ఎన్నోఏళ్లుగా కొల్లేరు రైతులు ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాటిచ్చినట్టుగా కొల్లేరు సరస్సులో మూడో కాంటూరు నుంచి ఐదవ కాంటూరు వరకు వున్న జిరాయితీ, డి పట్టా భూముల రైతులకు వరాలను ప్రకటించారు. 5,600 ఎకరాల డి పట్టా భూములు, 15 వేల ఎకరాల పట్టా (జిరాయితీ) భూములను ‘కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ’ పరిధి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జిరాయితీ భూములు, డి-పట్టా యజమానులకు ఒకే ప్రాంతంలో భూములు వుండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.

kolleru 15062018 2

ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో వందలాది మంది సన్నచిన్నకారు రైతులకు ఊరట లభించినట్టయ్యింది. ప్రస్తుతం మూడో కాంటూరు నుంచి ఐదవ కాంటూరు వరకు సుమారు 78 వేల ఎకరాల్లో విస్తరించిన సరస్సు ఈ ప్రాంతంలో 58 వేల ఎకరాలకు పరిమితం కానుంది. తద్వారా ఈ ప్రాంతంలో స్థానికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. కొల్లేరు సరస్సు నుంచి జిరాయితీ - పట్టా భూముల మినహాయింపు, సరస్సు పరిరక్షణ, డ్రైనేజీల ఆధునీకరణ, పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రైతులను, స్థానికులను సంతోషపరచడంతో పాటు కొల్లేరు పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.

kolleru 15062018 3

అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఎప్పుడూ నిండుగా నీటితో సమృద్ధిగా వుండాలని ఇందుకోసం పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొల్లేరుకు నీటిని తరలించే కాలువలు, అలాగే అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, ఆధునీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే కొట్టాడ దగ్గర తక్షణం రెగ్యులేటర్ నిర్మించాలని, చిన్నగొల్లపాలెం దగ్గర తలపెట్టిన రెగ్యులేటర్ నిర్మాణంపై అధ్యయనాన్ని త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇక నుంచి కొల్లేరుపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతానని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. కొల్లేరు అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుతో పాటు, పనుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఆర్డీవోని నియమించాలని సూచించారు.

కొల్లేరులో పర్యాటకాభివృద్ధికి ప్రస్తుతం వున్న రహదారి మార్గాలను పటిష్ట పరిచి, శాశ్వత ప్రాతిపదికన బృహత్ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. కొల్లేరును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, వన్యప్రాణి సంరక్షణ-పర్యావరణ పరిరక్షణ చేస్తూనే పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం సరస్సులో వున్న రిసార్టులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పారు. తమ భూములను ‘కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ’ పరిధి నుంచి మినహాయించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైతులు తాము రుణం తీర్చుకుంటామని చెప్పారు. కొల్లేరువాసులకు మరింత న్యాయం చేస్తామని, పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు విస్తృత పరుస్తామని రైతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

విశాఖపట్నం జిల్లా, రాజేంద్రపాలెం మండలంలోని గ్రామానికి చెందిన టైలర్ మావూరి నాగేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడు శివకృష్ణ మనోహర్ జీఈఈ అడ్వాన్సుడ్ లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. తమ కుమారుడుకి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు వస్తుందని ఊహించలేదు అని మనోహర్ తల్లిదండ్రులు అన్నారు. టైలర్ గా పని చేసే నా కుమారుడు, ఇంత గొప్ప ఘనత సాధించటం సంతోషంగా ఉందని తండ్రి అన్నారు. మనోహర్ ఐదో తరగతి వరకు రాజేంద్రపాలెం ప్రభుత్వ స్కూల్ లో చదివాడు. నవోదయ ప్రవేశ పరీక్ష రాసి, మంచి ర్యాంకు రావడంతో కొమ్మాదిలోని నవోదయ స్కూల్ లో చేరాడు. టెన్త్ పూర్తీ అయ్యాక, ఇంటర్ లో చేరటానికి fitjee నిర్వహించిన పరీక్ష రాసాడు. ఉత్తమ ప్రతిభ చూపటంతో కళాశాల యాజమాన్యం విజయవాడలో ఉచితంగా సీటు ఇచ్చి, హాస్టల్ సదుపాయం కూడా కలిపించింది..

fitjee 15062018 2

శివ కృష్ణ మనోహర్ గురువారం సాయంత్రం ఉండవల్లిలో ప్రజావేదిక హాలులో ముఖ్యమంత్రిని కలిశారు. శివ కృష్ణ మనోహర్ విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఐఐటీలో ఆలిండియా 5వ ర్యాంకు సాధించడం గొప్ప విశేషమని ముఖ్యమంత్రి అన్నారు. తండ్రి నాగేశ్వరరావు టైలరింగ్ వృత్తి చేసుకుంటూ తన కుమారుడిని ఉన్నత చదువులకు ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని ముఖ్యమంత్రి చెప్పారు.

fitjee 15062018 3

గత నాలుగు సంవత్సరాలలో విద్యాశాఖలో తీసుకున్న అనేక నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించగలరని అన్నారు. శివ కృష్ణ మనోహర్ విజయవాడ FIITJEE ఇనిస్టిట్యూట్ లో ఇంటర్ చదువుకున్నాడని డైరెక్టర్ పి.రమేష్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రిన్సిపాల్ రామకృష్ణ ఉన్నారు.

