ఆంధ్రప్రదేశ్ లో గౌరవముఖ్యమంత్రి నేత్రత్వంలో అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, క-రో-నా కబంధహస్తాల్లో చిక్కుకొని రాష్ట్రమంతా విలవిల్లాడుతుంటే, వేలాదిమంది చనిపోతుంటే, ఆ చితిమంటల వెలుగులుచూసి, ఘనత వహించిన ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిని మించిన ఆనందాన్ని పొందుతున్నాడని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. గురువారం ఆయన తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...! ఈ మంత్రిమండలి , ఈ ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థంకావడంలేదు, క-రో-నా రోగులకు కావాల్సిన వైద్యం, మందులు, ఇంజెక్షన్లు సకాలంలో అందడం లేదు. వారికి కావాల్సిన ఆక్సిజన్, వెంటిలేటర్లు అందడంలేదు. వీటన్నింటిపై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే స్థితిలో లేదు. క-రో-నా రక్కసి విశృంఖలంగా రాష్ట్రాన్ని సవాల్ చేస్తుంటే, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిస్తేజంగా ఉండిపోయారు. క-రో-నా-ను ఎలా కట్టడిచేయాలన్నఆలోచన ముఖ్యమంత్రికి, కేబినెట్ కు లేదు. అవగాహన అసలేలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దురాలోచనతో తీసుకుంటున్నట్లు ఉన్నాయిగానీ, దూరాలోచనతో చేస్తున్నట్లుగా లేవు. క-రో-నా-తో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామంటారా? ఏమిటీ విచిత్ర వైఖరి ముఖ్యమంత్రిగారు? మీకు అవగాహన, ఆలోచన లేవని రాష్ట్రప్రజలకు తెలుసు. చంటిబిడ్డలైన విద్యార్థులపై ముఖ్యమంత్రి ఎందుకింతలా కక్షబూనాడు. ముఖ్యమంత్రి పగ, ద్వేషం విద్యార్థులపైనా లేక వారి తల్లిదండ్రులపైనా? అన్నిరాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయికదా..! విద్యార్థుల సర్టిఫికెట్లపై పాస్ అని రాస్తే వారి భవిష్యత్ కు వచ్చినఇబ్బంది ఏమిటి? వాయిదా వేయండి.. జూన్ లోనో, జూలైలోనో నిర్వహించండి. విద్యార్థులప్రాణాలకు ఏదైనాజరిగితే, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా?

ప్రతిపక్షా ల వారు మీడియాతో మాట్లాడే అంశాలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టరు. ఏంచేయాలో, ఏం చేస్తున్నామో ఆలోచించరు. ఇదేమిటండీ? తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లడానికి ముఖ్యమంత్రికి క-రో-నా అడ్డువచ్చింది. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసేవిద్యార్థుల్లో ఎవరికైనా క-రో-నా వస్తే తానే బాధ్యత తీసుకుంటానని ఈ ముఖ్యమంత్రి చెప్పగలడా? అసలు ఇది ప్రభుత్వమా..లేక వల్లకాడా? ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. అధికారయంత్రాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. చనిపోయిన వారందరికీ ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వగలరా? రేపొద్దున ఫలానా మహానుభావుడు అధికారంలో ఉన్నప్పుడు తమవారు చనిపోయారని భావితరాలవారు చెప్పుకోవాలి కదా? ముఖ్యమంత్రికి ధైర్యముంటే, నైతిక విలువలుంటే, అలా ఇవ్వగలరా? అసెంబ్లీ నిర్వహించాలంటే 150 నుంచి 200 మంది వస్తారు. పరీక్షలు పెడితే ఎంతమంది విద్యార్థుల వస్తారో తెలియదా? మంత్రికూడా తన తెలివితేటలు, బుర్ర ప్యాక్ చేసి, పక్కన పెట్టినట్లు ఉన్నాడు. పరీక్షలు నిర్వహిస్తే ముఖ్యమంత్రిగానీ, కేబినెట్ మంత్రులుగానీ, విజయవాడలో ఒక్క పరీక్షా కేంద్రాన్నైనా తనిఖీ చేయగలరా? చీఫ్ ఇన్విజి లేటర్ గా ముఖ్యమంత్రి ఒక్కరోజు, ఒక్క పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించగలరా? అటువంటి పరిస్థితుల్లో పరీక్షలు పెడతారా? మీరు, మీ మంత్రుల ప్రాణాలు ఉంటే చాలా? ఎందుకింత దుర్మార్గంగా, మొండిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు?

