మన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకుని, వారితో డైరెక్ట్ గా కలవకుండా, ప్రజలని కన్ఫ్యుస్ చేస్తూ, బీజేపీ ఎలా గేమ్ ఆడిస్తుందో, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ముల ప్రయోగిస్తుంది... అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులకు విజయావకాశాలు లేకపోవటంతో లోపాయకారిగా జేడీఎస్‌ మద్దతు తీసుకుంటుంది... ముక్కోణ పోటీ సృష్టించి, తద్వారా లబ్ది పొందటానికి, వీలైతే ఎన్నికలు అయిన తరువాత, జేడీఎస్‌ తో కలిసి పనిచెయ్యటానికి కూడా సిద్ధమవుతుంది... సిద్ధరామయ్య ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మాత్రమే సిద్ధరామయ్య పోటీ చేస్తారని ప్రకటించారు. అక్కడ జేడీఎస్‌కు రహస్యంగా మద్దతివ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం...

bjp 23042018

అదే జరిగిన పక్షంలో సామాజిక వర్గాల లెక్కలు చూస్తే అక్కడున్న రెండున్నర లక్షల మంది ఓటర్లలో 70 వేల మంది ఒక్కళిగలు ఉన్నారు. ఓబీసీలు, దళితులు, ముస్లింలు కలిసి లక్షన్నర మంది ఉన్నారు. సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహించే కురుబ సామాజిక వర్గం ఓబీసీ కిందకు వస్తుంది. చాముండేశ్వరీ నియోజకవర్గంలో ఒక్కళిగల కారణంగా సిద్దరామయ్య ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యగా బాదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్యకు చెందిన కురుబ సామాజిక వర్గం బాదామీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడ నుంచి ధైర్యంగా పోటీ చేస్తున్నారు. దీని వల్ల బాగల్కోట్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కూడా నమ్ముతున్నారు. అయితే బాగల్కోట్ ప్రాంతంలో సిద్దరామయ్య ఆటలు సాగవని యడ్యూరప్ప వర్గం సవాలు చేస్తోంది. చాప కింద నీరులా బీజేపీ తన పని చేసుకుపోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

bjp 23042018

సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని జయాపజయాలపై అంచనాకు వచ్చేందుకు ఆరెస్సెస్ శ్రేణుల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఒక్కళిక సామాజిక వర్గం ఓట్లు ఏకమొత్తంగా జేడీఎస్ కు పడిన పక్షంలో ముక్కోణ పోటీ ఖాయమని బీజేపీ అంచనాకు వచ్చింది. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తోంది. జేడీఎస్‌కు బలమున్న ప్రాంతాల్లో తెరవెనుకగా ఆ పార్టీని ప్రోత్సహిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమయ్యాయి. బీజేపీ మద్దతు లభిస్తే తమకు కూడా ప్రయోజనం కలుగుతుందని జేడీఎస్ నేత దేవెగౌడ నమ్ముతున్నారు. సరిగ్గా మన రాష్ట్రంలో లాగే, కర్ణాటకలో కూడా, జేడీఎస్ పని కానిస్తుంది బీజేపీ... మరి వీళ్ళ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి...

ఏపీ చేనేతకు బ్రాండ్ అబాసిడర్‌, హీరోయిన్ పూనమ్‌కౌర్ ఏపీ ప్రత్యేక హోదా కోసం పూజలు చేశారు. రుషికేష్ గంగానది ఒడ్డున ప్రత్యేకంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కరోలీ బాబా ఆశ్రమంతో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా రావాలని పూనమ్‌కౌర్ కోరుకున్నారు. తెలంగాణాలో ఉంటున్న "కొంత మంది" తెలుగు సినిమా ఆక్టర్ లు, మన సమస్య అసలు పట్టించుకోపోగా, మరి "కొంత మంది" కుట్రలు కూడా చేస్తున్నారు... అలాంటి వారిని చూస్తే, పంజాబీ అమ్మాయి అయిన పూనమ్‌ కౌర్, చాలా మంచి పని చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున ధన్యవాదాలు చెప్తున్నారు. పూనమ్‌ కౌర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతకు బ్రాండ్ అబాసిడర్‌ వ్యవహరిస్తున్నారు... కొన్ని రోజుల కృతం ఆమె పుట్టిన రోజును కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి, చేనేత కార్మికుల మధ్యలో జరుపుకున్నారు... అలాగే, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామాను కలిసిన సందర్భంలో, చేనేత చీర బహుకరించి, చేనేత ప్రాముఖ్యత వివరించారు... ఈ రోజు, ఇలా ప్రత్యెక హోదా ఉద్యమానికి, తనకు తోచిన సాయం చేస్తున్నారు...

