మొక్కు చెల్లించటానికి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన కెసిఆర్, రాజధాని రోడ్లు చూసి కాంప్లిమెంట్ ఇచ్చారు. కెసిఆర్ తో పాటు ప్రోటోకాల్ లో భాగంగా, మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. గన్నవరం దిగిన దగ్గర నుంచి, దర్శనం అయ్యే వరకు, దేవినేని ఉమా అన్నీ దగ్గర ఉంది చూసుకున్నారు. ఈ సందర్భంగా, దుర్గమ్మ దర్శనం బాగా చేయించారని ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తన సమక్షంలోనే అమ్మవారికి ముక్కుపుడకను అలంకరించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో మాట్లాడి కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. కానీ ఆముదాలవలస సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారని సీఎంవో చెప్పారని.. హైదరాబాద్ వెళ్లగానే ఫోన్ చేస్తానని తెలిపారు.

uma 2806201 2

ఇదే సందర్భంలో రాజధాని రోడ్ల గురించి, దేవినేని ఉమాతో తన అభిప్రయన్ని పంచుకున్నారు. విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు. అలాగే ఎయిర్‌పోర్టు కూడా బాగుందని ప్రశంసించారు. బందర్ రోడ్డును బాగా విస్తరించారని.. ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు వరకు గ్రీనరీ బాగుందని మెచ్చుకున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు కూడా బాగున్నాయని తెలిపారు. చెట్లకు కూడా రంగులు వేసారని, వర్షం పడినా, ఎక్కడా పెద్దగా ఇబ్బంది కనిపించలేదని అన్నారు. ఈ సందర్భంగా, విజయవాడకు స్వచ్చ ర్యాంకింగ్స్ లో మొదటి వచ్చిన విషయం కెసిఆర్ కు చెప్పారు ఉమా.. రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న చర్యలు వివరించారు.

uma 2806201 3

కెసిఆర్ గతాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. బెజవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని గుర్తుచేశారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని ఎన్టీఆర్ అన్నారని జ్ఞాపకం చేశారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే అనేక సార్లు విజయవాడ వచ్చానని వెల్లడించారు. దుర్గగుడి బాగా మారిపోయిందని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కొండపల్లి బొమ్మను మంత్రి దేవినేని ఉమ బహూకరించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు పవిత్రసంగమం తన నియోజకవర్గంలోనే ఉందని దేవినేని ఉమ వివరించారు. దుర్గగుడి ఘాట్‌లను ఎప్పుడు అభివృద్ధి చేశారని దేవినేని ఉమను కేసీఆర్ ఆరా తీశారు. పుష్కరాల సమయంలోనే అభివృద్ధి చేశామని దేవినేని ఉమ బదిలిచ్చారు.

రైతు కుటుంబాలను ఆదుకోవడానికే చంద్రన్న బీమా తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రావికంటిపేటలోజరిగిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగ్గుశాస్త్రులపేట సమీపంలోని ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈనెల నుంచి రైతు బీమాను ప్రారంభిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమా, పాక్షిక అంగవైకల్యానికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామన్నారు.

cbn yeruvaka 28062018 2

రైతు ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుందన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటికొరతను అధిగమిస్తున్నామన్నారు. రైతు కూలీలకు న్యాయం జరగాలని, వారికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు పెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయంలో కొత్త మెళకువలు తెలుసుకోవడంతో పాటు రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షల మొత్తాన్ని బాధిత రైతు కుటుంబానికి అందజేసే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతు లేకపోతే తిండిలేదు.. అలాంటి రైతులు చేసే వ్యవసాయానికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.

