టిటిడి పై తప్పుడుగా, అనవసరంగా పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాసినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సహించేది లేదంటూ టిటిడి పాలకమండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో మీడియాకు వెల్లడించిన 24గంటల్లో శనివారం పోలీసు కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటికే టిటిడిలో జరుగుతున్న అంతర్గత విషయాలను బయట మీడియాకు , రాజకీయ నాయకులకు చేరవేస్తున్న ఉద్యోగులపై కూడా టిటిడి విజిలెన్స్ అధికారులు నిఘా వుంచారు. ఈ నేపధ్యంలో శనివారం టిటిడిపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై తిరుమల టౌన్ పోలీసు స్టేషన్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముఖ్యంగా తమిళనటుడు సూర్య తండ్రి శివకుమార్ వుండటం చలనచిత్ర రంగంలో సంచలనంగా మారింది. అలాగే హీరో సూర్య, జగన్ కు అనుకూలంగా ఉంటారు. ఆయన జగన్ కంపెనీ అయిన, భారతీ సిమెంట్స్ కు, ఆడ్స్ కూడా చేసారు. అలాంటి సూర్య తండ్రి పై, తిరుమల అధికారులు సీరియస్ అయ్యారు, ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు.

ఇటీవల టిటిడి ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణ మూర్తి రాజీనామా చేశారని ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి అసత్య ప్రచారం జరిగింది. దీనిపై టిటిడి విజిలెన్స్ ఫిర్యాదుతో టౌన్లో కేసు నమోదైంది. తమిళనాడులో ఓ సమావేశంలో నటుడు శివకుమార్ తిరుమలలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని , తిరుమలకు వెళ్లవద్దని చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో హల్ చల్ చేసింది. వీడియోలో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఇమెయిల్ ద్వారా టిటిడికి చేసిన ఫిర్యాదుపై శివకుమార్‌పై కేసు నమోదైంది. అలాగే కరోనా లా డౌన్ ఆంక్షల నేపధ్యంలో ఏకంగా జూన్ 30వరకు తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు నిలిపివేస్తారంటూ తిరుపతి వార్త (స్థానికవత్రిక) వార పత్రికకు చెందిన మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగరశివరాజు, గోదావరి న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేశారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో భక్తులను గందరగోళానికి గురిచేశారని టిటిడి ఫిర్యాదుతో తిరుమల టౌన్ పోలీసులు ఎపిడమిక్ డిసీసెస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.

 

అంతేగాక మే 1వతేదీ ఫేస్ బుక్ లో తిరుమల శ్రీవారికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని పోస్టుచేశారు. ఒకానొకప్పుడు తిరుమల ఆలయం భౌద్దారామం అని, తలనీలాల సమర్పణ హిందువుల సంప్రదాయం కాదని , బౌద్ధులకు చెందిందని అందులో పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో వున్న బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహంగా మార్చారని ఫేస్ బుక్ లో సమాచారాన్ని పొందుపరిచారు. ఈ పోస్టు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ క్రింద కేసులు నమోదయ్యా యి. ఇదిలా వుండగా ఇప్పటికే గత రెండునెలలకాలంలో టిటిడిపై దుష్ప్రచారాలపై తిరుమల పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇంకా పాతకేసులు కూడా దర్యాప్తులోనే వున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పలు మార్గ దర్శకాలతో ఆంధ్రప్రదేశ్ లోను ఈ నెల 30వరకు లాక్ డౌనను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా శనివారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ మార్గ దర్శకాలు అమల్లోకి వస్తాయి. వీటిని అనుసరించకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లును తెరుచుకునేందుకు అనుమతినిస్తుంది. అయితే కచ్చితంగా ఇవి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వనిచి చేయాలి. ఆహారాన్ని ఇక్కడ నుంచి పార్శిల్ గా తీసుకుని వెళ్లేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్ళు పైబడిన వారు, 10 ఏళ్ళలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేదం అమలులో ఉంటుంది. అటువంటి వారిపై రూ. 1000వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రాంతాల్లోను అమలు చేయాలి, కీలకంగా షాపింగ్ మాల్స్ లో ఎయిర్ కండిషన్ 24డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

