పులివెందుల పులి బిడ్డ అంటూ, చెప్పుకునే జగన్ పై, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సర్వే చేసారు. అన్ని నియోజకవర్గాల్లో చేసినట్టే, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పై కూడా సర్వే చేసారు. అయితే ఈ రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదే షాకింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి జగన్ కు ఇచ్చాడు ప్రశాంత్ కిశోరే. అయితే, ఈ సర్వే పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు, మళ్ళీ సర్వే చెయ్యమన్నట్టు వార్తలు వచ్చాయి. నేనే సియం అని ఆంధ్రా అంతా అనుకుంటుంటే, ఇదేమి సర్వే అంటూ జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జగన్ ఎంత చెప్పినా వినడు కాబట్టి, మరో సారి సర్వేకి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.. ఇదేదో సామెత ఉన్నట్టు, అక్కడ ఉన్నది వస్తుంది కాని, లేనిది ఎక్కడ నుంచి వస్తుంది.. ఇంతకీ ఆ సర్వే ఏంటో చూద్దాం...

pulivendula 14062018 2

నాలుగు దశాబ్దాలుగా, పులివెందుల అంటే వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోట... ఈ విషయం అందరికీ తెలిసిందే. పులివెందుల మెజారిటీ పైనే, కడప ఎంపీ సీటు కూడా ఆధారపడి ఉంటుంది అంటే, అంత మెజారిటీ వస్తు ఉండేది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్‌ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే జగన్ హాయంలో అంతా రివర్స్ లో ఉంది వ్యవహారం.. చివరకి సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీని స్థితికి పడిపోయాడు జగన్.. ఎప్పుడూ లేనిది వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి అంటే ఏంటో తెలిసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఈ మైనస్ ఉండగానే, చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు.

pulivendula 14062018 3

నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులకు సరైన తాగు- సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడి ప్రధాన సమస్య కూడా. వైఎస్‌ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు- సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే అక్కడ ప్రజలను ఆకట్టుకునేలా చేస్తుంది. ఎప్పుడూ లేనిది, పులివెందులలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే.. భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. మరో పక్క సంక్షేమం కూడా పీక్స్ లో ఉంది. ఇవన్నీ ఇప్పుడు పులివెందుల ప్రజలు ఆలోచించేలా చేస్తున్నాయి.

జగన వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు ఇప్పటికే వచ్చాయి. వైఎస్ వివేక ఓటమితోనే అది రుజువైంది. అయితే, ఈ పరిణామాల్లో సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్ కు, షాకింగ్ రిజల్ట్ కనిపించింది. ఈ సారి జగన్ మెజారిటీ 10 వేలు కూడా దాటదు అని సర్వే రిజల్ట్ వచ్చింది. దీని ప్రభావం, కడప ఎంపీ సీటు పై పడి, అది ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఇంకా సంవత్సర కాలం ఉండగానే, ఇలా ఉంటే, ఎన్నికల సమయానికి ఇంకా పోజిటివ్ ఓటు పెరుగుతుంది అని, పులివెందుల సీటుకే ఎసరు రావచ్చని, మరో సీట్ పై కూడా కన్నేసి ఉంచాలని, ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ తయారు చేసి, జగన్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే, జగన్ మాత్రం తన సహజ స్వభావాన్ని చూపించి, పులివెందుల ఈ సారి లక్ష మెజారిటీ వస్తుంది, ఈ సర్వే తప్పు, మరో సారి సర్వే చెయ్యమని, ప్రశాంత్ కిషోర్ కు చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియటం లేదు.. ఎక్కడో బీహార్ లో రోడ్లు ఉన్న ఫోటోలు తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ అంటారు... ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు తంతంటే, పవన్ సభ కోసం వస్తుంటే పోలీసులు తంతున్నారు అంటారు.. ఇక లోటస్ పాండ్ నుంచి వచ్చే ఫేక్ న్యూస్ లు అయితే, లెక్క లేనన్ని.. యుట్యూబ్ ఓపెన్ చేస్తే, చెత్తా చెదారంతో నింపేస్తున్నారు... ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా, బీజేపీ, పవన్, జగన్ కలిసి, కోఆర్డినేట్ చేసుకుంటూ, చంద్రబాబు పై విష ప్రచారం చేసి, తప్పుడు వార్తలతో, ఎక్కడో జరిగినవి తీసుకొచ్చి, మన రాష్ట్రంలో జరిగినట్టు చెప్తూ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చేలా, అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ ముఠాలు అన్నీ హైదరబాద్ నుంచి పని చేస్తున్నాయి.

pawan 13062018 2

ఈ నేపధ్యంలో, హైదరబాద్ నుంచి , పవన్ ఫాన్స్ పేరుతో రన్ అవుతున్న పేజీల్లో, ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు.. వారు ప్రచారం చేస్తున్న ప్రకారం, విజయవాడ పోలీసులు, మన బైక్ లు పై, పవన్ కళ్యాణ్ ఫోటో కాని, జనసేన ఫోటో కాని ఉంటే, మీ బైక్ ను ఆపి, ఫైన్ వేస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రచారం మొదలు పెట్టారు. మరో పేజిలో ఇదే వార్తను, మీరు ఎన్నైనా చేసుకోండి, మా వెంట్రుక అంటూ, పెట్టారు.. వీరి విపరీత ప్రచారానికి, చివారకి పోలీసులు పై కూడా, విషం చిమ్ముతున్నారు. ఇలా చేస్తూ, పవన్ ఫాన్స్ ని రెచ్చగొట్టి, తద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లు చూసి, కొంత మంది ఫాన్స్ నిజమే అనుకుని, పోలీసుల పై, ప్రభుత్వం పై అసభ్యంగా పోస్ట్ లు కూడా పెట్టారు..

