రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు పరుగులు పెడుతున్నాయి. ఉపాధికి భరోసా కల్పిస్తూ రెండు నెలల్లోనే 15వందల కోట్లకు పైగా నిధులు ఖర్చుచేసి సరికొత్త రికార్డు సృష్టించింది ప్రభుత్వం. కూలీలకు 760 లక్షల పని దినాలు కల్పించడంతో పాటు జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత రెండు నెలల్లో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై కేంద్రం అన్ని రాష్ట్రాల పనితీరును విశ్లేషించి తాజాగా ర్యాంకులు ప్రకటించింది. మొత్తం ఐదు కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగింటిలో ప్రధమస్థానంలో నిలిచింది. పనుల నిర్వహణ, కూలీల పనిదినాల కల్పన, జాబ్‌ కార్డులు పొందిన కుటుంబాలకు పని కల్పించడం, వ్యక్తిగత ఆస్తుల ఏర్పాటులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.

cbn 15062018 2

కూలీలు గత మూడేళ్ల కంటే అత్యధికంగా కనీస వేతనాలు అందుకుంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలో కూలీలకు 760 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో రూ.1526కోట్ల వేతన నిధులు ఖర్చుచేశారు. గత ఏడాది ఇదే రెండు నెలల్లో చేసిన ఖర్చుతో పోల్చితే ఇది 36శాతం ఎక్కువ. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91.84 లక్షల పనిదినాలు కల్పించారు. గత రెండు నెలల్లో చేపట్టన ఉపాధి పనులకు హాజరయిన కూలీలకు గరిష్ఠంగా రూ.200 కనీస వేతనం అందుతోంది.

cbn 15062018 3

ఈ ఏడాది ఉపాధి కూలీల కనీస వేతనం 205 రూపాయలుగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 70లక్షలకు పైగా ఉన్న జాబ్‌ కార్డు హోల్డర్లలో రోజూ దాదాపు 28లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. సరాసరి వీటి సంఖ్య 18లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇదే విషయం, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ ద్వరా వెల్లడించారు.. ఆయన ట్వీట్ ఇది "ఉపాధిహామీ పనుల్లో రాష్ట్రం రికార్డు సృష్టించి, జాతీయస్థాయిలో తొలి స్థానంలో నిలిచింది. గత రెండు నెలల్లో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై అన్ని రాష్ట్రాల పనితీరును విశ్లేషించిన కేంద్రం తాజాగా ర్యాంకులు ప్రకటించింది. మొత్తం 5 కేటగిరీల్లో నాలుగింటిలో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానంలో నిలిచింది."

గన్నవరం నుంచి నుంచి సింగపూరుకి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు కొన్ని రోజుల క్రిందట ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ మార్గంలో ప్రస్తుతం ఉన్న చార్జీల క్రమంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, ఇదేదో ఫోర్మలిటీగా చేసారు. ప్రజల నుంచి ఎదో రెస్పాన్స్ వస్తుందిలే అనుకున్నారు కాని, ప్రజాలు మాత్రం అనూహ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు.

gannavaram 15062018 2

విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. దీంతో, విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి గురువారం దిల్లీ వెళ్లారు.

gannavaram 15062018 3

విజయవాడ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి బయలుదేరాలంటే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనేకమంది ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో నెలాఖరులోగా సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే కేంద్రం నుంచి అనుమతుల జారీలో జాప్యమయ్యే అవకాశం ఉండడంతో వచ్చే నెలలో విమానయాన సేవలు ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సిల్క్‌ ఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌ తదితర సంస్థలు విజయవాడ- సింగపూర్‌ మధ్య విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ- నాగార్జునసాగర్‌, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.

సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన వర్చువల్‌ తనిఖీల సందర్భంగా క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. అక్కడికక్కడే ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. గుంటూరు జిల్లాలో వల్లభాపురం-చిన్నపాలెం రోడ్డు, విజయవాడలో స్వరాజ్యమైదానం, రైతుబజారు వద్ద చెత్త డంపింగ్‌పైనా తొలిసారిగా వర్చువల్‌ తనిఖీలు నిర్వహించారు. వల్లభాపురం రహదారిలో కల్వర్టు నిర్మించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పరిశుభ్ర నగరమని తెలిసినా పారిశుద్ధ్య పరిస్థితులను ఎందుకు నిరంతరం పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు.

cbn 15062018 2

ముఖ్యమంత్రి వర్చువల్‌ తనిఖీ సాగిందిలా.. గుంటూరు జిల్లా వల్లభాపురం-చిన్నపాలెం రోడ్డులో కల్వర్టు నిర్మించకుండా మొదట రోడ్డు వేశారు. అనంతరం కల్వర్టు నిర్మాణం కోసం రోడ్డును తవ్వేశారు. దీనిపై ‘డెల్టా రోడ్డు ఉల్టా’ శీర్షికతో పత్రికల్లో కథనం రావడంతో స్పందించిన సీఎం ఈ రోడ్డు పరిస్థితిని వర్చువల్‌ తనిఖీ చేశారు. అధికారులు, సీఎం మధ్య సంభాషణ ఇలా సాగింది.. సీఎం: ఈ రోడ్డు పంచాయతీరాజ్‌దా.. రోడ్లు భవనాల శాఖదా? అధికారులు: పంచాయతీరాజ్‌ శాఖది సర్‌. సీఎం: ఏఈ, డీఈలను లైన్‌లోకి తీసుకోండి. అధికారులు: క్షేత్రస్థాయిలో అందుబాటులో లేరు సర్‌.సీఎం: ఉదయమే సమాచారం ఇచ్చారు కదా.. ఏఈని సస్పెండ్‌ చేయండి. ఇంతవరకు మెత్తగా చెప్పాను. ఒకరిద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటే మొత్తం సర్దుకుంటుంది. పనులు సరిగా చేయకపోతే గుత్తేదార్లపైనా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే బ్లాక్‌ లిస్టులో పెడతాం. ఈలోపు పంచాయతీరాజ్‌ ఈఈ సుబ్రహ్మణ్యంకు ఇంజినీర్‌ఇన్‌చీఫ్‌ ఫోన్‌ చేసి ముఖ్యమంత్రికి ఇచ్చారు.సీఎం: ఒక రోడ్డుకు పైపులు వేయనందుకు ప్రభుత్వం పరువుపోతోంది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మీకు బాధ్యతలేదా? ఎందుకు పూర్తి చేయరు? ఈఈగా ఉన్నావ్‌.. ఏఈ ఎవరు? రోడ్డు 2016లో మంజూరైతే ఇప్పటి వరకు ఎందుకు కల్వర్టు పూర్తి చేయలేదు. వర్షాలు వస్తాయని తెలిసి మేలోనే ఎందుకు పూర్తి చేయలేదు?