అనుమతి వున్న షాపింగ్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు యాజమాన్యాలు డిజిటల్ చెల్లింవులు, ఈ-వ్యాలెట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. షాపింగ్ మాల్స్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియం త్రణ చర్యలు చేపట్టాల్సి వుంటుంది. పుడ్ కోర్టు లు, రెస్టారెంటుల్లో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. అంతేకాకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సి వుంది. హోటళ్ళలో, రెస్టారెంట్లులోని టేబుళ్ళు, కుర్చీలు వినియోగదారులు మారిన ప్రతి వర్యాయం శానిటైజ్ చేయాల్సివుంటుంది. గేమింగ్, ఇతర ఎంటరైన్మెంటు ప్రాంతాలను ప్రభుత్వం తదువరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు మూసివేయాలి. ఎట్టి పరిస్థితుల్లో షాపింగ్ మాల్స్ లోని సినిమాహాళ్లను తెరవకూడదన్నారు. దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో పాటించాల్సిన నిబంధనలు, కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లోకి భక్తులను అనుమతిస్తుంది, అయితే రెండు రోజుల పాటు ట్రైల్ రన్స్ ను నిర్వహించిన తరువాతనే అందుకు అనుమతిస్తుంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేసారు. 10వతేదినుంచి ఆలమాల్లోకి భక్తులను అను మతిస్తామని స్పష్టం చేసారు.

ఆయా ఆలయాలు ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ భక్తులు ఆలయాల్లోకి వెళ్ళాలి. ఇదే రీతిలో అన్ని ధార్మిక ప్రదేశాల్లోకి నిబంధనలకు అనుగుణంగానే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ వెళ్ళాల్సి వుంటుంది. ధార్మిక ప్రదేశాల్లో భక్తులు గుమికూడదు. కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి,మాస్కులు ధరిం చాలి. శానిటైజర్లు కలిగివుండాలి. దేవాలయాల్లోకి ప్రవేశించే సందర్భంలో కచ్చితంగా వరుస క్రమ యాజమాన్యాన్ని నిర్వహించాలి. భక్తులకు తీర్థ ప్రసాదాలను, ఇవ్వడం వారిపై పవిత్రజలాలు చల్లడం చేయకూడదు, దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంధాలను తాకకుండా దర్శనం చేసుకోవాల్సివుంటుంది. ప్రార్థనా మందిరాల్లో సాముహిక ప్రవేశాలు జరుగకూడదు. సరైన భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు అన్నదానం చేయాల్సి వుంటుంది. ఆయా మందిరాల నిర్వా హకుల ఖచ్చితంగా భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. నేలపై కూర్చుని ప్రార్థనలు చేసుకునే వారు ఎవ్వరికి వారు కింద కూర్చునే వస్త్రం/తివాచీని తీసుకుని రావాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఏడాది పాలన పూర్తయిన తరువాత, అసంతృప్తి వాదులు, ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఒక్కో సమస్యతో, ప్రభుత్వాన్ని ఇరుక పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఒకరు, అభివృద్ధి చెయ్యలేదని ఒకరు, మాఫియాలు పెరిగిపోతున్నాయని ఒకరు, నాటు సారా ఏరులై పారుతుందని ఒకరు, నీళ్ళు అమ్ముకుంటున్నారు ఒకరు, ఇసుక విధానం పై మరికొంత మంది, ప్రభుత్వ విధానాల పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి, వినుకొండ ఎమ్మల్యే, ప్రసన్న కుమార్ రెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, డిప్యూటీ సియం మామయ్యా, ఇలా అందరూ గత వారం రోజులుగా సొంత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తున్నారు. తాజగా ఈ లిస్టులో మరొకరు చేరారు. తూర్పు గోదావరి జిల్లా, కొత్త పేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఇసుక సమస్య పై నిలదీశారు. ఇసుక విధానం సరిగ్గా లేదు అంటూ, తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇసుక సరఫరా చెయ్యటంలో, ఏపీఎండీసీ విఫలమైందని ఎమ్మెల్యే ఆరోపణలు చేసారు. కోనసీమలో, చుట్టూ ఇసుక ఉన్నా, ఇంటి నిర్మాణానికి ఇసుక దొరకటం లేదని అన్నారు.

