మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావు బుధవారం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. వాణిజ్య వేత్తగా,
ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న శిద్దా రాఘవరావు టీడీపీ సీనియర్ నాయకుడు. అనతి కాలంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితంగా, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో టీడీపీ పోలిటిబ్యూరో సభ్యునిగా, జాతీయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. శిద్దా రాజకీయ జీవితంలో 2009లో ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్తిగా పోటీచేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చెందారు. శిద్దా కార్యదీక్షతను గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అలా అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రాఘవరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి శాసనసభ స్థానం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా రహదారులు - భవనాల శాఖ, అటవీ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు.

తదనంతరం 2019 ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పో టీచేసి, వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి చేతిలో ఓటమి చెందారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా అందరికి ఆత్మీయ పలకరింపుతో ఆకట్టుకునే విలక్షణమైన శైలి శిద్దాకే సొంతం. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అధికార వైసిపీ కొంత మందిని లాక్కుంటుంది. నయానో - భయానో ప్రధానమైన నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్ట్రస్థాయి నుంచి వ్యూహాలు ప్రారంభం అయ్యాయి. వీటిలో భాగంగా ప్రతిపక్ష నాయకుల పై ఒత్తిడి పెంచి వైసీపీ కండువాలు కప్పుతున్నారనే వాతావరణం ఉంది.

ఇదిలా ఉండగా అధికార పార్టీ శిద్దాపై దృష్టిసారించి, గత కొన్ని నెలలుగా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీస్తున్నట్లు సమాచారం. శిద్దా రాఘవరావు అతని సోదరులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి తీవ్ర ఒత్తిడులు వచ్చినట్లు తెలిసింది. దీంతో శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్ బాబును వైసీపీలోకి పంపుతారని ప్రచారం జరుగగా, శిద్దా చేరికకే అధికార పార్టీ ఒత్తిడి పెంచింది. శిద్దా రాఘవరావు ఆదివారం కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాత ఈ నెల 10న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోవడానికి మూహుర్తం నిర్ణయించినట్లు తెలిసింది. శిద్దా కుటుంబంలో రాజకీయంగా సంబంధాలు ఉన్న శిద్దా వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో జిల్లా మిల్క్ డైరీ చైర్మన్ గా వ్యవహరించి టీడీపీ ఓటమి అనంతరం బీజేపీ లో చేరారు. ఒత్తిడి నుంచి తప్పుకునేందుకు జిల్లా అధికార పార్టీ నాయకులతో చర్చించి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు శిద్దా సిద్ధం అయ్యారు.

తెలంగాణా నుంచి విడిపోయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవటంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, అమరావతి ప్రాంతంలో, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, జగన్ మోహన్ రెడ్డి రావటంతో, మొత్తం తారు మారు అయ్యింది. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి దాకా, 175 రోజుల పాటు, రాజధాని మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే, అమరావతి రైతుల సమస్యలు కాని, అలాగే మహిళల ఆందోళన గురించి కానీ, తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోలేదు. తెలంగాణాలో చిన్నది జరిగినా, తపించిపోయే తెలుగు సినీ పెద్దలు, కనీసం పట్టించుకోలేదు. మహిళలను కొట్టినా, కనీసం స్పందించలేదు. అయితే, ఈ రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది అని, జగన్ మోహన్ రెడ్డి సహకరించాలి అంటూ, చిరంజీవి, నాగార్జున, తదితర సినీ పెద్దలు, ఈ రోజు జగన్ ని కలవటానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. జగన్ మోహన్ రెడ్డితో, ఈ రోజు మూడు గంటలకు మీటింగ్ ఉంది. అయితే, ఎయిర్ పోర్ట్ దిగిన తరువాత, సినీ పెద్దలు, ఉండవల్లి దగ్గర ఉన్న, గోకరాజు, గంగ రాజు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

అక్కడ కొంచెం సేపు సేద తీరు, జగన్ మోహన్ రెడ్డిని మూడు గంటలకు కలవనున్నారు. అయితే, విషయం తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు, అక్కడకి చేరుకున్నారు. ప్లే కార్డులు పట్టుకుని, గెస్ట్ హౌస్ ముందు నుంచున్నారు. మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, మా తరుపున ఉండాలని, మా కష్టాలు జగన్ కు చెప్పాలి అంటూ, అక్కడ నుంచుని నినాదాలు చేసారు. మీ లాభాల కోసం వస్తారు, మా కష్టాలు ఉన్నప్పుడు కనీసం మా మొఖం మీరు చూడరా అంటూ కొంత మంది నిరసన తెలిపారు. ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోలేదు కాని, ఇప్పుడు మాత్రం మా ప్రాంతం కావాల్సి వచ్చిందా, మీకు సేద తీరటానికి అంటూ కొంత మంది వ్యాఖ్యానించారు. అయితే పరిస్థిత అదుపు తప్పుతూ ఉండటంతో, పోలీసులు రంగంలోకి దిగారు, వెంటనే వెళ్ళిపోవాలని, లేకపోతే అరెస్ట్ చేస్తాం అంటూ , పోలీసులు చెప్తున్నారు.

