వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా, ప్రతి రోజు తన ప్రెస్ మీట్లతో, ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రజా సమస్యలు చెప్తూ, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ, అలాగే ప్రభుత్వంలో పని చేస్తూ, కొంత మంది వ్యక్తులు చేస్తున్న పనులు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యే చేస్తున్న పనులను బహిరంగంగా విమర్శిస్తూ, వైసీపీని ప్రతి రోజు ఇబ్బంది పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చేసిన చాలెంజ్ కు ఒకే అంటే రాజీనామాకు రెడీ అని చెప్పారు. రఘురామకృష్ణం రాజుని ఎలాగైనా వదిలించుకోవాలని, వైసిపీ పార్టీ అనేక ప్లాన్లు వేసింది. ఆయనకు షోకాజ్ నోటీస్ పంపించగా, ఏకంగా పార్టీ పేరు మీదే పంచాయతీ పెట్టిన రాజు గారు, చివరకు పేరు పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసే దాకా ఇష్యూ ని తీసుకు వెళ్లారు షోకాజ్ నోటీస్ ఫెయిల్ అవ్వటంతో, రఘురామ కృష్ణం రాజు ఎంపీ పదవికి అనర్హత వేటు వెయ్యాలి అంటూ, పార్లమెంట్ స్పీకర్ కు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్లి ఫిర్యాదు చేసారు. అయితే రఘురామ రాజు మాత్రం, ఇక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చారు.

తాను ఎక్కడైనా జగన్ గారిని కానీ, పార్టీని కానీ విమర్శించినట్టు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం వేరు అని, ప్రభుత్వం తప్పు చేస్తుంటే, సరిదిద్దే బాధ్యత రాజ్యాంగ కల్పించిన హక్కు అని అన్నారు. ఇక ఇది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. దీంతో ఆయన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. రాజీనామా చెయ్యాలి అంటూ ప్రతి రోజు విసిగిస్తున్నారు. ఈ రోజు కూడా మంత్రి బాలినేని రఘురామ రాజు రాజీనామా చెయ్యాలని, డిమాండ్ చేసారు. అయితే మొన్నటి దాకా నేను రాజీనామా చెయ్యను అని చెప్పిన రఘురామరాజు, ఈ రోజు వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలినేని డిమాండ్ చేసినట్టు నేను రాజీనామాకు రెడీ అని, కాకపొతే నేను రాజీనామా చేసి, అమరావతి రిఫరెండంతో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానాని, నేను మళ్ళీ గెలిస్తే అమరావతి ఇక్కడ నుంచి కదలదు అని జగన్ గారి చేత చెప్పించండి, నేను రాజీనామా చేస్తే, ఎన్నికలకు వెళ్లి అమరావతి రిఫరెండంతో ఓట్లు అడుగుదాం అంటూ, అదిరిపోయే సవాల్ విసిరారు. మరి జగన్ గారు కానీ, 151 మంది ఉన్న వైసీపీ పార్టీ కానీ, ఒక్కడు వదిలిన ఛాలెంజ్ కు రెడీ అంటారా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కట్టడిలో విఫలం అయ్యిందని అందరికీ తెలిసిందే. నమోదు అవుతున్న సంఖ్య చూస్తూనే ఆ విషయం అర్ధం అవుతుంది. ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తరువాత స్థానం మనదే. అయితే మనకు ఇప్పుడు కేసులు 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలకే అమ్మో అని అనుకుంటున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, పెద్ద సిటీలు లేవు, అయినా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు క-రో-నా పాకేసింది. ఇక మరణాల్లో కూడా మనది 5 వ స్థానం. ఇలా ఏది చూసుకున్నా, ఏపిలో క-రో-నా అధికంగా ఉందని ప్రజలు భయపడే పరిస్థితి. అయితే తాజాగా వచ్చిన సర్వే వివరాలు చూస్తూ, అవాక్కవ్వల్సిందే. ఒక పక్క షాక్ అవుతూనే, మరో పక్క ఈ వైరస్ ఇంత ప్రమాదం కాదా అనుకునే సందేహం కూడా మానదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిరో సర్వైలెన్స్‌ నిర్వహించిన సర్వేలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19.7 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లిపోయినట్టు తేలింది. 9 జిల్లాల్లో చేసిన సర్వేలో ఈ విషయం బయట పడింది.

అంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 19.7 శాతం అంటే, దాదాపుగా కోటి మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే వారికి కూడా వారు ఈ వైరస్ బారిన పడినట్టు తెలియదు. అంతే కాదు క-రో-నా లక్ష్యనాలు కూడా అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు క-రో-నా టెస్టులు చేయించుకోని వారిని ఎంపిక చేసి ఈ సర్వే చేసారు. నెల రోజులు క్రితం మూడు జిల్లాల్లో ఈ సర్వే చెయ్యగా, 15.7 శాతం మందికి క-రో-నా విచ్చి వెళ్లిందని తేలింది, తాజగా మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా సర్వే చేసారు. రక్తంలో ఉండే యాంటీ బాడీస్‌ ఆధారంగా, ఈ నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో, 30.6 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లినట్టు తేలింది. ఈ సంస్థ అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇంకా ఎక్కువ కేసులు వచ్చే అవకాసం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇంత మందికి క-రో-నా వచ్చి వెళ్ళింది అనేది భయపెట్టే విషయం అయితే, అంత మందికీ కనీసం వైరస్ సోకినట్టు కూడా తెలియకుండానే, తగ్గిపోయింది అనేది ఊరటను ఇచ్చే విషయం.

రాజధాని అమరావతికి వరుస షాకులు ఇస్తున్న ఏపి ప్రభుత్వం, ప్రజలు గత 270 రోజులుగా ఆందోళన చేస్తున్నా, పట్టించుకోక పోగా, వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నారు. రెండు రోజుల క్రితం, మంత్రి కొడాలి నాని, ఇక్కడ అమరావతిలో శాసన రాజధానిగా కూడా ఉండటానికి వీలు లేదు, నేను ఈ విషయం జగన్ కు చెప్పాను, ఆయన చర్చించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు అని చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందుతూ ఉండగానే, ఇప్పుడు అమరావతి ప్రజలకు మరో షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాలను, అక్కడ నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకువటంతో, అమరావతి వాసులు షాక్ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో గ్రామాలు అయిన నీరుకొండ, నవులూరు, నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక సహా మరి కొన్ని గ్రామాల నుంచి సిఆర్డీఏ కార్యాలయాలు తరలించారు. అక్కడ ఉన్న ఫైల్స్, ఫర్నిచర్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఉన్న సిఆర్డీఏ కార్యాలయంలో ఉన్న, రికార్డులు అన్నీ, తుళ్ళూరులో ఉన్న కార్యాలయానికి తరలించారు. అయితే దీని పై రాజధాని రైతులు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మారో పక్క రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, దళిత సంఘాల జేఏసీలు చేస్తున్న పోరాట దీక్షలకు వివిధ పక్షాల నుంచి మద్దతు లభిస్తుంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత జేఏసీలు 268 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతులు వాపోయారు. అమరావతిని రాజధానిగా ఆనాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు అధికారం చేపట్టిన తరువాత మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో శాసన రాజధానిని కూడా లేకుండా చేయాలనే అనాలోచిత కలలు కంటున్న మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఏపి రాజకీయాల్లో, ప్రతి రోజు వార్తల్లో ఉండే నరసాపురం ఎంపీ రఘురామరాజు, ఈ రోజు ఏపిలో హిందూ మతం పై వరుస దాడులు జరుగుతున్నాయని, నిరసన దీక్ష చేసారు. అయితే దీక్షలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కూర్చున్నారు. మరో పక్క అమరావతి పోరాటం చేస్తున్న జీవీఆర్ శాస్త్రి కూడా ఈ దీక్షలో కూర్చున్నారు. అలాగే మరికొందరు కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ ఈ దీక్షలో పాల్గునటంతో, వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ, ధార్మికతకు, మత సామరస్యతకు పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని అనంరు. ముఖ్యంగా ఈ దాడుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, పిచ్చివాళ్ల పని అంటూ కొట్టిపారవేయడం, బాధితులపై ఎటువంటి చర్య తీసుకొనే ప్రయత్నం చేయక పోతూ ఉండడంతో హిందువుల మనోభావాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు,

దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులతో కలత చెందిన నేను గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు ఈ దీక్ష చేయతలపెట్టానని, దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వంను కోరడం కోసమే ఈ దీక్షను నిర్వహిస్తున్నానని అన్నారు. దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇటువంటి దాడులను అడ్డుకోని పక్షంలో రాష్ట్రంలో ప్రజల మధ్య మతసామరస్యం దెబ్బతిని, అశాంతి రాజుకొనే అవకాశం ఉంటుందనే ఆందోళనయే నన్ను ఈ దీక్ష జరపడానికి ప్రేరేపిస్తుందని, ఆ విధంగా జరిగితే రాష్ట్రాభివృద్ధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read