చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. చంద్రబాబు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నారు. ఇలా గత కొన్నేళ్లుగా చంద్రబాబు పై ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు, ఇన్నేళ్ళలో ఎప్పుడూ, చంద్రబాబు చెప్పినట్టు ఒక వీడియో చూపించింది లేదు. రాజకీయ పార్టీలు చేసే రాజకీయంలో ఇది ఒక భాగం. చంద్రబాబు 1995 ముఖ్యమంత్రి అయిన తరువాత, 1999 ఎన్నికల్లో తానే సియం అని వైఎస్ఆర్ అనుకున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు గెలిచారు. ఇక ఆ గెలుపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసింది. చంద్రబాబు తెచ్చిన ఐటి, విద్యుత్ సంస్కరణలు, జీవన విధానాన్నే మార్చేసాయి. ఇదే సమయంలో ప్రకృతి సహకరించక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే ఆయిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్, పాదయాత్ర చేసి, తాను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని, ఇచ్చిన హామీ, రైతులలో ఒక ఊపు ఊపేసింది. ఆ ఉచిత విద్యుత్ హామీతోనే చంద్రబాబు 2003లో ఓడిపోయారు. ఎంత అభివృద్ధిలో పరుగులు పెట్టించినా, ఉచిత విద్యుత్ హామీ ముందు నిలవలేక పోయింది. గతంలో ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంటు ఇస్తే, చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణలతో, వైఎస్ఆర్ కు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం అయ్యింది.

అయితే ఆ ఉచిత విద్యుత్ హామీ, చంద్రబాబు కోసం వైఎస్ఆర్ తవ్విన గొయ్యి. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఉచిత విద్యుత్ కొనసాగించారు, అంతే కాదు క్వాలిటీ కరెంటు పగట పూట ఇచ్చారు. ఇక రైతు రధం, మైక్రో న్యూట్రియంట్స్, రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, ప్రకృతి వ్యవసాయం, ఇలా అనేక పధకాలు రైతుల కోసం తెచ్చి, తన పై చేసిన ప్రచారాన్ని చెరిపి వేసుకుని, రైతుల పక్షాన నిలబడ్డారు. అయితే గతంలో ఏ ఉచిత విద్యుత్ తో అయితే, చంద్రబాబుకి గొయ్యి తవ్వి ఇబ్బంది పెడదాం అని వైఎస్ఆర్ అనుకున్నారో, ఇప్పుడు ఆ గోయ్యాలో, జగన్ మోహన్ రెడ్డి పడబోతున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్రం నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి, ఉచిత విద్యుత్ బదులు, నగదు బదిలీ చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీసోకొచ్చిన ఈ కొత్త సంస్కరణతో రైతులు షాక్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లెక్క మాత్రం వేరే ఉంది.

