పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి మీడియా మీద ఎందుకు పడ్డాడు ? పవన్ నా తల్లిని తిట్టారు అంటూ, మూడు రోజులు తరువాత ఎందుకు బయటకు వచ్చాడు ? సరిగ్గా, ధర్మ పోరాట దీక్ష అంటూ, మోడీ చేస్తున్న మోసం పై, తన పుట్టిన రోజు నాడే దీక్ష చేస్తున్నా అంటూ చంద్రబాబు చెప్పిన రోజే ఎందుకు హడావిడి చేసాడు ? ఇదంతా చంద్రబాబు దీక్ష డైవర్ట్ చెయ్యటానికి, బీజేపీ పెద్దలు ఆడించిన డ్రామా అని అందరికీ తెలిసిందే... ఇదే విషయం ఒక ప్రముఖ జాతీయ ప్రతిక్ర కూడా రాసింది... కేవలం చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెయ్యటానికే, పవన్ ఈ హంగామా చేసాడు అంటూ రాసింది... ఈ దీక్ష జాతీయ స్థాయిలో అటెన్షన్ పొందింది... అందుకే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెట్టాడు... అతడి వ్యక్తిగత విషయాలు పై, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టాడు... కొంత మేరకు దీక్ష డైవర్ట్ చెయ్యటంలో సక్సెస్ అయ్యాడు... అంటూ ఆ పత్రిక రాసింది.

pk national 250420182

జాతీయ స్థాయిలో కాకపోయినా, రాష్ట్ర స్థాయులో చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెయ్యటంలో కొంత వరకు సక్సెస్ అయినట్టు ఆ పత్రిక రాసింది... శ్రీ రెడ్డి వివాదంలో, తన తల్లి ప్రస్తావన రావటంతో, ఇదే అవకాశంగా మలుచుకున్న పవన్, మెలో డ్రామా అల్లారు... మూడు రోజుల తరువాత, తన తల్లి తిట్టారు అంటూ బయటకు వచ్చి, శ్రీ రెడ్డి ఉదంతం, చంద్రబాబు చేపిస్తున్నారు అంటూ, ఒక కట్టు కధ అల్లారు... సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే, అదీ తన తల్లిని తిట్టిన మూడు రోజుల తరువాత వచ్చి హంగామా చేసారు... శ్రీ రెడ్డి ఉదంతాన్ని, చంద్రబాబుకి ముడి పెట్టే ప్రయత్నం చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం చేసారు.. దీనికి తోడూ కొంత మంది టీవీ వాళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి, చంద్రబాబు, టీవీ9, ABN, లోకేష్, TV5, మహా టీవీ అందరూ తన మీదకి శ్రీ రెడ్డిని పంపించారు అంటూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసారు...

pk national 25042018 3

మొత్తానికి ప్లాన్ ప్రకారం, చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెచెయ్యటానికి, పవన్ ని రంగంలోకి దించి, డ్రామాలు ఆడించే ప్రయత్నం చేసి, చంద్రబాబు దీక్షని డైల్యుట్ చేసే ప్రయత్నం చేసి, విఫలం అయ్యారు... అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి... తన ట్విట్టర్ వేదికగా, టీవీ9, ABN,TV5 చానల్స్ ను బ్యాన్ చెయ్యమన్న పవన్, మరి ఈ రోజు ఒక జాతీయ పత్రికలో, తన పైన వచ్చిన వ్యతిరేక వార్తను పరిగణలోకి తీసుకుని, దీన్ని కూడా బ్యాన్ చెయ్యమని, తన అభిమానులకి పిలుపు ఇస్తాడా ? ఈ జాతీయ పత్రికను కూడా, చంద్రబాబు పత్రిక అని, చంద్రబాబు కుట్ర అని, చంద్రబాబు కులం అని, ఇలాంటి పిచ్చి వాగుడు వాగి, దాన్ని కూడా బ్యాన్ చేస్తాడా ? చూద్దాం...