ఆదినుంచీ ముఖ్యమంత్రి క-రో-నా విషయంలో తేలికదృష్టితోనే వ్యవహరించారు. పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే కరోనా పోతుందన్నది నిజం కాదా? క-రో-నా వచ్చిన మొదటిరోజే ముఖ్యమంత్రి అవగాహ నతో, సముచిత నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితులుండేవా? పారాసెట్మాల్ కు, బ్లీచింగ్ కు క-రో-నా పోతే, వేలకు వేలు గుంజుతూ బ్లాక్ మార్కెట్లో ఇంజెక్షన్లు ఎందుకు అమ్ముతున్నారు? ఎలా చెబితే ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది? పదివేల మంది విద్యార్థులు ఒకేసారి పరీక్ష రాయడానికి వస్తే, ఎన్ని వైద్యబృందాలను నియమించి, పరీక్షలు చేయగలరు? ఒక్కో బృందం గంటలో ఎందరు విద్యార్థులకు పరీక్ష చేయగలదు? రాష్ట్రప్రజలు ఈ ముఖ్యమంత్రికి ఎలా ఓట్లేశారనేది ఇప్పటికీ రహస్యమే. ముఖ్యమంత్రి తక్షణమే అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు, లేదా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలి. లక్షలాది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఈ గుడ్డి ప్రభు త్వానికి, అవగాహనా రాహిత్య ప్రభుత్వానికి తెలియచేస్తున్నా .. క-రో-నా వైద్యంపై, దాని విస్తృతిపై ప్రభుత్వానికి అవగాహనే లేదు. ఈ రాష్ట్రంలోని బిడ్డలందరూ తనబిడ్డలేనని ముఖ్యమంత్రి భావించాలి. వారిని అష్టకష్టాలపాలు చేయకుండా, వారిని బలి తీసుకోకుండా, ముఖ్యమంత్రి సముచిత నిర్ణయం తీసు కోవాలి. వయస్సులో పెద్దవాడినైనా సరే, ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కారం చేస్తాను. పరీక్షల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని ముఖ్యమంత్రి గ్రహించాలి. ఏ బిడ్డకై నా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రికి ముసళ్ల పండగ ముందుంటుంది. తక్షణమే ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి, పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దుచేయడమో, వాయిదా వేయడమో చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న, పది, ఇంటర్ పరీక్షల పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్, బసవ ప్రభు పాటిల్ వాదనలు వినిపించారు. దాదాపుగా గంట సేపు సుదీర్ఘ వాదనలు విన్న అనతంరం హైకోర్టు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి అఫిడవిట్ వేయాలని, ఈ కేసుని మే 3వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో, పలు అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సుమారు పది లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరు కావలసి ఉండటంతో, వారి తల్లిదండ్రులతో పాటు, మొత్తం 30 లక్షల మంది అక్కడే ఉన్నారని, అదే విధంగా ఉపాధ్యాయులు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది, మొత్తం ఎక్కవ మంది అవుతారని, ఈ నేపధ్యంలో, వీరి అందరితో పరీక్షలు నిర్వహణ చేయటం సాధ్యం అవుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఎవరికీ అయితే, ఇప్పటికే కో-వి-డ్ వచ్చిన విద్యార్ధులు ఎలా పరీక్ష రాస్తారు అని, సీనియర్ కౌన్సిల్ వాదించారు. నిబంధనలు ప్రకారం వారు ఐసొలేషన్ లో ఉండాలి కదా అని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపు న్యాయవాది, తాము వీరి అందరికీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