తాము ఉచిత విద్యుత్ ఎత్తివేయటం లేదని, కేవలం మీటర్లు పెట్టి, ఎంత వాడుకుంటే అంత, నగదు రైతు ఎకౌంటు లో వేస్తాం అని, రైతు కట్టుకోవటమే అని ప్రభుత్వం అంటుంది. రూపాయి కూడా రైతులు కట్టనవసరం లేదని, మేము హామీ అంటూ, అలా చేస్తే రాజీనామా చేస్తాం అంటున్నారు. అయితే ఇక్కడ అనేక అనుమనాలు రైతులకు వస్తున్నాయి. గతంలో కిరణ్ సర్కార్ ఈ మీటర్లు పెడతాం అన్నప్పుడు, జగన్ గారి సాక్షి టీవీలోనే దీని పై విశ్లేషణ ఇచ్చారు. ఇప్పుడు ఇలాగే చెప్తారని, చివరకు గ్యాస్ సబ్సిడీ లాగా అవుతుందని, జగన్ గారి సాక్షి నాడు వ్యతిరేకించింది. అంతే కాదు, ఇక్కడ కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఇక రైతులు ఆ డబ్బులు వేరే అవసరాలకు వాడుకుంటే పరిస్థితి ఏమిటి ? తరువాత కేంద్రం మరిన్ని ఆంక్షలు పెడితే, మన జుట్టు కేంద్రానికి ఇచ్చినట్టే కదా. ఇలా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఈ నిర్ణయంతో నెలకొంది. సీనియర్ విశ్లేషకులు లెక్క ప్రకారం, గతంలో వైఎస్ఆర్, ఉచిత విద్యుత్ తో, చంద్రబాబు కోసం గొయ్యి తవ్వితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దాంట్లో పడ్డారని, ఈ నిర్ణయంతో జగన్ భారీ వ్యతిరేకత మూట కట్టుకుంటారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు గత ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబుని ఓడిస్తాం అని శపధం చేసారు. చంద్రబాబుని ఓడిస్తాం అంటే, జగన్ ని గెలిపిస్తామనే కదా. అదే చేసారు. ఈ క్రమంలో డిపాజిట్లు కూడా దక్కలేదు. నోటా కంటే తక్కువగా, చివరకు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తక్కువగా ఓట్లు వచ్చాయి. తాము అనుకున్నట్టే అన్ని మార్గాలు ఉపయోగించి చంద్రబాబుని దించి, జగన్ ని గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నికలు అయిన తరువాత, తమ పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టారు. సొంతగా ఎదిగే సమర్ధత బీజేపీకి లేదు. అప్పటి అధ్యక్షుడు కన్నా, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వాళ్ళు, ఎంత హడావిడి చేసినా, వాళ్ళ మాటలు విశ్వసించి, బీజేపీ వైపు తిరిగేవారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి, ఏపిలో బీజేపీ గురించి, వీళ్ళ మాటలు గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, ఏపిలో మాత్రం ఒక బలమైన బీజేపీ నేత ఎవరూ లేరని చెప్పాలి. ప్రధాని మోడీ పేరు చెప్పి ఏదో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని దగ్గరకు తీసారు. ఎన్నికలు అయిన వెంటనే, పవన్ బీజేపీకి దగ్గర అయ్యారు. పాచిపోయిన లడ్డూ, ఉత్తర భారత పార్టీ , చేగోవీరా అంటూ ఏవేవో చెప్పి, ఎన్నికలు అవ్వగానే బీజేపీకి దగ్గరవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే సినిమా హీరో పరంగా పవన్ సూపర్ స్టార్ కానీ, ఎన్నికల పరంగా పెద్ద బలం లేని నాయకుడని తేలిపోయింది.

మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి, 6 శాతం ఓట్లతో, ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది. పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసారు. అయితే వీళ్ళు ప్రత్యర్ధి ఎవరు అనేది మర్చిపోయారు. ముఖ్యంగా సోము వీర్రాజు ఏపి బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత, పనిగట్టుకుని మరీ చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, ఇది బీజేపీ అజెండానా, లేక సోము వీర్రాజు సొంత అజెండానా అనే చర్చ మొదలైంది. అలాగే అమరావతి ఉద్యమం పై, మాకు సంబంధం లేదు అని చెప్పటం కూడా, బ్యాక్ ఫైర్ అయ్యింది. అధికారంలో ఉన్న వైసీపీ పై చాలా సాఫ్ట్ గా వెళ్తున్నారని, మీడియా ముందుకు వస్తే ఇంకా ఎందుకు చంద్రబాబుని తిడుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఇక జీవీఎల్ అయితే, వైసీపీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్ధం అయి పోతుంది. అసలు ఏపిలో బీజేపీ వ్యూహం ఏమిటి ? చంద్రబాబుని రానివ్వకుండా చేసి, జగన్ మోహన్ రెడ్డినే శాశ్వతంగా ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నమా అనేటట్టు వ్యవహరించారు.

