ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతి రాజు గారి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పార్టీలకు అతీతంగా అందరూ, వెల్లంపల్లిని తప్పుబట్టారు. అశోక్ గజపతి రాజు గారి పేరు కూడా తలవటానికి అర్హత లేని వెల్లంపల్లి అంటూ అన్ని వైపుల నుంచి ఆయన పై విమర్శలు వచ్చాయి. అనేక క్షేత్రయ సంఘాలు వెల్లంపల్లి వ్యాఖ్యల పై నిరసనలు తెలిపాయి. అయినా వెల్లంపల్లి మాత్రం తప్పు తెలుసుకోలేదు. అయితే వెల్లంపల్లి వ్యాఖ్యల పై అశోక్ గజపతి రాజు పరోక్షంగా స్పందించారు. తన స్థాయికి తగదు అనుకున్నారో ఏమో, పరోక్షంగా స్పందించారు. ఆయన నిన్న ఒక వీడియో మెసేజ్ విడుదల చేస్తూ, దేవాలయాల పై జరుగుతున్న ఘటనల పై స్పందించారు. "ప్రస్తుత దేవాదాయ మంత్రి గారు, మనకి దేవుడు మాటలు కానీ, ధర్మం మాటలు కానీ, ఆ నోట్లో నుంచి రావటం లేదు. పచ్చి బూతులే ఆయన నోటిని నుంచి వస్తున్నాయి. మనందరికీ కోపం తేవటానికి, అసలు విషయం నుంచి, డైవర్ట్ చేయటానికి చేస్తున్నారు. హిందూ దేవాలయాల ఆస్తులు దోచేస్తుంటే, దానికి అడ్డు పడకుండా, ఈ తిట్లు తిడితే, ఎవరూ బాగుపడరు అనే విషయం మీకు మనవి చేస్తున్నాను. అందుకోసం ఆ ఫోకస్ అంతా హిందూ మతాన్ని కాపాడుకోవటానికి ఉండాలి." అంటూ అశోక్ గజపతి రాజు, వెల్లంపల్లికి కౌంటర్ ఇచ్చారు...

ashok 06012021 2

ఇక ఆయన మాట్లాడుతూ, వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన దేవాలయాల పై ఉద్దేశ్యపూర్వక ఘటనలు జరుగుతున్నయాని అన్నారు. హిందువుల విశ్వాసం పైన, ధార్మిక చిహ్నలపైన, విగ్రహాల పైన, పూజారుల పైన ఉద్దేశ్యపూర్వక ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆలయాల ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల నియామకాల్లో, రూల్స్ పాటించకపోవటంతో, అన్యామతస్తులు, నేరచరితులు నియామకం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా, వంశపారంపర్య ధర్మకర్త హక్కులను హరించి, ఆచార వ్యవహారాలకు తూట్లు పొడిచి, విచ్చలవిడి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఏండోమెంట్ భూములు జాయింట్ కలెక్టర్ పరిధిలోకి తీసుకురావటం, ఆర్ధిక నేరాల ఆరోపణలు, బెయిల్ మీద ఉన్న వ్యక్తులకు, దేవాలయల భూములు క్రమబద్దీకరణ కమిటీలో వేయటం వంటికి ఈ కుట్రలో భాగమే అని అన్నారు. గోశాలలు గాలికి వదిలేసారని, ట్రస్ట్ బోర్డులు/చైర్ పెర్సన్లు ద్వారా దేవాలయాల డిపాజిట్లు కొల్లగొట్టటం , ప్రసాదాలు, దర్శన టిక్కెట్లు, కాటేజీలు, టోల్ చార్జీలు ధరలు విపరీతంగా పెంచేశారని అశోక్ గజపతి రాజు అన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇలా కూడా ఉంటారా అనే విధంగా, కొడాలి నాని మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు పేరు చెప్తే, ఈయనకు పూనకం వచ్చేసి, ఉచ్చం, నీచం కూడా తెలియదు. చంద్రబాబు అనే కాదు, తన పై ఎవరు విమర్శలు చేసినా బూతులతో సమాధానం చెప్తున్నారు. నీ అమ్మ మొగుడు, బొచ్చు పీకుతావా, అనేవి ఈయన నోట్లో నుంచి వచ్చే ఊత పదాలు. చివరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. చివరకు పేకాటలో తన అనుచురులు దొరికినా, ఏమవుతుంది ఉరి వేస్తారా, ఫైన్ కడతారు, మళ్ళీ వచ్చి ఆడుకుంటారు అంటూ చాలా సింపుల్ గా తీసి పడేసే వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్ళింది అంటే, అతన్ని ఒక మనిషిలా కూడా లెక్క వేయకూడదు అని తెలుగుదేశం అనుకునే దాకా వెళ్ళింది. అందుకే మీడియా ముందు బూతులు తిట్టి అలసి పోయి వెళ్ళిపోతారు కొడాలి నాని. కానీ కేఏ పాల్ లాగే, కొడాలి నాని వ్యాఖ్యలను తెలుగుదేశం పట్టించుకోవటం ఆపేసింది. అయితే, ఈ రోజు హిందూపురంలో పర్యటన చేసిన ఎమ్మెల్యే నందమారి బాలకృష్ణ, మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా బాలయ్య ఇలాంటి వారికి స్పందించరు. ఇలాంటి వారిని పట్టించుకోరు కూడా. అయితే కొడాలి నాని శ్రుతిమించితున్నారు అనుకున్నారో ఏమో, బాలయ్య మీడియా ముందు కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు.

