రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్క పైసా కూడా పన్ను పెంచని ప్రభుత్వం, ఇప్పుడు పేదలకు ఇంటి పన్ను మినహాయింపు ఇస్తుంది. రాష్ట్రంలో రూ.2లక్షలలోపు విలువ ఉన్న గ్రామీణ ఇళ్లకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 80 లక్షలు ఇళ్లు ఉండగా 44 లక్షల ఇళ్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. పూరి గుడిసెలు,మట్టి ఇల్లు,రేకులు,పెంకుటిళ్ళు మొదలైనవన్నీ ఈ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

inti pannu 25042018

గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం కారణంగా 3200 కోట్లు ఉపాధి హామీ పథకం మెటీరియల్ వెనక్కి వెళ్ళిపోయింది కానీ, ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజి తో డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేసామని, దీని వలన కార్యక్రమాల అమలులో మనం ఎక్కడ ఉన్నాం, ఇతర జిల్లాల పనితీరు తెలుసుకునే అవకాశం వచ్చిందని లోకేష్ తెలిపారు. టెక్నాలజీ సహాయం తో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామని, క్షేత్ర స్థాయిలో మీకు ఉన్న సమస్యలు పై నాకు పూర్తి స్థాయి అవగాహన ఉందని, ఒక్కొక్కటిగా మీ సమస్యలను పరిష్కరిస్తున్నాని లోకేష్ అన్నారు... ఇంకా కొన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాను అని చెప్పారు...

inti pannu 25042018

ఉపాధిహామీ పథకంలో భాగంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వలన 481 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కలుగుతుందని, క్షేత్ర సహాయకులు ప్రమాదంలో మరణిస్తే చెల్లించే పరిహారాన్ని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచామని, ప్రమాద సమయంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే చెల్లించే నష్ట పరిహారాన్ని లక్షన్నర నుండి 3 లక్షలకు పెంచామని లోకేష్ చెప్పారు. "అతి చిన్న వయస్సులో గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చింది మీ సహకారం పూర్తి స్థాయి లో ఉండాలి. ఒక యువకుడినైనా నా పై ఎంతో నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. మీ సహకారంతో విజయం సాధిస్తే భవిష్యత్తులో మరికొంతమంది యువకులకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని" లోకేష్ అన్నారు.

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు. సాయికుమార్ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోగల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే గోరంట్లలోగల వినాయక దేవస్థానంలో పూజలు నిర్వహించారు. రాబోయే ఐదేళ్లలోనూ ప్రధానిగా మోదీనే ఉంటారని, కర్ణాటకలోనూ భాజపా ప్రభుత్వం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

saikumar 24042018 2

కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి ముందు కదిరి, గోరంట్ల పట్టణానికి విచ్చేసి లక్ష్మీనరసింహస్వామివారిని, వినాయక దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాగేపల్లి వెళ్లి తన అనుచరులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువేళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, ప్రధాని మోదీ తప్పక సహకరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని కోరతానని, అవసరమైతే ఆయన కాళ్లు పట్టుకుంటానని సాయికుమార్ భావోద్వేగం చెందారు.

saikumar 24042018 3

ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని సాయికుమార్‌ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కర్ణాటకలోని బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేయనున్నారు. తన తల్లి స్వగ్రామమైన బాగేపల్లి బెంగళూరు నగరానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందని ఆయన చెప్పారు. అమ్మ కోరిక మేరకు బాగేపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే సంకల్పంతోనే అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ ఇలవేల్పు అయిన నారసింహుడి ఆశీస్సులతో నామినేషన్ వేయాలనే ఉద్దేశంతోనే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ల చేస్తూ, చంద్రబాబు పై చేస్తున్న చౌకబారు ఆరోపణలు పై, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏప్రిల్ 20వ తేదీన సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం రోజు నుంచే పవన్ కళ్యాణ్ ట్వీట్లు ప్రారంభం కాగా, ఆ వ్యవహారంపై పరోక్షంగానే తప్ప నేరుగా స్పందించని చంద్రబాబు మంగళవారం డైరెక్టుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని... ఎదుటివారి మీద బురద చల్లే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని సిఎం చంద్రబాబు అన్నారు. మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ఎవరిపైనా విమర్శలు చేయలేదని...కేవలం సమస్యలపైనే పోరాడానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

cbn pk tweets 24042018 1

పవన్‌ కల్యాన్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిరాధార ఆరోపణలతో ఆయన సాధించేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. వైసీపీని బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. కేంద్రం అందరినీ ఆడిస్తోందని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు సాగినా... ఏపీలో సాగబోవని బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి.. ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గవర్నర్ రాజకీయ వ్యవహారాలు నెరుపుతున్నారంటూ ఆరోపించారు. వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయని, గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

cbn pk tweets 24042018 1

ఇదిలా ఉండగా పవన్ ట్వీట్ లపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఒక్కరే గట్టిగా పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టే నిరసనలు పక్క దారిపడుతుందని... ఇలాంటి టైంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టే నిరసనలు పక్కదారి పడతాయని, అప్పుడు బీజేపీ, పవన్, జగన్ ఏదైతే ఆశిస్తున్నారో అది సక్సెస్ అవుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి... ఇవి పెద్దవి అయితే, కులాల గొడవలుగా కూడా మారతాయని, అందుకే పవన్ చేస్తున్న ట్వీట్ లకు స్పందించవద్దు అని చెప్పారు.. పవన్ చేసే ట్వీట్ లు కూడా, మరీ దిగజారి ఉంటున్నాయని, ఇలాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదని, ప్రజలే అలాంటి వారికి బుద్ధి చెప్తారని, తెలుగుదేశం భావిస్తుంది..

పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ‘‘మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న పవన్‌ కల్యాణ్‌ మనల్ని విమర్శిస్తున్నారు. కేంద్రం ఎన్ని విధాలా ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోంది. మనల్ని ఇబ్బందులు పెడతారు, సమస్యలు సృష్టిస్తారు. ఐదు కోట్ల మంది ఐక్యతగా ఉంటే.. కేంద్రం ఆటలు సాగవు. 29 సార్లు దిల్లీకి వెళ్లా, ఎప్పుడూ రాజీ పడలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ నుంచి రాజశేఖర్‌రెడ్డి వరకూ నన్నేమీ చేయలేకపోయారు. నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. నేనెవరికీ భయపడను.. తప్పు చేసిన వారెవ్వరినీ వదలను అంటూ పదునైన విమర్శలు చేసారు...

cbn modi 24042018

రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత భాజపాకు లేదా? నేనేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నా. ఈనెల 30న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నాం’’ అని సీఎం వివరించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్లే బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వ్యక్తులను పీఎంవోలో పెట్టుకుంటూ... ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ లేదని, దానికి కేంద్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

cbn modi 24042018

బ్యాంకులు దివాళా తీస్తున్నాయని, బ్యాంకుల్లో తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేయాలంటే గజగజలాడే పరిస్థితి వస్తుందని, తప్పు చేసేవారిని వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోరం చూస్తే... ఆడబిడ్డలు ఏ విధంగా ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపల మొత్తం జప్తు చేస్తామని అన్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తామని అన్నారని, అలాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకుని, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటోందని, వేరే రాష్ట్రాల్లో కేంద్రం ఆటలు సాగాయి గానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం ఆటలు సాగవని ఆయన అన్నారు.

Advertisements

Latest Articles

Most Read