తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎవరి పార్టీలు వారు, ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం తెలంగాణాతో ఎంత ముడిపడి ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ తో కూడా అంతే ముడి పడి ఉంటుంది. ఎందుకంటే ఆ హైదరాబాద్ నగర పునర్-నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ప్రతి ఇంటి నుంచి హైదరాబద్ కు వెళ్లి పని చేసిన వారు ఉండరు అనే స్థాయికి, మనకి హైదరాబాద్ కు బంధం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, హైదరాబాద్ తో అనుబంధం అలాగే ఉంది. అయితే ఉద్యమ సమయంలో కానీ, సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత కానీ, అక్కడ ఉన్న ఆంధ్రా వారి పై, తెలంగాణా వాదులు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గుర్తున్నాయి. సొంత రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ స్టేట్ అని సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. అంతే కాదు, హైదరాబాద్ కు దీటుగా రాజధాని నిర్మాణం చేసుకుంటుంటే, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఈ హేళనలు అన్నీ ఇంకా గుర్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అమరావతికి ఎవరు మద్దతు తెలిపినా, అమరావతి ఉద్యమానికి బలం అనే చెప్పాలి. ఇదే కోవలో, హైదరాబాద్ సెటిలర్స్ ని మంచి చేసుకోవటానీకో ఏమో కానీ, మంత్రి కేటీఆర్ అమరావతి ప్రస్తావన తెచ్చారు. నిన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయటం లేదని అన్నారు.

ktr 24112020 2

పక్క రాష్ట్రంలో చక్కగా ఒక రాజధాని కట్టుకుంటున్నాం అని అమరావతిని మొదలు పెడితే, అమరావతి కోసం డబ్బులు ఇవ్వకుండా, ఒక చెంబుడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చి మోడీ చేతులు దులుపుకున్నారని కేటీఆర్ అన్నారు. ఎవరైనా ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటుంటే, కేంద్రం ఆదుకుంటుందని ఆశ పడతారని, అయితే వారి ఆశలు అడియాశలు చేసారని అన్నారు. అయితే మొన్నటి వరకు అమరావతిని గ్రాఫిక్స్ అన్న నోటితోనే, ఇప్పుడు కేటీఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో, అందరికీ అర్ధం అయినా, ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం వస్తుంది. అమరావతికి జరుగుతున్న అన్యాయం పై, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం పై, పక్క రాష్ట్రం మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ తరుపున కూడా, కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే, అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఇదే స్థాయిలో కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు ? అమరావతి ఆగిపోయింది, పోలవరం 20 వేల కోట్లు మాత్రమె ఇస్తాం అంటున్నారు, 18 విభజన హామీలు అలాగే ఉన్నాయి, మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా అలాగే ఉండి పోయింది. ఆంధ్రులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. పక్క రాష్ట్రం వారు జాలి చూపిస్తుంటే, సొంత రాష్ట్రం వారు మాత్రం కేంద్రాన్ని అడగలేక పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ చర్చకు దారి తీసింది. సహజంగా గవర్నర్ లు, ప్రభుత్వాలు పంపే ఫైల్ ని ఆమోదించి పంపిస్తారు. ఎంత వివాదం ఉన్న బిల్లు అయినా, ప్రభుత్వం ఒకే చెప్పిన తరువాత, సహజంగా వెనక్కు తిప్పి పంపించరు. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు అయినా, అలాగే నిమ్మగడ్డ రమేష్ ని తొలగించి వేరే వారికి ఎలక్షన్ కమీషనర్ ను నియమించే బిల్లు అయినా, ఎంత వివాదాస్పదం అయినా, గవర్నర్ ని ఆమోదించవద్దు అని వేడుకున్నా, ఆయన ఆ బిల్లులను ఆమోదించారు. రాజధాని బిల్లులను వెంటనే ఆమోదించకుండా, కొంచెం టైం తీసుకుని, న్యాయ సలహాలు తీసుకున్న టైంలో, ఎక్కడ గవర్నర్ వాటిని వెనక్కు పంపుతారో అని, ఏకంగా మంత్రి బుగ్గన లాంటి వారిని కూడా గవర్నర్ వద్దకు పంపించి, ఆ బిల్లుల అవసరం గురించి వివరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గవర్నర్, ఏపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనకు ఉన్న పరిధిలో, విచక్షణాదికారం ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి సారి గవర్నర్, ఏపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లును నియమించే విషయంలో, ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ పంపగా, గవర్నర్ ఆ ఫైల్ ని వెనక్కు తిప్పి పంపించారు. జగన్ ప్రభుత్వానికి, గవర్నర్ వద్ద నుంచి షాక్ రావటం ఇదే మొదటి సారి. అయితే ఈ నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే వెనక్కు పంపినట్టు తెలుస్తుంది.

