హాయ్ ఐ యాం దేవ్.. ఐ డోంట్ నో తెలుగు.. ఐ వర్క్డ విత్ ఇంటర్నేషనల్ పార్టీస్... జనసేనని ఒక ఊపు ఊపటానికి వచ్చా... నా టాలెంట్ అంతా బయటకు తీస్తా... చూపిస్తా... చూపిస్తా... ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా ? దేవ్ అంటూ, జనసేన పార్టీకి సలహాదారుడుగా పని చేసిన వ్యక్తి... ఆ రోజు ఇవన్నీ చూసి, విని, అవును అనుకుంటా, పవన్ చాలా గట్టి వాడిని తీసుకొచ్చాడు... దేవ్ లో ఆ కాన్ఫిడెన్సు చూడండి, ఇక విజయం మనదే అంటూ, జనసేన పార్టీ డ్రీం మిషన్ ఎక్కింది... సీన్ కట్ చేస్తే, 24 గంటల్లో మొత్తం మారిపోయింది... దేవ్ కాదు...వాసు దేవ్...వ్యూహ కర్త కాదు..కార్య కర్త... ఇంగ్లీష్ వాడు కాదు..తెలుగు వాడు... మీరనుకొన్న ఈ దేవ్ మామూలు వాడు కాదు ... పూర్తి పేరు వాసుదేవ్... హైదరాబాద్ చింతలబస్తీ కుర్రాడు.. మోడీ పంపిన మన కిషన్ రెడ్డి మనిషి. తెలుగు రాదు అన్నాడు ఎందుకంటే...మాట్లాడితే తెలిసిపోతుందిగా తెలంగాణ వాడని..

bjp 03052018 2

ఈ చింతలబస్తీ దేవ్ ను తీసుకోవచ్చి, ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ఉన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు పవన్.. మనం చేసే పనులు ఎవరికీ తెలియవు అనుకుంటే అది అజ్ఞానమే... చింతలబస్తీ నుంచి వచ్చినా, చికాగో నుంచి వచ్చినా, అది వేరే విషయం.. ఎవరి పార్టీలు వారివి... వీళ్ళకు దమ్ము లేదు కాబట్టి సలహాదారులని పెట్టుకుంటారు... ఇది ఎవరికీ అభ్యంతరం కాదు... కాని, ఇక్కడ ఆడుతున్న అతి పెద్ద ఆట చూస్తుంటే, రాష్ట్రం ఏమైపోతుందో అని భయం వేస్తుంది... మొన్నా ఆ మధ్య, పవన్ ట్విట్టర్ వార్ మొదలు పెట్టిన ఏప్రిల్ 20 తారీఖు, రెండు మూడు రోజుల ముందు, పవన్, కిషన్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది...

bjp 030520183

ఇప్పుడు అదే కిషన్ రెడ్డి మనిషి, పవన్ కళ్యాణ్ సలహాదారుడు అయ్యాడు... ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అని నమ్మాల్సి వస్తుంది... ఒక పక్క మోడీకి పర్సనల్ గా పని చేసిన వ్యక్తి, జగన్ సలహాదారుడు అయ్యాడు.. అదే ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు బీజేపీ పార్టీకి పని చేస్తూ, బీజేపీ పార్టీలో ఉన్న మనిషి, ఇప్పుడు పవన్ దగ్గర చేరాడు... పవన్ రాజకీయం మొత్తం నేనే నడిపిస్తా అంటున్నాడు... అంటే ఏంటి ఇది ? బీజేపీ చెప్పినట్టు, జనసేన, వైసిపీ నడవాలి... ఆపరేషన్ గరుడ పాత్రధారులు వీరంతా... అక్కడ బీజేపీ ఏమి చెప్తే, వీరంతా అది చేస్తారు... ఇది విషయం... ఇలాంటి రాజకీయం నడుస్తుంది మన రాష్ట్రంలో.. చంద్రబాబు అనే ఒక్కడిని ఎదుర్కోవటానికి, ఇంత మంది వస్తున్నారు... వీళ్ళకు దమ్ము లేదని తెలుసు, వీలకు సలహాదారులని కూడా, నియమిస్తున్నారు బీజేపీ పెద్దలు...

ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా.. మన జగన్ మోహన్ రెడ్డి, తన సత్తా ఏంటో తెలిసి, చంద్రబాబుని డీ కొట్టటం నా వల్ల కాదని, కోట్లు ఖర్చు పెట్టి, తెచ్చుకున్న సలహాదారుడు... సోషల్ మీడియాని ఫేక్ చేసి పెట్టటంలో దిట్ట... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కనికట్టు చేసే గారిడీ వాడు టైపు... అయితే ఎన్ని చేసినా, ఎంత మందిని తెచ్చుకున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనోడి రాత మారలేదు అనుకోండి, అది వేరే విషయం... అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కూడా, ఒక కొత్త సలహాదారుడు వచ్చాడు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇతన్ని తీసుకోచ్చారో కాని, కనీసం ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడ లేని ఇతను, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, నా సత్తా చూపిస్తా అంటూ, అప్పుడే ఛాలెంజ్ లు చేస్తున్నాడు...

