15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 7వ తేదీన సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ లో హాలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చకు 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో పలు శాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఈ నెల 7 వ తేదీన నిర్వహించే సమావేశం ఏర్పాట్లపై ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దిశానిర్దేశం చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా 11 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్నాటక, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పాండిచ్ఛేరి, సిక్కిం, మేఘాలయ, మిజోరమ్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.

amaravati 04052018 2

ఇటీవల 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు త్రివేండ్రంలో సమావేశమయ్యాయన్నారు. తదుపరి సమావేశం అమరావతిలో నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 7 వ తేదీన అమరావతిలో ఉన్న సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాలులో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై సమావేశం నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలించాలని చూస్తోందన్నారు. క్రమశిక్షణతో అభివృద్ధి బాటలో పయనించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిపోయి, వాటిని ఆర్థికంగా కుంగదీయాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే వెనుకబడి రాష్ట్రాల పేరుతో కొన్ని రాష్ట్రాలకు 20 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు కుమ్మరిస్తోందన్నారు. ఇప్పటికీ ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎంతో వెనుబడే ఉన్నాయన్నారు.

amaravati 04052018 3

ఇపుడు 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల పేరుతో మరోసారి అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలకు నిధుల మంజూరులో మొండిచేయి చూపడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 2011 జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించాలన్న15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏపీకి ఏటా 8 వేల కోట్ల వరకూ ఆర్థికంగా నష్టం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసిన వారికి ప్రోత్సాహాలు అందజేస్తామంటూ కేంద్రం ఆశ చూపిస్తోందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు గండిపడుతుందన్నారు. నిధుల కోసం తన ఎదుట మోకారిల్లేలా చేసి, రాష్ట్రాల హక్కులను కాలరాసి, వాటిపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చూస్తోందన్నారు. 1971 జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఇందుకోసమే 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఇంకా ముసుగులు ఎందుకు అనుకున్నారో ఏమో, లేక అన్నిట్లో మనం కలిసి చేస్తున్న పని ఒకటే అనుకున్నారో ఏమో కాని, వైసిపీ, జనసేన పార్టీ ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది.. హైదరాబాద్ లోని, బంజారా హిల్స్ లోని ఒక ప్రముఖ హోటల్ లో, ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు.. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. ఈ భేటీలో జనసేన కీలకనేతలైన శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పవన్ వ్యక్తిగత సహాయకులు వేణు, చక్రవర్తి పాల్గొన్నారు. వైసీపీ నుంచి, ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు వచ్చారు... వారి పేర్లు తెలియాల్సి ఉంది. అయితే, మొదటగా వీరి భేటీ సంగతి తెలుసుకుని ఒక మీడియా సంస్థ అక్కడ ముందుగానే కాచుకుని కూర్చుంది... అక్కడకు వచ్చిన వారు, ఆ మీడియాను చూసి జారుకున్నారు...

ycp 03052018

మళ్ళీ ఒక గంట తరువాత, ఆ మీడియా సంస్థ ప్రతినిధులు వెళ్ళిపోయిన తరువాత, మళ్ళీ వచ్చి సమావేశం అయ్యారు.. ఈ సమావేశంలో ప్రధానంగా, తెలుగుదేశం పార్టీని ఎలా నిలువరించాలి, భవిష్యత్తులో కలిసి కట్టుగా, టిడిపిని ఎలా దెబ్బ కొట్టాలి, చంద్రబాబుని పరిపాలన నుంచి ఎలా డైవర్ట్ చెయ్యాలి అనే విషయం పై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో జనసేన సలహాదారుడు చింతలబస్తీ దేవ్ కూడా రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో మీడియా ఉంది అని తెలుసుకుని, ఇక్కడకు రాకుండా వెళ్లిపోయారని తెలుస్తుంది.. దాదాపు గంటన్నర పాటు, ఈ సమావేశం జరిగిందని, skype కాల్స్ లో, మిగిలిన ప్రముఖ నాయకులు కూడా, ఈ మీటింగ్ లో పాల్గున్నారని తెలుస్తుంది.

ycp 03052018

అయితే ఈ భేటీపై అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఏయే విషయాలపై చర్చిస్తున్నారు..? అసలు ఈ భేటీ ఎందుకు జరుగుతోంది..? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. మరో పక్క జనసేన, వైసిపీ నేతలు దాదాపు ఒకే మైండ్ ఫ్రేమ్ లో పని చేస్తున్నారు. ఇరు పార్టీలు మోడీని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనటం లేదు.. కనీసం మోడీ అనే పేరు కూడా తలవటం లేదు. మరో పక్క ఇరు పార్టీల నేతలు, మోడీ పై పోరాడుతున్న చంద్రబాబు పై మాత్రం, ప్రతి రోజు విరుచుకు పడుతున్నారు. అదీ కాక, ఇప్పుడు పవన్ సలహాదారుడు చింతలబస్తీ దేవ్ కూడా, బీజేపీ నుంచి వచ్చినవాడు.. ప్రశాంత్ కిషోర్ అయితే, డైరెక్ట్ మోడీతో కలిసి పని చేసినవాడే.. ఇలా ఒకరికిఒకరు సహకరించుకుంటూ, బీజేపీ, వైసిపీ, జనసేన కలిసిపోయి, తెలుగుదేశం పై యుద్ధం ప్రకటించాయి... రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి...

