ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం రాత్రి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. శనివారం రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని ఆ ఆదేశాల్లో తెలిపారు. దీని ప్రకారం, ఎలాంటి కొత్త పధకం, ప్రజలను ప్రలోభపెట్టే పనులు చేయ కూడదు. అయితే సోమవారం రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమం మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని. జగన్ మోహన్ రెడ్డి, నెల్లూరులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి, ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా ? లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య నెలకొన్న వైరంతో, ఈ కార్యక్రమం ఏమి అవుతుంది అనే టెన్షన్ అందరిలో ఉంది. అయితే అమ్మఒడి కార్యక్రమం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో రేపు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం పై, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అమ్మోది పధకం గతంలో ఉన్న పధకమే కాబట్టి, ఈ కార్యక్రం ఎప్పటిలాగే ఈ సారి కూడా చేసుకోవచ్చు అని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే ఇలా చెప్తూనే, ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి, కొన్ని షరతులు విధించింది.

ec 10012021 2

అమ్మ ఒడి కార్యక్రమం పై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గ్రామాల్లో చేపట్టే కార్యక్రమంలో, ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గునకూడదు అని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే గ్రామాల్లో ఈ కార్యక్రమంలో పాల్గునాలని స్పష్టం చేసింది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం, ప్రజాప్రతినిధులు పల్గునవచ్చని తెలిపింది. దీంతో రేపు జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తూ ఉండటంతో, ఈ కార్యక్రమం కూడా పట్టాణ ప్రాంతంలో ఉండటంతో, ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గ్రామాల్లో ఉన్న లబ్దిదారులను, పట్టాణాలకు పిలిచి కూడా, ఈ కార్యక్రమం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఇక అలాగే ఇంటి పట్టాల కార్యక్రమం కూడా, పాత పధకమే కాబట్టి, ఇది కూడా చేసుకోవచ్చని, కానీ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కాకుండా, అధికారులు మాత్రమే చేయాలని తెలిపింది. మరి అధికార పార్టీ నేతలు, ఎన్నికల కమిషన్ చెప్పింది వింటారో లేదో, మళ్ళీ ఎలాంటి పరిస్థితి చూడాల్సి ఉంటుందో, రేపు కానీ తెలియదు.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు నుంచి వస్తున్న అభ్యంతరాలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆందోళన పై ఈ రోజు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. కొద్ది సేపటి క్రితం ఆయన, ఒక బహిరంగ లేఖ విడుదల చేసారు. అలాగే ఇది పత్రికా ప్రకటనగా కూడా ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల విధి నిర్వహణ, అంటే పోలింగ్ విధుల్లో పాల్గునే ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించి, తాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తాము ప్రొసీడింగ్స్ లో ఇది వరుకే చెప్పమని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గునే ఉద్యోగులకు పీపీఈ కిట్లు, సానిటైజర్ లు , పేస్ షీల్డ్స్ తో పాటు, క-రో-నా వ్యాక్సిన్ వస్తే, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటుగా, ఉద్యోగులకు కూడా అదే ప్రాధాన్యత ఇచ్చి, వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి, తాను సూచించిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేసారు. దీంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, ఎన్నికల్లో కానీ, వచ్చే సవాళ్ళను ధీటుగా ఎదుర్కునే మనస్తత్వం ఉందని చెప్పి, ఇది ఎన్నో సార్లు కూడా నిరుపితం అయ్యిందని అన్నారు. ప్రస్తుతం కూడా రాజ్యంగ విధిగా ఉన్న ఎన్నికల నిర్వహణ అనేది, రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని చెప్పి, దీంట్లో అందరం కలిసి కట్టుగా పాల్గునాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

letter 10012021 2

దీంతో పాటు, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని, ఈ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్రంలో, ఇవి రాజ్యాంగం ప్రకారం నిర్వహించాల్సి ఉందని, ఇది ఒక రాజ్యంగ విధి అని కూడా అయన చెప్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పంచాయతీలకు కీలకంగా ఉండే పంచాయతీ పాలకవర్గాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి, కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి వచ్చే నిధులు కూడా వెంటనే అందాల్సి ఉందని, ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యంగా విధిలో ఉండే ఈ ఎన్నికల ప్రక్రియలో అందరం కలిసి కట్టుగా, ఈ ఎన్నికలు విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు కూడా, ఎన్నికల సంఘం తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక బృందం తనతో సమావేశం అయినప్పుడు కూడా, ఉద్యోగులు బద్రతకు సంబంధించి, అన్ని రకాల విషయాలు తాము వారికి వివరించినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో, ఉద్యోగులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో, అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తాము తీసుకుంటామని తెలిపారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎన్నికల ప్రకటన వచ్చిన నేపధ్యంలో, రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అందరితో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్ లోకి అందరినీ తీసుకున్న చంద్రబాబు, ఎన్నికల అజెండా గురించి చర్చించారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు, ఈ రోజు పత్రికల్లో వచ్చిన ఒక వార్త పై స్పందించారు. ఈ రోజు పత్రికల్లో జగన్ అభినవ శ్రీరాముడు అంటూ, వైసీపీ నాయకులు పెట్టిన ఒక ఫ్లెక్సీ వార్తగా వచ్చింది. అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు వేష ధారణలో జగన్ మొఖం పెట్టారు. బాణం ఎక్కుపెట్టినట్టు ఉంది. ఆ బాణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మీద ఎక్కు పెట్టినట్టు ఉంది. ఒక పక్క రాష్ట్రంలో దేవాలయాల పై వరుస ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ పార్టీ, తమ హిందూ ఇమేజ్ పెంచుకోవటానికి, నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే, నిన్న విజయవాడలో కొత్తగా గుడులు కడుతున్నాం అంటూ శంకుస్థాపన చేసి హడావిడి చేసారు. ఈ రోజు ఇలా జగన్ అభినవ శ్రీరాముడు అంటూ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేసారు. అయితే ఇది హిందువులకు చూడటానికి ఎంతో ఎబ్బుట్టుగా ఉందని, ఉదయం నుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కొన్ని హిందూ సంఘాలు ఆందోళన కూడా చేసాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా ఈ విషయం పై ప్రస్తావించారు.

