జగన్ మోహన్ రెడ్డి ఏడాది పలాన పై, తెలుగుదేశం పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసింది. నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి, చార్జ్ షీట్ విడుదల చేసారు. ఈ సందర్భంగా లోకేష్, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. చంద్రబాబు వైజాగ్ ఎందుకు వెళ్ళలేదు అని అడగగా, లోకేష్ స్పందించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మొదట నిలబడింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఈ రోజు విశాఖపట్నం వెళ్లలేదు అంటున్నారు. రెండు నెలల క్రితం విశాఖ పర్యటన అప్పుడు, పర్మిషన్ ఇచ్చి ఎయిర్ పోర్ట్ దగ్గర చంద్రబాబు గారిని అడ్డుకున్నారు. పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే, 10 గంటలు ఎయిర్ పోర్ట్ దగ్గర ఆపింది వీళ్ళే. మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజే పర్మిషన్ అడిగాం. అప్పుడు పర్మిషన్ రాలేదు. తరువాత విమానాలు మొదలైన తరువాత పర్మిషన్ అడిగాం, టికెట్లు బుక్ చేసుకున్నాం, పర్మిషన్ ఇచ్చారు. కాని రాత్రికి రాత్రి ఏకంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేసారు. చంద్రబాబు గారు వైజాగ్ రాకుండా, వీళ్ళు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకు చంద్రబాబు వైజాగ్ వస్తున్నారు అంటే అంట భయం అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు వైజాగ్ వచ్చినా అడ్డు పడుతున్న, మీరా మమ్మల్ని అడిగేది. హూద్ హూద్ అప్పుడు అక్కడ ఉంది ఎవరు ? తిత్లీ అప్పుడు నిలబడింది ఎవరు ? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తరువాత, అక్కడ పోలీసులతో కలిసి రేస్క్యే ఆపరేషన్ చేసింది మా ఎమ్మెల్యే, వీళ్ళ దగ్గర నుంచి మేము నీతులు నేర్చుకోవాలా అని లోకేష్ అన్నారు.

తెలంగాణాలో పార్టీ మూసుకుంది మేము కాదని, మాకు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, తెలంగాణాలో పార్టీ ఎత్తేస్తింది వైసీపీ అని లోకేష్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి అడగగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రభుత్వం స్కూల్స్ లో తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అని, అప్పట్లో ఇదే పార్టీ అడ్డు పడింది అని అన్నారు. మేము అప్పుడు తెలుగు మీడియం ఆప్షన్ పెట్టామని అన్నారు. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దు అని చెప్పటం లేదు, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచండి అని చెప్తుంటే, ఎందుకు దీనికి మీరు ఇబ్బంది పడుతున్నారు అని అడిగారు. ఇది మేము ప్రశ్నిస్తుంటే, మీ పిల్లలు ఏ స్కూల్స్ అని అడుగుతున్నారని, మేము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, అది తెచ్చిందే మేమని, మేము తెలుగు మీడియం ఆప్షన్ కూడా పెట్టమంటున్నామని అన్నారు. అలాగే మేము ట్వీట్ పెడితే భయపడుతున్నారని, ట్వీట్ పెట్టారు ట్వీట్ పెట్టారు అంటూ హేళన చేస్తున్నారని, విషయాలు బయటకు వస్తుంటే, ఎందుకు భయ పడుతున్నారని అన్నారు.

