుర్చుకుని, బీజేపీ అధ్యక్షుడు అయిన చరిత్ర కన్నాది. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తిని తీసుకువచ్చి, బీజేపీ అధ్యక్షుడుని చేసుకున్న ఖర్మ బీజేపీది. ఇలాంటి థర్డ్ క్లాస్ గాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, కుటుంబరావు లాంటి చదువు, సంస్కారం ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ? అందుకే లీగల్ నోటీసు పంపించారు.

kutumbrao 29062018

కుటుంబరావు గారు, అనేక సందర్భాల్లో జీవీఎల్ ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు. అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అందుకే, కుటుంబరావు మీద వ్యక్తిగత కచ్చి పెట్టుకుంది బీజేపీ. ఈయన విషయం మొత్తం, ప్రజలకు చెప్తూ ఉండటంతో, వీరి అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మటం లేదని, అందుకే ఆయన వ్యక్తిత్వం పై దెబ్బ కొట్టే ఎత్తుగడ వేసింది. అయితే, ఈయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే, నోటీసు పంపించారు. ఇప్పడు కన్నా , ఏమి చేస్తాడో..

ఆంధ్రప్రప్రదేశ్‌ ప్రజల జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం కీలక భేటీ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన రెండో డీపీఆర్‌పై చర్చించినట్టు సమాచారం. సవరించిన అంచనాలతో ఇటీవల రూ.57,940 కోట్లతో ఏపీ సర్కార్‌ డీపీఆర్‌ సమర్పించడంతో దానిపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలోని కాస్ట్ ఎస్కలేషన్‌ కమిటీ సమావేశమైంది. జులై మూడో వారంలో సాంకేతిక సలహా కమిటీకి దీన్ని పంపుతామని కమిటీ సూత్రప్రాయంగా చెప్పింది. సవరించిన అంచనాలపై చర్చించి నివేదికను తయారు చేయనున్నట్టు వెల్లడించింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందితే ఆర్థిక సలహా కమిటీ ముందుకు.. అక్కడ ఆమోదం లభిస్తే నేరుగా కేంద్ర కేబినెట్‌ ముందుకు ఈ డీపీఆర్‌ వెళ్లనుంది.

polavaram 29062018 2

సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, చీఫ్‌ ఇంజినీర్లతో పాటు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కూడా హాజరయ్యారు. పోలవరానికి సవరించిన అంచనాలు గతేడాది ఆగస్టులోనే కేంద్రానికి పంపారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని అనుమానాలతో వెనక్కు పంపగా.. వాటికీ సమాధానాలిచ్చారు. కేంద్ర జలసంఘం అధికారులకు ఈ విషయాలపై స్పష్టత లేకపోవడంతో ఇంజినీరింగు అధికారుల్లో దిగువ స్థాయి బృందాలను వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు దిల్లీ పంపేవారు. వారు వారి పరిధిలో అంశాలకు మాత్రమే సమాధానాలిచ్చేవారు. భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సి ఉన్నందున ఈ వ్యయం భారీగా పెరిగిందని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నోసార్లు తెలియజేసింది. పార్లమెంటరీ ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్టీ కమిషన్‌సహా పలు జాతీయ కమిటీలు పర్యటించి రాష్ట్ర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి.

polavaram 29062018 3

అయినా కేంద్రం కొర్రీలు మానలేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీతోపాటు.. బీజేపీ, జనసేన పార్టీలూ పోలవరం భూ సేకరణపై ఆరోపణల సంధించడం ప్రారంభించాయి. 2013నాటికి భూ సేకరణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లే ఈ పద్దు అంచనాలు ఆకాశానికి ఎగబాకాయని రాష్ట్ర జల వనరుల శాఖ మొత్తుకుంటోంది. 2010-11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. ఈ మొత్తాన్ని దాదాపు ప్రభుత్వం ఖర్చు చేసింది. తుది అంచనాల ప్రకారం ఇంకా రూ.37,725.21 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులను పరుగులెత్తించాలంటే.. తుది అంచనాలను కేంద్రం తక్షణమే ఆమోదించి.. నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే గత ఏడాదిన్నరగా కేంద్రం వాస్తవ ధోరణిలో కాకుండా అనుమానాస్పద ధోరణిని ప్రదర్శిస్తూ.. కొర్రీల మీద కొర్రీలు వేస్తూనే ఉంది.

Advertisements

Latest Articles

Most Read