pk dev 01052018

ఈ రోజు, హైదరాబాద్‌లో తమ పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, జనసేన పార్టీకి, రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ అనే వ్యక్తి పనిచేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ అతన్ని పరిచయం చేసారు.. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్‌కు సహకరిస్తారన్నారు. అయితే, అసలు ఈ దేవ్ అనే అతను ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చాడు ? అతని ప్రొఫైల్ ఏంటి ? ఇలాంటి వివరాలు ఏమి తెలియవు... పేరు కూడా, కేవలం దేవ్ అని మాత్రమే చెప్పి, పూర్తి పేరు కూడా చెప్పకుండా , ఎందుకో మరి దాస్తున్నారు...

pk dev 01052018

ఈ సందర్భంగా దేవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. "జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయనాయకుడు కాదు. ఆయనకు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్‌కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే, కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రాలు ఇచ్చింది.. అది కూడా రహస్యంగా..

gali 01052018

అయితే, ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్, సిబిఐ ప్రమాణ పత్రాలు బయట పెట్టింది... 50 వేల కోట్లు... సాంకేతిక కారణాలతో కేసు కొట్టేసే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రం దాఖలు చేసింది... గోవా, కర్ణాటకలో ఎప్పుడు మైనింగ్ చేసారో, ఎలా తరలించారో, చెప్పటం కష్టం అంటూ, సిబిఐ కోర్ట్ కు తెలిపింది... ఇలా చెప్తే, గాలి జనార్ధన్ రెడ్డి పై పెట్టిన కేసు వీగిపోతుంది అని , న్యాయవాదులు అంటున్నారు... అక్రమ మైనింగ్ లో దేశ సహజ సంపదను కొల్లగొట్టిన విషయం తెలిసిందే... అప్పట్లో, సిబిఐ, 50 వేల కోట్ల మేర, అవినీతి జరిగినట్టు నిర్ధారించింది కూడా... మరో పక్క, బెయిల్ ఇచ్చే విషయంలో, జడ్జికి లంచం కూడా ఇవ్వబోయి దొరికిపోయాడు గాలి.. ఇంత ఘన చరిత్ర ఉన్న గాలికి, ఇప్పుడు క్లీన్ చిట్ రానుంది...

gali 01052018

కర్ణాటక ఎన్నికలకు ముందే, గాలి జనార్ధన్ రెడ్డికి, తన కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చేందుకు, బీజేపీ పెద్దలు ప్రణాలిక సిద్ధం చేసినట్టు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు, ఇవి ఊతం ఇస్తున్నాయి... ఎన్నికల ముందు, క్లీన్ ఇమేజ్ ఉంది అని చెప్పుకునే విధంగా, తద్వారా ఓటర్లను ప్రభావితం చెయ్యవచ్చు అనేది ఢిల్లీ పెద్దల ఆలోచన... మరో పక్క, ఇక్కడ గాలి తమ్ముడు అయిన, జగన్ కు కూడా ఇదే భరోసా ఉంది అని తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది... అందులో భాగంగానే విజయసాయి రెడ్డి, ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారని ఆరోపించింది... అవసరమైతే, పార్టీని, బీజేపీకి ఇచ్చేయ్యటానికి కూడా జగన్ సిద్ధం అయ్యాడు... ఇలాంటి వారిని దగ్గరకు తీసుకుని, అవినీతి పై యుద్ధం చేస్తా అంటున్నారు మన ప్రధాని...

"కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు సోదర సోదరీమణులకు వినమ్రపూర్వక విన్నపం" సోదర సోదరీ మణులారా, ఎన్నో శతాబ్దాలుగా తెలుగు,కన్నడ ప్రజల మధ్య విడదీయరాని అన్యోన్య సోదర సంబంధం వుంది. బసవన్న సంఘ సంస్కరణోద్యమ గాలులు తెలుగు గడ్డపై కూడా వీచిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత కూడా దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమై ఈ రాష్ట్ర అభివృద్దికి ఇతోధిక కృషిచేసిన, చేస్తున్న మీ అందరినీ ముందుగా హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.అలాగే గడిచిన 5 ఏళ్లుగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని 2013 ఎన్నికల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 2013 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నూటికి 95 శాతం అమలు చేయడం ద్వారా ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. "అన్న భాగ్య" పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువనున్న( BPL) కుటుంబాలకు కిలో ఒక్క రూపాయికే నెలకు 30 కేజీల బియ్యం ఇస్తామన్న వాగ్దానం నెరవేర్చాం.