cbn 15062018 3

విజయవాడలోని స్వరాజ్‌మైదానం దగ్గర చెత్త డంపింగ్‌పై.. అధికారులు: రైతు బజార్‌ వద్ద నిత్యం చెత్త వేస్తారు సర్‌..! సీఎం: నిత్యం ఉండేదేనా! అక్కడ చెత్త వేయడానికి ఆదేశాలు ఏమైనా ఇచ్చారా?(ఆగ్రహం వ్యక్తం చేస్తూ...) అధికారులు: ఉదయం పత్రికలో రావడంతో చాలావరకు శుభ్రం చేశారు సర్‌.. సీఎం: కమిషనర్‌ నివాస్‌ ఎవరు దీనికి బాధ్యులు? మైదానం పరిశుభ్రత బాధ్యతలు ఎవరివి? కమిషనర్‌: అదనపు వైద్య, ఆరోగ్య అధికారి(ఏఎంహెచ్‌వో)సర్‌.. సీఎం: ఆయన్ని వెంటనే సస్పెండ్‌ చేయండి. విచారణ జరిపించండి.

పోలవరంపై వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. గురంవారం ఉదయం జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ...పోలవరంలో రికార్డుస్థాయిలో 11వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకు వెళుతూ ఉంటే ప్రాజెక్టును, అక్కడ రేయింబవళ్లు పనిచేస్తున్న వందలాది ఇంజనీర్లును, కార్మికులను అవమానించేలా పొలవరాన్ని సినిమాగా చెబుతున్న అజ్ఞాని జగన్ అన్నారు. వైఎస్ తన కుమారుడు ఎదో ఉద్దరిస్తాడనుకుని చదువు కోసం అమెరికా పంపితే తిరుగుటపాలో వచ్చేసిన జగన్ అసలు ఏంచదువుకున్నాడో ఎవ్వరికీ తెలియదు. కొన్నిచోట్ల బీకాం అని, కొన్ని చోట్ల ఎంబిఎ అని ఉంది. జగన్ మానసిక స్థితి కూడా సరిగా లేనట్లుందని, జగన్ సరైన మానసిక నిపుణులతో వైద్యం చేయించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.

uma 15062018

తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి ఆయన పార్థివ శరీరం ఇంకా ఇంటికి కూడా చేరని పరిస్థితుల్లో ఆరోజు కూడా, ఆ సమయంలో కూడా ఇంట్లో కూర్చొని పోలవరం స్పిల్ వే, ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్ మరియు 960 మెగావాట్ల పవర్ ప్లాంట్లకు టెండర్లు అప్ లోడ్ చేయించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మంత్రి దుయ్యబట్టారు. అవినీతిపరులు, దొంగలైన జగన్, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లకు అందరూ అవినీతిపరుల్లాగే కనిపిస్తారు. మీ హయాంలో అసలైన డ్యామ్ పనులు వదిలేసి మట్టిపనులు చేసి దోపిడీలు చేసి, అదిగో పోలవరం నీళ్లు వచ్చేస్తున్నాయని ప్రజలను మోసం చేసి ధనయజ్ఞం చేసిన చరిత్ర మీది. ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తూ కళ్లెదురుగుండా నీళ్లు పారిస్తున్న చరిత్ర మాది అని మంత్రి ఉమా అన్నారు.

uma 15062018

త్వరలోనే గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కూడా చేసి చూపిస్తామని, వైకుంఠపురం బ్యారేజికి పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చామని, దీని ద్వారా నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని మంత్రి చెప్పారు. అలాగే పాపం జగన్ గెలిస్తే రాజధానిని తీసుకెళ్లి ఇడుపులపాయలో పెట్టుకుందామనుకున్నాడని, కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రానికి మధ్యలో ఉండాలని అమరావతిలో పెట్టి అభివృద్ధి చేస్తుంటే అక్కసుతో అమరావతిని భ్రమరావతి అంటున్నాడు అని మంత్రి ఉమా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే కన్నా టీడీపీ చేరేవాడని, కన్నాను చేర్చుకుంటే జైలుకెళ్తావని జగన్ కు అమిత్ షా వార్నింగ్ ఇస్తే ఆగిపోయి చివరకు రాష్ట్ర బీజేపీ పదవిలో చేరిన కన్నా మాటలకు విలువలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్ర పెద్దల డైరెక్షన్లో వైసిపి, జనసేన, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన బుద్దిచెబుతారని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read