hc 300432021 2

హైకోర్టు మాత్రం వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహణ చేస్తాం అనేది, ఎలా సాధ్యం అని చెప్పి, హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి అని, ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించటం సమంజసమా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ అలోచించికోవాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో, ఇప్పటికే వైరస్ సోకినా వారు, బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపధ్యంలో పది లక్షల మంది పిల్లలు పరీక్షలకు రావటం, ఒకరికి వస్తే వారి ఇంట్లో వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో, మిగతా వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో ఇటువంటి పరీక్షల నిర్ణయం ఎంత వరకు సమంజసం అనేది కూడా అలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితువు పలికింది. దీంతో పాటు మిగతా రాష్ట్రాల్లో రద్దు, వాయిదా వేసిన రాష్ట్రాల డేటాని కూడా హైకోర్టు ముందు ఉంచారు. ఈ నేపధ్యంలో , ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకోవాలని, హైకోర్టు ఆదేశిస్తూ, మే 3కి కేసు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు బాల్ ప్రభుత్వం కోర్టులో ఉంది.

జగన్మోహన్ రెడ్డి సర్కారు కుంభకోణాల్లో అతిపెద్దదైన ఇసుక కుంభకోణం (శాండ్ స్కామ్) గురించి ప్రజలకు తెలియ చేయడానికే మీడియాముందుకొచ్చినట్లు టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున సహజవనరుల దోపిడీకి పాల్పడుతూ, వేలకోట్లనుదిగమింగుతున్నాడు. మరోపక్క మద్యం వ్యాపారం మొత్తాన్ని తనగుప్పెట్లో పెట్టుకొని లిక్కర్ డాన్ గా అవతరించాడు. కచ్చితమైన ఆధారాలతో, వాస్తవాలను బయటపెడుతూ, తెలుగుదేశం తరుపున ముఖ్యమంత్రిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇసుకను పొరుగురాష్ట్రాలకు తరలిస్తూ, ఇప్పటికీ వ్యాపారం చేస్తూనేఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలోనే పెద్ద శాండ్ స్మగ్లర్ గా పేరుప్రఖ్యాతులు పొందాడు. ఆయనకు చెందిన వందలాది లారీలు, చిత్తూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు తరలిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి ఇసుక స్మగ్లర్లు, రాష్ట్రంలోని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి పాల్పడుతూ, ప్రజలపై వేలకోట్ల భారం మోపుతున్నారు. ఇసుక లారీని రూ.40నుంచి రూ.50వేలకు అమ్ముకుంటూ, దోపిడీచేసి, తాడేపల్లి ప్యాలెస్ కు పెద్దఎత్తున వేలకోట్ల సొమ్ము తరలించారు. ఆ తరువాత కేబినెట్ సబ్ కమిటీ వేశామని, రాష్ట్రవ్యాప్తంగాఉన్న ఇసుక రీచ్ లన్నింటినీ ఒక కంపెనీకి కట్టబెట్టి, పెద్దఎత్తున ఇసుక వ్యాపారం జరిగేలా చూస్తామని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీకూడా, ఒక బూటకపు టెండర్ తో, హోల్ సేల్ గా జయప్రకాశ్ వెంచర్స్ అనేకంపెనీకి కట్టబెట్టాడు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్ టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) ద్వారా టెండర్లు పిలిచామని మాయ మాటలు చెప్పుకున్నారు. కావాలనే ముందుగా ప్లాన్ చేసి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు అనుగుణంగా ప్రణాళికలు సిద్దంచేశారు.

