ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. నిన్న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, ఈ రోజు ఎన్నికల నియమావళి అమలు లోకి రావటంతో, ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలు మేము ఒప్పుకోం అని చెప్తున్నా, కోర్టుల్లో వీరి వాదన నెగ్గే అవకాసం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని, కోర్టులు కాదనే అవకాసం లేదని, మొన్నే కేరళ విషయంలో చూసాం. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యింది. ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు. ఈ సమవేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఇతర ముఖ్య నేతలు పాల్గున్నారు. ఎన్నికల నేపధ్యంలో వారికి చంద్రబాబు దేశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతించారు. ఇవి జరిగితే జగన్ బండారం బయట పడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తే, జగన్ కు ఒక బ్రేక్ వస్తుందని, పెంచిన చార్జీలు దగ్గర నుంచి, పన్నుల దగ్గర నుంచి,ర రైతులకు మోటార్ల మీటర్ల దాకా అన్నిటి పై వెనక్కు తగ్గుతాడని అన్నారు. ఎన్నికలు అనేవి నిర్ణయించేది రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ అని అన్నారు. దీనికి జగన్ మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఉండదని అన్నారు.

cbn 09012021 2

ఎన్నికల సంఘాన్ని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉద్యోగులు, పోలీస్ వారు కూడా, సహకరించాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అన్నారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరపాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ముందు పలు సంచలన డిమాండ్స్ పెట్టారు. ఆన్లైన్ లో కూడా నామినేషన్లు వేసే విధంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. తద్వారా వీళ్ళు బలవంతంగా ఎత్తుకుని వెళ్ళే అవకాసం ఉందని అన్నారు. ఇక కేంద్ర బలగాలు పర్యవేక్షణలో మాత్రమే ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గ్రావ వాలంటీర్లును ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేయ కూడదు అని చంద్రబాబు డిమాండ్ చేసారు. గతంలో ఎన్నికల కమిషన్ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకుందని, వారిని ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని అన్నారు. ప్రభుత్వ భావనల పై వైసీపీ రంగులు తీయాలని డిమాండ్ చేసారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గతంలో బలవంతంగా చేసిన ఏకాగ్రీవాలు అన్నీ రద్దు చేయాలని అన్నారు. అన్ని స్థానాలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

జగన్ మోహన్ రెడ్డికి అక్రమ ఆస్తుల కేసులో, ఈడీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఆయన విచారణకు హాజరుకాకుండా, కోర్టు నుంచి ఎప్పటికప్పుడు పర్మిషన్ తీచ్చుకుంటున్నారు. ఇక మధ్యంలో క-రో-నా వల్ల కోర్టులు కూడా పని చేయలేదు. అయితే ఈ మధ్య రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అయ్యింది. ఈ నేపధ్యంలోనే ఈడీ తాజాగా జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 11 వ తారీఖున కోర్ట్ కు హాజరు కావాలని జగన్ ను ఆదేశించారు. అరబిందో, హెరిటో భూకేటాయింపులు విషయంలో, ఈ చార్జ్ షీట్ ను, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుకు బదిలీ చేయటం జరిగింది. అయితే ఈ అరబిందో, హెరిటో భూకేటాయింపులకు సంబంధించి, భూములు కేటాయింపులకు ప్రతిఫలంగా, జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని దానికి సంబంధించిన, దాని మీద ఈ కేసు నమోదు అయ్యింది. దీని పై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అనేక సాక్ష్యధారాలు నమోదు అయిన నేపధ్యంలో, నాంపల్లి కోర్టు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కు బదిలీ చేయాలనే పిటీషన్ కు స్పందించి, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఈ కేసుని తీసుకోవటం జరిగింది. దీంతో ఈ కేసుని విచారణకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, జగన్ కు సమన్లు జారీ చేసి కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారే చేసింది. ఇక ఇదే కేసులో విజయసాయి రెడ్డి, హెరిటో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి కోర్టుకు రావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది.