balayya 06012021 2

బాలయ్య మాట్లాడుతూ "ఒక న్యాయం అంటే, చట్టం అంటే వీరికి లెక్క లేదు. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. మొన్న ఎవడో ఒకడి తమ్ముడు, వాడు పేకాటలో పట్టుబడ్డాడు. ఏంటి రా నీ తమ్ముడు దొరికాడు గా అంటే, ఆ ఏముంది కోర్టులో వేస్తారు, ఫైన్ కడతాం, బయటకు వస్తాడు, మళ్ళీ పేకాడతాడు అనే విధంగా స్పందిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకో. వాడికి చెప్తున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు. మేము మాటల మనుషులం కాదు, ఊరికినే నోరు పారేసుకోవటానికి. అవసరం అయితే చేతల్లో కూడా చూపిస్తాం. జాగ్రత్త, తస్మాత్" అంటూ హెచ్చరించారు. ఇక అలాగే ఇక్కడ రకరకాల మంత్రులు ఉన్నారని, ఒకరు బెంజ్ మినిస్టర్, ఒకరు హవాలా మినిస్టర్, ఒకరు బూతులు మినిస్టర్, ఒకరు పేకాట మినిస్టర్, ఒకరు ఇసుక మంత్రి, ఒకరు లిక్కర్ మంత్రి, ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అంటూ, బాలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అలాగే తన పర్యటనలో దెబ్బతిన్న పంటలను చూసారు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదని, ఇన్సురన్సు ప్రీమియం కట్టలేదని, విపత్తు సహాయం లేదని ధ్వజమెత్తారు.

జస్టిస్‌ రాకేశ్‌కుమార్.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సంచలనం. జస్టిస్‌ రాకేశ్‌కుమార్ అంటే తెలియని ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అమరావతి ప్రజలకు ఆయన దేవుడు. అక్కడ రైతన్నలు ఇంకా ఆశతో ఉన్నారు అంటే, ఈయన కూడా కారణమే. ఇక ఆంధ్రప్రదేశ్ లో న్యాయం కోసం చూసే వారికి ఆయన ఒక నావలాగా కనిపించారు. ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యక్తిరేక పనులు గురించి తన వద్ద ఏ పిటీషన్ వచ్చినా, ఘాటుగా స్పందించే వారు. పదే పదే ప్రభుత్వం చట్ట విరుద్ధమైన చర్యలు చేయటం, జడ్జిల పై బూతులు తిట్టిన సోషల్ మీడియా వైసీపీ వారి పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం, ఇలా అనేక అంశాలతో ఆయన ప్రభుత్వం పై, ఒకింత అసంతృప్తిలో ఉండేవారు. చివరకు ఆయన అంటేనే ప్రభుత్వానికి భయం మొదలైంది. చివరకు, ఆయన అసలు మా కేసులు వాదించటానికి లేదు అంటూ, రెండు పిటీషన్లలో ఏకంగా ప్రభుత్వమే, అఫిడవిట్ వేయటం మరో హైలైట్. ఇలాగే మిషన్ బిల్డ్ ఏపి కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలని ప్రభుత్వం తరుపున మిషన్ బిల్డ్ ఎపి అధికారి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ వేసిన ఒక పితీషన్, సంచలనికి దారి తీసింది. ఇలా ఒక జడ్జి తమ కేసు వినకూడదు అంటూ, ఏకంగా ప్రభుత్వమే ఇలా పిటీషన్ వేయటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే చివరకు వాదనల సమయంలో, అసలు రాకేశ్ కుమార్ అనని మాటలు, ప్రభుత్వం అఫిడవిట్ లో పెట్టారని తేలింది.