pawan 13062018 3

అయితే, ఈ విషయం విజయవాడ పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో విజయవాడ సత్యన్నారాయణ పురం పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోస్ట్ ల స్క్రీన్ షాట్ చూపిస్తూ, ఇలాంటివి నమ్మవద్దు అంటూ ప్రజలను కోరారు. పోలీసులుగా మాకు పక్షపాతం లేకుండా, ట్రాన్స్ పేరెంట్ గా, పబ్లిక్ ఫ్రెండ్లీతో, బాధ్యతగా పని చెయ్యటమే తెలుసు. విజయవాడ ప్రజలకు ఇది బాగా తెలుసు. ఇలాంటి ఫేక్ న్యూస్, పుకార్లు వ్యాప్తి చేస్తే, లీగల్ గా ఆక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి పోస్ట్ చేసిన అడ్మిన్స్ వెంటనే ఇవి డిలీట్ చెయ్యవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ, అలాంటి పుకార్లు పుట్టించే వారికి, గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా, ఇలాంటి వాటి పై పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేస్తున్న సోషల్ మీడియా పై, ఒక పాలసీ రావల్సిన అవసరం ఉంది.

ఢిల్లీలో ఈనెల 17వ తేదీ ఉదయం నిర్వహించనున్న నీతి ఆయోగ్ (NITI Ayog) 4 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని 18 వ తేదీకి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడిక్కడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. ఈనెల 16 వతేదీన రంజాన్ పండుగ ఉందని, ముస్లింలకు ఇది పెద్దపండుగ అని, అలాగే 17వ తేదీ ఉదయం ఈద్ మిలాప్ ఉందని, అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను రాజధాని అమరావతిలో ఉండాల్సి ఉందని, ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని 18వ తేదీకి లేదా కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. తమ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.

muslim 13062018 2

ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

muslim 13062018 2

వ్యవసాయరంగంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశంలో, ఇ-నామ్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, భూసార స్థితి కార్డులు తదితర అంశాలపై ఆయన అధికారులతో మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.  ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వస్థ సురక్షా మిషన్ , పోషణ్ మిషన్ (Poshn Mission), మిషన్ ఇంధ్రధనుష్‌ అమలు వివరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో జలసంరక్షణకు, నదుల అనుసంధానానికి నరేగా నిధులను ఏమేరకు వినియోగించాం? మెరుగైన ఫలితాల సాధనకు నరేగా నిధులను ఎలా ఉపయోగించాలో నివేదికలో వివరాలు పొందుపర్చాలని కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలో ఏం చేయవచ్చో సూచనలివ్వాలని కోరారు.

అందరి టార్గెట్ చంద్రబాబు... బీజేపీ, పవన్, జగన్ తెర ముందు డైరెక్ట్ గా, కలిసి చంద్రబాబు పై పోరాటం చేస్తుంటే, వెనుక నుండి ముద్రగడ, ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి ఉన్నారు. వీరి అందరి టార్గెట్ చంద్రబాబుని దించటం. మొన్నటి వరకు జగన్, ముద్రగడ మాత్రమే ఈ లిస్టు లో ఉండేవాడు.. ఒక్కసారి చంద్రబాబు బీజేపీని డీ కొట్టటంతో, బీజేపీ వీరందరి చేత, చంద్రబాబు పై దాడి చేపిస్తుంది.. వింత ఏమిటి అంటే, చంద్రబాబుని ఇబ్బంది పెడతాం అని చెప్పి మరీ, దాడి చేస్తుంది.. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గట్టిగా అడగటం.. దగా పడ్డ రాష్ట్రానికి, విభజన హామీలు నెరవేర్చండి అని అడగటం.. మాకే ఎదురు తిరుగుతువా అని ఢిల్లీ పెద్దలు, మన ముఖ్యమంత్రి పది దాడి చేస్తుంటే, వీరందరూ ఆ ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నారు.

motkupalli 13062018 2

అయితే ఇప్పడు కొత్తగా మోత్కుపల్లి నరసింహులును కూడా రంగంలోకి దింపేందుకు ఆయనతో వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మంతనాలు జరిపారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ నేతగా మోత్కుపల్లి వైసీపీలో చేరలేదు. కానీ ఆ పార్టీ స్పాన్సర్‌షిప్‌తో చంద్రబాబును విమర్శించడానికి రెడీ చేయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. ఆంధ్రాలో మా జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధ్దిచెప్పే సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి రావాలని ఆయన మోత్కుపల్లిని కోరారు.

motkupalli 13062018 3

అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత వారం తిరక్కుండానే ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఢీ కొట్టడానికి తన ఇమేజ్ మైనస్‌గా మారడం జగన్‌ను కలవరపెడుతోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి, వెంటాడుతున్న ఈడీ కేసులు జగన్ అభత్రాభావానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు పనిమంతుడనే ఇమేజ్‌ను వీలైనంతగా తగ్గిస్తేనే తనకు ప్లస్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న వారందరినీ కూడగట్టి ‌రాజకీయ విమర్శలకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read