దివాళాతీసిన జేపీ వెంచర్స్ కంపెనీని, మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ఇసుక దోపిడీకి తెరదీశాడు. ఇసుక తవ్వకాల్లో ఎలాంటి అనుభవం లేని జయప్రకాశ్ వెంచర్స్ కు రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ ఎలా అప్పగిస్తారని తాను నెలక్రితమే ప్రశ్నించాను. ఇసుక రీచ్ లను ప్రభుత్వరంగ సంస్థలకు కట్టెబెడతామనిచెప్పిన ప్రభు త్వం, ప్రైవేట్ సంస్థలకు ఎలా కట్టబెడుతుందనికూడా పెద్దిరెడ్డిని నిలదీయడం జరిగింది. అప్పుడు మీడియా ముందుకొచ్చిన పెద్దిరెడ్డి, చాలా పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామనిచెప్పారు. కేంద్రప్రభుత్వసంస్థ ఎంఎస్ టీసీఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ నిర్వహించామని, తమ పాత్రేమీలేదని పెద్దిరెడ్డి నెలక్రితం మీడియా ముందు నంగనాచిలా బుకాయించాడు. పెద్దిరెడ్డి పిట్టకథలుచెప్పడం మానుకోవాలి. ఆ వీడియోలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తమకేమీ సంబంధం లేదని, టెండర్ల నిర్వహణ మొత్తం ఎంఎస్ టీసీ ఆధ్వర్యంలో నే జరిగిందని చెప్పారు. శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి అమాయకం గా మాట్లాడినంత మాత్రాన నిజాలు బయటకురాకుండా ఉం డవు. ఎంఎస్ టీసీ అనేది కేవలం ఒక ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ మాత్రమే. నిబంధనలు, విధివిధానాల తయారీలో ఆ సంస్థకు ఎలాంటి సంబంధముండదు. టెండర్ నిర్వహణ మాత్రమే ఎంఎస్ టీసీ చేస్తుంది.. గైడ్ లైన్స్ తో వారికి సంబంధముండదని గతంలోనేను అంటే, ఆరోజు పెద్దిరెడ్డి అడ్డగోలుగా బుకాయించాడు. అంతా ఎంఎస్ టీసీవారే చేశారన్నట్టుగా చెప్పాడు.