ఎల్టీ పాలిమర్స్ విషవాయువు వెంటాడుతోంది. నిపుణులు హెచ్చరించిన విధంగానే స్టెరీన్ గ్యాన్ ప్రభావం మానవాళిని వెంటాడుతోంది. గ్యాస్ లీకేజీ ఘటనలో అప్పుడు అధిక మోతాదులో గ్యాస్ పీల్చిన వారు, ఇప్పటికీ మృతి చెందుతూనే ఉన్నారు. పోయిన వారం ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మరొకరు చనిపోయారు. ఎక్కువ మోతాదులో విషవాయువు పీల్చిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొద్ది మోతాదులో విషవాయువు పీల్చిన వారిపై స్టెరీన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని అప్పట్లోనే వాతావరణ నివుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అది అక్షరాలా రుజువు అవుతోంది. ఎల్టీపాలిమర్స్ కర్మాగారం అనుకుని ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం వాసులపై సైరీన్ గ్యాస్ ప్రభావం అధికంగా ఉందని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత మృతులు సంఖ్య 12 కాగా వారానికొకరు వంతున అదే గ్రామానికి చెందిన వృద్ధులు ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మృత్యువాత పడుతుండడం ఆ గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

సోమవారం వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ ముసలయ్య(58) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెలలో జరిగిన గ్యాస్ లీకేజీ మటనలో ముసలయ్య విషవాయువు పీల్చి అపస్మారక స్థితిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అయితే సోమవారం ఉన్నట్టుండి మునలయ్య ఆరోగ్యం క్షీణించడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు ఓప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ముసలయ్య సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు వాపోతున్నారు. దీర్ఘకాలికంగా, దీని ప్రభుత్వం ఉంటుందని అర్ధం అవుతుందని, ప్రభుత్వం, దీని పై తగు చర్యలు తీసుకోవాలని, అందరికీ లైఫ్ లాంగ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉచిత వైద్యం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైవపర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తయింది. దీనిపై ఈ నెల 20వలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైవపర్ కమిటీ చైర్మన్, భూమిశిస్తు చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘనటకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. మూడో రోజైన సోమవారం జీవీఎంసీలో హైపవర్ కమిటీ విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, తర్వాతి పరిణామాలు, తీసుకున్న చర్యలపై జీవీఎంసీ అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. అలాగే జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల వివరాలపై కమిటీ ఆరా తీసింది. ప్రమాద తీవ్రత పరిశ్రమలపై విశ్లేషాత్మక నివేదికలు తయారు చేయాలని హైపవర్ కమిటీ సూచించింది.

జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత కంపెనీ, సరస్వతీ సిమెంట్స్ కు ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒత్తిడి చేసారో లేక, రూల్స్ ప్రకారం చేస్తున్నారో లేక జగన్ మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేసే అత్యుత్సాహమో కాని, జగన్ గారి సొంత కంపెనీకి, అనుమతులు తన్నుకుంటూ వస్తున్నాయి. నెల క్రితం, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, నేడు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరస్వతి సిమెంట్స్ మైనింగ్ లీజ్ ను, ఏకంగా 50 ఏళ్ళుకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో ఉన్న, 613.70 హెక్టార్లలో ఉన్న మైనింగ్ ను, 50 ఏళ్ళ పాటు సరస్వతీ సిమెంట్స్ కు కేటాయిస్తూ, జీవో నెంబర్ 30 విడుదల చేస్తూ, నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా ఉండగా, ఆయన భార్యకు 13.8 కోట్ల విలువ చేసే షేర్లు వాటా ఉంది. ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సూచన మేరకు, జీవ విడుదల అయ్యింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ను గుంటూరు జిల్లాలో పెట్టాలి అనుకుని, దాచేపల్లి, మాచవరం మండలాల్లో కొన్ని గ్రామాల్లో భూములు సేకరణ చేసారు.

ప్రభుత్వంలో తన తండ్రే ఉండటంతో, అనుమతులు వచ్చేసాయి. అయితే, కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు నుంచి కూడా తీసుకున్నారు. భూములు తీసుకునే సమయంలో, ఉద్యోగాలు ఇస్తాం అని ఆశ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, జగన్ కేసులతో, ఈ కంపెనీ సమయానికి స్థాపించక పోవటంతో, భూములు ఇచ్చిన వారు, తమ భూముల్లో సేద్యం చేసుకోవటానికి సిద్ధం కాగా, కొంత మంది వైసిపి నాయకులు వారి పై దాడి చెయ్యటం, పోలీసులు కేసులు నమోదు కావటం తెలిసిందే. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, అక్కడ స్థానికులు జరిగిన విషయం చెప్పటంతో, రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు క్యాన్సిల్ చేసారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే, దీనికి అనుమతి ఇవ్వటం, శాశ్వతంగా నీటి కేటాయింపులు జరగటం, ఇప్పుడు ఏకంగా 50 ఏళ్ళు లీజుకి ఇవ్వటం జరిగిపోయాయి. ఒక వేళ చంద్రబాబు ఇలాగే చేస్తే, ఈ పాటికి హైదరాబాద్ మీడియా, కొంత మంది మేధావులు, ఎంత గోల చేసేవారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మాత్రం, ఎవరూ మాట్లాడటం లేదు.

 

Advertisements

Latest Articles

Most Read