poonam 2304218

వారం రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, కొన్ని మాటలు ఆసక్తిని రేపాయి... ఆయుధాలు లేని వాళ్లతో యుద్ధం చేయకూడదని గురు గోవింద్‌ చెబుతారు. బలహీనులతో యుద్ధం చేయకూడదంటారు. ఏ వ్యక్తి అయినా ఓ అమ్మాయితో పోరాటం చేస్తున్నాడంటే, అతడు బలహీనుడని అర్థం. దిగజారిపోయిన వ్యక్తే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మోసం చేయాలనుకుంటాడు. అలాగని నేను తిరగబడి కక్ష సాధించేందుకు ఫూలన్‌ దేవిని కాదు కదా? అందుకే మోసం చేసేవాళ్లని దేవుడే చూసుకుంటాడని నమ్ముతాను’’ అని చెప్పారు. ‘‘నేను పోరాడుతున్నప్పుడే నా బలం ఏమిటో నాకు తెలుస్తుంది. ఎవరికీ హాని కల్గించే పనిని నేను చేయను. నాతో యుద్ధం చెయ్‌. ఏం జరుగుతుందో జరుగుతుంది అనుకుంటాను. మిమ్మల్ని ఓసారి కొట్టారనుకోండి. నొప్పి అనిపిస్తుంది. మళ్లీ కొడితే, మళ్లీ మళ్లీ కొడితే నొప్పికి మీరు అలవాటు పడిపోతారు. నా విషయంలో అదే జరిగింది అనుకుంటాను’’ అని స్పష్టం చేశారు.

poonam 2304218

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌కు విద్యా సంస్థలను తీసుకొచ్చారని, అందుకే తనలాంటి వాళ్లు చదువుకోగలిగారని అన్నారు. ఆయన వల్లే తాను నిఫ్ట్ లాంటి జాతీయస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నా అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై తన గౌరవాన్ని రాజకీయం చేయవద్దని, గురు గోవింద్‌ను గౌరవించినట్టే ఆయననూ గౌరవించానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడనని, తాను ఏది మాట్లాడినా దాన్ని రివర్స్‌లో తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

ఒక బాధ్యత లేని వ్యక్తి ప్రవర్తన, మన నిజ జీవితాల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం... విచక్షణ లేకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటూ, విపరీత మనస్తత్వం కలవారాని, మనం ఎంతో మందిని మన జీవితంలో చూస్తూ ఉంటాం... కాని, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక పెద్ద సినీ హీరో అయ్యిండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ బ్రతికేస్తున్నాడు... ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు.... ఇలా పవన్ కళ్యాణ్, గాలిగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటే, అదే రకమైన భావజాలంతో ఉన్న తన ఫాన్స్ ఇంకా రెచ్చిపోతారు.. సమాజంలో ఇప్పటికే, విచ్చలవిడితనం పెరిగిపోయి ఉంది.. పవన్ లాంటి వాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే, ఇంకా తన ఫాన్స్ ఎలా రెచ్చిపోతారో అర్ధమవుతుంది... ఒక లీగల్ నోటీసుకు సమాధానం ఇస్తూ, ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడో చూడండి.

pavan 23042018 1

రెండు రోజుల కృతం, తనను టార్గెట్ చేసేందుకు కొన్ని మీడియా చానెళ్లు కుట్ర పన్నాయని శ్రీనిరాజు ఆ కుట్రలో భాగస్వామి అని పవన్ ట్వీట్లు చేసాడు... శ్రీనిరాజు తాజా ఫొటో ఇలా ఉంటుందని కూడా పవన్ ట్వీట్ చేశాడు... శ్రీ సిటీ, చంద్రబాబు ఎదో గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఒక ట్వీట్ చేసాడు పవన్... నిజానికి శ్రీ సిటీ, మొత్తం వ్యవహారం నడించింది కాంగ్రెస్ టైంలో. అయితే శ్రీనిరాజు ఈ వ్యవహారం పై, పవన్ కు లీగల్ నోటీసు పంపించారు... మీరు చేసిన ట్వీట్ లు, తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని, ఆ ట్వీట్ లు డిలీట్ చెయ్యాలని, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని, శ్రీని రాజు లీగల్ నోటీసు పంపించారు... దీనికి పవన్, రిప్లై ఇస్తూ ఇవాళ తాను పంపించిన రిప్లై ట్విట్టర్ లో పెట్టారు...