అయితే ఏమైందో ఏమో కానీ, ఏపి బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. గత 15 రోజులుగా బీజేపీ నేతలు, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పై దృష్టి పెట్టారు. అవసరం అయినప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, సరైన ట్రాక్ లో పడ్డారు. ఇక అవసరం ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని టార్గెట్ చేసే విధానం పక్కన పెట్టారు. ఇది ఏపి బీజేపీ నేతలు సమీక్షించి మార్చుకున్న విధానమో లేక, ఎవరైనా పెద్దలు చెప్పారో కానీ, ఏపి బీజేపీ వ్యూహం మార్చింది. అయితే దీని పై మీడియా వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రెండు వారల క్రిందట, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో, సోము వీర్రాజు, సునీల్ డియోధర్, జీవీఎల్ సమావేశం అయ్యారు. ఆ సమావేశం తరువాతే ఈ మార్పు గమనిస్తున్నాం అని, విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఉన్నా, అది పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం పై బీజేపీ పోరాటం చెయ్యలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై హెచ్చరిస్తుంది అనే ఆశ. ఏది ఏమైనా ఏపి బీజేపీ ఇప్పటికైనా ప్రజా పక్షాన పోరాడుతుందని, ఈ వైఖరి కొనసాగిస్తుందని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే ఈ సారి తన పదవి పై జరుగుతున్న కేసులు, కుట్రల విషయంలో కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న స్థానిక ఎన్నికల పై. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో జరగాల్సి ఉండగా, క-రో-నా రావటంతో, రమేష్ కుమార్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుని, ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటికే చాలా చోట్ల నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. చాలా చోట్ల గొడవలు, బెదిరింపులు, లాంటి సంఘటనలు జరిగాయి. ఎప్పుడు కనీ వినీ ఎరుగని రీతిలో హిం-స జరిగింది. అయితే క-రో-నా పుణ్యమా అని, మరి కొన్ని ఘటనలు జరగకుండా, ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆ రోజు కనుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ నిర్ణయం తీసుకోక పోయి ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేగా ఉండేది. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి నచ్చక, ఆయన పై రాజకీయ దాడి చెయ్యటం, కోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అక్కడ కూడా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సమర్ధించటం, తరువాత ఏకంగా రమేష్ కుమార్ ని తప్పించటం, ఆ తరువాత మళ్ళీ హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగలటం తెలిసిందే.

nimmagadda 05092020 2

అయితే మొత్తానికి మళ్ళీ నిమ్మగడ్డ విధుల్లోకి జాయిన్ అయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. క-రో-నా ఉదృతంగా ఉంది కాబట్టి, ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిపే అవకాశమే లేదు. ఇక ఇప్పటికే వేసిన నామినేషన్ల సంగతి ఏమిటి అనేదే ప్రశ్న. చూస్తూ ఉంటే నిమ్మగడ్ద ఉండే వరకు, ఎన్నికలు జరిపేలా లేదు, ఈ ప్రభుత్వం. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఒక మెసేజ్ వైరల్ అయ్యింది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినట్టు, విడతల వారిగా డేట్లతో సహా ఒక మెసేజ్ వైరల్ అయ్యింది. చాలా మంది అది నిజం అని నమ్మిన వారు కూడా ఉన్నారు. ఈ మెసేజ్ బాగా వైరల్ అవ్వటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీస్ స్పందించింది. ఎన్నికల కమీషనర్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని, తాము ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదని ఒక ప్రకటన విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్.