governor 22112020 2

గత 20 రోజులుగా ఈ ఫైల్ గవర్నర్ వద్దే ఉంది. గవర్నర్ ఈ ఫైల్ పై న్యాయ సలహాలు, నిపుణుల సలహాలు తీసుకున్నారు. దీపావళి ముందు రోజు, జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసిన సందర్భంలో, ఈ ఫైల్ పై కూడా గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు, వీలైనంత త్వరగా ఆమోదం తెలపలాని కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ నియామకాలు విరుద్ధంగా ఉండటంతో, గవర్నర్ తిప్పి పంపారు. సహజంగా ఒక యూనివర్సిటీ వీసిని నియమించే క్రమంలో, సెర్చ్ కమిటీ ముగ్గురు వ్యక్తులతో ఒక ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, అందులో నుంచి ఒకరిని గవర్నర్ నియమిస్తారు. అయితే ఈ మధ్య కొత్త చట్టం తీసుకు వచ్చిన జగన్ ప్రభుత్వం, ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఒక చట్టం తెచ్చింది. అయితే ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం అని, ప్రభుత్వ పాత్ర ఈ నియామకాల్లో ఉండ కూడదు అని, గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు మార్పులు పై కోర్టులో కేసులు కూడా పడ్డాయి. అయితే ఇక్కడ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాముఖ్యంగా మారింది. ఇక నుంచి ప్రతి బిల్లు గవర్నర్ ఆషామాషీగా ఆమోదించరు అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.

2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, తన చుట్టూ ఉండాల్సిన మనుషుల కోసం, ఏరి కోరి కొంత మంది వ్యక్తులను తెచ్చుకున్నారు. ఇందులో అనేక మందిని సలహదారులుగా తన ఫంక్షనింగ్ కోసం తెచ్చుకున్నారు. ఇందులో ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ ని కూడా అలాగే తన కోర్ టీంలోకి తెచ్చుకున్నారు. డాక్టర్ పీవీ రమేష్ కు వైద్య ఆరోగ్య శాఖ పై గతంలో పట్టు ఉండటం, అలాగే చంద్రబాబు హయంలో విదేశీ వ్యవహారాలు చూడటంలో ఆయనకు పేరు ఉండటంతో, పీవీ రమేష్ ను, జగన్ మోహన్ రెడ్డి తన అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్, సియంఓలో నుంచి తాను తప్పుకుంటున్నాను అంటూ, తన ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయాన్ని ఆయానే స్వయంగా, తన ట్విట్టర్ లో తెలియ చేయటంతో, అందరూ ఒకింత షాక్ తిన్నారు. నవంబర్ 1 నుంచి పీవీ రమేష్ బాధ్యతలు నుంచి తప్పుకున్నట్టు, ఇదే విషయం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు, తాడేపల్లి వెళ్లి చెప్పిన సందర్భంలో, ఆల్ ది బెస్ట్ చెప్పి, జగన్ పంపించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని తరువాతే పీవీ రమేష్ ట్వీట్ చేస్తూ, విషయం చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే విషయం పై ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసి, అధికారింగా పీవీ రమేష్ రాజీనామాను ఆమోదించింది.