pavan 23042018 1

దాని సారంశం, నా ట్విట్టర్ నా ఇష్టం.. నేను నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా... నా ఫ్రీడమ్ అఫ్ స్పీచ్... ఒక ట్వీట్ కు కూడా, నువ్వు నాకు లీగల్ నోటీసు పంపించాలా... ఎదో ఊహించుకుంటున్నారు... నేను రాసిన ట్వీట్ లలో, తప్పు ఏమి లేదు... నా ట్విట్టర్ లో, నా ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేఛ్చ నాకు ఉంది అంటూ, శ్రీని రాజుకు రిప్లై ఇచ్చాడు పవన్... ఇంకో ట్వీట్ లో, చంద్రబాబుని అంటే నీకు ఎందుకు కోపం శ్రీని రాజు అని రాసాడు పవన్... శ్రీని రాజు ఫోటో పెట్టి, తన పేరు లాగాడు కాబట్టి, లీగల్ నోటీసు వచ్చింది... మరి పవన్ కు ఆ మాత్రం తెలియదా ? లేక ప్రతి దాంట్లో చంద్రబాబుని లాగటమా ? మొన్న లోకేష్ విషయంలో కూడా, ఎవరో ఎదో అనుకుంటున్నారు అది నేను చెప్పా అని పవన్ చెప్పటం ఏదైతే ఉందో, పవన్ ఎలాంటి మనస్తత్వం కలవాడో అర్ధమవుతుంది... ఇలాంటి మనుషులు, సమాజానికి ఎంతో ప్రమాదకరం... ఇష్టం వచ్చినట్టు బ్రతికేయ్యండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అని తన ఫాన్స్ కు చెప్పకనే చెప్తున్నాడు...

మోడీ వల్లే, కియా కార్ల కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది అని, నిస్సిగ్గుగా వాదిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకి, ముఖ్యంగా తన ఫేస్బుక్ పేజీలో మోడీ వల్లే, కియా వచ్చింది అని పెట్టుకున్న పురందేశ్వరి గారికి, వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రే సమాధానం చెప్పారు... మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మీడియాతో మాట్లాడుతూ, కియాను మహారాష్ట్రకు తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేసాం.. ఎన్నో సార్లు ప్రయత్నించాం.. కాని కియా కంపెనీ కోర్కెలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మాకు ఇప్పటికే చాలా కంపెనీలు ఉన్నాయి, అందుకే వారి కోర్కెలకు మేము లొంగలేదు... వారి కోర్కెలకు లొంగితే, మిగతా కంపెనీలు కూడా వస్తాయి, అందుకే మేము కియాను ఇక్కడకు రప్పించలేకపోయాయం అంటూ మహారాష్ట్ర సియం చెప్పారు...

maharashtra 23042018 2

అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కియా కంపెనీ అడిగిన అన్నటికీ అంగీకరించారని అందుకే, కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళింది అంటూ, మహారాష్ట్ర సియం చెప్పారు... ఒక పక్క బీజేపీ నేతలు, మా మోడీ వల్లే, ఆంధ్రప్రదేశ్ లో కియా వచ్చింది అంటూ హడావిడి చేస్తుంటే, వాళ్ళ ముఖ్యమంత్రే, చంద్రబాబు వల్లే కియా ఏపి వెళ్లిందని ఒప్పుకున్నారు... గత కొద్ది రోజుల నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, చంద్రబాబు ఎంతో కష్టపడితే తెచ్చిన కంపెనీని, మోడీ వల్లే రాయలసీమలో పెట్టారు అంటూ, ఒక ఫేక్ ఇమేజ్ పట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు...

maharashtra 23042018 3

పురందేశ్వరి లాంటి నాయకురాలు కూడా, మోడీ వల్లే వచ్చింది అంటూ, నిస్సిగ్గుగా, చంద్రబాబు కష్టాన్ని, మోడీ ఖాతాలో వేసారు.. చంద్రబాబు మాత్రమే కాదు, ఇది వరకు తమిళనాడుకి చెందిన ఒక కన్సల్టెంట్, కియా అన్ని రాష్ట్రాలను కాదని, ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చిందో క్లియర్ గా చెప్పారు... అది అప్పట్లో, బాగా వైరల్ అయ్యింది కూడా... మొన్న కియా ప్రారంభోత్సవం అప్పుడు కూడా, చంద్రబాబుపై కియా ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు... పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన దిట్టగా అభివర్ణించారు... చంద్రబాబు చొరవ చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే,.... చకచకా అన్ని రకాల అనుమతులు, భూకేటాయింపులు జరిపారని చెప్పారు... ఆ వెంటనే త్వరితగతిన కార్ల ఉత్పత్తిని చేపట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచిందన్నారు... ఈ హడావుడిలో భూమి పూజ అట్టహాసంగా చెయ్యలేకపోయామన్నారు... ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే 13 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు...

Advertisements

Latest Articles

Most Read