ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు, తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారా ? అయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ సమయంలో, పరిమితి స్థాయిలోనే, అతి తక్కువ మందికి మాత్రమే స్వామి వారి దర్శనం జరుగుతుంది. ఇవి వివరాలు... తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం విలేకరులకు తెలిపారు. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని నిలిపివేశారు.

tiruamala 29062018 2

ఐదురోజుల పాటు పరిమిత సమయంలో కొద్దిమంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 30 వేల మందికి మించి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశాల్లేవని జేఈవో తెలిపారు. పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారని, శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉపఆలయాల మహాసంప్రోక్షణ చేస్తారని అన్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలకు ఉదయాస్తమాన సేవ భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 16న ఉదయం మహాసంప్రోక్షణ జరుగుతుంది. చివరి రోజున యాగశాలలోని ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి చేర్చడంతో వైదిక కార్యక్రమాలు సమాప్తమవుతాయి.

tiruamala 29062018 3

మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుందని ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు వివరించారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పై గతంలో కేంద్ర పర్యావరణశాఖ ఇచ్చిన స్టే ఉత్తర్వుల నిలుపుదలను పొడగించాలని కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జులైలో ఈ స్టే ఉత్తర్వుల నిలుపుదల గడువు ముగుస్తున్నందున తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ఫోన్‌ చేశారని జల వనరులశాఖ అధికారులు వెల్లడించారు. శాశ్వత ప్రాతిపదికన స్టే ఉత్తర్వులను నిలుపుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వగా డిమాండుగా ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఒడిశాలో ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే పూర్తి చేయాలని, పనులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరుతున్నారు. స్టే ఉత్తర్వుల ఫైలు ప్రస్తుతం కేంద్ర పర్యావరణశాఖ వద్ద ఉంది. అయితే అక్కడి అధికారులు మాత్రం వింత సమాధనం చెప్తున్నారు. సంబంధిత కార్యదర్శి విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

polavaram 29062018 2

ఇది ఇలా ఉంటే, ఈ విషయంలో కూడా మోడీ వైఖరి పై రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలగిన టీడీపీ.. తుదకు ఎన్డీఏ నుంచీ బయటకు వచ్చేసింది. కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. దరిమిలా బీజేపీ, టీడీపీ రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో.. లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు జరపాలని కాంక్షిస్తున్న మోదీ ఆలోచనలతో ఒడిసా సీఎం నవీన్‌ ఏకీభవించారు. ఇటీవల బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ పార్టీలతో కలవలేదు. కాంగ్రెస్‌, బీజేపీలకు దూరం పాటిస్తూనే ప్రధానికి సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. దీంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ నవీన్‌ రాసిన లేఖకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించే అవకాశం లేకపోలేదు.

polavaram 29062018 3

చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణితో ఉన్న మోదీ ప్రభుత్వం... స్టే ఆదేశాలను పొడిగించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుందేమోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న సందేహాలు రేగుతున్నాయి. వాస్తవానికి పోలవరం నిర్మాణానికి సంబంధించి రాష్ట్రం చేసిన వ్యయంలో ఇంకా రూ.1995 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. అయితే.. కేంద్రం నుంచి పూర్తిగా నిధులన్నీ వచ్చేశాయని, పెండింగ్‌లో ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర నేతలు గత రెండ్రోజులుగా అసత్య ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. ఇప్పుడు నిర్మాణ పనుల నిలిపివేతపై స్టే విషయంలోనూ మోదీ రాజకీయంగా వ్యవహరిస్తే పోలవరం పనులు స్తంభించిపోతాయని, ప్రాజెక్టు ముందుకు నడవకుండా బ్రేకులు పడిపోతాయని రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

 

నల్లధనాన్ని అరికట్టడానికి మేము చించేస్తున్నాం, పొడిచేస్తున్నాం.. మా మోడీ మీకు 15 లక్షలు వేస్తాడు అంటూ, ఊదరగొట్టిన బీజేపీ నేతలకు బిగ్ షాకింగ్ న్యూస్. స్విస్ బ్యాంకుల్లో పెరిగిపోతున్న భారతీయుల నల్లధనాన్ని చూస్తే భారత ప్రజలు షాక్ కు గురవ్వాల్సిందే. అకౌంట్లో మనీ పెంచుకోవడమే తప్ప, తగ్గించుకునే పనే లేదంటున్నారు బ్లాక్ మనీ హోల్డర్స్. ఏ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవంటూ నల్లధనాన్ని ఈజీగా దేశం దాటించి సేఫ్ స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చని ఏం చేయదులే అన్న ధీమా బ్లాక్ మనీ హోల్డర్స్ లో పెరిగిపోయినట్లు కన్పిస్తుంది. నోట్ల రద్దు తర్వాతే స్విస్ బ్యాంకుల్లో నల్లధనం 56 శాతం పెరిగిపోయింది.