నిబంధనలు ప్రకారం, అడిగిన వారికి ఇసుక ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. కోనసీమలో మొత్తం 10 ఇసుక ర్యాంపులు ఉండగా, ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఆయన అన్నారు. తాను స్వయానా లేఖ ఇచ్చినా, అడిగినా, కనీసం రెండు ట్రక్కులు ఇసుక కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మూడు రోజుల క్రితం, 14 వేలతో ఆన్లైన్ ఆర్డర్ చేసినా, ఇప్పటికీ ఇసుక సరఫరా చెయ్యలేక పోయారని ఆరోపించారు. వీళ్ళ వ్యవహారం పై, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి ఫిర్యాదు చేసానని ఎమ్మెల్యే అన్నారు. అలాగే బ్రిక్ ఇండస్ట్రీ విషయంలో, ఆ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం, సబ్సిడీల కింద 8 లక్షలు ఇస్తుంటే, అదనీ ఇదనీ, నిబంధాలు సాకుగా చెప్పి, అధికారులు, ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అలాగే తమ పంట పొలాల్లో ఉన్న మట్టిని రైతులు, తరలించుకుంటుంటే, వారి పై కూడా పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇదేమి పధ్ధతి అంటూ ఫైర్ అయ్యారు.

సొంత ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలకు 1.5 సెంట్ల భూమి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, స్థలం వస్తుంది అని సంతోష పడ్డారు. ఒక పక్క చంద్రబాబు కట్టించిన ఇళ్ళు ఉన్నా, అవి ఇవ్వకుండా, ఈ స్థలాలు అంటూ ముందుకు తెచ్చారు. అయితే, ఏదో ఒకటి అనుకుంటూ, తనకంటు ఒక సొంత స్థలం రాబోతుందని వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న పేదకుటుంబాలకు కొంత మంది నాయకులు ఇస్తున్న ఝలక్ కు అప్పులు ఊబిలో కూరు కుపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే ఒక్కొక్క లబ్దిదారుడు 30 వేల నుండి లక్షన్నర ఇవ్వాలని నాయకులు డిమాండ్ చెయ్య డంతో ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలంలో కూడబెట్టుకొని ఉన్న కొద్ది సొమ్ముతో ఇల్లు నిర్మించుకోవాలనే వారి ఆశ నిరాశగా మారింది. వారి దగ్గర ఉన్న కొద్ది పాటి సొమ్ములను నాయకులు గుంజుకు పోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. పదోపరకో ఐతే పరవాలేదు వేలల్లో అడుగుతుంటే ఇచ్చుకోలేక అప్పులు పాలవుతున్నారు.

ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వచ్చే స్థలం కూడా రాకుండా పోతుందని బయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 2.5 రెట్ల ధర భూములు ఇచ్చే రైతులకు సరిపోవడం లేదని, అందుకే రైతు ధరకు ప్రభుత్వం ఇచ్చే ధరకు మధ్య వ్యత్యాసంను లబ్ధిదారులు నుండి వసూలు చేస్తున్నట్లు నాయకులు సమరించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే స్థలంలో, ఈ గుంజుడు ఏమిటి అంటూ లబ్ధిదారుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల్లో నిర్బంధవసూళ్లను భరించలేని లబ్ధిదారులు గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబరకు మొరపెట్టుకుంటున్నారు. అలాగే, భూములు కొని, పంచుతున్న దాంట్లో కూడా స్కాం ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్కువ ధర పలికే భూములు, ఎక్కువ రేటుకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేసి, రాష్ట్రం మొత్తం, పెద్ద స్కాం చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఒక పక్క ఈ స్కాం చేస్తూనే, మళ్ళీ పేదలను నుంచి కూడా, డబ్బులు గుంజుకోవటం చూసి, అందరూ ఆశ్చర్య పోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read