8200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు రుణమాఫీ వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాలేజీ విద్యార్ధులకు లాప్ టాప్స్ అందజేశాం. రైతులకోసం సోలార్ పంపు సెట్లపై 75% సబ్సిడీని, డ్రిప్ ఇరిగేషన్ లో 100% సబ్సిడీని అమలు జరిపాం. రైతాంగానికి 2లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశాం. "క్షీర భాగ్య" పధకం ద్వారా రైతులకు లీటరు పాలకు 4 రూపాయల చొప్పున సబ్సిడీ ఇచ్చాము. తద్వారా ఇబ్బడి ముబ్బడిగా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, అలా ఉత్పత్తి అయిన పాలను స్కూలు పిల్లలకు ఉచితంగా సరఫరా చేయడం ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించే ప్రయత్నం చేశాం. 65 లక్షల మంది స్కూలు విద్యార్థులకు యూనిఫారాలు, టెక్స్ట్ పుస్తకాలు ఉచితంగా అందజేశాం. "విద్యా శ్రీ" పధకం కింద హాస్టళ్లలో సీటు లభించని విద్యార్ధులకు నెలకు 2000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వటం జరిగింది. 2 లక్షల పైచిలుకు ఇరిగేషన్ పాండ్స్ తవ్వించాం. ఎస్.సి, ఎస్.టీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డుల నుండి తీసుకున్న రుణాలను మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా మాఫీ చేయడం జరిగింది. రెవిన్యూ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదల ఇళ్లకు పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేశాం. ఇలా ఆనాడు మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన 165 వాగ్దానాలలో దాదాపు 158 వాగ్దానాలు నెరవేర్చగలిగామని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి తెలుగు ప్రజలకు తీరని అన్యాయం, ద్రోహం చేసింది. ఆ విషయం నేను మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గుండెల్లో దించిన బాకులాగా ఆ విషయం మిమ్ములను బాధిస్తుందన్న సంగతి నేను అర్ధం చేసుకోగలను. నాటి ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీలు, పార్లమెంటు చేసిన చట్టాలపై కూడా ఇసుమంత గౌరవం లేకుండా వ్యవహరిస్తూ బీజేపీ వారు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారు.

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చటంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం గమనార్హం. నాడు పార్లమెంటులో హడావుడి చేయటమే కాకుండా, 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో వాగ్దానం చేసి, స్వయంగా నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో ఏపీకి 10 సం.ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని అన్ని హామీలను తు చ తప్పకుండా నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దారుణంగా మోసం చేసిన విషయాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోలేరు. దానివల్ల ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్ధం చేసుకోవటమేగాక, ఈ విషయంలో బీజేపీ వారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా పలు సందర్భాలలో వ్యవహరించిన తీరుతో మీకు కలిగిన ఆవేదనని, ఆక్రోశాన్ని ఓ ప్రజాహితం కోరుకునే రాజకీయవేత్తగా నేను మీతో సరి సమానంగా పంచు కుంటున్నాను. 2016 జూన్ 9 వ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన జరిగిన 9 రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని తీర్మానం చేశాం. ఎంతో ఆర్తితో, చిత్తశుద్ధితో ఆ తీర్మానం చేసిన ఆ సమావేశంలో నేను కూడా భాగస్వామిని అన్న విషయం మీకు సవినయంగా మనవి చేస్తున్నాను.

చేయటానికి అవకాశం ఉండి కూడా ఇబ్బందుల్లో వున్న, ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగనామం పెట్టిన బీజేపీకి తెలుగు ప్రజలంతా తగిన రీతిలో బుద్ధి చెప్పగలరని ఆశిస్తున్నాను. ఇదిలా ఉండగా పేరులో 'సెక్యులర్' అని ఉన్నా ప్రజా వ్యతిరేక, ఉన్మాద బీజేపీతో కుమ్మక్కైన, బీజేపీకి 'బి' టీమ్ గా పనిచేస్తున్న జే.డి(ఎస్) వారి నిజ స్వరూపాన్ని గ్రహించి వారికీ తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఆ విజ్ఞత, చైతన్యం మన రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ఉందన్న విషయం నాకు తెలుసు. ఓ పక్క అవినీతి వ్యతిరేక జపం చేస్తూ మరో పక్క మైనింగ్ మాఫియా గాలి జనార్ధన్ రెడ్డి బృందంతో కర్నాటక అసెంబ్లీని నింపజూస్తున్న బీజేపీని ఎలా అర్ధం చేసుకోవాలో, ఎక్కడ ఉంచాలో మీకు తెలుసు. మొత్తంగా దేశంలో అరాచక పాలన సాగిస్తూ, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతూ అధోగతి పాలు చేస్తున్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి కర్ణాటకలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో మరిచిపోలేని తీరున గుణపాఠం నేర్పాలని వినమ్రంగా కోరుతున్నాను.

గడిచిన 5 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో కృషి చేసి మీకు ఎలా సుపరిపాలనను, అభివృద్ధి, సంక్షేమాలను అందించామో విజ్ఞులైన మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత ఐదేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక శ్రద్ధను కొనసాగిస్తూనే...2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్య, ఐటీ రంగం, సుపరిపాలనపై దృష్టి సారించి ఆకాంక్షాయుత వర్గాల( aspirational sections) ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రతిన బూనుతున్నాము. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించి రాబోయే ఐదేళ్లు కూడా మీకు మరింతగా సేవ చేసే సదవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించవలసిందిగా వేడుకుంటున్నాను."

Advertisements

Latest Articles

Most Read