అలాగే మేము కరోనా పార్టీగా మారదలుచుకోలేదని, కాళ్ళ మీద పూలు చల్లించుకోవాలని అనుకుంటూ, కరోనా వ్యాప్తి చెయ్యదలుచుకోలేదని, అందుకే జూమ్ ద్వారా పార్టీ నేతలతో కనెక్ట్ అవుతున్నామని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, పార్టీ కార్యక్రమాలు చేస్తామని, వాళ్ళ లాగా రోడ్లు మీద తిరిగి కరోనా వ్యాప్తి చెయ్యం అని లోకేష్ అన్నారు. ఇసుక కొరత, విద్యుత్ ధరల పెంపు , కరోనా సహాయం కోసం, భూములు తరుపున పోరాటం, మద్యం మాఫియా, అమరావతి పైన, రైతుల కష్టాలు, ఇలా ప్రతి అంశం పై ,పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ నాయి లోకేష్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే పై స్పందిస్తూ, విప్ జారి చేసిన సందర్భంలో, వారి పై ఆక్షన్ తీసుకుంటామని అన్నారు. నా పైన 7 ఏళ్ళుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రజల పై చేస్తున్నారని లోకేష్ అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నెమ్మదిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసారు. అక్కడ పనులు అన్నీ ఆపేసి, వైసీపీ మంత్రులు అంటున్నట్టు నిజంగానే, దాన్ని స్మశానం చేసారు. ఇక తరువాత, నెమ్మదిగా అమరావతి అక్కడ ఉండదు అనే సంకేతాలు ఇచ్చి, అసెంబ్లీ సమావేశాల్లో, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నాం అని, విశాఖలో ఒక ముక్క, కర్నూల్ లో ఒక ముక్క, అమరావతిలో మరో ముక్క ఉంచుతాం అని చెప్పారు. అయితే ఈ మూడు ముక్కల రాజధాని అనేది మంచి నిర్ణయం కాదని అందరూ చెప్తున్నారు. ఇది పక్కన పెడితే, అక్కడ 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. తమ జీవితాలు బాగు పడతాయి, తమతో పాటు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని వస్తుంది, మనల్ని గెంటిన వారికి, హైదరాబాద్ కంటే ధీటైన రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని అనుకున్నారు. కాని, జగన్ మోహన్ రెడ్డి దీన్ని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యటంతో, అమరావతి ప్రజలు ఉద్యోమం మొదలు పెట్టారు, చివరకు రాజధాని మార్పు, సీఆర్డీఏ చట్టం అనేది కోర్టులోకి వెళ్ళింది.

అయితే ఈ విషయం పై, మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉండవల్లి అరుణ్ కుమార్ అమరావతి పై మాట్లాడారు. చంద్రబాబు చెప్పుకున్నంత కాకపోయినా, అమరావతిలో నిర్మాణాలు జరిగాయని, కొన్ని జరుగుతున్నాయని, ఇప్పుడు ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే కదా ఉంది అన్నారు. వైసీపీ ఆరోపిస్తున్నట్టు అక్కడ స్మశానం ఏమి లేదని, అన్నారు. అలాగే అమరావతి మార్పు అనేది, ఎవరి తరం కాదని, అక్కడ నుంచి రాజధాని మార్చటం అనేది జరగదు అని అన్నారు. గతంలో ఒప్పుకుని, అందరూ ఏకగ్రీవంగా రాజధాని అమరావతి ఉండాలని, ఇప్పుడు మార్చటం కుదరదు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి, అలాగే అక్కడ డబ్బులు ఇచ్చిన చోటు, ఇప్పుడు మార్చి వేరే చోటు పెడతాను అంటే, అది జరిగే పనే కాదని అన్నారు. ఇక్కడే కావలి అంటే, చంద్రబాబు చెప్పినట్టు కాకుండా, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు కాని, ఇక్కడ నుంచి అమరావతిని రాజధానిగా మార్చటం జగన్ వల్ల కాదని అన్నారు.

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసునకు సంబంధించి శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ సుధాకర్ మానసిక ఆసుపత్రి సూవరింటెండెంట్‌కు తెలియపరచి ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే సీబీఐ విచారణకు మాత్రం సహకరించాలని సూచించింది. విశాఖ మానిసిక ఆసుపత్రిలో ఆక్రమ నిర్బంధంలో ఉన్న డాక్టర్ సుధాకర్ ను తక్షణమే విడుదల అయ్యేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుధాకర్ తల్లి కావేరీ లక్ష్మీభాయి హైకోర్టులో కార్పస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన విధితమే. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్ తల్లి తన పిటీషన్లో పేర్కొన్నారు. ఇరువాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం డాక్టర్ సుధాకర్ డిశ్చార్జికి సమ్మతించింది.

ఆసుపత్రి సూపరింటిండెంట్ కు సమాచారం అందించి సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకరకు న్యాయస్థానం సూచించింది. దీనిపై సుధాకర్ తల్లి కావేరి లక్ష్మీబాయి మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉంది. తమకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సుధాకరను డిశ్చార్జి చేసి మరో ఆస్పత్రిలో చేర్పిస్తాం. తన కొడుకున్న జరిగిన అన్యాయం ఒక్కొక్కటి బహిర్గతం అవుతోంది. సీబీఐ తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. మరోసారి అవకాశం ఇస్తే సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతానని ఆమె చెప్పారు. అయితే హాస్పిటల్ నుంచి బయటకు రాగానే సుధాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొన్నాళ్ళు పాటు, ఎవరికీ కనపడకుండా, అజ్ఞాతంలోకి డాక్టర్‌ సుధాకర్‌ వెళ్ళిపోయారు. విశాఖపట్నంలోనే ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని, ఒక అయుదు రోజులు తనను ప్రశాంతంగా వదిలెయ్యాలని సన్నిహితులకు చెపినట్టు తెలుస్తుంది. మరో పక్క తాను ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని, సిబిఐకి కూడా విషయం చెప్పారు. డాక్టర్ సుధాకర్ కేసునకు సంబంధించి సీబీఐ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. నర్సీపట్నం చేరుకున్న సీబీఐ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణవేణిని శుక్రవారం విచారించారు. తొలుత నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సర్వీసు రికార్డులు, హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణవేణిని విచారించారు.