cbn yeruvaka 28062018 3

2004-2014 మధ్య కాలం ఓ భయంకరమైనదని అభివర్ణించారు. ఆ కాలంలో విత్తనాలు, ఎరువులు దొరికేవి కాదని విమర్శించారు. ఒక్కో రైతుకు రెండు లాఠీ దెబ్బలు, ఒక్క ఎరువు బస్తా దొరికేదని గుర్తుచేశారు. ఆ రోజులను రైతులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ విత్తనాల సమస్య ఉండేదని.. ఆ సమయంలో అన్నీ సమస్యలేనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్‌కొరత లేదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రైతులకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగానికి రూ.82వేల కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. సాంకేతికతను అనుసంధానం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని, శాస్త్రీయ వ్యవసాయం చేయాలని, యాంత్రీకరణపై దృష్టి పెట్తాలని చంద్రబాబు రైతులకు సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలన్నారు. నదుల అనుసంధానం పూర్తిచేసి నీటి కొరతను అధిగమించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటపేట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేసి గురువారం ఉదయం ప్రారంభించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఎడ్లతో నాగలి పట్టి దుక్కిదున్నారు. విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి సాంప్రదాయపద్ధతికీ, యాంత్రీకరణ పద్ధతి గురించి వ్యవసాయ శాస్త్రవేత్త చిన్నంనాయుడును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు శాస్త్రవేత్త చిన్నంనాయుడు బదులుస్తూ విత్తనం ఖర్చు 50 శాతం తగ్గుతుందని, అలాగే సాగు ఖర్చు ఎకరానికి రూ. 4 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు.

cbn tractor 28062018 2

అలాగే దిగుబడిలో యాంత్రీకరణకు, నేరుగా వేసే పద్ధతులకు గల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. యాంత్రీకరణ ద్వారా ఎకరాకు 28 నుండి 32 బస్తాల వరకు దిగుబడి వస్తుందనే వివరాలను శాస్త్రవేత్తలు ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా ఈ యంత్రం ద్వారా విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.850/-లు అవుతుందని, దీనిద్వారా ఒకే పద్ధతిలో వరుసగా వస్తుందని అన్నారు. , వెదజల్లే పద్ధతికి, యాంత్రీకరణకు అయ్యే ఖర్చు సరిసమానంగా అవుతుందని, యాంత్రీకరణ పద్దతి ద్వారా రెండు మూడు బస్తాల వరకు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.

cbn tractor 28062018 3

అనంతరం సీడ్ డిబ్లర్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. యంత్రం ద్వారా ముఖ్యమంత్రి నాట్లు వేసారు. తొలుత హెలీప్యాడ్ నుండి సాంప్రదాయ వస్త్రధారణతో ఎడ్లబండిపై ఏరువాక కార్యక్రమం వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకు ధింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు కిమిడి కళా వెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి,డా. బెందాళం అశోక్, కలమట వెంకటరమణమూర్తి , గాదె శ్రీనివాసులనాయుడు, ఆమదాలవలస పురపాలక సంఘ చైర్ పర్సన్ తమ్మినేని గీత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అందుచేత దీక్ష విరమించాలని కోరారు. అయితే అధికారిక ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని రమేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వు లేకుండా ఎలా దీక్ష విరమించమంటారని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమకు 3వేల ఎకరాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు ఫోన్‌ చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు చెప్పిన సీఎం రమేశ్‌.. తాను రాష్ట్ర ప్రజల కోసం ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు.

ramesh 28062018 3

కడప చాలా వెనుకబడిన జిల్లా అని, ఉక్కు పరిశ్రమ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించినదని చెప్పారు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్‌ కేంద్రమే తీసుకోవాలని, తమకెలాంటి క్రెడిట్‌ అవసరం లేదని కేంద్రమంత్రికి స్పష్టంచేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని భాజపాకు మంచి పేరు వస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్‌బాడీని చూస్తారని బీరేంద్రసింగ్‌తో రమేశ్‌ అన్నారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రధానితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

ramesh 28062018 2

బీరేంద్ర సింగ్‌ను గురువారం టీడీపీ ఎంపీలు కలిసారు. 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలిని రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు. ఆ లేఖపై చర్చలు జరిపిన అనంతరం బీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు. అధికారులతో చర్చల తర్వాతే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్‌కు పంపినట్టు ఏపీఎండీసీ చైర్మన్‌ వెంకయ్యచౌదరి చెప్పారు. ఆ పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/4X0Rfu2mmkI

Advertisements

Latest Articles

Most Read