blck 29062018 2

2017 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం 7వేల కోట్లు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో అన్నీ దేశాల వ్యక్తులకు చెందిన డబ్బు 2017 లో 3 శాతం పెరిగి 100 లక్షల కోట్లుగా ఉందని స్విస్ నేషనల్ బ్యాంక్(SNB) గురువారం(జూన్-28) విడుదల చేసిన యాన్యువల్ డేటా తెలిపింది. 1987 నుంచి స్విట్జర్లాండ్… బ్యాంకుల్లో మనీ వివరాలను ప్రజల ముందు ఉంచుతుంది. నిన్న స్విస్ నేషనల్ బ్యాంక్ విడదల చేసిన యాన్యువల్ డేటా వివరాల ప్రకారం… మూడేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో తగ్గుతూ వస్తున్న భారతీయుల బ్లాక్ మనీ 2017 లో భారీగా 56 శాతం పెరిగింది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ 45 శాతం తగ్గిపోయింది. 2006 చివరి నాటికే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ రికార్డు స్ధాయిలో 23 వేల కోట్లు ఉంది. సుప్రీం కోర్టు సూచనతో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం కేసుని ఛేధించడానికి ప్రభుత్వం ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.

blck 29062018 3

మరో పక్క, ప్రధాని మోడీ ప్రయాణ ఖర్చులు కూడా బయటకు వచ్చాయి. ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. 2014లో ప్రధాని పదవి చేపట్టనప్పటినుంచి ఇప్పటివరకూ 41 విదేశీ పర్యటనలు, 52దేశాల్లో నరేంద్రమోడీ పర్యటించారు. బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త భీమప్ప గదాద్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఇప్పటివరకూ మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు రూ.355 కోట్లు ఖర్చు అయినట్లు PMO తెలిపింది. ఈ నాలుగేళ్లలో 165 రోజులు విదేశాల్లోనే మోడీ బస చేశారు. ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్‌ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు PMOతెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలోని ఎక్కువదేశాల్లో పర్యటించిన భారత ప్రధానిగా, విదేశాల్లోనే ఎక్కువగా గడిపిన భారత ప్రధానిగా మోడీదే రికార్డు.

కడప ఉక్కుపై జిల్లాపరిషత్‌ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహారదీక్ష నేడు పదవ రోజుకు చేరుకుంది. రిమ్స్‌ వైద్యులు రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, సుగర్‌ లెవెల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు పేర్కొన్నారు. రమేశ్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వారన్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ప్రతి గంటకు ప్రభుత్వ వైద్యులు వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐసీయూలో వుంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి వుందని వైద్యులు సూచిస్తున్నా ఆయన మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఉక్కు దీక్ష కి మద్దతు తెలిపి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

ramesh 29062018 2

నిన్న కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు ఫోన్‌ చేసి దీక్ష విరమించాలని కోరారు. సుమారు 15 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడి ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఏపిీ ఎంపీలతో చర్చిస్తున్నానని వెంటనే దీక్ష విరమించాలని సూచించారు. కడపజిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే 9 రోజులకు స్పందించిన కేంద్రమంత్రి నుంచి తగిన సమాధానం వస్తుందని ఆశించిన సీఎం రమేష్‌కు నిరాశే ఎదురైంది. 10వ రోజు కొనసాగిస్తున్న దీక్షకు పలు సంఘాల నాయకులు, మహిళలు పెద్దసంఖ్యలో ర్యాలీగా వేదిక వద్దకు వచ్చి దీక్షకు సంఘీబావం తెలిపారు. దీక్ష శిబిరం వద్ద ఎలాంటి తోపులాటలు జరగకుండా, వచ్చే ప్రజలకు మంచినీరు, భోజనసౌకర్యం కల్పించడంలో చంద్రదండు వాలంటరీలు ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు.

ramesh 29062018 3

8 రోజుల పాటు ఆమరణదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని బుధవారం రిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తు న్నారు. పలువురు మంత్రులు రిమ్స్‌కు వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. మరో పక్క, ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీల సరదా సంబాషణ వీడియో బయటకు రావటంతో, సొంత పార్టీ కార్యకర్తలే వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క 10 రోజులుగా అలా దీక్ష చేస్తుంటే, వీరు ఇలా హేళనగా మాట్లాడుతుంటే, విజయసాయి రెడ్డి లాంటి వాడికి, పవన్ లాంటి వాడికి, ఇలాంటి వారికి తేడా ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళీమోహన్ పై చర్యలు తీసుకోవాలని, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read