చీరాల రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి ఇందుకు ఆజ్యం పోసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు చేరిన ఆమంచి కృష్ణమోహన్, ఎన్నికల తర్వాత చేరిన కరణం వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై, చీరాల నియోజకవర్గంపై హక్కులు తమవంటే తమవంటూ.. పరస్పర ఆరోపణలు సంధించు కుంటున్నారు. రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. నియోజకవర్గంలో ఎవరి పెత్తనం సాగాలనే విషయంలోనే ఇక్కడ గొడవంతా.! చీరాలలో గత రాజకీయాలను పరిశీస్తే.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోతుల సునీత స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్తో పోటీ చేశారు. పోతుల సునీత ఓడిపోగా తెలుగుదేశం పార్టీ ఆధికారంలోకి వచ్చింది. చీరాల ఇన్చార్జిగా సునీత కొంతకాలం అధికారం చలాయించారు. ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం లేకపోవడంతో ఆమంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చీరాలలో అధికార పగ్గాలు అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలో సునీత, ఆమంచి ఒకే పార్టీలో ఉన్నందును ఆధిపత్య పోరు కొనసాగింది. 2019 ఎన్నికల వరకూ పోతుల సునీత చీరాల రాజకీయాల జోలికి రాలేదు.. చంద్రబాబు ఆమంచికి మంచి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆమంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తప్పనిసరి పరిస్థితుల్లో కరణం బలరాం టిడిపి తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రం అంతటా అత్యధిక సీట్లతో వైసిపి అధికారంలోకి వచ్చింది. కానీ 2014 ఎన్నికల్లో సొంతంగానే గెలిచిన ఆమంచి 2019 ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉన్నప్పటికీ 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమంచి ఓడిపోయినా పార్టీ గెలిచింది. కనుక చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జి హోదాలో ఆమంచి చీరాల నియోజకవర్గంలో అధికార పగ్గాలు అందుకున్నారు. ఆయన పెత్తనం కొనసాగింది. బలరాంకు వైసిపి నుంచి ఆహ్వానం రావడంతో ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఆయన తనయుడు కరణం వెంకటేష్ వైసిపిలో చేరారు. రాజకీయాల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం కరణం బలరాంకు చీరాలలో అధికారాల బదలాయింపు జరగాలి. కానీ పార్టీ ఇన్‌ఛార్జిగా తాను ఉన్నాను కనుక తన పెత్తనమే కొనసాగాలనేది ఆమంచి వాదన. దీంతో ఇద్దరి మధ్య చీరాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ముదిరింది. చీరాల నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలికే దిశగా పార్టీ అధిష్టానం ఒక పరిష్కార మార్గాన్ని సూచించినట్లు చెబుతున్నారు. చీరాల ప్రజాప్రతినిధిగా ఉన్న కరణం బలరాంను వేరొక నియోజకవర్గానికి పంపడం కుదరదు కనుక ఆమంచిని పర్చూరు బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వస్తుంది.

కనుక చీరాలలో ఉండి ఇబ్బందులు పడే కన్నా పర్చూరులో బలమైన నాయకత్వం అవసరం ఉన్న క్రమంలో ఆమంచిని అక్కడి భాధ్యతలు చేపట్టాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఫార్ములా వల్ల ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలకడంతో పాటు ఆటు పర్చూరు, ఇటు చీరాలలో కూడా పార్టీకి మేలు జరుగుతుందనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. చీరాలను వదిలి వెళ్లడం ఆమంచికి ససేమిరా ఇష్టం లేదని తెలుస్తోంది. 2014 నాటి తరహా ఫార్ములాను ఆచరణలో పెట్టేందుకు ఆమంచి అంగీకరించడం లేదని చెబుతున్నారు. వైసిపికి మద్దతు ఇచ్చే సమయంలో ఇచ్చిన హామీ మేరకు కరణం బల రాంకు చీరాల నియోజకవర్గంలో అధికారాల బదలాయింపులు ఒక్కొక్కటిగా జరు గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్.రాజశేఖరరెడ్డి వర్గంతి సందర్భంగా కరణం వెంకటేష్ చేసిన కొన్ని వాఖ్యలు చీరాల రాజకీయాల్లో కాక రేపాయి. స్వయంగా ఆమంచి పార్టీ అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. వైసిపిలోని ఆమంచి అనుయాయులు బృందంగా తాడేపల్లి వెళ్లి పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ఇన్చార్జి అప్పిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. చీరాలలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తరచుగా శాంతి-భద్రతల సమస్యగా మారుతోంది.

Advertisements

Latest Articles

Most Read