సమాచార హక్కుచట్టం ద్వారా ఎంఎస్ టీసీవారిని వివరాలు అడగడం జరిగింది. ఎంఎస్ టీసీ ద్వారా ఏపీలో ఇసుకకు సంబంధించి, మూడు ప్యాకేజీలకు చెందిన టెండర్లలో టెక్నికల్ గైడ్ లైన్స్ ఎవరు రూపొందించారని నేను అడగడం జరిగింది. ఎంఎస్ టీసీ ఇచ్చిన సమాచారంలో చాలా స్పష్టం గా చెప్పారు. ఇసుక టెండర్ కు సంబంధించిన టెక్నికల్ బిడ్ లో ఎంఎస్ టీసీ ఎటువంటి గైడ్ లైన్స్ రూపొందించలేద ని తేల్చిచెప్పారు. దీనిపై శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి ఏంసమాధానం చెబుతాడు? చాలా స్పష్టంగా టెక్నికల్ బిడ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను తాము రూపొందించలేదని ఎంఎస్ టీసీ తరుపున అడిషనల్ జనరల్ మేనేజర్ మలాయ్ మండల్ నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో పెద్దిరెడ్డి గతంలో ఆడిన నాటకం, కుట్ర, ఇసుకమాఫియాలో దోపిడీకోసం ముఖ్యమంత్రి పన్నినకుట్ర బట్టబయలైంది. ప్రభుత్వమే గైడ్ లైన్స్ అన్నీ రూపొందించి, నింద మాత్రం ఎంఎస్ టీసీపై వేస్తారా? అంతా ఎంఎస్ టీసీ ద్వారానే జరిగినట్టు కలరింగ్ ఇస్తారా? ప్రజలంతా ఇప్పటికై నా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న దగాకోరు లగురించి తెలుసుకోవాలి. శాండ్ స్మగ్లర్ ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పాడో, ఇదివరకే వీడియోలో చూశాం కదా? వేలకోట్లను దిగమింగడానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే డమ్మీ కంపెనీని తెరపైకి తెచ్చారని తేలిపోయింది. ఈముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, సీఐడీ, ఏసీబీ విభాగాలను నేడు ఛాలెంజ్ చేస్తున్నాను. ఏసీబీని, సీఐడీని పెద్దిరెడ్డి ఇంటికి పంపించి, తక్షణమే ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి అవినీతి బట్టబయలైంది. ఆయన ఇంటికి ఏసీబీ, సీఐడీని పంపించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయించే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నాయా? ఏరకంగా బూటకపు టెండర్లతో, టెక్నికల్ గైడ్ లైన్స్ రూపొందించి, డమ్మీ కంపెనీ అయిన జయప్రకాశ్ వెంచర్స్ కు ఇసుకరీచ్ లను అప్పగించారో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఈ రోజు సిఐడి విచారణకు హాజరు అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో మార్ఫింగ్ చేసారు అంటూ, దేవినేని ఉమా పై కేసు పెట్టారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి 2014లో మాట్లాడుతూ, తిరుపతిలో ఉండటానికి ఎవరు ఇష్టపడతారు అంటూ, తిరుపతిని కించపరిచేలా మాట్లాడిన ఆడియోకి, జగన్ మోహన్ రెడ్డి తాజా క్లిప్పింగ్స్ వేసి చూపించారు. ఆయన చెప్పింది వాస్తవమే కాని, వీడియో మాత్రం తప్పుగా ఉండటం, మార్ఫింగ్ కేసు పెట్టారు. ఈ రోజు సిఐడి విచారణకు ఉమా హాజరు అయ్యారు. దాదాపుగా, 9 గంటల పాటు ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు, సిఐడి ఆఫీస్ లోనే ఉన్నారు. బయటకు వచ్చిన దెవినేని ఉమా, సిఐడి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వీడియో, చంద్రబాబు చేపించాడు, ఆయన పెట్టించాడు అని చెప్పు అంటూ, తన పై సిఐడి ఒత్తిడి తెచ్చింది అని, అలా చెప్తే తనను వదిలేస్తారు అంటూ, చెప్పారు అంటూ, దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుని కూడా ఈ కేసులో ఇరికించే కుట్రలో భాగంగా ఇది చేసారు అంటూ, దేవినేని ఉమా సిఐడి పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే, దేవినేని ఉమా ఆరోపణలు పై, ఇప్పటి వరకు అయితే సిఐడి ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

uma 29042021 2

దేవినేని ఉమా మాటల్లోనే "నేను మీడియా ముందు మాట్లాడితే, దాన్ని పట్టుకుని, చంద్రబాబు నాయుడు చేపించాడు అని చెప్పు. తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పు అంటూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సతాయిస్తూ కూర్చుకున్నారు. మళ్ళీ 1 వ తారీఖు ఉదయం రమ్మన్నారు. మే డే అని కూడా మర్చిపోయారు అనుకుంటా. ఉదయం పది గంటలకు రమ్మన్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళు అడిగినవి తెచ్చి ఇవ్వాలి అంట. నేను మీడియా సమావేశంలో, జగన్ మాట్లాడిన వీడియో ట్యాబ్ లో చూపించాను కాబట్టి, ఆ ట్యాబ్ రేపు ఉదయం తెచ్చి ఇవ్వమన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇదే కుట్రలు కుతంత్రాలు నడుస్తూ ఉన్నాయి. పొద్దున్న నుంచి చూస్తా ఉన్నా, వీరి అరాచకాలు. జగన్ మోహన్ రెడ్డి గారు, తప్పుడు కేసులు బనాయించి, తప్పుడు కేసులు పెట్టి, మా గొంతు నొక్కాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం, మేము తగ్గుతాం అనుకోకండి. మీ దురాగతాలు ఇంకా గట్టిగా ఎండగడతాం. మీరు క్యాబినెట్ మీటింగ్ కి బయటకు రాలేరు కాని, ప్రజలు, పిల్లలు బలి అవ్వాలా ?" అని దేవినేని ఉమా అన్నారు.

Advertisements

Latest Articles

Most Read