ఏసిబి డీజీ గా అవనీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఆర్‌.పి ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్‌.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆర్.పి. ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01 న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు నిర్వహించారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఆర్పీ ఠాకూర్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాఠూక్ మెడల్ పొందారు. ప్రస్తుతం ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి ఆర్.పి.ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఠాకూర్ సాబ్ ఆల్ ది బెస్ట్! మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఎన్నో ఉన్నాయి... ప్రత్యేక వాదులు...రాజకీయ ముసుగులోని అత్యంత అవనీతి పరులు...కేంద్రం వత్తాసుతో కుట్రదారులు.. కులాల కుంపట్లు...ప్రాంతాల మధ్య విద్వేషాలు...అల్లర్లు...అలజడులకుప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న క్లిష్ట పరిస్దితుల్లో బాధ్యతలు చేపడుతున్న ఠాకూర్ గారు, ముఖ్యమంత్రి మీమీద ఉంచిన బాధ్యత నమ్మకం నిలబెడతారని, నవ్యాంధ్ర ప్రగతిలో మీ మార్క్ చూపిస్తారు అని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్...

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు నిన్న, కన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే కోవలో, ప్రతి రోజు రంకెలు వేసే సోము వీర్రాజుకి మాత్రం, ముందుగా ఒక లేఖ రాసారు. నా మీద చేస్తిన ఆరోపణలు నిరూపించండి, లేకపోతే మీ మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని వీర్రాజుకు, కుటుంబరావు లేఖ రాశారు. ‘‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించండి. లేని పక్షంలో అసత్య ఆరోపణలు చేసినందుకు సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు సిద్ధంకండి’’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కుటుంబరావు, బీజేపీ నేతలను హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖలు పంపారు.

veerraju 30062018 2

‘‘నేను స్టాక్‌ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేశానని కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మీరు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మీ ఆరోపణలు ప్రసార సాధనాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. నా గౌరవానికి భంగం కలిగించే అసత్య ఆరోపణలు మీరు చేశారు. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి. నాపై మీకు ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఎవరో తక్షణం వారి వివరాలు నాకు తెలపండి. ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలపలేని పక్షంలో నాపై ఆరోపణలు మీరు చేసినట్లుగానే భావించి మీపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు దిగాల్సి ఉంటుంది’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

veerraju 30062018 3

కుటుంబరావు గారు, అనేక సందర్భాల్లో జీవీఎల్ ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు. అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అందుకే, కుటుంబరావు మీద వ్యక్తిగత కచ్చి పెట్టుకుంది బీజేపీ. ఈయన విషయం మొత్తం, ప్రజలకు చెప్తూ ఉండటంతో, వీరి అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మటం లేదని, అందుకే ఆయన వ్యక్తిత్వం పై దెబ్బ కొట్టే ఎత్తుగడ వేసింది. అయితే, ఈయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే, నోటీసు పంపించారు. ఇప్పడు కన్నా , వీర్రాజు ఏమి చేస్తాడో..

పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీ లక్ష్యం పెట్టుకున్న గృహ నిర్మాణశాఖ రెండో విడత సామూహిక గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. జులై 5న మూడు లక్షల ఇళ్లకు ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిచేసుకున్న ఇళ్ల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్నికల నాటికి 10 లక్షల కొత్త ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందులో ఇప్పటి వరకు 4 లక్షల పైచిలుకు లక్ష్యాన్ని పూర్తి చేసింది. గతేడాది అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తొలివిడతలో లక్ష ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు.

housing 30062018 1

అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన మరో 3 లక్షల ఇళ్లకు ఇప్పుడు గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణశాఖ విజయవాడలో పెద్దఎత్తున సభ నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు సభలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మొత్తం 662 మండలాల్లోని 12,755 గ్రామ పంచాయతీలు, 119 పట్టణ ప్రాంతాల్లోని 2,073 వార్డుల్లో గృహప్రవేశాలు చేయించనున్నారు. గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్ల సంఖ్య 3,00,306 ఉండగా, గృహప్రవేశాల రోజుకు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని గృహనిర్మాణశాఖ అంచనా వేస్తోంది. కాగా, ఎన్నికల సమయానికి ఇంకా సుమారు 6లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

housing 30062018 2

ఇన్ని ఇళ్ళు, ఇంత మంది లబ్ధిదారులు ఉన్నా, ఎక్కడా రూపాయి అవినీతి ఉండదు.. ప్రతిపక్షాలకు ఇవి అబద్ధం అని చెప్పే అవకశం ఉండదు. ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

మన రాష్ట్రాన్ని దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. కాని, మహా మేధావులు అయిన జగన్, పవన్ మాత్రం, మన రాష్ట్రంలోని యువతలో విష భీజాలు నాటుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మా కడపను నిర్లక్ష్యం చేస్తున్నాడు, మొత్తం అమరావతికే చేస్తున్నాడు అంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలి, అన్నీ అమరావతికి దోచిపెడుతున్నారు అంటాడు. ఈ మూర్ఖుల మాటలు ఎలా ఉన్నా, దేశం మాత్రం, కడపకు ఏమి చేసారు, ఉత్తరాంధ్రకు ఏమి చేసారో గుర్తిస్తుంది. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నీతిఆయోగ్‌ ప్రారంభించిన ‘ఆకాంక్షిత జిల్లాల’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఒకరిని చూసి ఒకరు అభివృద్ధి చెందేందుకు వీలుగా పెట్టిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు మంచి ముందడుగు వేశాయి.

niti 30062018 2

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల్లో జిల్లాలు స్వయంగా సమర్పించిన సమాచారం ఆధారంగా వాటి పురోగతిని లెక్కించి నీతిఆయోగ్‌ శుక్రవారం కొత్తగా 108 జిల్లాలకు డెల్టార్యాంకులు విడుదల చేసింది. ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం-జలవనరులు, ఆర్థిక సమ్మిళితం-నైపుణ్యాభివృద్ధి-మౌలికవసతులు అనే ఐదు రంగాల్లో అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. ఈ రెండునెలల్లో సాధించిన రాష్ట్రాల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. గత రెండునెలల్లో బాగా పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం 4, కడప 5, విశాఖపట్నం 14 ర్యాంకులో నిలిచాయి.

niti 30062018 3

విజయనగరం, కడప, విశాఖపట్నం జిల్లాలు ‘విద్యాపరంగా’ మంచి పనితీరు కనబరిచి 1, 4, 5 ర్యాంకులు సాధించాయి. ‘ఆర్థిక సమ్మిళిత పురోగతి’లో విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకు సాధించింది. అన్ని విభాగాలూ కలిపి చూస్తే 17.5% మార్కులతో విజయనగరం నాలుగు; 14.9% మార్కులతో కడప ఐదు; 11% మార్కులతో విశాఖపట్నం 14వ ర్యాంకు సాధించాయి. బేస్‌లైన్‌ ర్యాంకింగ్‌లో ఒకటోస్థానంలో నిలిచిన విజయనగరంజిల్లా గత రెండునెలల్లో సాధించిన పురోగతిలో నాలుగోస్థానాన్ని ఆక్రమించింది. ఇదివరకు నాలుగులో ఉన్న కడప ఇప్పుడు ఐదులో; 13లో ఉన్న విశాఖపట్నం 14వస్థానంలో నిలిచాయి.

Advertisements

Latest Articles

Most Read