rakesh 05012021 2

దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జరీ చేసి, కంటెంప్ట్ అఫ్ కోర్టు కింద కేసు బుక్ చేయమని చెప్పింది. అయితే ఈ తీర్పు కాపీలో జస్టిస్ రాకేశ్ కుమార్ కొన్ని సంచలన విషయాలు రాసారు. అసలు హైకోర్టు పై ఎందుకు ఇలా చేస్తున్నారో అని చెప్పుకుని వస్తూ, జగన్ , చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దగ్గర నుంచి మొదలు పెట్టి, ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, జగన్ మోహన్ రెడ్డి కేసులు, తరువాత ఒకే రోజు ఏడు కేసులు పోలీసులు ఎత్తేయటం, జగన్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో వెతకటం, ఇలా అనేక అంశాలు ఆ తీర్పులో పెట్టారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్పు పై అభ్యంతరం చెప్తూ, అందులో రాసిన పదాల పై సీరియస్ అయ్యింది. జస్టిస్ రాకేశ్ కుమార్ రిటైర్డ్ అయినా సరే, ఆయన ఇచ్చిన తీర్పు పై, రాకేశ్ కుమార్ తీర్పు పై అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పు పై అభ్యంతరం చెప్తూ , సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరుపున పిటీషన్ దాఖలు చేసారు. మరి సుప్రీం కోర్టు, ఏమి చెప్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయంతో ప్రజలు రకరకాల షాక్ లు తింటున్నారు. ఇప్పటికే పన్నుల రూపంలో ప్రభుత్వం బాదుతున్న వెరైటీ బాదుడు చూసి, ప్రజలు అవాక్కయ్యారు. పెట్రోల్ రేట్లు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, మరుగుదొడ్డి ఉంటూ పన్ను, చెత్త పన్ను అంటూ రకరకాల బాదుడు బాదారు. ఇది ఇలా ఉంచితే, ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ చూసి విజయవాడ ప్రజలు అవాక్కయ్యారు. విజయవాడలో ఆటోనగర్ దాటిన తరువాత తాడిగడప అనే ఊరు అందరికీ తెలిసిందే. తాడిగడప పేరును, ఇప్పుడు ప్రభుత్వం "వైఎస్సార్ తాడిగడప" అంటూ మార్చేసింది. రాత్రికి రాత్రి వచ్చిన ఈ మార్పు చేసి ప్రజలు అవాక్కయ్యారు. అసలు వైఎస్ఆర్ కి తాడిగడపకు సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మా ఊరి పేరు తాడిగడగానే ఉంచాలని అంటున్నారు. కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టారంటే అర్ధం ఉంది, అసలు విజయవాడలో ఉన్న తాడిగడపకు వైఎస్ఆర్ పేరు ఏమిటి అంటూ జుట్టు పీక్కుంటున్నారు. రేపటి నుంచి ఇలా ప్రతి ఊరు ముందు వైఎస్ఆర్ అనో, ఇంకో పేరో పెట్టుకుంటూ పొతే, ఎలా అని ? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంటున్నారు. ఇక ఈ విషయం పై తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు.

vij 05012021 1

జగన్ మోహన్ రెడ్డికి మైండ్ లేదని, ఇలాగే బావ పేరు, చెల్లి పేరు, తల్లి పేరు కూడా పెట్టేస్తారా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక, ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఉంది. మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా ఏపీలోని పలు గ్రామాలు విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన ఏపీ సర్కార్. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోకి అమరావతి పరిధిలోని గ్రామాలను తీసుకుని వచ్చారు. ఇక మంగళగిరి మున్సిపాలిటీలో 11 గ్రామాల విలీనం చేసారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, కందుకూరు మున్సిపాలిటీల్లోకి సమీప గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 6 చోట్ల చిన్నస్థాయి పట్టణ ప్రాంతాలు ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసారు. ఇదే క్రమంలో, విజయవాడలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు తదితర ప్రాంతాలను కలుపుతూ "వైఎస్సార్ తాడిగడపగా" పేరు మార్చి పడేసారు. దీని పై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read