jagan 09012021 2

ఇక మరో పక్క సిబిఐ చూస్తూ, విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చింది. విజయసాయి రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు మోపటం సరైన నిర్ణయమే అని సిబిఐ వాదించింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించి తనకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి డిశ్చార్జ్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీని పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ,అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ 9, 13 విజయసాయి రెడ్డికి వర్తిస్తాయని చెప్పారు. ఆ సమయంలో విజయసాయి రెడ్డి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారని, అది పబ్లిక్‌ సర్వెంట్‌ కిందకే వస్తుందని, అవినీతి నిరోధక చట్టం కింద విజయసాయి రెడ్డిఐ బుక్ చేయవచ్చని అన్నారు. వాదనలు విన్న సిబిఐ కోర్టు, ఈ కేసుని ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికిప్పుడు జగన, విజయసాయి రెడ్డికి ఈ కేసులతో వచ్చే ముప్పు ఏమి లేదని చెప్పాలి. అయితే జగన్ కోర్టుకు వెళ్ళటానికి ఇష్ట పడటం లేదు కాబట్టి, ఏమవుతుందో చూడాలి.

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాల్సిందే అని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి స్పష్టం చేసారు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ తో పాటు, మరో ఇద్దరు అధికారులు, ఈ రోజు నిమ్మగడ్డను కలిసారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసారు. అయితే వాళ్ళు కలిసి వెళ్ళిన కొద్ది సేపటికే ఎన్నికల్ షడ్యుల్ విడుదల చేసారు. ఈ రోజు మళ్ళీ ప్రొసీడింగ్స్ విడుదల చేసారు. ఈ షడ్యుల్ ప్రకారం రేపటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. రాష్ట్రంలో నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఫిబ్రవరి 5, 9, 13, 17న పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పారు. మొత్తంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రొసీడింగ్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో, ప్రభుత్వ వాదనల్లో కొత్త ఏమి లేదని అన్నారు. ఇవన్నీ గతంలోనే చెప్పారని అన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ అని అంటున్నారని, ఇంకా కేంద్రం ఎక్కడా షడ్యుల్ ఇవ్వలేదు కదా అని నిమ్మగడ్డ అన్నారు. అయితే దీని పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్తుందా, లేదా ఎన్నికలకు రెడీ అంటుందా అనేది చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ప్రెస్ నోట్ విడుదల చేసారో లేదో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. నిమ్మగడ్డ ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం కూడా ఊహించలేదు. అయితే నిమ్మగడ్డ నిర్ణయం పై ప్రభుత్వం ముందుగా చేయాల్సింది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం. అయితే రేపటి నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవలు ఉన్నాయి. ఈ నెల 17 వరకు సెలవలు ఉంటాయి. మరి రేపు ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ మూవ్ చేస్తుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే, ముందుగా ప్రభుత్వం నిమ్మగడ్డ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉత్తరం రాసింది. చీఫ్ సెక్రటరీ నిమ్మగడ్డకు లెటర్ రాసారు. మీ మీద గౌరవంతో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించటం లేదు అని చెప్పిన, మీ నిర్ణయాన్ని మేము అంగీకరించటం లేదని అన్నారు. క-రో-నా కారణంగా మేము ఎన్నికలు నిర్వహణ చేయలేక పోతున్నామని అన్నారు. అలాగే వ్యాక్సిన్ కూడా వేయాల్సి ఉందని అన్నారు. ఈ ప్రక్రియ అంతా అయ్యే దాకా ఎన్నికలు వద్దు అని, మా నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇక పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, ప్రజల ప్రాణాలు హరించే విధంగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. మొండి వైఖరి అంటూ, ఎన్నికల కమిషన్ ని నిందించారు. సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారు అంటూ ప్రకటన విడుదల చేసారు.

Advertisements

Latest Articles

Most Read