జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...

pk 24042018

ఇక గత నలుగు రోజులుగా అయితే, కల్లు తాగిన కోతిలా, ట్విట్టర్ లో పడి హడావిడి చేస్తూ, బజారు మనుషుల కంటే హీనంగా, ప్రవర్తిస్తున్నాడు.. ఇవి పక్కన పెడితే, ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది.... అది అయిపోయిన తరువాత ఈ నెల 23 న చిత్తూరు పర్యటన అంటూ హడావిడి చేసాడు... అది కాన్సిల్ అయ్యింది అని, పవనే స్వయంగా ట్విట్టర్ లో చెప్పాడు... 15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో హోదా పై నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ నడుస్తుంది...

pk 24042018

ముందుగా ఇక పవన్, హోదా పై ఏ రకమైన ఉద్యమాలు చెయ్యడు... కేవలం ఎవరన్నా ఉద్యమాలు చేస్తే, వారికి సహకరిస్తాడు... ఇక నుంచి, రాష్ట్ర ప్రభుత్వం పై మాత్రమే దాడి చేస్తాడు... అయితే 23 న చిత్తూరు పర్యటన వాయిదా వెయ్యటానికి కారణం కూడా ఉంది... ఇదే చిత్తూరు జిల్లా తిరుపతిలో, చంద్రబాబు ఈ నెల 30న మోడీకి వ్యతిరేకంగా పెద్ద సభ పెడుతున్నారు... ఇది అతి పెద్ద సభ... దీనిని ఆపమని, మోడీ గవర్నర్ ను కూడా పంపించాడు... కాని చంద్రబాబు మాత్రం, వెనక్కు తగ్గలేదు... వెంటనే వైసిపీ రంగంలోకి దిగింది, ఈ నెల 30న నయవంచన సభని వైజాగ్ లో పెడుతున్నట్టు చెప్పింది... పవన్ కూడా, 30వ తారీఖే చిత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు... అటు జగన్ చేతే, ఇటు పవన్ చేతే బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఇది... వీలైతే, 30వ తారీఖే పవన్ పై చెప్పులతో కాని, రాళ్ళ దాడి కాని ప్లాన్ చేసారు... చంద్రబాబు తిరుపతిలో పెట్టే మీటింగ్ డైవర్ట్ చెయ్యాలని, ఇద్దరికీ ఆదేశాలు వచ్చాయి... చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ఎలా అయితే డైవర్ట్ చేసారో, 30న తిరుపతిలో జరిగే చంద్రబాబు మీటింగ్ డైవర్ట్ చెయ్యటానికి, జగన్, పవన్ పోటీ పడుతున్నారు...

రాష్ట్రంలోని పల్లెపల్లెకూ ఎల్‌ఈడీ వెలుగులు రాబోతున్నాయి. ఇందుకు ఉద్దేశించిన చంద్రకాంతి పథకాన్ని రాష్ట్ర ప్రజలకు నేడు సీఎం చంద్రబాబు అంకితం చేసారు. ఈ కార్యక్రమం కోసం ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడి వెళ్లారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో చంద్రకాంతి కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. పంచాయతీల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపడం ద్వారా గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాసిరకమైన వీధి దీపాల వల్ల ఒకవైపు పంచాయతీ నిధులు వ్యయం, మరోవైపు అధిక విద్యుత్‌ వినియోగమవుతోంది. దీంతో గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు నింపడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

led 24042018

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎ్‌సఎల్‌ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రకాంతి పేరుతో వీధిలైట్లు స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పట్టణాల్లో 6.2 లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చి 133 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేశారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ప్రాజెక్టు పూర్తి చేసి దేశంలోనే గ్రామీణ ఎల్‌ఈడీలో ముందుండాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. సీఎంతోపాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌ ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. 12,918 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే ఎల్‌ఈడీ లైట్లును అమర్చి తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే నంబరు వన్‌గా నిలిపినందుకు సీఎం అధికారులను ప్రశంసించారు.