ramesh 21112020 2

35 ఏళ్ళ నుంచి ఆయన ఐఏఎస్ అధికారిగా పని చేసారు. ఆయనకు అపారమైన అనుభవం కూడా ఉంది. అలాగే మొన్న క-రో-నా సందర్భంలో కూడా ఆయనే ప్రభుత్వం తరుపున అన్ని బాధ్యతులు చూసారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని పని చేసారు. మొదట్లో కేసులు పెరగకుండా చూసుకోవటంలో ఆయన పాత్ర అధికంగా ఉందని చెప్తారు. అయితే నాలుగు నెలల క్రితం నుంచే పీవీ రమేష్ వెళ్ళిపోతారనే కధనాలు వచ్చాయి. నాలుగు నెలల క్రితం సియంఓ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారుల శాఖల మార్పులు జరిగాయి. ఇదే సందర్భంలో పీవీ రమేష్ ను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పీవీ రమేష్ తో అజయ్ కల్లంని కూడా తప్పించినా, ఆయనకు వేరే శాఖలు ఇచ్చారు, కానీ పీవీ రమేష్ కు మాత్రం ఏమి ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఆయన ఎటువంటి బాధ్యతలు నిర్వహించలేదు. ప్రభుత్వం తనను దూరం పెడుతుంది అనుకున్నారో ఏమో కానీ, గౌరవంగా తప్పుకోవాలని, తానె రాజీనామా ఇచ్చి వచ్చేసారు. అయితే ఏరి కోరి తెచుకున్న వ్యక్తిని ఇలా ఎందుకు తప్పించారు, రాజీనామా చేసి వెళ్ళిపోయేలా ఎందుకు చేసారు అనేది మాత్రం స్పష్టత లేదు.

దాదాపుగా 4-5 నెలల క్రిందట, కర్నూల్ జిల్లాలో పేకాట డెన్ ఒకటి బయట పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన సంచలనం అవ్వటానికి కారణం, ఆంధ్రప్రదేశ్ కార్మిక, న్యాయ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం సొంత గ్రామం కావటం, పట్టుబడిన వారిలో కొంత మంది మంత్రి గారి బంధవులు ఉండటం. అయితే మంత్రి జయరాం మాత్రం, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పట్టుబడిన వారు తనకు దూరపు బంధవులని, ప్రతిపక్షాలు దీని పై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం, ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందని, మంత్రి నిర్వహిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో జరిగిన రైడ్ లో , 40 వాహనాలను, రూ.5.44 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు, 33 మందిని అరెస్ట్ కూడా చేసారు. అయితే ఈ సందర్భంగా పెద్ద హంగామానే జరిగింది. మంత్రి సోదరుడి అనుచరులుగా పేరు ఉన్న కొందరు, రైడ్ కి వచ్చిన పోలీసుల పై ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు మరింత కఠినంగా ప్రవర్తించి, వారిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన అందుకే పెద్దగా హైలైట్ అయ్యింది. అయితే మంత్రి మాత్రం, ఇలాంటి వాటిని తను ప్రోత్సహించను అని, వీటితో తనకు సంబంధం లేదని చెప్పారు. మంత్రి తమ్ముడు గుమ్మనూరు నారాయణ ఈ ఘటన వెనుక ఉన్నారని, ప్రతిపక్షాలు ఆరోపించాయి.

hc 21112020 2

వీటి అన్నిటి నేపధ్యంలో, ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి పాత్రని తేల్చాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. మంత్రిగా ఉన్న వ్యక్తిపైనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక పోలీసులతో కాకుండా, సిబిఐ విచారణ కోరారు. మంత్రినే ప్రతివాదిగా చేర్చటంతో, ఈ కేసుని హైకోర్టు అసలు అనుమతి ఇస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. ఏకంగా పోలీసులు పైన మంత్రి అనుచరులు దాడి చేసారని, దాడి చేసిన వారి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని వెనుక మంత్రి ఉన్నారని పిటీషనర్ తరుపున వాదనలు వినిపించగా, మంత్రి దీని వెనుక ఉంటే, అసలు పోలీసులు ఎందుకు దాడి చేస్తారు అంటూ, మంత్రి తరుపు న్యాయవాది వాదించారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసుని విచారణకు తీసుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఒక మంత్రి పైనే వేసిన కేసు, హైకోర్టు విచారణకు తీసుకోవటంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా దీని వెనుక ఉంది ఎవరో తెలుస్తాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక మరో మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని, ఎలక్షన్ కమీషనర్, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ స్పందించక పొతే, ఈ కేసు కూడా కోర్టుకు చేరే అవకాసం ఉంది. మొత్తానికి మంత్రులు, ఇప్పుడు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే టైం వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read