jagan 090120221 2

జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, ఈ ఫ్లెక్స్ పెట్టింది కూడా, క్రిస్టియన్ మంత్రి నియోజకవర్గంలో అని, ఇలా ఎందుకు చేస్తున్నారు, జగన్ మోహన్ రెడ్డి మొఖాన్ని శ్రీరామ చంద్ర మూర్తికి పెడతారా, హిందువుల మనోభావాలను గాయపరుస్తారా ? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక పక్క రామతీర్ధంలో శ్రీరాముడి తల పెకిలిస్తే, ఇప్పటి వరకు కనీసం అక్కడకు వెళ్లి స్పందించని జగన్ మోహన్ రెడ్డిని, శ్రీరాముడితో పోలుస్తారా ? హైందవ సంస్కృతిపై ఇంతకంటే మరో దా-డి ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం, నదిలో మునిగి నాటకాలు అడారని, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పేదానికి, చేసేదానికి పోలిక ఉండదని చంద్రబాబు అన్నారు. అపరిచితుడు సినిమాలో లాగా చేస్తున్నారాణి, చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి కుదించారని, గతంలో పెట్టిన దివ్యదర్శనం రద్దు చేసారని, ఇప్పుడేమో, నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రభుత్వం తాము ఎన్నికలు ఒప్పుకోం అంటూ, పడుతున్న పాట్లు చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగ సంఘం నుంచి వెంకట రామిరెడ్డి, ఏపి ఎన్జీవోల సంఘం నుంచి చంద్రశేఖర్ రెడ్డి, పోలీసులు సంఘం, ఇలా అందరూ నిన్న వరుస పెట్టి ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్ లు విడుదల చేసి, మేము ఎన్నికల్లో పాల్గునేది లేదు, మేము సహకరించేది లేదు అంటూ, హడావిడి హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రభుత్వం కూడా అత్యవసర పిటీషన్ అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, ఇటు నిమ్మగడ్డ మాత్రం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో, ఆయనకు రాజ్యాంగబద్ధ పదవిలో, ఎన్నికల సమయంలో సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి, తన అధికారాలని ఆయన ఉపయోగిస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రభుత్వం ఆయన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే, ఇప్పుడు ఆయన రూల్స్ ప్రకారం, ఒక్కో బాణం వదులుతున్నారు. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ కు లేఖ రాసారు. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో, అనేక ఘటనలు జరిగాయి. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేసి, అఅనేక ఏకాగ్రీవాలు చేసుకున్నారు.

nimmagadda 10012021 2

ఈ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి. చివరకు బొండా ఉమా, బుద్దా వెంకన్న మీదకు కూడా వచ్చిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లో నిమ్మగడ్డ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, వారిని ఇప్పుడు మళ్ళీ తప్పించాలని నిమ్మగడ్డ, తాజాగా లేఖ రాసారు. అప్పట్లో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. ఎన్నికలు వాయిదా పడటంతో, ఈ ఆదేశాలు అమలు కాలేదు. చిత్తూరు కలెక్టర్, గుంటూరు కలెక్టర్, తిరుపతి, గుంటూరు లో ఎస్పీలను బదిలీ చేయాలనీ, మాచర్ల సిఐని సస్పెండ్ చేయాలని, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ట్రాన్స్ఫర్ చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను, ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు వచ్చిన నేపధ్యంలో, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపధ్యంలో, ఆ ఆదేశాలు అమలు చేయాలని నిమ్మగడ్డ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. గతంలో మేము చెప్పిన వారందరినీ బదిలీ చేసి, వారి స్థానంలో వేరే వారిని నియమించాలని నిమ్మగడ్డ కోరారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, సహకరించకపోతే నిమ్మగడ్డ ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read