led 24042018

జూన్‌ కల్లా 15 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను అమర్చాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొన్నారు. అక్టోబరు నాటికి మిగిలిన లైట్లన్నీ అమర్చుతారు. పంచాయతీలు రానున్న పదేళ్ల వరకూ ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే విద్యుత్‌ చార్జీల ఆదాతో ఈ ప్రాజెక్టును నిర్వహించేలా చర్యలు తీసుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీల్లో ఈఈఎ్‌సఎల్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా 3 లక్షల ఎల్‌ఈడీ వీఽఽధి దీపాలు అమర్చారని మంత్రి లోకేశ్‌ తెలిపారు. దేశంలో మరెక్కడా ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. వీటివల్ల ఏటా 333 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదాతో పంచాయతీలకు రూ.500 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని అంచనా. ఈ దీపాలన్నీ ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. వేసవి ఉదయం 5.30కి ఆరిపోయి.. సాయంత్రం 6.30కి వెలుగుతాయి. సీజన్‌ మారాక టైమ్‌ను మరోసారి సెట్‌ చేస్తారు.

ముఖ్యమంత్రితో ఉన్న వైరం పక్కన పెట్టి మరీ, ఆదివారం విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు గవర్నర్ నరసింహన్... కేంద్రం పంపించిన రాయబారం తీసుకువచ్చి చంద్రబాబుని కలిసారు గవర్నర్. ముఖ్యంగా కర్ణటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం... చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

delhi 24042018

అయితే దీని పై చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక, గవర్నర్ వెళ్ళిపోయారు...

delhi 24042018

అయితే, ఈ విషయాలన్నీ ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి, గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారు... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...

సైబర్ భద్రతా సవాళ్లను అధిగమించడంలో కొత్తగా ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఒక ముందడుగుగా భావించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి బిల్డింగ్ మూడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ఆవశ్యకతను ఐటీ అధికారులు వివరించారు. ఈ సెంటర్ ద్వారా కంప్యూటర్స్ హ్యాకింగ్‌ను, వైరస్‌లను నియంత్రించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థలకు గూఢచార భాగస్వామ్య ముప్పును విశే్లషణ ద్వారా అందిస్తుందన్నారు. ఇలాంటి సెంటర్‌ను దేశంలో ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు.

cbn hack 24042018 1

సాంకేతిక పరిజ్ఞానం-సామాజిక పరివర్తనాల్ని ప్రారంభించడంలో సహాయపడిన పలు సైబర్ ప్రోగ్రామ్‌లకు ఆంధ్రప్రదేశ్ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. దేశంలో సైబర్ భద్రతా గమ్యస్థానంగా అమరావతిని రూపొందించడానికి ఇదొక ప్రోత్సాహకరంగా నిలుస్తుందన్నారు. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో క్లిష్టమైన, ప్రధానమైన సమస్యగా మారాయని వివరించారు. ఇలాంటి వాటికి సైబర్ రక్షణ కల్పించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి లైవ్‌లో అందుబాటులో ఉన్న కేంద్ర ఐటీ శాఖ అధికారులు సహాని బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు విషయాలు చర్చించారు. కేంద్ర ఐటీ శాఖ అధికారి సహాని ముఖ్యమంత్రికి వివరిస్తూ సైబర్ భద్రతతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లడం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అందుకు అభినందిస్తున్నానని తెలిపారు.

cbn hack 24042018 1

అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా ఒక ఏకో సిస్టం తయారవుతుందని, ఇప్పటికే సీసీ కెమెరాల పరిజ్ఞానం, డ్రోన్ల పరిజ్ఞానం ఉపయోగించడం, రియల్‌టైమ్ గవర్నెస్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమమని అన్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థలను హ్యాక్‌ చేయాలని విద్యార్థులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లకు సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటులు ఎథిక‌ల్ హ్యాకింగ్ చేసి నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ మీద తాను తీసుకున్న చర్యలు ఎంత ఖటినంగా ఉన్నాయో చెప్తుంది... ఎవరన్నా విద్యార్ధులు ట్రై చెయ్యండి, చంద్రబాబు సవాల్ ను స్వీకరించండి...

Advertisements

Latest Articles

Most Read