విజయవాడ గ్యాంగ్ వార్ రోజు రోజుకు కొత్త విషయంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ నగర పోలీసులు 13మంది అరెస్ట్ చేసినట్లు విజయవాడ సీపీ ద్వారక తిరు మల రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. హతుడు తోట సందీప్ కు, కోడూరు మణికంఠకు రాజకీయంగా సంబంధాలున్నా, జరిగిన ఘటనకు రాజకీయ నాయకుల జోక్యం లేదని ఆయన ప్రక టించారు. అయితే ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై నిఘా పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేసారు. సీపీ చెప్పిన కథనాన్ని అనుసరించి హతుడు సందీప్, పండు మంచి స్నే హితులు. యనమలకుదురులో ఒక స్థలంలో ప్లాటుకు సంబంధించి ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డి నడుమ వివాదాలున్నాయన్నారు. స్థిరాస్తి వ్యాపారంతో పాటు, సెటిల్మెంట్లు చేసే ట్రాక్టరు డీలరు నాగబాబు దగ్గరకు ఈ వ్యవహరం సెటిల్మెంటుకు చేరింది. దీంతో నాగబాబు తనతో సత్సం బంధాలున్న తోట సందీప్ ను ఈ విషయంలో సహకరించాలని కోరాడు, ఈ వ్యవహరమై ఈ నెల29న నాగబాబుకు చెందిన పెనమలూరులోని తన మిత్రుని స్థలంలో వంచాయతీ పెట్టారు.

దీనికి పండు ప్రదీప్ తరుపున హాజరయ్యారు. ఇది నచ్చని సందీప్ పండుకు ఫోన్ చేసి బెదిరిం చాడు. తన అనుచరులతో కలిసి అతని ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ తీవ్రస్థాయిలో పండును దూషిస్తూ మాట్లా డటమే కాకుండా, ఆమెకు తీవ్రస్థాయిలో హెచ్చరి కలు చేసాడు. దీనికి ప్రతిగా పండు మరుసటిరోజు ఉదయం సందీప్ వ్యాపార దుకాణం పైకి తన అను చరులతో కలిసి వెళ్లి, అక్కడి గుమాస్తాను కొట్టా డు. అక్కడి నుంచే సందీపకు ఫోన్ చేసి బెదిరించాడు, అతని అంతుచూస్తానన్నాడు. ఈ నేపథ్యం లో తరువాత వండు మాట్లాడుకుందాంమని సందీపు పిలిపించాడు. అక్కడ జరిగిన ఇరు వర్గాల నడుమ పరస్పర దాడులు జరిగాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించి, ఈ నెల 4వ తేది రాత్రి రేవల్లె ప్రశాంత్, ఆకుల రవితేజ, ప్రేమ్ కుమార్, ప్రభు కుమార్, బోనోత్ శ్రీనునాయలను అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన 13 మందిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీపీ తెలిపారు.

నిందితుల నుంచి కత్తులు, కోడికత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇకపై విజయవాడలో గ్యాంగ్ వార్లు, ఘర్షణలు పునరావృ తమైతే కఠినచర్యలు తప్పవన్నారు. అయితే ఇది ఇలా ఉంటే, కోడూరు మణికంఠ తీవ్ర గాయాలతో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో, చికిత్స పొండుతున్న సంగతి తెలిసిందే. కోడూరు మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు దగ్గర, ఒక అజ్ఞాత వ్యక్తి తిరుగుతూ కనిపించారు. అతను ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానం లేకపోవటంతో, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వార్డు బాయ్ కోసం వచ్చానని చెప్పగా, అది నిజమా కాదా అనేది పోలీసులు చూస్తున్నారు. మరో పక్క మణికంఠకు చికిత్స పొందుతున్న వార్డు దగ్గర, పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేసారు.

Advertisements

Latest Articles

Most Read