చంద్రబాబుని ఇబ్బంది పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ చేస్తున్నారు అనే వార్తలు వస్తే, కొంత మంది, ఇవన్నీ పిట్ట కధలు అంటూ తీసి పారేసారు.. కాని, జరుగుతున్న పనులు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనే అభిప్రాయం కలుగుతుంది... చంద్రబాబు అంతటి లీడర్ లేదు అంటూ మొన్నటి దాక పొడిగిన పవన్, రాత్రికి రాత్రి ప్లేట్ తిప్పటం, విభజన హామీలు ఇవ్వాల్సిన బీజేపీని ఒక్క మాట అనకుండా, జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని మాత్రమే తిట్టటం, ఐవైఆర్, ముద్రగడ, మోత్కుపల్లి, పోసాని లాంటి వారిని అడ్డం పెట్టుకుని, కులాల వారీగా ప్రజలను రెచ్చగొట్టటం వంటివి, చూస్తూ ఉంటే చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని, తమిళనాడు లాగా నాశనం చెయ్యటానికి, ఢిల్లీ పెద్దలు వేసిన స్కెచ్ లో, వీరందరూ ఎలా పని చేస్తున్నారో తెలుస్తుంది..

bjpycp14062018 2

అయితే, ఇప్పుడు మాత్రం, వైసీపీ, బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు... ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో ఇలాంటి వేషాలు వేస్తే దొరికిపోతామని, ఢిల్లీలో మీటింగ్ సెట్ చేసారు. అయితే, మీడియా అప్రమత్తతతో దొరికిపోయారు... సిసి టీవీ ఫూటేజ్ తో అడ్డంగా దొరికి పోయారు.. ఈ సమావేశం కోసం, ఒకే కారులో బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వచ్చారు. వైసీపీ, బీజేపీ నేతల ఢిల్లీ సమావేశం రాజకీయవర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు, మారుతున్న పరిస్థితులు, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ టీడీపీ చేస్తున్న పోరాటం.. తదితర విషయాలపై వీరు చర్చించినట్లు చెబుతున్నారు. సమావేశానికి సంధానకర్తగా రాంమాధవ్‌ వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వివరాలను ఎప్పటికప్పడు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం.

bjpycp14062018 3

ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మరోవైపు పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కోసం లోపలికి వెళుతున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. టీడీపీ ప్రభుత్వం అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే బుగ్గన, బీజేపీ నేతలకు నివేదిక సమర్పించారని తెలుస్తుంది. పీఏసీ చైర్మన్‌గా అన్ని విషయాలను లోతుగా పరిశీలించానని బుగ్గన చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పడు ఆ వివరాలన్నీ నివేదిక రూపంలో బీజేపీ నేతలకు ఇచ్చారని, ఈ సమావేశంలో కీలక విషయం ఇదేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

మన రాష్ట్ర ప్రగతికి అడ్డు పడుతూ, ఢిల్లీ పెద్దలు పన్నిన కుట్రలకు, మన రాష్ట్రంలో కొంత మంది తోడేళ్ళు కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎన్ని కుట్రలు పన్నుతున్నారో చూస్తున్నాం.. ఇలాంటి కుట్రలను ఎదుర్కుంటూ, మరో పక్క రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు చంద్రబాబు... ఇప్పటికే కియా సంస్థ తన ప్లాంట్ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, ఇప్పుడు కియా అనుబంధ పరిశ్రమలు కూడా, రెడీ అవుతున్నాయి. కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, కియాకి అనుబంధంగా ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక కంపెనీ అయిన, Faurecia Interior Systems, ఈ రోజు శంకుస్థాపన చేసుకుంది.

kia 14062018 2

Faurecia Interior Systems అనే సంస్థ, కార్ ఇంటీరియర్ తాయారు చేస్తుంది. ఈ కంపెనీ కార్ ఇంటీరియర్ తాయారు చెయ్యటంలో, ప్రపంచంలోనే ఒక టాప్ కంపెనీ గా ఉంది. కియా మోటార్స్ నిర్మాణం జరుగుతున్న చోట, ఈ ప్లాంట్ ఈ రోజు శంకుస్థాపన జరుపుకుంది. 180 రోజుల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చెయ్యనున్నారు. 12 ఎకరాల్లో, ఈ కంపెనీ స్థాపన జరగనుంది. మొత్తం 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఈ ప్లాంట్ లో, 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, రూ.4,790 కోట్ల పెట్టుబడులతో 6.,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ పరిశ్రమల కోసం, అనంతపురము జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్ కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, , అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది.

kia 14062018 3

చంద్రబాబు మాట్లాడుతూ, కియా మోటార్స్ సహా ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ కంపెనీలైన ఇసుజు మోటార్స్-అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని, వీటిలో సుజుకి ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియామోటార్స్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్ గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని అన్నారు. తాను ఇటీవల బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. అనంతపురాన్ని రెండవ స్వగృహంగా భావించాలని ముఖ్యమంత్రి కోరారు. ఓవైపు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున చేపడుతూనే మరోవైపు భారీ స్థాయిలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read