సునామీ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్‌కాయిస్) సమాచారం మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే పడే అవకాశం ఉండగా రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఒకవేళ వెళ్లినా వారికి సమాచారం ఇచ్చి తిరిగి రప్పించాలని మత్స్య శాఖాధికారులకు సూచించారు.

krishna sunami 25042018 2

కలెక్టరేట్‌లో 08672-252847 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సముద్ర ప్రాంతాలైన ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ కమిటీలు, రెడ్‌క్రాస్ వంటి సహాయ సంస్థలు అప్రమత్తం కావాలని కలెక్టర్ కోరారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. రానున్న రెండు రోజుల మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.

krishna sunami 25042018 3

అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. ఇవాళ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధానమంత్రి మోడీతో గవర్నర్‌ భేటీ కావాల్సింది. అయితే ఆయన అపాయింట్స్ క్యాన్సిల్‌ కావడంతో ఆయన ఇవాళ 12 గంటలకే హైదరాబాద్‌కు తిరుగు ముఖం పట్టారు. ప్రధాని చైనా పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో.. ఆయన కీలక కార్యక్రమాల షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. దీంతో ప్రధాని, గవర్నర్‌ భేటీ క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇతర మంత్రులతో జరగాల్సిన భేటీలు కూడా రద్దు చేసుకోవడం విశేషం.

govenrer 25042018

తెలుగు రాష్ట్రాలపై గవర్నర్‌ ఇప్పటికే తాను తయారు చేసిన నివేదికను ప్రధాని, హోం శాఖకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం, నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం. నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం.

govenrer 25042018

మరో పక్క ప్రధాని మోడీతో పాటు, మిగిలిన బీజేపీ పెద్దలు గవర్నర్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. చంద్రబాబుతో సంధి కుదర్చమని, కర్ణాటక ఎన్నికల దాక, చంద్రబాబుని విమర్శలు చెయ్యకుండా ఉండమని పంపించినా, గవర్నర్, చంద్రబాబుని ఒప్పించలేక పోగా, తిరిగి చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ లు తీసుకురావటం మోడీకి నచ్చలేదని తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మరింత ఘాటుగా మోడీ పై వ్యాఖ్యలు చెయ్యటం, గవర్నర్ ని నేరుగా బహిరంగంగా విమర్శలు చెయ్యటం కూడా, మోడీకి మింగుడు పడటం లేదని సమాచారం. చంద్రబాబుని ఒప్పించటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, మరో పక్క జగన్, పవన్ ను ఆడిస్తుంది గవర్నర్ అనే విషయం సామాన్యులకు కూడా అర్ధం అవ్వటంతో, బీజేపీ ప్లాన్ కూడా బయట పడటంతో, గవర్నర్ ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం...

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌‌‌రెడ్డికి ఫోన్ చేసారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరినీ, మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలిసిందే. అంతే కాదు, వైసిపీలోకి వెళ్ళాలి అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు కూడా అమిత్ షా ఫోన్ చేసి, వైసీపీ లోకి వెళ్ళద్దు అని, త్వరలో మీ రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయిని, చెప్పినట్టు సమాచారం... అమిత్ షా ఫోన్ చేసిన తరువాత, మనసు మార్చుకున్న కన్నా ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. అస్వస్థత అనే వంకతో, కన్నా హాస్పిటల్ లో చేరి, వైసిపీ తో చేరే అంశం వాయిదా వేసారు. ఢిల్లీ నుంచి అమిత్ షా.. ఒక్క ఫోన్ కాల్‌తో అంతా మారిపోయింది అని సమాచారం.

kanna 25042018

అటు జగన్ కు కూడా ఫోన్ చేసి, మా పార్టీలో నుంచి ఎవర్నీ, చేర్చుకోవద్దు.. త్వరలోనే దీనికి సంబంధించి మీకు స్పష్టత ఇస్తాము. మీ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి, ఈ తరుణంలో, ఈ చేరికలు కరెక్ట్ కాదు అని అమిత్ షా, జగన్ తో చెప్పారని తెలిసింది.. జగన్ కూడా , దీనికి అంగీకారం తెలుపుతూ, మీరు ఎలా చెప్తే అల అని చెప్పారు... కన్నా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మా పార్టీలోకి వస్తాను అన్నారని, మీ సూచన మేరకు వారిని పార్టీలోకి ఇప్పుడే తీసుకోము అని, మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తామని, జగన్, అమిత్ షా తో చెప్పారు..

kanna 25042018

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దెబ్బకు బిజెపి విలవిలలాడుతోంది. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఎంత దెబ్బ తీయాలో అంతా దెబ్బతీసింది. ఇలాంటి స్థితిలో నాయకుల్లో కూడా గందరగోళం నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్తును చూసుకొని నాయకులు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిస్థాయిలో నిర్జీవంగా తయారవుతుంది అమిత్ షా గ్రహించారు. ఇందుకు ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలనే ఆలోచనతోనే ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఒకవైపు పార్టీ మారాలనుకునే నాయకులను బుజ్జగిస్తూనే మరోవైపు వైసీపీ అధినేత అధినేత జగన్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ చెప్పటంతో, జగన ఆయన మాటలు వినాల్సిన పరిస్థితి..

Advertisements

Latest Articles

Most Read