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలన్న అంశంపై ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. సీనియర్ బీజేపీ నేత ఎల్ కె అద్వానీ పాల్గొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికిరావాల్సిందిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే మోడీ ఆహ్వానాన్ని, చంద్రబాబు తిరస్కరించారు..

modi cbn 03052018 2

అయితే, డైరెక్ట్ గా మోడీ మీద ఉన్న కోపం చూపించకుండా, రాలేక పోవటానికి గల కారాణాలు, లెటర్ రూపంలో రాసారు.. ఇలా రాయకపోతే, మళ్ళీ గాంధీ అంటే, చంద్రబాబుకి ఇష్టం లేదు అనే మరో కట్టు కధ అల్లుతారని, ఈ ప్రచారం ఎందుకు అనే ఉద్దేశంతో చంద్రబాబు లెటర్ రాసారు... "మీ నుంచి ఆహ్వానం అందింది.. కాని మాకు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని రావటం కుదరదు. మహత్మా గాంధీ అంటే మాకు చాలా గౌరవం. అందుకే గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని, చేస్తున్న స్వచ్చ భారత్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. ఈ విషయంలో మద్దతు ఉంటుంది. సమావేశంలో తీసుకున్న నిర్నయాలు మాకు తెలియచేయండి అంటూ, చంద్రబాబు తరుపున, ఆయన సెక్రటరీ సతీష్ చంద్ర ఉత్తరం రాసారు.

modi cbn 03052018 1

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి, మోడీ రాష్ట్రానికి చేస్తున్న మోసం పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు... మరో పక్క చంద్రబాబు ఒక్కరే, మోడీతో డీ కొడుతున్నారు... జాతీయ స్థాయిలో కూడా, అన్ని విపక్షలని మోడీకి వ్యతిరేకంగా ఏకం చేస్తారు, ఫ్రంట్ పెడతారు అని వార్తలు కూడా వస్తున్నాయి...ప్రస్తుతం రాష్ట్రం ఉన్న నేపధ్యం, ప్రజల్లో ఉన్న మూడ్ చూసి, ప్రధాని మోడీతో కలిసి సమావేశం అయితే, అవి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి, చంద్రబాబు ఇలా మీటింగ్ కు వెళ్ళకుండా, తిరస్కారించారు అనే వార్తలు వస్తున్నాయి.. అదే టైంలో, సామాఖ్య స్పూర్తికి ఇబ్బంది కలగకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రల్లో చేసే, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు...

తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, సుజానా చౌదరి పై, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో, విపరీతమైన ప్రచారం జరుగుతుంది.. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి, బీజేపీలో చేరుతున్నారు అంటూ, బీహార్ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, చింతలబస్తీ దేవ్ బ్యాచ్ విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి... గత రెండు రోజుల నుంచి, ఈ ప్రచారం తీవ్రమైంది... సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇదే వార్తా ఉండేలా ప్లాన్ చేసారు, వైసిపీ, జనసేనన, బీజేపీ... ఇన్నాళ్ళు ఈ వార్తలని పెద్దగా పట్టించుకోని సుజానా, ఇప్పుడు దాడి ఎక్కవ అవ్వటంతో స్పందించారు... రెండు రోజుల క్రితం కూడా, ధర్మ పోరాట దీక్షలో పాల్గుని, మోడీచేస్తున్న మోసాన్ని ఎండగట్టారు.. అయినా ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంది..

sujana 03052018 1

ఈ విష ప్రచారం పై, తన ట్విట్టర్ లో స్పందించారు.. ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ పోస్ట్ చేసి, "నేను పార్టీ మారటమా ? ఏప్రిల్ 1stలో వేసే జోకులు, మే నెలలో వెయ్యకూడదు... నాకు ఉంది ఒకే పార్టీ, ఒక సిద్ధాంతం, అదే తెలుగుదేశం పార్టీ.. నాకు ఉన్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం, భ్యవిష్యత్తు ఎన్నికలు గెలుస్తాం, కేంద్రాన్ని మేమే శాసిస్తాం" అంటూ, ట్వీట్ చేసారు.. ఈ ట్వీట్ తో పాటు, ఆ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా పోస్ట్ చేసి, చంద్రబాబుతో ఉన్న ఫోటోలు పోస్టు చేసి, అటు బీహార్ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, చింతలబస్తీ దేవ్ బ్యాచ్, నోరు ముపించారు.

sujana 03052018 1

మా నాయకుడు చంద్రబాబు, రాష్ట్రం కోసం ఏమి చెయ్యమంటే అది చేస్తామని, ప్రజల ఆకాంక్ష మేరకు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, కేంద్ర మంత్రి పదవి కూడా వదులుకున్నాని, ఇది చంద్రబాబు పై నాకున్న కమిట్మెంట్ అని, సుజనా చెప్పారు.. మరో పక్క ఇలాంటి వార్తల వెనుక మైండ్ గేమ్ ఉందని, తెలుగుదేశం పార్టీ అంటుంది. సుజనా చౌదరి లాంటి మనిషి, పార్టీని వదిలి వెళ్తారు అనటం ఒక జోక్ అయితే, ఆయన వెళ్లి బీజేపీతో చేరతారు అనటం, ఇంకా పెద్ద జోక్ అని అంటున్నారు.. బుద్ధి ఉన్న వాడు ఎవడైనా, బీజేపీ పార్టీలో చేరతారా అని ప్రశ్నిస్తున్నారు.. ఈ చింతలబస్తీ, బీహార్ బ్యాచ్ కు, బీజేపీ అంటే అమితమైన ప్రేమ కాబట్టి, బీజేపీని రాష్ట్రంలో పైకి లేపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుట్లోదే, ఈ తలకమాసిన ప్రచారం అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి..

Advertisements

Latest Articles

Most Read